జ్ఞానడుడు మహర్షి నారదుడు -20(చివరి భాగం )
ఈ విధం గా నారదుడు దేవకీ వసుదేవులకు శ్రీహరి దివ్య కదామృత పానం చేయించి ,స్వస్వరూప జ్ఞానం కల్గించాడు .అవతార పురుషుని అవతారం సమాప్తమయ్యే స్తితి దగ్గరకు వచ్చింది కనుక ,వారి కోసం మనసు లో ఉండే బాధను అణచుకోవటానికి ఉన్ముఖీ కరణం చేశాడు మహర్షి .యాదవ వంశ వినాశామూ శ్రీ హరి సంకల్పమే కనుక ,యాదవ కులం లో మిగిలి ఉండేవారేవ్వరు ఉండరని అర్ధం చేసుకొనే మానషిక ధైర్యం తట్టుకొనే శక్తి ఆ తలిదండ్రులకు కల్పించగాలిగాడు .ఈ జీవిత మంతా ఒక పద్ధతి ప్రకారం ,విధి విధానం గా నడుస్తుంది అన్న సత్యాన్ని ఆవిష్కరించాడు .కర్మల వల్ల ఉత్తమ లోకాలు కలిగినా ,శాశ్వతానందం ముక్తి మాత్రమె నని ,అదీ శ్రీ హరి చింతనం వల్ల మాత్రమె సాధ్యమని ఎరుక పరచాడు .బంధం మోక్షానికి అడ్డం కనుక సర్వ బంధనాలను విచ్చిన్నం చేసుకొని ‘’నీవే తప్ప ఇతః పరంబెరుగా‘’ననే ప్రపత్తి మార్గాన్ని చేబట్టాలని అప్పుడే ఆయన సామీప్య, సారూప్య ,,సాయుజ్య, ప్రదమైన మోక్షం కలుగుతుందని మహర్షి నారదుడు ఆయా సందర్భాలలో ససవివరం గా తెలియ బర్చాడు .నవవిధ భక్తులనూ బోధించిన నారదుడు చెప్పని విషయమే లేదు .
ఇంతటి మహోన్నత భక్తీ సామ్రాజ్యాన్ని దర్శింప జేసిన శ్రీ మద్భాగవతం చరితార్ధ మైంది .పుణ్య ఫల ప్రదమైంది .
‘’లలిత స్కంధము కృష్ణ మూలము ,శుకా లాపాభి రామంబు ,మం
జులతాభి శోభితమున్ ,సువర్ణ సుమనస్సుజ్నేయ మున్ ,సుందరో
జ్జ్వల వృత్తంబు ,మహా ఫలంబు ,విమల వ్యాసాల వాలంబు నై
వెలయున్ ,భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై .’’
‘’సత్యం పరం ధీమహి ‘’అని గాయత్రీ ప్రారంభం లో ,గాయత్రీ నామ బ్రహ్మ స్వరూపమై ,మత్స పురాణం లో గాయత్రిని అధికరించి ,ధర్మ విస్తారాన్ని వృత్రాసుర వధను చెప్పబడేది మాత్రమె భాగవతం అనడం వల్ల ఇది మహా భాగవతం అయింది, అనిపించు కొన్నది
‘’శ్రీ మంతమై ముని శ్రేష్ట కృతంబైన భాగవతంబు సద్భక్తి తోడ
వినగోరు వారల విమల చిత్తంబుల ,జెచ్చెర నీశుడు చిక్కుగాక
ఇతర శాస్త్రంబుల ,నీశుండు చిక్కునే ,మంచి వారలకు నిర్మత్సరులకు
గపట నిర్ముక్తులై ,కాంక్ష సేయకయును దగిలి యుండుట మహా తత్వ బుద్ధి
బరగానా ధ్యాత్మికాడి తాపత్రయంబు నడచి ,పరమార్ధ భూతమై యధిక సుఖదా
మై సమస్తంబుబు గాకయు ,నయ్యు నుండ –వస్తు వేరుగంగ దగు భాగవతము నందు ‘’
‘’వేద కల్ప వృక్ష విగలితమై ,శుఖ ముఖ సుదాద్రవమున మొనసి యున్న
భాగవత పురాణ ఫల రసాస్వాదన –పదవి గనుడు రసిక భావ విదులు ‘’
శ్రీ హరి నామామృతం తప్ప ఏదీ దరి చేర్చదు.
‘’వర గోవింద కదా సుధారస మహా వర్షోరు ధారా పరం
పర లంగాక ,బుదేంద్ర చంద్ర ఇతరోపాయాను రక్తిం ,బ్రవి
స్తర దుర్దాంత ,దురంత ,దుస్సహాజ ,సుస్సంభావితానేక దు
స్తర గంభీర ,కఠోర ,కల్మష ,కనద్దావానలంబారునే ‘’ అని మహర్షి మహా రాజుతో అంటాడు .భాగవత కదా ప్రారంభం లో
‘’హరినామ కదన దావానల జ్వాలచే గాలవే ఘోరాఘకాననములు
వైకుంఠదర్శన వాయు సంఘంబుచే దోలగవే ,భవ దుఃఖ తోయదములు కమల నాభ ధ్యాన కంఠీరవము చే గూలవే సంతాప కుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి చే దీరవే షడ్వర్గ తిమిరములు
నలిన నయన సద్భక్తి నావ చే గాకసం –సార జలధి దాటి చనగ రాదు
వేయు నేల ,మాకు విష్ణు ప్రభావంబు –దేలుపవయ్య సుత ధీసమేత ‘’
‘’చారుతర ధర్మ రాశికి –భారకుడగు కృష్ణు డాత్మ పదమున కేగన్
భారకుడు లేని ఎవ్వని –జేరును ధర్మంబు బలుపు సెడి మునీంద్రా ‘’అన్నది భాగవత పరమార్ధం విన్నా చదివినా చెప్పినా ఇహ పరదాయకం .మోక్ష ప్రదం .నారద భక్తీ సూత్ర పరి పుష్టం .అమలం ,దివ్యం ,
భక్త కవి పోతన వేద వ్యాస మహర్షి వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు రాయటం
వ్యాస పూర్ణిమ -గురు పూర్ణిమ వ్యాస భాఘ్
సర్వ లఘు సీసం (దశమ స్కంధం )
‘’నవ వికచ ,సరసిరుహ నయన ,యుగ నిజ చణ ,గగన చర నది జనిత ,నిగమ వినుత
జలధి సుత కుచకలష ,లలిత మృగ మద రుచి పరిమళ నిజ హృదయ ధరణి భరణ
ద్రుహిణ ముఖ సురనికర ,విహితను తి కలిత ,గుణ కటి ఘటిత ,రుచిర తర కనక వసన
భుజగ రిపు వరగమన ,రజతగిరి పతి వినుత ,నతత జపరత ,నియమ సరణి చరిత
తిమి ,కమఠ కిటి నృహరి ,ముదిత బలినిహి –త దపరశుధర ,దశ వదన విళన
మురదమన ,కలికలుష సుముదపహరణ –కరివరద ,ముని ,నర సుర ,గరుడ వినుత ‘’
ఓం స్వస్తి –సంపూర్ణం .
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –25-3-13-ఉయ్యూరు