చరిత్ర-సాహిత్యం — 4
పత్ర్రికలు ప్రజా బాహుళ్యానికి చేరువ గా ఉంటాయి .ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా పత్రికల సేవ నిరుప మానం .సంపాదకులైన కాశీ నాధుని ,ముట్నూరి ల సంపాదకీయాలను ప్రజల్ని చైతన్య పరచి కార్యోన్ముఖులను చేశాయి .బ్రిటీష వారికి అవి కొరడా దెబ్బలే .సినిమాలు జాతీయ ,రాష్ట్రీయ అభిమానాన్ని ప్రోది చేశాయి .సాంఘిక దురాచారాలను ఎండ గట్టాయి .
వీటన్నిటికి మించి కధ సామాన్యులను బాగా పలకరించింది .పెద్ద ప్రభావమే కల్గించింది .ఆధునిక తెలుగు కధ కు ఆద్యుడు గురజాడ .ఆయన కధ ‘’దిద్దు బాటు ‘’మొదటి ఆధునిక కధానిక .విశ్వనాధ ,వేలూరి ,శ్రీ పాద ,మల్లాది మా గోఖలే ,బుచ్చి బాబు ,,గోపీ చాంద్ ,చిన్తాదీక్షితులు పద్మ రాజు ,చా.సో.,తిలక్ వగైరా మంచి కధలు రాసి మంచి ప్రభావం చూపారు .కాలాన్ని బట్టి శైలి మారింది .భాష కూడా మారింది .ఏదైనా ప్రజలకు దగ్గరయ్యే ఉపాయం వెదుక్కోందిసాహిత్యం ..రేడియో ,టి.వి. ల ప్రభావం మాటలతో చెప్పక్కర లేదు .మినీ కధ ,కాలం కధ లు వచ్చాయి .మినీ ,హైకూ కవితలు రాజ్యమేలుతున్నాయి .కొందరు కవులు తాము చూసిన విషయాలను చాటువులు గా అందించారు .కంప్యుటర్ వచ్చి మొత్తం అంతా మార్చేసింది .యువత దాని లో కొట్టుకు పోతోంది .అది అవసరమే అయినా అనవసర విధానాలు జనాన్ని పేడ దారి పట్టిస్తున్నాయి .కొత్తరచనలు బ్లాగులు సాహితీ సేవ చేస్తున్నాయి .ఖగోళ రహస్యాలు తెలుస్తున్నాయి .వ్యావహారిక భాష అవసరాన్ని గిడుగు వారు బహుళ వ్యాప్తి లోకి తెచ్చారు .పాత్రోచిత భాష ను కన్యా శుల్కం లోను ,ప్రతాప రుద్రీయం లో ను గురజాడ వేదం వారు ప్రవేశ పెట్టి మార్గ దర్శనం చేశారు .మాండలికం లో కధలు ,కవితలు వచ్చి ఉత్తేజితుల్ని చేస్తున్నాయి .రాయలసీమ తెలంగాణా ,ఉత్తరాన్ద్ర్ర రచయితలు దూసుకు పోతున్నారు .
ఒక దేశం లో జరిగిన సంఘటనలు ,చరిత్ర ఇతర దేశాల పై అక్కడి రాజకీయ ,ఆర్ధిక ,సామాజిక స్తితుల పై ,సాహిత్యం పై ప్రభావం చూపిస్తాయి .బయల్దేరింది ఒక దేశం లో నైనా ,దాని ప్రభావం మీడియా ద్వారా విశ్వ వ్యాపితమవుతుంది .స్పెయిన్ దేశపు నాటక కర్త ‘’లోప దివేగా ‘’1800 లో నాటకాలు రాశాడు .షేక్స్ పియర్ చాలా తస్క్కువే నాటకాలు రాశాడు .కాని ప్రపంచ దేశాల పై అనంత ప్రభావం చూపాడు .రాసింది రసానందం గా ఉండటమే దీనికి కారణం .విశ్వ శ్రేయస్సు ను కల్గించాలి .’’నిన్నటి మహా భారతం పద్దెనిమిది పర్వాలు అయితే నేటి కావ్యం పద్దెనిమిది పంక్తులే ‘’అన్నాడు శ్రీ శ్రీ .తక్కువలో ఎక్కువ ప్రభావం కలిగించేదే ఉత్తమ రచన .అంత కూడా భరించలేం –‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’అనేశారు .స్పూర్తి ,చైతన్యం కల్గించే ఒక్క వాక్యం చాలు అదే కావ్యం అని అర్ధం .అంటే భిన్నత్వం లో ఏకత్వం సాధించేది ,శాంతిని బోధించేది ,సారవంతం అయింది అయిదే గొప్ప రచన ..తన అనుభూతి ని జనం అనుభూతిగా చేసేదే .అదే కల కాలం నిలుస్తుంది .
literature is the immortaalityof the human speech’’అన్నారు .గ్రీకు దేశానికి స్వాతంత్ర ప్రబోధం చేసి ,తానూ స్వయం గా యుద్ధ రంగం లో దూకి తన జాతికి స్వాతంత్రం తెచ్చాడు ‘’బైరాన్ ‘’మహా కవి ..అలాగే ఫ్రెంచి విప్ల వాన్ని ప్రేరే పించి ,విప్లవ గీతాలు ,కావ్యాలు రాసి రూసో అనే రచయిత తన దేశానికి స్వేచ్ఛ కల్గించాడు .ఈయనకు వాల్టర్ అనే మరో రచయిత తోడూ అయాడు .రష్యా లో గోర్కి ,తాల్ స్టాయ్ ,రచనలు జనాలను చైతన్య పరచాయి .ఇక్కడ విప్లవాలు ,ఉద్యమాలు ,సాహిత్యం ఒక దానికొకటి తోడ పడి జమిలిగా సాగాయి .
literature is the critisism of life ‘’అని ఆర్నోల్డ్ అంటే ,it is an expression of society అని ఇంకోరు అన్నారు .literature is the comprehensive essence of the intellectual life of a nation ‘’అని వేరొకరు వ్యాఖ్యానించారు .అన్నీ నిజాలే .తెనాలి రామ లింగని ‘’పాండురంగ మహాత్మ్యం ‘’లో నిగమ శర్మకధ ఆనాడు విశృంఖలం గా తిరిగిన యువకుడి కధ .గౌరన రాసిన ‘’హరిస్చంద్రో పాఖ్యాన్నం ‘’లో నక్షత్రకుని పాత్ర ,పెద్దన గారి మను చరిత్ర లో వరూధిని ,ప్రవరుడు ,ముక్కు తిమ్మన గారి సత్య భామ ,కళాపూర్ణోదయం లోని కల భాషిణి ,అందరు ఆయా కాలాల్ లోని విలక్షణ వ్యక్తులే .హాయిగా భార్యా పిల్లల టో కాల క్షేపం చేయకుండా దూరం గా పారి పోవాలని భావించే వారిని మళ్ళీ గృహసత ఆశ్రమం వైపు కు రప్పించే ప్రయత్నాలే మను ,పాండు కావ్యాలు ..మహమ్మదీయ దండ యాత్రల ఫలితం గా ఆంధ్రజాతి నిర్వీర్యమైంది ..విజయ నగర రాజులు ఆంధ్రుల ప్రాభవాన్ని నిల బెట్టారు .అందుకే రాయల వారి ఆముక్త మాల్యద లో సామాజిక స్పృహ ,మాలదాసరి కధ లో భక్తికి కుల మత భేదాలు లేవని చెప్పటం ,రాజనీతి ,వగైరాలు నిక్షిప్తమైనాయి ..తెలుగు జాతి ఆచార వ్యవహారాలను నాగరకత ,విశ్వాసాలు ,పండుగలు ,పబ్బాలు క్రీడాభి రామం లో శ్రీ నాధుడు చూపాడు .వీటిని ఆధారం చేసుకొని శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ‘’ఆంధ్రుల సాంఘిక చరిత్ర ‘’రాశారు .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —31-5-12.—కాం