వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –11
సైకత లింగ రామేశ్వరుడు
ఐతిహాసికత ,చారిత్రిక ప్రాధాన్యం ఉన్న క్షేత్రం రామేశ్వరం .కాశీ ,ప్రయాగ క్షేత్రాల లో గంగా స్నానం చేసి ,ఆ పవిత్ర గంగా జలాన్ని కలశం లో నింపు కొని ,,విశ్వేశ్వర లింగా నికి అభిషేకం చేసి పులకించి ,సీలు చేసిన చెంబుల్లో గంగా జలాన్ని భద్రపరచి వెంట తెచ్చు కొని రామేశ్వరం లో సముద్ర స్నానం చేసి ,ఆ గంగా జాలం తో రామేశ్వర లింగానికి అభి షేకం చేసి సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందటం భారత దేశం లో ఒక సంప్రదాయం .ఇది తరతరాలుగుఆ అవిచ్చిన్నం గా సాగి పోతున్న చరిత్ర ..ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరానికి గొప్ప ప్రాదాన్య త ఉంది ..
తమిళ నాడు లో మదురై నగరానికి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం లో ,రామనాధ పురం జిల్లాలో వున్న ద్వీపం రామేశ్వరం. చుట్టూ సముద్రం ..రామేశ్వరం విష్ణు మూర్తి యొక్క శంకు ఆకారం లో ఉండటం విశేషం ..ఇక్కడ నూనె గానుగలు కుండలు చేయటం ఉండవు .కారణం రామేశ్వర లింగం సైకత అంటే ఇసుక లింగం ..బోలుగా ఉంటుంది .కాశీ యాత్రా ఫలం దీనికి దగ్గర్లో ఉన్న ధనుష్కోటి లో అంటే సేతువు లో స్నానం చేసిన తర్వాతా లభిస్తుంది ..బంగాళాఖాతం ,హిందూ మహా సముద్రం ,కలిసే చోటునే సేతు అంటారు .అంటే వారధి అని అర్ధం ..ఇక్కడే శ్రీ రాముడు లంకకు చేర టానికి వారధి కట్టాడు .ఇప్పటికి శ్రీ రామ వారధి చిహ్నాలు ఇక్కడ కని పించటం మరో విశేషం .
రావణ వధ తర్వాతా బ్రహ్మ హత్యా దోష నివారణ కోసం శ్రీ రాముడు శివ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి దోష విముక్తుదవాలని భావించాడు ..ఇక్కడ ప్రతిష్టించే లింగాన్ని కాశీ వెళ్లి తీసుకొని రావలసినది గా అంజ నేయుడికి చెప్పాడు .అనుకొన్న ముహూర్తానికి హనుమ రాక పోతే సీఎతా దేవి ఇసుక తో లింగం చేసి ఇస్తే ,మహర్షుల ఆజ్న ప్రకారం శ్రీ రాముడు ఆ సైకత లింగాన్ని ప్రతిష్టించాడు ..హను మంతుడు కాశీ నుంచి లింగం తెచ్చి ,జరిగిన విషయం తెలుసు కొని ,ఇసుక లింగాన్ని తోక తో పేక లించటా నికి విశ్వ ప్రయత్నం చేశాడు ..విఫలుడుఅయాడు ..హనుమ ను అనున యించి ,సైకత లింగం ప్రక్కనే హనుమ తెచ్చిన కాశీ లింగాన్ని రాముడు ప్రతిష్ట చేసి హనుమ ను శాంతింప జేశాడు ..భక్తులు ముందుగా హనుమ తెచ్చిన లింగానికి పూజ చేసి ,ఆ తర్వాతే సైకత లింగాన్ని పూజించాలని శ్రీ రాముడు విధి విధానాన్ని ప్రకటించాడు .అప్పటి నుండి అలానే జరుగు తోంది ..హనుమ తెచ్చినలింగాన్ని ‘’విశ్వ లింగం ‘’అని ,సీత చేసిన ఇసుక లింగాన్ని ‘’రామ లింగం ‘’అని పిలుస్తారు .
ఆలయానికి మూడు మండ పాలు ,వాటి పై అద్భుత శిల్ప సంపద ఉంటుంది ఆలయం 865అడుగుల పొడవు ,657అడుగుల వెడల్పు ఉంటుంది ..పైకప్పును 49 అడుగుల పొడవైన రాతి దూలం మోస్తుంది ..మొత్తం దేవాలయం విస్తీర్ణం 4000చదరపు అడుగులు .ప్రపంచపు అద్భుతాలలో రామేశ్వరాలయం ఒకటి ..తూర్పు ,పడమరల ఎత్తైన గోపురాలున్నాయి .పన్నెండవ శతాబ్దం లో ఉదయాన్ సేతు పతి అనే రామ నాద పురం పాలకుడు ఈ ఆలయాన్ని కట్టించాడు ..గర్భ గుడి లో శ్రీ రామ లింగేశ్వర లింగం ఉంటుంది .దేవేరి ‘’పర్వత వర్ధని ‘’అమ్మవారు స్వామికి కుడి వైపు ఉంటుంది ..శ్రీ చక్రం ఉన్న ఆలయం ఇది .ఈ ఆలయానికి ఉత్తరం గా ‘’విశ్వలింగ ‘’దేవాలయం ఉంది .అమ్మవారి పేరు ‘’విశాలాక్షి ‘’..ఈశాన్యం లో నట రాజ స్వామి ఆలయం ఉంది ..తూర్పు గోపుర ద్వారానికి ,కుడి వైపు ఎరుపు రంగు కలిగి ,దక్షిణ ముఖం గా ఉన్న ఆంజనేయ విగ్రహం పరమ ఆకర్షణీయం గా ఉంటుంది ..ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం లో స్వామి వారల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహ్స్తారు .ధ్వజస్తంభం నందీశ్వరుని వెనుక ఉండటం ఇక్కడ మరో వింత ..దేవాలయ ముఖ ద్వారం సముద్రాభి ముఖం గా ఉంటుంది .గుడికి సముద్రం చాలా దగ్గరే ..ఇక్కడి సముద్ర జలానికి ‘’అగ్ని తీర్ధం ‘’అని పేరు .దేవాలయం ఆవరణ లో 22నూతులున్నాయి ..సముద్ర స్నానం చేసి వచ్చి ,ఈ బావుల్లోని నీటిని బొక్కెన లతో తోడుకొని లేక పోయించుకొని స్నానం చేయాలి ..నీరు తోడి పోయటానికి మనుష్యులు బొక్కెన లతో రెడీ గా ఉంటారు ..బేరం ఆడి వారిని నియమించుకోవాలి ..బావుల్లో స్నానం చేయటానికి సుమారు ఇరవై రూపాయల టికెట్ కొనుక్కో వాలి .ఇరవై రెండు బావులకు వేరు వేరు పేర్లున్నాయి .అవన్నీ పవిత్ర తీర్ధ జలాల్ని విశ్వాసం ..ఆ నీటి లో స్నానం చేస్తే ,శారీరక మానశిక ఆనందం లభిస్తుంది .కారణం ఆ జలాల్లో ఓషధీ ధర్మాలున్డటమే .అదికాక సముద్రపు ఒడ్డున ఉన్నా ఆబావుల్లో నీరు ఉప్పగా ఉండక పోవటం చిత్రాతి చిత్రం .ఒక్కో బావికి ఒక్కో మహర్షి పేరుంటుంది .
రామేశ్వరానికి రెండు కిలో మీటర్ల దూరం లో కోదండ రామ స్వామి దేవాలయం ఉంది .ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణునికి శ్రీ రాముడు శరణా గతిని ఇచ్చాడు ..ధనుష్కోటికి వెళ్ళే దారి లో ‘’జటా తీ ర్ధం ‘’ఉంది .శ్రీ రాముడు రావణ వధ ,రామ లింగ ప్రతిష్ట తర్వాతా,తన జటలను ఈ తీర్ధం లో తడుపు కొన్నాడట ..అందుకే ఆపేరు వచ్చింది .
రామనాధ పురానికి పదిహేను కి.మీ.దూరం లో ‘’దేవీ పట్నం ;’’ఉంది .ఇక్కడ శ్రీ రాముడు తొమ్మిది శిలలను ప్రతిష్ఠించటం చేత ‘’నవ పాషాణం ‘’అని పిలుస్తారు ..ఇవే నవగ్రహాలు .
రామేశ్వరం లో శ్రీ రాముని పాదుకలు ఉన్న చోట పెద్ద పెద్ద బండ రాళ్ళు ఉంటాయి .వీటిని నీటి లో వేస్తె తెలిపోవటం మహిమా ,విశేషం .సేతువు ను ఇలాంటి ఇటుకలతో నే నిర్మించారని భావిస్తారు ..రామేశ్వరం శివ వైష్ణవ సమ దర్శన క్షేత్రం .ముక్తి క్షేత్రం ..దివ్య క్షేత్రం
మరో వింత ఆలయం సంగతి ఇంకో సారి –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —4-6-12.—కాంప్—అమెరికా