మధురాంతకం రాజా రాం
————————-
మధురాంతకం రాజా రాం ఆంటే నాకెందుకో విపరీత మయిన ఇష్టం .ఆయన చని పోవ టానికి ఒక సంవత్చరం క్రితం విజయ వాడ లో ఒక సన్మాన సభలోపాల్గొన్నారు . .ఆయన్ను చూడాలన్న తహ తహ తో వెళ్లాను .”అచ్చ తెలుగు కధకు నిలువు తద్దం రాజా రాం .”అని నా నోట్ బుక్ లో నేను రాసు కోని వారిని సంతకం పెట్ట మన్నాను .చదివి నవ్వుతు సంతకం చేశారు .నాకు మహదానందం కలిగింది కాళ్ళకు నమస్కారం చేసాను .”అదేన్దప్పా .ఒద్దప్పా అట్లా చేయ్యద్దప్పా ”అని వారించారు కాని నేను వినకుండా నా పనినేను చేశాను .ఆప్యాయం గా కౌగిలించు కున్నారు .ఎంత ఆనందాన్ని అనుభావిమ్చానో చెప్పలేను .నా కల సఫలం అయింది .ఆ నెల లోనే ఆయన రాసిన బెజవాడ కనక దుర్గమ్మ ముక్కెర మీద కధ ప్రచురితం అయింది .దాన్నిఇక్కడ మళ్ళీ చెప్పారు .ఆయనది అద్భుత మైన ఫినిషింగ్ .కావ్యం చదువు తున్నట్లు అనుభూతి కలుగు తుంది .మనిషి లోపలి పొరలను తాకే భావ జాలం ,వాక్య విన్యాసం రసార్ద్రత వారి కధల్లో కొల్లలు మనసు ద్రవిన్చాల్సిందే సున్నిత హాష్యం అనుపానం .న హృద్యమైన కదా విధానం ,వైవిధ్యమైన ఇతి వృత్తం ,మనోజ్ఞా మైన శైలి మధురాంతకం కధకు నిండు దానాన్ని ,పుష్టిని కలిగిస్తాయి .కధలను అల్లడం లో ఏ చిక్కులు వుండవు .మాటలను అత్యంత సమర్ధం గా ప్రయోగించే నేర్పు ఆయనది .ప్రతి కధ పాడి కుండ లానిమ్డు గా వుంటుంది మధించాలే . కాని అద్భుత మైన వెన్నా ,నెయ్యి లభిస్తాయి .అదో ప్రపంచమే .అందులో ప్రవేశించ గానే మనల్ని మనం మరచి పోతాం .కధ అయిపోయిందని పిస్తూనే ముందుకు సాగుతుంది .ఎలా మొదలు పెడతారో ,అలాగే అంత గొప్ప గా ముగిస్తారు .ఏ రచయితకు ఇంత భావ పుష్టి వున్నట్లు అనిపించదు .ఏ ఇజం వుండదు .ఏ స్లోగాన్ను పెన్ను గన్నుకు ఎక్కించాడు సాదా సీదా,ఆశా మాషీ గా సాగిపోతూ ,అడుగడుక్కు వెనక్కు చూసుకొన మనే హెచ్చరిక లాంటి హితోపదేశం కధల్లో కన్పిస్తాయి .జీవితం కన్పిస్తుంది .అందులో బాధలు ,కలిమి లేములు స్పష్టం గా కపిస్తాయి .గొప్ప వాడి పై ద్వేషం కాని ,లేమి వానిపై అసహ్యం కని కన్పించవు .ఆ రెండు అంతస్తులు సారి సమానం కావాలనే భావన వ్యాప్త మావు తుంది .ఇలపై గొప్ప సాంఘిక విప్లవం వస్తుందనే ఆశా రేఖ గోచరిస్తుంది .ఆ విప్లవం ”చంపు ,నరుకు ”అనే తీవ్ర వాదం కాదు .గాంధీ మార్గం .అహింసాయుతం .శాంతి యుతం .మనసు లో పూర్తిగా మార్పు రావాలని భావం ఆయనది .అందుకు తగిన విధం గా కధనం వుంటుంది .ఆంతరంగికం గా మార్పు రానప్పుడు సామాజిక మార్పు తేవటం భగీరధ ప్రయత్నమే నన్న భావం ఆ కధల్లో కన్పిస్తుంది .మనసు మారితే అది శాశ్వత మార్పు అవుతుంది .ఆ విలువలు కల కాలమ్ నిలుస్త్సాయి .హంగామాతో ,మాటల గారడీతో ,వచ్చే మార్పు తాత్కాలిక మైనదే .ఈ దృక్పధం రాజా రాం కధ లన్నిటి లోను దృగ్గోచరమవుతుంది ముద్దబంతి పూల వంటి మాటలనే ఆయన ఉపయోగిస్తారు .కొరడా ఝాలిపిమ్పులుండవు .కదా మార్గం లో వుమ్మేత్తలు ,జిల్లేళ్ళు కన్పించవు .అదొక రాజ మార్గం .హాయిగా నడవవచ్చు .గొప్పగా అనుభవం పొంద వచ్చు .మానసికం గా గొప్ప ఆనందాన్ని అనుభావిన్చచ్చు .కావ్యం లోనే కాదు కధలో కూడా ”రాసోవైసః ”అన్న సూక్తిని నిజం చేసిన మహా కధకుడు రాజా రాం .అందుకే ఆయన్ను నేను ”కుటుంబ కదాశ్రీ రాజా రాం ”అంటాను .. కధ చదివితే అనుభూతి మిగుల్తుంది .అది శాశ్వతం గా మనసు లో నిలిచి పోయి మళ్ళీ మళ్ళీ చదివింప జేస్తుంది రాజారం కధ రామాయణం లాగా ,భాగవతం లాగ .రాజారాం కధలను పారాయణం చేసే వారు ఆంద్ర దేశం లో కో కొల్లలు .ఏ విదేశీ భావ జాలం ఆయన పై పద లేదు .దేశీయ మైన కధ ,దాని బలం ,విభిన్నమైన శైలి ఆయన్ను రాయల సీమలో మట్టిలో మానిక్యాన్ని చేశాయి .అవి సజీవ చిత్రాలు .ఆ మాటల పోహలింపు ,వాక్య విన్యాసం ,గడుసు దనం ,అనుభవ సారం ఆయన్ను అంత ఎత్తులో నిల బెట్టాయి .ఆయనతో పోల్చటానికి ఏ ఇతర భాషా రచయిత మనకు కన్పించడు రాజారం కు సాటి రాజ రామే .కదా రాజా రాముడు ఆయన .నిసర్గ సుందర రచన .మాండలికాల జోరుండదు .అవసరమైన చోట వాటి వాడకం మానసిక ఆహ్లాదం గా వుంటుంది .పదాలు ఇబ్బంది పెట్టావు .హాయిగా తీయగా ,మల్లెల దొంతర లా మంచు చల్ల దనం లా,మంచి గంధం లా ,మధురసాయణం లా ,మానస్ తేలికగా ,సుందర దృశ్యం లా కధను రాయటం లో ,మధురం గా మలచటం లో ,మధు మధురం గా అంతం చేయటం లో ఇంటి పేరు సార్ధకం చేసు కొన్నారు మధురాంతకం . చిత్తూరు జిల్లా దామల చెరువు గ్రామం లో జన్మించి ఉపాధ్యాయ వృత్తిలో జీవితాన్ని సార్ధకం చేసు కోని ”దామల చెరువు అయ్యవారు ”గా లబ్ధ ప్రతిస్తులు .కేంద్ర సాహిత్య అకాడెమి వీరి కూన లమ్మ కోన ”కదా సంపుటికి పురస్కారం లభించింది 1996 జనవరి 14 న జీవన సాఫల్య పురస్కారాన్ని అప్పజోస్యుల విష్ణు భొట్ల ఫౌండేషన్ వారు రాజా రాం సాహిత్య కృషికి అందజేశారు .మానవ సంబంధాలను ప్రధానం గా దృష్టి లో పెట్టుకొని కధలు రాసిన మహా రచయిత ఈ మట్టి మనిషి మధురాంతకం రాజా రాం. .మూడేళ్ళ క్రితం తిరుపతి నుంచి కాణిప్పాకం వెళ్తుంటే దామల చెరువు గ్రామమ్ కన్పించింది చెరువు నిండా తామరపూలే తామరల చెరువు దామల చేరు వు అయిందేమో నని పించింది మనసారా అయ్య వారు ఆహ్వానిస్తున్నార నిపించింది .చెరువే రాజారాం గారు అనుకోని మనసులో నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగాము .ఆయన కధలు తామరపూలు లా ఆకర్షిస్తాయి ,మానసిక వికాసం ఇస్తాయి .పద్మం వికసనానికి చిహ్నం .అయ్య వారి కధల్లో ఆ వికసనం విస్పష్టం గా కన్పిస్తుంది .జై రాజా రాం . మీ గబ్బిట దుర్గా ప్రసాద్ 08 -06 -11 .
రామాయణం లాగా ,భాగవతం లాగ .రాజారాం కధలను పారాయణం చేసే వారు ఆంద్ర దేశం లో కో కొల్లలు
బాగా చెప్పారు