వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –9
కుంభ కోణం లో కుండ మూతి లింగం
తమిళ నాడు లోని కుంభకోణం లో వెలసిన ‘’కుమ్భేశ్వర స్వామి ‘’లింగం కుండా మూతి లాగా ఉండటం తో ఆ పేరు వచ్చింది .ఇక్కడ మహా మాఘం అనే కొలను ఉంది .పన్నెందేల్లకు వచ్చే పర్వ దినమే మహా మాఘం ..ఆ సమయం లో ఆ కొలను లో ‘’గంగా జలం ‘’పుడుతుందని భక్తుల విశ్వాసం .ఇదీ ఇక్కడి వింత ,విశేషం . మహా మాఘం లో ఉత్సవం అమోఘం గా జరుగుతుంది .
వ్రేలి ముద్రలు కని పించే సైకత లింగం
కర్నూలు జిల్లా ప్రొద్దుటూరు కు దగ్గర్లో ముక్తి రామేశ్వరం ఉంది ..ఇక్కడి లింగం ఇసుక తో చేసింది .సైకత లింగం అంటారు ..లింగం అయిదు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండటం విచిత్రం .ఈ లింగం పై ఇసుకను అదిమి పెట్టిన చేతి వ్రేలి ముద్రలు ఇప్పటికీ కని పించటం విశేషం .
ఉత్సవాలు లేని కోటి పల్లి లింగం
తూర్పు గోదావరి జిల్లా కాకి నాద కు దగ్గర్లో గోదావరి ఒడ్డున కోటి పల్లి దివ్య క్షేత్రం .దేవేంద్రుడు నిర్మించిన స్వంభూ శివలింగం ,ఆలయం ఉన్నాయిక్కడ .పాతాళం నుంచి ఈ లింగం ఉద్భవించినదని పురాణ కధనం .ఇది ‘’యోగా లింగం ‘’అవటం వల్ల ఉత్స వాలు ఉండవు .ఈ కోటేశ్వర స్వామికి చైత్ర మాసం నుండి అయిదు నెలలు కోటి తీర్ధం లో ఉంటాడు .మిగతా ఏడు నెలలు కోటి తీర్ధ జాలం నేల మట్టం వరకు వుండి ,భక్తులకు దర్శనం ఇస్తూ ,ఆనందం మాత్రమే కల్గించటం విశేషం .
కన్నీరు కార్చే గరుడుడు
నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట కు రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మన్నారు పోలూరు ‘’గ్రామం పురాణ ప్రసిద్ధి చెందింది ..ఇక్కడే జాంబ వంతునికి ,శ్రీ కృష్ణుడికి యుద్ధం జరిగిందని అంటారు .ఇక్కడున్న ‘’అలఘు మల్లామ్క్రిష్ణ ‘’దేవాలయం చాలా పురాతన మైనది ..చాళుక్య రాజులు కట్టిన దివ్య దేవాలయం ఇది ..ఇక్కడ సుగ్రీవ ,జాతాయు ,జాంబవంత ,గరుత్మంతుల భారీ విగ్రహాలు అందర్ని ఆకర్షిస్తాయి .స్వామి భక్తు లంతా కొలువు దీరి నట్లు ఉంటుంది ..దీన్ని మని కాంత క్షేత్రం అని కూడా పిలుస్తారు ..స్వామి గర్భాలయానికి దక్షిణం గా ‘’సౌందర్య వల్లి ‘’అమ్మ వారు ఉంటారు .స్వామికి ఎదురుగా తొమ్మిది అడుగుల ఎత్తున గరుత్మంతుని విగ్రహం సమ్మోహన పరుస్తుంది .గరుడుని కంటి నుంచి కన్నీరు ఒలుకు తున్నట్లు శిల్పి విగ్రహాన్ని మహాద్భుతం గా మలిచాడు ..శమంతక మని ని శ్రీ కృష్ణుడు ఇక్కడే జాంబవంతుని దగ్గర నుండి పొందాడని ఐతిహ్యం .సత్య .జాంబవతీ సమేత శ్రీ కృష్ణ స్వామి దర్శనం సర్వ శుభ ప్రదం ..ఇక్కడే సత్య భామ కు గర్వ భంగం అయిందట ..ఈ ప్రదేశం లోనే ఆంజనేయుని చేత గర్వ భంగం అయింది .తనకు జరిగిన అవమానాన్ని దుఃఖిస్తూ ,తన స్వామికి మొర పెట్టు కొనే సన్నీ వేష రూప కల్పనే గరుడుని కన్నీరు గాధ .ఇప్పటికి ఆ కన్నీరు గాధను మనం చూడ వచ్చు .అద్భుత మైన వింత ఇది .ఇక్కడి శిల్ప సౌందర్యం చిత్రాతి చిత్రం గా ఉంది మనసులను ఆకర్షిస్తుంది .