ఊసుల్లో ఉయ్యూరు –13
1951 లో మేము హిందూ పురం నుంచి ఉయ్యూరు వచ్చేశాం .మా నాన్న గారికి హిందూపూర్ మునిసిపల్ హై స్కూల్ నుంచి ,జగ్గయ్య పేట జిల్లా పరిషద్ హై స్కూల్ కు బదిలీ అయింది .అందుకే ఉయ్యూరు కు చేరాం .రెండేళ్ళ తర్వాత నాన్న ఉయ్యూరు హై స్కూల్ కు వచ్చేశారు .
సంప్రదాయ కుటుంబం కనుక తద్ది నాలు ,పండుగలు శాస్త్రీయ పద్టతి లోనే జరిగేవి .అప్పుడే మాకు చిలుకూరి వెంకటేశ్వర్లు గా రితో పరిచయం ఏర్పడింది .ఆయన మా బజార్లోనే కాలువ కు దగ్గర గా సూరి వాళ్ల ఇంట్లో అద్దె కు వుండే వారు .యడవల్లి శ్రీ రామ మూర్తి గారు అనే మోతు బరి రైతు అవతలి బజార్లో వుండే వారు .యెర్ర గా ,పిల్లి కళ్ళ తో చెవిలో బొచ్చు తో వుండే వాడు .ఖద్దరుబట్టలే కట్టే వాడు .పంచె ,లాల్చి ,ఉత్త రీయం .బ్రాహ్మడు ఎరువుల వ్యాపారం చేయటం ఆయన తోనే ప్రారంభం .వ్యాపారం చాలా పకడ్బందీ గా చేసే వాడు .ఆయనకు తమ్ముడు సాయం .ఆ ఎరువుల కొట్లో వెంకటేశ్వర్లు గారు గుమాస్తా గా పని చేసే వారు .జీతం పెద్ద గా ఉంటుందని అనుకోను .అసలు వీరిది ,ఉయ్యూరు కు దగ్గరలోని శాయ పురం అగ్ర హారం.అక్కడి నుంచి వచ్చి ఉయ్యూరు లో కాపురం పెట్టారు .పంచె కట్టి ,చొక్కా తొడిగే వారు .పైన తువ్వాల వుండేది .పొడుగ్గా ,బక్క పలుచ గా వుండే వారు .వియత్నాం నాయకుడు హోచిమన్ లాగా పిల్లి గడ్డం తో వుండే వారు .కొంచెం యెరు పు రంగే ..మాట చాలా స్పీడ్ గా వుండేది .అర్ధం అవటం కొంచెం కష్టం గా వుండేది .ముగ్గురు మగ పిల్లలు ,ఇద్దరు ఆడ పిల్లలు ఆయనకు .అందర్నీ ఆ జీతం తోనే పోషించాల్సి వచ్చేది .అందు కని ఎవరైనా తద్దినాలకు బ్రాహ్మణా ర్తాలకు పిలిస్తే వచ్చే వారు .రావటానికి ఆయన యడవల్లి వారి పర్మిషన్ తీసుకొని రావాల్సిందే .ఆయన్ను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వదిలే వారు .ఆ తర్వాతే ఆయన బ్రాహ్మణా ర్థం కు వచ్చే వారు .ఇంట్లో వంటలు అయి రెడి గా వుంటే అప్పుడు ,ఎరువుల కొట్టుకు వెళ్లి చెప్పే వాళ్ళం .అప్పుడు ,ఆయన బయల్దేరి వచ్చే వారు .ఒక్కో సారి కొట్లో పని ఒత్తిడి వుంటే ఆయన రావటం ఆలశ్య మయ్యేది . ఇక్కడ యజ మానులు ,ఆయన కోసం ఎదురు చూస్తూ ,తిట్టు కొంటు వుండే వారు .ఈ తిట్లు కొన్ని యద వల్లి వారికి కూడా .ఆయనకు అంటే శ్రీ రామ మూర్తి కి కర్కోటకుడు అని పేరు . అప్పు పెట్టె వాడు .మొహమాటం అనేది అసలు లేదు .నాన్న కు శిష్యుడు , మామయ్యకు సహాధ్యాయి .ఎక్కడైనా బావ కాని వంగ తోటలో కాదు అన్నట్లు ప్రవర్తించే వాడు .వెంకటేశ్వర్ల గారికి కూడా అక్కడ పని చేయటం కష్టం గానే వుంది . చాకిరీ గొడ్డు చాకిరి చేయాలి ,జీతం గొర్రె తోక .విసుగు అని పించి మానె శారు.
ఉద్యోగం పోయింది కనుక ,ఏదో ఒకటి చేసి పొట్ట పోషించు కోవాలి .కనుక బ్రాహ్మ ల ఇళ్ళల్లో నీళ్ళు పోసే వారు .పుల్లేరు కాలువ నుంచి ,పెద్ద ఇత్తడి బిందెల తో నిండా నీరు తెచ్చి ఇళ్ళల్లో పోసే వారు .మేమూ పోయిన్చుకోవటం ప్రారంభించాం . మడిగా నీళ్ళు తెచ్చే వారు .తడి బట్టతో .బట్ట అంటే అంగ వస్త్రమే .. .పైన ఏమీ ఆచ్చాదన వుండేది కాదు .దాన్నే గోచి పోసి కట్టి తడి గా , మడి నీళ్ళు పోసే వారు . పండుగా .పబ్బం అయినా ,తద్దినాలు అయినా ఎక్కువ నీళ్ళు పోయించుకొనే వాళ్ళు . నెలకూ రెండు రూపాయలిచ్చే వారేమో ఒక బిందెడు నీళ్ళకు .ఆ తర్వాత క్రమం గా పెంచు కొంటు నెలకు ముప్ఫై దాకా ఇచ్చే వారు .ఈ చనువు తో ఆయన్ను” ఏమండీ” అనటం మానేసి ”చిలుకూరాయన ”అనే స్థితికి వచ్చాం .”అండీ పోయి ఏమయ్యా” లోకి వచ్చింది . అది మా అల్ప బుద్ధికి నిదర్శనం అని ఇప్పుడు అని పిస్తుంది . దీనికి తోడూ ఆయన కొంత వైదికం నేర్చుకొన్నారు .బ్రాహ్మనార్తాలతో పాటు మంత్రం చెప్పటం కూడా మొదలు పెట్టారు .అప్పటికి ఉయ్యూరు లో వంగల సుబ్బావధాని గారు ,కోట కృష్ణ మూర్తి గారు ,పాల పర్తి వెంకట్రామయ్య గారు వైదీకం చేసే వారు .మా ఇళ్ళలో సుబ్బయ్య గారే ఇంటి పురోహితులు .ఆ తర్వాత ఆయనకు వీలు లేక పొతే కృష్ణ మూర్తి గారు .ఒక్కో సారి వీరిద్దరికీ తీరుబడి లేక పోతే చిలుకూరాయనే మా కు పురోహితులు .మా నాన్న తరం వరకు బాగానే గడిచి పోయింది .మా తరం వచ్చే సరికి అభావం ఏర్పడింది .అప్పుడు మాకు ఆపద్బాన్ధవుని లా,వెంకటేశ్వర్లు గారు తోడు పడ్డారు .నాన్న టైం లో పొలం లో కుప్ప నూర్చతసం లో చిలుకూరి వారి సహాయం తీసుకొనే వారు . రాత్రి తనతో పాటు పొలం లో కాపలా కు తీసుకొని వెళ్ళే వారు .ఒక వేళ నాన్న కు వెళ్ళటం కుదరక పొతే కడవకొల్లు పొలానికి ఆయన్నే కాపలాకి పంపే వారు . మాట కాదనటం ఆయన నిఘంటువు లో లేదు .ఆ తర్వాత నేను పొలం వ్యవ హారాలు చూసే టప్పుడు కూడా సాయం చేసే వారు .ఆ తర్వాత వాళ్ళబ్బాయి లక్ష్మీ నరసింహం, నా దగ్గర చదవటం ,ఇంట్లోనే వుండి చదువు కోవటం , ఇక్కడే పడు కోవటం వల్ల , వాళ్ల నాన్న డ్యూటీ తీసుకొన్నాడు .తలలో నాలుక లా పని చేశాడు ఇప్పటికీ ఎక్కడ వుద్యోగం చేస్తున్నా ఉయ్యూరు వస్తే ముందు మా ఇంటికి వచ్చి ,కన పడి వెళ్తాడు .ఏమైనా పనుందా మాస్టారు అని అడిగి, వుంటే చేసి వెళ్తాడు .అతను మా ఇంట్లో చెయ్యని పని లేదు .ఏదైనా ఇంట్లో మా వల్ల కాక పొతే చిలుకూరికి చెప్పి చేయించుకోవటం అలా వాటు అయింది .ఇలా చేయించుకోవటం సిగ్గు గానే వున్నా ,వాడి ఆప్యాయత కు తప్పని సరి అయేది .ఆర్మీ లో పని చేసి , వాలంటరీ గా పదవీ విరమణ చేసి బాంక్ పరీక్షలు రాసి పంజాబ్ నేషనల్ బాంక్ లో వుద్యోగం సంపాదించి, ఉయ్యురు లో స్వంత ఇల్లు కొనుక్కొని ,ప్రస్తుతం బీమ వరం లో పని చేస్తున్నాడు .
మా నాన్న గారు చని పోయింతర్వాత నెల మాసికాలకు చిలుకూరాయనే మంత్రం ,భోక్త .దాన్ని వాళ్ల భాష లో ”కూత .మేత ”అనే వారు . ఆయనకు ఒక సారి చెబితే చక్క గా జ్ఞాపకం పెట్టు కోని సమయానికి వచ్చే వారు .ఒక్కో సారి పని ఒత్తిడి లో ఆలశ్యం గా వచ్చి తిట్లు కూడా తినే వారు .అయినా నవ్వుతు మళ్ళీ మామూలే .కృష్ణ మూర్తి గారిని పిలిస్తే ”మీ కుల దైవం చిలుకూరాయన వున్నాడు గా ‘అని దేప్పే వాడు . ఇవన్నీ పట్టించు కోకుండా ,తన పని తాను చేసుకొని పోయే వాడు .ఒక వేళ ఆ ఇద్దరు వస్తే రణ రంగం గా వుండేది తద్దినం .చిలుకూరాయనకు స్పీడ్ ఎక్కువ .కృష్ణ మూర్తి గారు గూడ్సు బండి .ఈ ఇద్దర్ని సముదాయించ లేక తల ప్రాణం తోకకు వచ్చేది . వెంకటేశ్వర్లు గారు నెమ్మది నెమ్మదిగా ఆబ్దీక మంత్రము నేర్చారు .ఆయన ఉచ్చారణ లో మాటలు ఎక్ష్ప్రెస్స్ స్పీడ్ లో దొర్లి పోయేవి .మంత్రం మొదలు ,చివర తప్ప మధ్య దంతా యెగిరి పోయేది .అట్లాగే ,ఏ టైం కి రమ్మంటే ఆ టైం కి వచ్చి ,కూతా మేత తో పని పూర్తి చేసే వారు రెందోబ్రాహ్మనుడిని కూడా ఆయనే తెచ్చుకొనే వారు .ఇంత ఇవ్వ మని అడగటం లేదు .ఎంత ఇస్తే అంత తో తృప్తి పడే వారు .ఎప్పుడు తనకు తక్కువ ఇచ్చినట్లు గా కంప్లైంట్ చెయ్య లేదు .అందుకనే ఎక్కువే ఇవ్వాలని పించి ఇచ్చే వాళ్ళం కొందరిళ్ళలో అక్షరాభ్యాసం బారసాల ,పుణ్యః వాచనం చేసే వారు .శివాలయం లో అభిషేకాలు చేసే వారు .బ్రాహ్మణులు లేని కొరత ను తీర్చారు .ఎవరు పిలిచినా వెళ్ళే వారు .అందరితో స్నేహం గా మెలిగే వారు .ఆయన భార్య గారు కూడా మా ఇళ్ళల్లో ఒక మనిషి గానే మసిలే వారు .
మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు వచ్చినా ,ఉపనయనాలు అయినా ,ఇంకేమైనా ముఖ్యమైన వి జరిగినా మేము ముందు గా చెప్పేది చిలుకూరాయనకే .ఆ రోజుల్లో తప్పక సాయం గా వుండాలి అని కోరే వారం .అన్ని పనులు మానేసి ,మాతో వుండి ఆ కార్య క్రమాలను గట్టెక్కించే వారు .వడ్డన లో సాయం చేసే వారు .ఎవర్నైనా పిలుచుకు రావాలంటే వెళ్ళే వారు .కూరలు తరగటం వంట లో సాయం చేయటం చేసే వారు .ఈ పని ,ఆ పని అంటూ లేదు ఏపని అయినా రడీ .అదీ ఆయన తీరు .దేనికీ ఆశ వుండేది కాదు .ఎంత అవసరం వుంటే మన సాయం కోరుతారు అనుకోని ముందుకు దూకే వారు .
బ్రాహ్మనులు ఎవరైనా చని పొతే అందరి ఇళ్ళ కు వెళ్లి చెప్పి రావటానికి ఆయన్నే పంపే వారు .శ్మశానానికి తీసుకొని వెళ్ళే నలుగురి లో ఎవరు లేక పొతే ఆయన హాజరు .లేదు అనేది ఆయన కు తెలీదు .అలాగే దిన వారాల్లో దానాలు పుచ్చుకోవటం లో ,ఏ మాత్రం సంకోచించే వారు కాదు .ఈ దానం తీసుకొంటే తనకేమైనా చెడు జరుగు తుంది అన్న ఆలోచన వుండేది కాదు .ఎదిస్తే అది తీసుకొనే వారు .అది కావాలి ,ఇది కావాలనే ఆశ లేదు .ప్రతి ఇంట్లోను ఇంట్లో మనిషి గా మెదిలే వారు .అందుకని ఆయన్ను పరాయి మనిషి గా చూసే వాళ్ళం కాదు .తద్దినం రోజూ భోక్తగా ,మంత్రం చెప్పే వాని గా ద్వి పాత్రాభినయం చేసి మెప్పించే వారు .భోక్తల విస్త్ల్లలో ఎవరి విస్తరి లో ముందు వడ్డించాలి దగ్గర్నుంచి ,ఏది ముందు వడ్డించాలి ,తరువాత ఏమి వడ్డించాలి అన్నీ వరుసగా చెప్పి సక్రమంగా జర గ టానికి తోడ్పడే వారు .అందుకీ ఇంట్లో ఆడ వాళ్ళు ముందుగా ఏ కార్య క్రమం వచ్చినా ”చిలుకూరాయన కు ” చెప్పారా ?” అని అడగటం పరి పాటు అయింది .అంత కార్య దీక్ష ఆయనది .యజ మాని కంటే ఎక్కువ బాధ్యత తో వుండే వారు .అందుకే నాకు ఆయన వుంటే అన్నీ ఆటోమాటిక్ గా జరిగి పోతాయి అనే నమ్మకం వుండేది . చివరి వరకు అలా నే వున్నారాయన .పెద్ద కొడుకు నరసింహం అంటే తగని ప్రేమ .వాడు యాక మూరు లో ఇల్లు కొంటె తెగ సంబర పడి పోయారు .మా ఇద్దరినీ దగ్గరుండి గృహ ప్రవేశ కార్యక్రమం జరిగే దాక వదలలేదు . నరసింహాన్ని మేము ”చిలుకూరి ”అనే వాళ్ళం /పేరు తో పిలవటం లేనే లేదు .ఇదీ మా ఒళ్ళు బలుపె.
”చిలుకూరాయన” అంటే తండ్రి ”,చిలుకూరి” అంటేకొడుకు . .మా ఇంటిల్లి పాదికీ ఇదే అలవాటు . చాలా సంపాదించాడని చెప్పుకొనే వారు ఆయన్ను గురించి .కాని ఎప్పుడు డబ్బు వున్న హజం ఆయన లో వుండేది కాదు .ఏమీ లేని వాడి గానే వుండే వాడు .ఆడంబరం ,హడా విడి లేవు .అతి సామాన్యం గా నే జీవితాన్ని గడిపారు .పెద్ద కొడుకు నరసింహానికీ అవే బుద్ధులు వచ్చాయి .అతనికి తండ్రి అంటే విప రీత మైన అభిమానం ,గౌరవం ,ప్రేమ వున్నాయి .చిలుకూరాయన కొద్ది గా జబ్బు పడి ,అనాయాసం గా మరణించారు .వారి దిన వారాలు ,సంవత్స రీకాలు దగ్గరుండి జరిపించాం చిలుకూరితో వాడి వివాహానికి మాకే పెత్తనం ఇచ్చాడు .అదీ మా చేత్తోనే జరిగింది .ఇలా మాఅందరికీ తలలో నాలుక గా మసలుతూ ,ఆపద్బాన్ధవుడి గా వుండి ,ఆదు కొనే దైవమైన వెంకటేశ్వర స్వామి పేరు తోవున్న చిలుకూరి వెంకటేశ్వర్లు గారిని ఇంత కాలానికైనా స్మరించే అదృష్టం కల్గినందుకు సంతోషం గా వుంది.
వీసా /”పాస్ పోర్ట్ కు” హైదరాబాద్ చిలుకూరు బాలాజే ఎట్లాగో ,మా ఇళ్ళలో పనులకు మా (చిలుకూరాయన) చిలుకూరి వెంకటేశ్వర్లు గారు అంటే అంత నమ్మకం మాకు .
మీ –గబిత దుర్గా ప్రసాద్ –17 -01 -12 .
ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు
ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు
ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని
ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
chilukoori venkataeswarlu gaari vanti vishishtamaina vyakthini gurinchi thelusukonadam aasakthikaramgaa undi.Aayanaki goppa paandithyam laekapovachchu.andarikee saayapadadam, andari thalalo naalkalaa vyavaharinchadam, prathiphalamgaa aemi ichchinaa theesukonadam vagairaalu choosthuntae — aayano nijamaina karmayogi anipisthunnaaru.Etti pattimpuloo, bhaeshajaaloo laeni ilaanti vaari jeevithaalanunchi koodaa manam naerchukovaalsindi entho unnadanipisthunnadi.
well after long time you have shown the chilukuri venkateswarulu works and bring my child days. Really thankful to U.
vegaraju raja