సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –4
కృతులలో భాష భావం
త్యాగయ్య కృతుల్లో వున్న భాష ,భావ గాంభీర్యాన్ని తెలుసు కొనే ముందు ,ఆ నాటి రాజుల సంగీత కళా పోషణ ఎలా వుందో ఒక సారి గుర్తుకు చేసు కొందాం .
భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం అని ,హిందూ స్తాని సంగీతం అని రెండు రకాలు .కర్ణాటక సంగీతాన్ని ”నారదీయ సంగీతం ”అనీ ,హిందుస్తానీ ని ”హనుమదీయ సంగీతమ్ ”అనీ పేరు .హనుమంతుడు గొప్ప గాయకుడు ,సంగీత స్రష్ట .మహా రాజులు ఎందరో ,సంగీత విద్వాంసులను ఆదరించి ,పోషించారు .సంగీతానికి గొప్ప ప్రచారం కల్గించారు .త్యాగయ్య గారి శిష్యుడు సుబ్బయ్య అనే ఆయన కుమారుడు ఎనిమిది గంటల పాటు ”సావేరి ”రాగాన్ని పాడిన ఘనుడట .నారాయణ తీర్ధుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణుడినే మెప్పించిన మహా భక్త వరేన్యుడు .సదాశివ బ్రహ్మేన్ద్రులు మహిమలను ఎన్నోచూపిన మహిమాన్వితుడు .క్రిష్నయ్య అనే విద్వాంసుడు ఎండ బాధ నుంచి తప్పించుకోవటానికి ”మలయ మారుత రాగాన్ని ”పాడి చల్ల బరచుకోన్నాదట .శీలం నరసయ్య అనే సంగీత విద్వాంసునికి 40 వేల రాగాల మీద మంచి పట్టు ఉండేదిట .పైడాల గురు మూర్తి అనే విద్వాంసుడు ,1000 గీతాలను రాశాడట .తంజావూర్ నాయక రాజు ”చెవ్వప్ప ”సంగీత మహల్ నే కట్టించిన సంగీత ప్రియుడు .ఆ మహల్ లో గాయకుడు ఎంత తక్కువ శ్రుతి లో పాడినా కనీసం 1500 మందికి విని పించే ఏర్పాటు ఉందట . చత్రపతి శివాజీ మహారాజు వంశానికి చెందిన ”షాహాజీ ”మహా రాజు ఆస్థానం లో త్యాగయ్య గారి తాత గారు ;;గిరిరాజ కవి ”ఆస్థాన గాయకుడు గా వుండే వారు .శరభోజి మహా రాజు ఆస్థానం లో 360 మంది సంగీత విద్వాంసులు వుండే వారట .రోజుకు ఒక విద్వాంసునితో పాడించే వారట . తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ గొప్ప వాగ్గేయ కారుడు .సంగీత స్రష్ట .ఆయన ఆస్థానం లో వున్న ఫిడేల్ విద్వాంసుడు ”వడివేల్ ” ప్రతిభకు మెచ్చి ,బంగారు ఫిడేల్ తయారు చేయించి ,బహూక రించాడట .గద్వాల్ రాజు సీతా రామి రెడ్డి సంగీత విద్వాంసులను ఆదరించి ,ఏటా వార్షికాలు ఇచ్చే వాడు .
భోజనం సమయం లో ”చిన్న గుమ్మడి కాయ ”అంత లడ్డు లు వడ్డించే వాడట .ఎన్ని తింటే అన్ని రూపాయలు కానుకగా అంద జేశే వాడట .కృష్ణా జిల్లా లో చల్లపల్లి ,నూజివీడు ,మైలవరం ,ముక్త్యాల ,తోట్ల వల్లూర్ జమీందారులు సంగీత కళను బాగా పోషించారు .గరిక పాటి కోటయ్య దేవర లాంటి మహా విద్వాంసులను ఆస్థాన విద్వాంసులను చేశారు .ఇలా ,వివిధ రాజులు ,జమీందార్లు సంగీత కళకు మంచి ప్రోత్సాహమిచ్చి పోషించారు .
”సంగీత సాహిత్య రాసాను భూత్యై-కర్ణద్వయం కల్పిత వాన్ విధాతా –ఏకేన హీనః పున రేక కర్ణో ,ద్వాభ్యాం విహీనో బదిరస్య ఏవ”అంటే బరహ మనకు రెండు చెవులను ఇచ్చాడు అవి సంగీర్హా ,సాహిత్యాలను విని ఆస్వాదిన్చాతానికే .అందులో ఒక దాని మీదైనా ఇష్టం లేక పొతే ఒక చెవి వున్న వాడి కింద లెక్క .రెండిటి మీదా ఆసక్తి లేక పొతే చెవిటి వాడి గానే భావించాలి .మన వాళ్ళు మనో రంజనం చేసే సంగీత ,సాహిత్యాలకు అంత ప్రాధాన్యత నిచ్చారు .తెలిసిన శ్రోత దొరికితే శ్లోకం శ్లోకత్వం పొందు తుంది .తెలియని శ్రోత దొరికితే శ్లోకం శోకం అవుతుంది అన్నారు పెద్దలు .రసికత్వం లేని విద్య రాణించదు .ఇప్పుడు త్యాగయ్య గారి కృతుల్లో వున్న ,భాష,భావ సౌందర్యాన్ని వివ రం గా తెలుసు కొందాం .
”ఏలా దయ రాదు ,పరాకు చేసే వేలా సమయము కాదు -”ఏలా ‘
”బాల కనక మయ చేల సుజన పరిపాల ,శ్రీ రమా లోల విధృత శర జాల -శుభద కరుణాల వాల -ఘన నీల నవ్య వన మాలికా భరణా ‘ఏలా ”అనే ”ఆథనా ”రాగం లో మొదటి కీర్తన రాశారు త్యాగయ్య .ఆయన శ్రీ రాముడు నారాయణుడే .దశావతారాలు ,ఆయన ప్రతీకలే .త్యాగ బ్రహ్మ అపర వాల్మీకి అవతారం అని భక్తుల విశ్వాసం .ఈ కీర్తన లో నామ ,రూప వర్ణనా వైభవం వుంది .లలిత పద విన్యాసం ,రుచికర మైన అను ప్రాసలు ,వున్న కీర్తన ఇది .సంస్కృత భాషా ప్రయోగం ప్రౌధం గా వుంది .సంగీత కళా విన్యాసము కన్పిస్తుంది .తెలుగు కూడా అంత అందం గానే నడిచింది .
” మరవకే నవ మన్మధ రూపుని -నీటో ,మెల్లని మాటొ కన్నుల తేటో ,మరి వలె వాటో ,మనసా –కులుకో ,పావలా గిలుకో ,కపురపు బలుకో ,చెక్కుల తాళుకో ”అనే దేవ గాంధారి రాగం లోని కీర్తన లో శ్రీరాముని రూపము ,అలంకారము లను తేట తెలుగు లో వర్ణిస్తూ రామునికి తెలుగుదనం అబ్బ జేశాడు త్యాగయ్య .శ్రీ రామునికి తెలుగు వారి ”వల్లే వాటు ”వేశాడు చిత్రాతిచిత్రం గా .
కొన్ని పదాలను తమాషా గా వాడు తాడు త్యాగ్యా భాస్కర కవి ని ”కవీనా ”అంటాడు .కవి +ఇన అని విడగొట్టు కొంటె కాని అర్ధం కాదు .వాల్మీకిని ”బిలజ మౌని ”అని చక్కని తెనుగు పేరు తో పిలిచాడు .అట్లాగే శ్రీ రాముడు ఆయన చేతిలో ”పాప గజ నృసింహుడు ”అయి పోయాడు .
శ్రీరాగం లో రాసిన ”ఎందరో మహాను భావులు ”కీర్తన హై లైట్ గా భావిస్తారు అదొక నానుడి గా జనం లో నిల్చి పోయింది .అందులోని నడక సౌభాగ్యం ఎంత అద్భుతం గా వుందో గమనిద్దాం ..
త్యాగయ్య కృతుల్లో వున్న భాష ,భావ గాంభీర్యాన్ని తెలుసు కొనే ముందు ,ఆ నాటి రాజుల సంగీత కళా పోషణ ఎలా వుందో ఒక సారి గుర్తుకు చేసు కొందాం .
భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం అని ,హిందూ స్తాని సంగీతం అని రెండు రకాలు .కర్ణాటక సంగీతాన్ని ”నారదీయ సంగీతం ”అనీ ,హిందుస్తానీ ని ”హనుమదీయ సంగీతమ్ ”అనీ పేరు .హనుమంతుడు గొప్ప గాయకుడు ,సంగీత స్రష్ట .మహా రాజులు ఎందరో ,సంగీత విద్వాంసులను ఆదరించి ,పోషించారు .సంగీతానికి గొప్ప ప్రచారం కల్గించారు .త్యాగయ్య గారి శిష్యుడు సుబ్బయ్య అనే ఆయన కుమారుడు ఎనిమిది గంటల పాటు ”సావేరి ”రాగాన్ని పాడిన ఘనుడట .నారాయణ తీర్ధుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణుడినే మెప్పించిన మహా భక్త వరేన్యుడు .సదాశివ బ్రహ్మేన్ద్రులు మహిమలను ఎన్నోచూపిన మహిమాన్వితుడు .క్రిష్నయ్య అనే విద్వాంసుడు ఎండ బాధ నుంచి తప్పించుకోవటానికి ”మలయ మారుత రాగాన్ని ”పాడి చల్ల బరచుకోన్నాదట .శీలం నరసయ్య అనే సంగీత విద్వాంసునికి 40 వేల రాగాల మీద మంచి పట్టు ఉండేదిట .పైడాల గురు మూర్తి అనే విద్వాంసుడు ,1000 గీతాలను రాశాడట .తంజావూర్ నాయక రాజు ”చెవ్వప్ప ”సంగీత మహల్ నే కట్టించిన సంగీత ప్రియుడు .ఆ మహల్ లో గాయకుడు ఎంత తక్కువ శ్రుతి లో పాడినా కనీసం 1500 మందికి విని పించే ఏర్పాటు ఉందట . చత్రపతి శివాజీ మహారాజు వంశానికి చెందిన ”షాహాజీ ”మహా రాజు ఆస్థానం లో త్యాగయ్య గారి తాత గారు ;;గిరిరాజ కవి ”ఆస్థాన గాయకుడు గా వుండే వారు .శరభోజి మహా రాజు ఆస్థానం లో 360 మంది సంగీత విద్వాంసులు వుండే వారట .రోజుకు ఒక విద్వాంసునితో పాడించే వారట . తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ గొప్ప వాగ్గేయ కారుడు .సంగీత స్రష్ట .ఆయన ఆస్థానం లో వున్న ఫిడేల్ విద్వాంసుడు ”వడివేల్ ” ప్రతిభకు మెచ్చి ,బంగారు ఫిడేల్ తయారు చేయించి ,బహూక రించాడట .గద్వాల్ రాజు సీతా రామి రెడ్డి సంగీత విద్వాంసులను ఆదరించి ,ఏటా వార్షికాలు ఇచ్చే వాడు .
భోజనం సమయం లో ”చిన్న గుమ్మడి కాయ ”అంత లడ్డు లు వడ్డించే వాడట .ఎన్ని తింటే అన్ని రూపాయలు కానుకగా అంద జేశే వాడట .కృష్ణా జిల్లా లో చల్లపల్లి ,నూజివీడు ,మైలవరం ,ముక్త్యాల ,తోట్ల వల్లూర్ జమీందారులు సంగీత కళను బాగా పోషించారు .గరిక పాటి కోటయ్య దేవర లాంటి మహా విద్వాంసులను ఆస్థాన విద్వాంసులను చేశారు .ఇలా ,వివిధ రాజులు ,జమీందార్లు సంగీత కళకు మంచి ప్రోత్సాహమిచ్చి పోషించారు .
”సంగీత సాహిత్య రాసాను భూత్యై-కర్ణద్వయం కల్పిత వాన్ విధాతా –ఏకేన హీనః పున రేక కర్ణో ,ద్వాభ్యాం విహీనో బదిరస్య ఏవ”అంటే బరహ మనకు రెండు చెవులను ఇచ్చాడు అవి సంగీర్హా ,సాహిత్యాలను విని ఆస్వాదిన్చాతానికే .అందులో ఒక దాని మీదైనా ఇష్టం లేక పొతే ఒక చెవి వున్న వాడి కింద లెక్క .రెండిటి మీదా ఆసక్తి లేక పొతే చెవిటి వాడి గానే భావించాలి .మన వాళ్ళు మనో రంజనం చేసే సంగీత ,సాహిత్యాలకు అంత ప్రాధాన్యత నిచ్చారు .తెలిసిన శ్రోత దొరికితే శ్లోకం శ్లోకత్వం పొందు తుంది .తెలియని శ్రోత దొరికితే శ్లోకం శోకం అవుతుంది అన్నారు పెద్దలు .రసికత్వం లేని విద్య రాణించదు .ఇప్పుడు త్యాగయ్య గారి కృతుల్లో వున్న ,భాష,భావ సౌందర్యాన్ని వివ రం గా తెలుసు కొందాం .
”ఏలా దయ రాదు ,పరాకు చేసే వేలా సమయము కాదు -”ఏలా ‘
”బాల కనక మయ చేల సుజన పరిపాల ,శ్రీ రమా లోల విధృత శర జాల -శుభద కరుణాల వాల -ఘన నీల నవ్య వన మాలికా భరణా ‘ఏలా ”అనే ”ఆథనా ”రాగం లో మొదటి కీర్తన రాశారు త్యాగయ్య .ఆయన శ్రీ రాముడు నారాయణుడే .దశావతారాలు ,ఆయన ప్రతీకలే .త్యాగ బ్రహ్మ అపర వాల్మీకి అవతారం అని భక్తుల విశ్వాసం .ఈ కీర్తన లో నామ ,రూప వర్ణనా వైభవం వుంది .లలిత పద విన్యాసం ,రుచికర మైన అను ప్రాసలు ,వున్న కీర్తన ఇది .సంస్కృత భాషా ప్రయోగం ప్రౌధం గా వుంది .సంగీత కళా విన్యాసము కన్పిస్తుంది .తెలుగు కూడా అంత అందం గానే నడిచింది .
” మరవకే నవ మన్మధ రూపుని -నీటో ,మెల్లని మాటొ కన్నుల తేటో ,మరి వలె వాటో ,మనసా –కులుకో ,పావలా గిలుకో ,కపురపు బలుకో ,చెక్కుల తాళుకో ”అనే దేవ గాంధారి రాగం లోని కీర్తన లో శ్రీరాముని రూపము ,అలంకారము లను తేట తెలుగు లో వర్ణిస్తూ రామునికి తెలుగుదనం అబ్బ జేశాడు త్యాగయ్య .శ్రీ రామునికి తెలుగు వారి ”వల్లే వాటు ”వేశాడు చిత్రాతిచిత్రం గా .
కొన్ని పదాలను తమాషా గా వాడు తాడు త్యాగ్యా భాస్కర కవి ని ”కవీనా ”అంటాడు .కవి +ఇన అని విడగొట్టు కొంటె కాని అర్ధం కాదు .వాల్మీకిని ”బిలజ మౌని ”అని చక్కని తెనుగు పేరు తో పిలిచాడు .అట్లాగే శ్రీ రాముడు ఆయన చేతిలో ”పాప గజ నృసింహుడు ”అయి పోయాడు .
శ్రీరాగం లో రాసిన ”ఎందరో మహాను భావులు ”కీర్తన హై లైట్ గా భావిస్తారు అదొక నానుడి గా జనం లో నిల్చి పోయింది .అందులోని నడక సౌభాగ్యం ఎంత అద్భుతం గా వుందో గమనిద్దాం ..
”మానస వన సంచారము నిలిపి –మూర్తి బాగుగా పొడ గనే వారెందరో మహాను భావులు
సరగున పాదములకు ,స్వాంతమను -సరోజమును సమర్పణము సేయు వారెందరో —
హరి గు మ ణు లగు సరముల గళమున –శోభిల్లు భక్త కోటులిలలో ,తెలివితో
కరుణ కల్గిజగామేల్లను సుధా ద్రుష్టి చే బ్రోచు వారెందరో మహాను భావులు
హొయలు మీరి ,నడలు గల్గు -సరసుని సదా కనుల చూచుచు పులక శరీరులై
యానంద పయోధి నిమగ్నులయి ముదంబును ,యశము గల వారెందరో –”
సరగున పాదములకు ,స్వాంతమను -సరోజమును సమర్పణము సేయు వారెందరో —
హరి గు మ ణు లగు సరముల గళమున –శోభిల్లు భక్త కోటులిలలో ,తెలివితో
కరుణ కల్గిజగామేల్లను సుధా ద్రుష్టి చే బ్రోచు వారెందరో మహాను భావులు
హొయలు మీరి ,నడలు గల్గు -సరసుని సదా కనుల చూచుచు పులక శరీరులై
యానంద పయోధి నిమగ్నులయి ముదంబును ,యశము గల వారెందరో –”
ఈ కీర్తన లో త్యాగయ్య గారి సంస్కార హృదయం ఆవిష్కృత మైంది . ఈ గీతం తో సంగీత రాసికులే కాక భక్తులు కూడా ముగ్ధులై పరవశించి పోతున్నారు .అంత ప్రాచుర్యం పొందిక కృతి ఇది .
అల్లాగే ”దుర్జన జలద సమీర ”,”నయన నిందిత సరోజ ”అనే అద్భుత ప్రయోగాలు చేశారు .ఇందులో మిగిలిన వారి కంటే భిన్నం గా ఆలోచించి కొత్త పద ప్రయోగం చేయాలనే ఆలోచన మనకు స్పష్టం గా కని పిస్తుంది .ఆయన ది అగాధ సంగీత సాహిత్య రస జలధి .అందులో మునిగితే తేలటం కష్టం .మరోసారి మరిన్ని వివరాలు తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
చాలా మంచి విషయాలు చెప్తారండి. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.