ఊసుల్లో ఉయ్యూరు –15
వీరమ్మ తల్లి తిరునాళ్ళు 2
సంతానం కోసం ప్రాణా చారాలు
సంతానం కోసం ప్రాణా చారాలు
సంతానం లేని మహిళలు ,ఆలయం ప్రక్కనే వున్న చెరువు లో స్నానం చేసి ,మెడ లో ఒక్క మంగళ సూత్రం తప్ప ,ఏ ఆభరణాలు దరించ కుండా ,తడి బట్ట లతో ,వీరమ్మ తల్లి గుడి చుట్టూ ప్రాణాచారం పడతారు .అంటే బోర్లా పడుకొంటారు .ఒళ్లంతా తడిగా వుండటం వల్ల ,కొద్ది సేపటికి మగత వస్తుందని ,అమ్మ వారు కలలో కన్పించి ,కాయ కాని ,పండు కాని ,చేతిలో పెట్టి నట్లు కల వస్తుందని ,అలా వస్తే వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం తో చేస్తారు .ఇలా జరగటానికి కొన్ని గంటలు పట్ట వచ్చు ,లేక రోజులూ పట్ట వచ్చు .అది వారి పూర్వ జన్మ సుకృతం పై ఆధార పడి ఉంటుందని నమ్మకం .అమ్మ వారి అనుగ్రహం దొరకక పొతే కల రాదు .ప్రయత్నం ఫలించలేదని తెలుసు కుంటారు .వచ్చే ఏడాదికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు .ఈ ప్రాణాచారాలు ,అమ్మ వారు ఆలయం ప్రవేశించిన రోజూ నుండి ,పౌర్ణమి దాకా చేస్తారు .పౌర్ణమి ,ఆ ముందు రోజూ గరిష్టం గా ప్రాణాచారాలు చేసే వారు కన్పిస్తారు .ఇదంతా ,తర తరాలుగా వస్తున్న ఆచారం .ప్రాణాచారం పడుకొన్న వారికి తోడుగా ,వారి కుటుంబ స్త్రీలు సహాయం గా వుంటారు .
సిడిబండి
అమ్మ వారి తిరునాళ్ళు ప్రారంభ మైన పదకొండవ రోజూ న ”సిడిబండి ”వేడుక జరుగుతుంది .ఈ సంబరాన్ని చూడ టానికి ,ప్రజలు తండోప తండాలు గా వస్తారు .స్థానికం గా ఉయ్యూరు శివాలయం వీధిలో వాటర్ టాంక్ దగ్గర ,కొబ్బరి తోటలో తరతరాలుగా నివాసం ఉంటున్న వడ్లా బత్తులు– ప్రకాశ రావు గారి కుటుంబం ,సిడిబండి చేస్తారు .ఇది చింత చెట్టు చక్రాల బండి .దానికి పొడవైన తాడి చెట్టు వుంటుంది .దాన్ని మధ్యలో చీల్చి తయారు చేస్తారు .ఇదే సిడి బండి అంటే .సుడి వేసే బండి ,అదే సిడి బండి .ప్రతి ఏడూ ఏ తాటి చెట్టు కొట్టాలో అమ్మ వారు వారికికలల కన్పించి చెబుతుందని ఆ చెట్టునే కొట్టి తయారు చేస్తా రని అంటారు .చక్రాలు పాతవే.. తాడి మానె కొత్త .వివిధ గ్రామాల నుండీ కోలాటం బృందాలు ,భజన బృందాలు వచ్చి పాల్గొంటాయి .తమ శక్తి సామర్ధ్యాలను ,కళ లను ప్రదర్శించ టానికి పోటీ పడతారు .పెళ్లి వయసు వచ్చిన ఒక దళిత యువకుణ్ణి సిడిబండి రెండో చివర కట్టిన బుట్టలో కోర్చోబెట్టి ఊరేగిస్తారు .అతని పై ప్రజలంతా ,అరటి పళ్ళు ,పొగాకు కాడలు విసురు తారు .గుమ్మడి కాయలూ విసిరేస్తారు .చెరుకు సీజన్ కనుక చెరుకు ముక్కలూ విసిరేస్తారు .మంచి గుమ్మడి కాయలతో బండిని అలంకరిస్తారు .ఇళ్ళ దగ్గర వార పోసి ,కానుకలు కొబ్బరికాయలు ,సమర్పించి ,హారతి ఇస్తారు .గుమ్మడి కాయలు సమర్పిస్తారు .సిడి బండి వాటర్ టాంక్ దగ్గర సాయం కాలమ్ బయల్దేరి ,రాత్రి పొద్దు పోయిన తర్వాత ఆలయం దగ్గరకు చేర్తుంది .మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది .మొక్కు వున్న వారు బండిలో ని తొట్టె లో కూచుని గుడి చుట్టూ తిరుగు తారు .సిడి బండి రోజున స్కూళ్ళు ,కాలేజీలు ఒకే పూటఅంటే ఉదయం మాత్రమే పని చేస్తాయి .డప్పుల హోరు ఈ తిరునాళ్ళ ప్రత్యేకత .ఇసకేస్తే రాలనంత జనం .ఉయ్యూరు ఉప్పొంగి పోతుంది ఆ రోజు .
మళ్ళీ మెట్టినింటికి చేరటం
అంబరాన్ని అంటే సంబరాలు పదిహేను రోజులు జరుగు తాయి .ప్రతి ఇంటి వారు మట్టి ప్రమిదలలో గులాం చల్లు కుంటు ఊరేగింపు గా వెళ్తారు .మొక్కులు చెల్లిస్తారు .కోళ్ళు బాగాతెగుతాయి . .మేకలు తెగుతాయి ,గొర్రె పొట్టేళ్ల వధకు అంతుండదు .ప్రతి రోజూ గుడి దగర ,అమ్మ వారి చరిత్ర ను హరికధా,బుర్ర కధ చెప్తారు .నాటకాలు వేయిస్తారు .విద్యుద దీపాలంకరణ కు కళ్ళు జిగేల్ మంటాయి .తిను బండారాలకొట్లు ,గాజుల కోట్లు ఖర్జూరపు కోట్లు ,కొబ్బరికాయల కోట్లు వేలం పాడి కొనుక్కొంటారు .ఫాన్సీ సామాల కొట్లు కూడా ఎక్కువే .ఆడ వారు అమ్మ వారిని దర్శించి తప్పకుండా గాజులు కొనుక్కొని వేసుకొంటారు .అలాగే పసుపు కుంకుమ కొంటారు .పిల్లలకు బలే సరదా .పసుపు కుంకుమ కలిపినా దాన్ని ”బండారు ”అంటారు .దర్శనం తర్వాత అందరు బండారు ధరిస్తారు .పశువులకూ పెడ తారు .ఈ పదిహేను రోజుల్లో ”భండారు ”పెట్టు కోని వారు వుండరు .బలి ని ఇచ్చే జంతువులకు కూడా పెడతారు .దాన్ని రక్ష గా భావిస్తారు .సర్కసులు జెయంట్ వీల్,గారడీలు ,చిన్న జంతు ప్రదర్శన శాలలు బాగా ఆకర్షిస్తాయి .పూర్వం” చర్ బొప్పాయ్ గుండు” అనే ఆట ఆడేవాళ్ళం . ఒక గాజు తో చేసిన పెట్టె వుండేది .దానిలో రంగుల గుంటలున్దేవి .ఆ రంగుల గడులు బయట రబ్బరు షీట్ మీద ఉండేవి .రంగుల మీద డబ్బు కాయాలి .ప్లాస్టిక్ బాల్ తీసుకొని గాజు గోడకు కొడితే అది అటు ఇటు తిరిగి ఏదో గుంట మీద నిలుస్తుంది .ఆ రంగు మీడ్ద కాసిన వాడికి రెట్టింపు డబ్బు ఇస్తారు .బలే సరదాగా ఆడే వాళ్ళం .అలాగే ఒక చక్రం దానిలో సెక్టార్ల ఆకారం లో గదులు ,దాన్ని తాకుతూ ఒక ప్లాస్టిక్ నాలుక బద్ధ లాంటిది ఒకటి వుంటుంది .చక్రాన్ని తిప్పి వదిలేయాలి నాలుక బద్ద ఎక్కడ ఆగితే దాని మీద వున్న జంతువూ ల మీద పందెం కాసిన వారికి రెట్టింపు డబ్బు ఇస్తారు .పూర్వం మూడు ముక్కలాట కూడా వుండేది .ఇప్పుడు ఇలాంటి జూదాలన్నీ నిషేధించారు .మా చిన్నప్పుడు బడి ఎగ గొట్టి తిరణాల లో తిరిగే వాళ్ళు చాలా మంది వుండే వారు .మేము మాత్రం సాయంత్రం బడి వదిలిన తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళం .రబ్బర్ బంతులు ఇనప సామాన్లు సత్తు గిన్నెలు బెలూన్లు కు గిరాకి ఎక్కువ .దొరకనివస్తువంటూ వుండదు .ప్రక్కనే జిల్లా పరిషద్ స్కూల్. ఆ పదిహేను రోజులు స్కూల్ హాజరు బాగా తక్కువ గా వుంటుంది .పూర్వం గుండ్రటి చెక్కలతో వుండే నుయ్యి లాంటిది ఒకటి వుండేది .దాన్లో మోటారు సైకిల్ మీద అడుగు నుంచి పైకి వచ్చే వారు చుట్టూ తిరుగుతూ .చూడ టానికి టికెట్ వుండేది . రంగుల రాట్నం పిల్లలకు ఎక్కి తిరగటం సరదా.బూరలు ,పిల్లన గ్రోవులు ”,డమ డమాల బండ్లు’ కోని లాగుతుంటే ఆ చప్పుడు భలేగా వుండేది .వెదురు పుల్లలతో చేసిన బండ్లకు రంగు కాగితాలతో అలంకరించి అమ్ముతారు .అందరు ఖర్జూర పండు కొనుక్కుంటారు .ఇప్పుడు గుడి లో రోజూ ప్రసాదం గా పులిహోర లేక సెనగలు పెడుతున్నారు .ప్రతి ఇంటి వారు తప్పక వచ్చి దర్శనం చేసు కొంటారు .ఉయ్యూరు అ చుట్టూ ప్రక్కల వున్న వారు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలలో వుంటే తప్పక పిల్లా జెల్లా తో తిరు నాళకు వచ్చి చూసి వెద తారు .పిల్లలకు పండగే పండగ .
ఇక్కడ తిరునాళ్ళు పూర్తి అయింతర్వాత దగరలో కృష్ణా నది ఒడ్డున వున్న అయిలురు లో జరిగే తిరునాలకు వెళ్లి అక్కడ కోట్లు పెట్టు కొంటారు .అక్కడ రెండు రోజుల తిరునాళ్ళు జరుగు తాయి ..తిరునాళ్ళు లో పదిహేనవ నాటి రాత్రి అంటే బహుళ ఏకాదశి నాడు అమ్మవారినీ ,అయ్య వారినీ గుడి నుంచి ,మేళ తాళాలతో బయల్దేర దీస్తారు .కొన్ని బజార్ల గుండా ఊరేగించి మెట్టి నింటికి చేరుస్తారు .దారిలో ప్రజలు హారతులిస్తారు వార పోస్తారు కొబ్బరికాయలు కొడతారు .అయితె అంతగా జనం వుండరు .కొమ్ము బుర్ర ల వాళ్ళు ఎక్కువ గా కని పిస్తారు .రుంజ వాయించే వారూ ఉంటారు .అయితే అమ్మ వారు సరాసరి గుడి లో ప్రవేశించారు . .శివ రాత్రి నాడు ఉదయం కొమ్ము బూరలు ఊదు కొంటు అత్తారింటి నుంచి ,అయిలూరు తీసుకొని వెళ్లి కృష్ణా నది లో స్నానం చేయించి మళ్ళీ తీసుకొని వచ్చిమెట్టి నింటి దేవాలయం లో ప్రవేశ పెడతారు .యాదవకులానికి చెందిన వారే అమ్మ వారి అర్చకులు .అమ్మ వారు యాదవ కులానికి చెందినా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అత్యంత భక్తీ శ్రద్ధ లతో వీరమ్మ తల్లిని కొలిచి కోర్కెలను తీర్చుకొంటారు .భక్త జనానికి కొంగు బంగారం వీరమ్మ తల్లి .ముద్దు గా ;;జేజమ్మ తల్లి ”అని పిల్చు కుంటారు .వీరమ్మ పేరంటాలు అనికూడా పిలుస్తారు .ఇంత మహిమ గల వీరమ్మ అమ్మ వారి చరిత్ర తెలుసుకోవాలని ఉందా !వచ్చే ఎపిసోడు దాకా ఆగండి మరి .
ఇక్కడ తిరునాళ్ళు పూర్తి అయింతర్వాత దగరలో కృష్ణా నది ఒడ్డున వున్న అయిలురు లో జరిగే తిరునాలకు వెళ్లి అక్కడ కోట్లు పెట్టు కొంటారు .అక్కడ రెండు రోజుల తిరునాళ్ళు జరుగు తాయి ..తిరునాళ్ళు లో పదిహేనవ నాటి రాత్రి అంటే బహుళ ఏకాదశి నాడు అమ్మవారినీ ,అయ్య వారినీ గుడి నుంచి ,మేళ తాళాలతో బయల్దేర దీస్తారు .కొన్ని బజార్ల గుండా ఊరేగించి మెట్టి నింటికి చేరుస్తారు .దారిలో ప్రజలు హారతులిస్తారు వార పోస్తారు కొబ్బరికాయలు కొడతారు .అయితె అంతగా జనం వుండరు .కొమ్ము బుర్ర ల వాళ్ళు ఎక్కువ గా కని పిస్తారు .రుంజ వాయించే వారూ ఉంటారు .అయితే అమ్మ వారు సరాసరి గుడి లో ప్రవేశించారు . .శివ రాత్రి నాడు ఉదయం కొమ్ము బూరలు ఊదు కొంటు అత్తారింటి నుంచి ,అయిలూరు తీసుకొని వెళ్లి కృష్ణా నది లో స్నానం చేయించి మళ్ళీ తీసుకొని వచ్చిమెట్టి నింటి దేవాలయం లో ప్రవేశ పెడతారు .యాదవకులానికి చెందిన వారే అమ్మ వారి అర్చకులు .అమ్మ వారు యాదవ కులానికి చెందినా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అత్యంత భక్తీ శ్రద్ధ లతో వీరమ్మ తల్లిని కొలిచి కోర్కెలను తీర్చుకొంటారు .భక్త జనానికి కొంగు బంగారం వీరమ్మ తల్లి .ముద్దు గా ;;జేజమ్మ తల్లి ”అని పిల్చు కుంటారు .వీరమ్మ పేరంటాలు అనికూడా పిలుస్తారు .ఇంత మహిమ గల వీరమ్మ అమ్మ వారి చరిత్ర తెలుసుకోవాలని ఉందా !వచ్చే ఎపిసోడు దాకా ఆగండి మరి .
క్రింద ఇంకొన్ని ఉసులు
ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు
ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30 -01 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Sidi Bandi gurinchi inkonni vishayaalu cheppukovaali. Sudulu thirigaedi kaabatti sudi bandi adae sidibandi ayindani raasaaru.Adi sarikaadu.Vuyyoorulo sidi bandi chakraalu chinthakarrathonoo,
sidimaanu thaatimaanugaa vaaduthunnaaraemogaanee, asalu sidimaanugaa upayoginchae
chiru maanu laeka sirimaanu anae nidupaati vruksham okati vaerae undi.Poorvakaalamlo yaethaalaku yaetham maanugaa koodaa ee nidupaati chirumaanunae vaadi neellu thodaevaaru.telugulo ee chettunu thirumaanu ani koodaa antaaru.baarugaa, drudhamgaa undae ee maanulanae yethaalaku vaadaevaaru.sirimaanu sabdam sidimaanu ayindi.Combretaceae kutumbaaniki chendina ee vruksham shaastreeya naamam ‘ Anogeissus latifolia'(Axle-wood). Aa
madhya nallamala adavulalo Y.S.R. prayaanisthunna helicopter ee chirumaanu chettunu guddukunae petrol tank baddalai aa chettu niluvunaa thagalabadi poyindi.jaatharalalo anaadigaa
sidimaanuku manushulu vaellaadadaanni praacheena kavulu saitham paerkonnaaru.Gamanincha praarthana.
Sundi bandi..Siri bandi..sidi bandi andi akkad a uddesam lucky ani. Veer vaaduka bhashaku link lenidi…