అందరి నేస్తం డికెన్స్ –2
రచనా వ్యాసంగం 
1831 లో అంటే డికెన్స్ 19 వ ఏటనే ఫ్రీ లాన్స్ కోర్ట్ రిపోర్టర్ అయాడు .షార్ట్ హాండ్ అతి వేగం గా రాస్తూ దేశం లోనే ఫాస్తేస్ట్ షార్ట్ హాండ్ రిపోర్టర్ అని పించుకొన్నాడు .ఇతని నవలలు ఆతర్వాత షార్ట్ హాండ్ లోకి అనువాదం పొందటం గొప్ప విశేషం .నటించాతమూ అతనికి బాగా తెలుసు .ఒక కంపెని మేనేజర్ అతన్ని ఆడిషన్ టెస్ట్ కు పిలిపించాడు .తలనొప్పి రాంప వల్ల వెళ్ళ లేక పోయాడు .లేక పొతే రచయిత డికెన్స్ బదులు కమెడియన్ డికెన్స్ మిగిలే వాడేమో ?ట్రూసన్ పేపర్ కు రిపోర్టర్ అయాడు .రిటన పార్లమెంట్ విశేషాలు రిపోర్ట్ చేసే వాడు .రెండు నాల్కల లాయర్లు ,రంగులు మార్చే ఊసరవెల్లి రాజా కీయ నాయకులు ,బద్ధ కస్తులు ,లంచగొండి బ్యూరో క్రాట్ లను చూసి ,వారు ఆడే మానవ నాటకాలను చూసి ఆశ్చర్య పోయే వాడు .వాళ్ళందరి జీవితాలను చదివి అర్ధం చేసుకొన్నాడు .”న్యాయం అనే తండ్రి పిల్లల్ని దూరం చేసుకొన్నాడు ”అని డికెన్స్ భావించాడు .వీళ్ళందరి జీవితాలను చదివే సరికి జీవితం అంత సరిపడా రచనా సామగ్రి దొరికింది .మంత్లీ మాగా జైన లలో ”విగ్నేట్స్ అఫ్ సిటీ లైఫ్ ‘(‘నగర జీవిత పుష్ప చిత్రం )అని రాస్తుండే వాడు .ఈ అనుభవమే ”పిక్విక్ పేపర్స్ ”రచనకు దారి తీసింది .ఎలెక్షన్ వార్తల కోసం ఇంగ్లాండ్ ,స్కాట్లాండ్ దేశాలన్నీ తిరిగాడు .మానవ ప్రవర్తన యెంత కృత్రిమం గా,బుద్బుద ప్రాయం గా వుంటుందోతెలుసు కొన్నాడు .ఒక గంటకు 15 మైళ్ళు తిరిగాడు . లండన్ లో ప్రతి అంగుళం అతనికి తెలుసు .సాన్నిహిత్యం ఏర్పరచు కొన్నాడు .21 ఏళ్ళ వయసులో మంచి పేరు ,ప్రఖ్యాతి వచ్చాయి .లండన్ గెజెట్ కు స్కెచెస్ రాశాడు .ఇద్దరంమాయిల ప్రేమలో నలిగి పోయాడు .అందులో ఒకరైన మేరియా బీడ్న్స్ అనే అమ్మాయినే ”డేవిడ్ కాఫర్ ఫీల్డ్ ”నవలలో ”డోరా ”పాత్రగా చిత్రించాడు .ఇతనికి ఆమె పై ప్రేమ వున్నా ,ఆమె ఆకర్షితు రాలు కాలేదు .ఇది వాన్ సైడ్ ప్రేమ ట్రాక్ గా మిగిలి పోయింది పాపం .అతన్ని ”బాయ్ ”అని అవమానించేది .
మానసిక క్షోభ అనుభ వించాడు .మేరియ వాళ్ళ మిజేరి పెరిగింది .ఆమె నుంచి దూరం అవుతూ తానూ అంట వరకు ఎవరిని ప్రేమించ లేదని బ్రతికి ఉండగా మేరియా ను తప్ప ఇంకేవారిని ప్రేమించానని బీరాలు పోతూ రాశాడు .ఆ తర్వాతా ఆమె కు రాసిన ఉత్త రాలన్ని తగల బెట్టె శాడు .ఇదంతా నవలలో డోరా -డేవిడ్ ల ప్రేమ గా రాశాడు
సీరియల్ రచన
కేథరిన హోగార్డ్ తో వివాహమైంది .గోల్డ్స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలలో మోసెస్ అనే చిన్న పిల్లాడు తానా పేరు చెప్పా మంటే ముక్కు మాటలతో ”బోజేస్ ”అనే వాడట .అదే” బోజ్”గా మార్చుకొని పేపర్లకు రాశాడు .చిన్న తమ్ముడికి ఆ పేరే పెట్టాడు కూడా .వాడంటే వాళ్ళ మాలిన అభిమానం డికెన్స్ కు .అసలు పేరు ”ఆగస్ట్ ”(ఘన మైన ).చివరికి వాడే అందరి ముందు డికెన్స్ ను ఆవ మానించి 1866 లో చని పోయాడు .తానూ రాసే స్కెచెస్ లో నగర జీవితం ,అణగారిన సామాన్యుల జీవితాలను చిత్రించే వాడు .పాత బట్టలు అమ్మే వాళ్ళు ,కిల్లీడుకానం వాళ్ళు ,టీ తోటల్లో పని చేసే వాళ్ళు కిల్లి దుకాణం వాళ్ళు బాధితులైన భార్యలు ,శిక్ష పడ్డ ఖైదీలు ,అందరు పాత్రధారులే .గుమాస్తాల మీదా ,ఆడంబరాల మీద ,ద్రాక్ష సారాయి మీద ,వంచన మీద ,మోస కారుల పై మిలిటరీ బాచి లర్ల పై ,ఇచ్చకాలు ఆడే వారి మీద అధిక్షేప రచనలు చేసి ”బోజ్ ”ప్రఖ్యాత రచయిత గా గుర్తింపు పొందాడు .”వేల మంది గొంతుక తానె అయాడు(a MAN OF THOUSAND VOICES) .
దీన్నే ”డికెన్స్ TERRITORY ”అన్నారు విశ్లేషకులు .ఆ రచనలు ఆవేదనకు ,దుఖానికి ఆలంబనం .నగర సంస్కృతీ వీధి భాగోతం ,కింది తరగతి జనాల పలుకు బదులు ,వాళ్ళ నివాసాలు ,జీవన విధానం అన్ని తానా స్కెచెస్ లో ప్రతి బిమ్బింప జేశాడు .లండన్ నగర పాత్రను ఎవరు చిత్రించా నంత గొప్ప గా కళ్ళకు కట్టించి చూపించాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-17 -03 -1

1831 లో అంటే డికెన్స్ 19 వ ఏటనే ఫ్రీ లాన్స్ కోర్ట్ రిపోర్టర్ అయాడు .షార్ట్ హాండ్ అతి వేగం గా రాస్తూ దేశం లోనే ఫాస్తేస్ట్ షార్ట్ హాండ్ రిపోర్టర్ అని పించుకొన్నాడు .ఇతని నవలలు ఆతర్వాత షార్ట్ హాండ్ లోకి అనువాదం పొందటం గొప్ప విశేషం .నటించాతమూ అతనికి బాగా తెలుసు .ఒక కంపెని మేనేజర్ అతన్ని ఆడిషన్ టెస్ట్ కు పిలిపించాడు .తలనొప్పి రాంప వల్ల వెళ్ళ లేక పోయాడు .లేక పొతే రచయిత డికెన్స్ బదులు కమెడియన్ డికెన్స్ మిగిలే వాడేమో ?ట్రూసన్ పేపర్ కు రిపోర్టర్ అయాడు .రిటన పార్లమెంట్ విశేషాలు రిపోర్ట్ చేసే వాడు .రెండు నాల్కల లాయర్లు ,రంగులు మార్చే ఊసరవెల్లి రాజా కీయ నాయకులు ,బద్ధ కస్తులు ,లంచగొండి బ్యూరో క్రాట్ లను చూసి ,వారు ఆడే మానవ నాటకాలను చూసి ఆశ్చర్య పోయే వాడు .వాళ్ళందరి జీవితాలను చదివి అర్ధం చేసుకొన్నాడు .”న్యాయం అనే తండ్రి పిల్లల్ని దూరం చేసుకొన్నాడు ”అని డికెన్స్ భావించాడు .వీళ్ళందరి జీవితాలను చదివే సరికి జీవితం అంత సరిపడా రచనా సామగ్రి దొరికింది .మంత్లీ మాగా జైన లలో ”విగ్నేట్స్ అఫ్ సిటీ లైఫ్ ‘(‘నగర జీవిత పుష్ప చిత్రం )అని రాస్తుండే వాడు .ఈ అనుభవమే ”పిక్విక్ పేపర్స్ ”రచనకు దారి తీసింది .ఎలెక్షన్ వార్తల కోసం ఇంగ్లాండ్ ,స్కాట్లాండ్ దేశాలన్నీ తిరిగాడు .మానవ ప్రవర్తన యెంత కృత్రిమం గా,బుద్బుద ప్రాయం గా వుంటుందోతెలుసు కొన్నాడు .ఒక గంటకు 15 మైళ్ళు తిరిగాడు . లండన్ లో ప్రతి అంగుళం అతనికి తెలుసు .సాన్నిహిత్యం ఏర్పరచు కొన్నాడు .21 ఏళ్ళ వయసులో మంచి పేరు ,ప్రఖ్యాతి వచ్చాయి .లండన్ గెజెట్ కు స్కెచెస్ రాశాడు .ఇద్దరంమాయిల ప్రేమలో నలిగి పోయాడు .అందులో ఒకరైన మేరియా బీడ్న్స్ అనే అమ్మాయినే ”డేవిడ్ కాఫర్ ఫీల్డ్ ”నవలలో ”డోరా ”పాత్రగా చిత్రించాడు .ఇతనికి ఆమె పై ప్రేమ వున్నా ,ఆమె ఆకర్షితు రాలు కాలేదు .ఇది వాన్ సైడ్ ప్రేమ ట్రాక్ గా మిగిలి పోయింది పాపం .అతన్ని ”బాయ్ ”అని అవమానించేది .

సీరియల్ రచన
కేథరిన హోగార్డ్ తో వివాహమైంది .గోల్డ్స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలలో మోసెస్ అనే చిన్న పిల్లాడు తానా పేరు చెప్పా మంటే ముక్కు మాటలతో ”బోజేస్ ”అనే వాడట .అదే” బోజ్”గా మార్చుకొని పేపర్లకు రాశాడు .చిన్న తమ్ముడికి ఆ పేరే పెట్టాడు కూడా .వాడంటే వాళ్ళ మాలిన అభిమానం డికెన్స్ కు .అసలు పేరు ”ఆగస్ట్ ”(ఘన మైన ).చివరికి వాడే అందరి ముందు డికెన్స్ ను ఆవ మానించి 1866 లో చని పోయాడు .తానూ రాసే స్కెచెస్ లో నగర జీవితం ,అణగారిన సామాన్యుల జీవితాలను చిత్రించే వాడు .పాత బట్టలు అమ్మే వాళ్ళు ,కిల్లీడుకానం వాళ్ళు ,టీ తోటల్లో పని చేసే వాళ్ళు కిల్లి దుకాణం వాళ్ళు బాధితులైన భార్యలు ,శిక్ష పడ్డ ఖైదీలు ,అందరు పాత్రధారులే .గుమాస్తాల మీదా ,ఆడంబరాల మీద ,ద్రాక్ష సారాయి మీద ,వంచన మీద ,మోస కారుల పై మిలిటరీ బాచి లర్ల పై ,ఇచ్చకాలు ఆడే వారి మీద అధిక్షేప రచనలు చేసి ”బోజ్ ”ప్రఖ్యాత రచయిత గా గుర్తింపు పొందాడు .”వేల మంది గొంతుక తానె అయాడు(a MAN OF THOUSAND VOICES) .

సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-17 -03 -1