దశాదిత్య ప్రతిభా పురస్కార సభ

దశాదిత్య ప్రతిభా పురస్కార సభ

  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 26-3-13-మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ లో హోటల్ ఐలాపురం లో దిగ్దంతులైన పది మందికి వారి ప్రతిభా విశేషాల కు పురస్కార సన్మాన సభ జరిగింది .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత  వహించగా గౌరవాధ్యక్షులు ,అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ,లోక్ నాయక ఫౌండేషన్ వ్యవస్తాపకులు శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ ల పర్యవేక్షణ లో ప్రధాన కార్య దర్శి డాక్టర్ జి.వి.పూర్ణ చంద్ సభా నిర్వహణ లో వైభవోపేతం గా జరిగింది .

    శ్రీ కే.వి.ఎల్.యెన్.నరసింహం గారి శ్రావ్య మైన కం ఠం తో ఆలపించిన ‘’మా తెలుగు తల్లికి మల్లె పూ   దండ ‘’గీతం తో సభ ప్రారంభ మైంది .శ్రీ సుబ్బారావు గారు తమఅధ్యక్ష ప్రసంగం లో ఆరు నెలలుగా వాయిదా పడుతున్న ఈ సభ ఈరోజు ఇంతవైభవం గా జరగటం అదృష్టమని ,ఇందరు ప్రతిభా మూర్తులను ఒకే వేదిక పై చూడటం మనం చేసుకొన్నా పుణ్యమని ఇది అరుదైన సంఘటనమని ,దేశం లో ఏ అనధికార ,అధికార సంస్థ కృష్ణా జిల్లా రచయితల సంఘం చేబట్టినన్ని సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేబట్టి నిర్వహించలేదని ప్రపంచ వ్యాప్తం గా మన సంఘం అందరి అభిమానాలను సాధించిందని భాషకు ఎన లేని సేవలన్దిన్చిందని అన్నారు .ఈ సభ కు దిశా నిర్దేశం చేస్తూ శ్రీ పూర్ణ చంద్ గత ముప్ఫై ఏళ్ళుగా మన సంఘం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు విజయవంతమైనాయన్నారు తెలుగు భాషా సంస్కృతుల పరి రక్షణ లో మనం ముందున్నామని తెలుగు భాషా సదస్సులు జాతీయ తెలుగు రచయితల సభలు ,రెండు సార్లు ప్రపంచ తెలుగు రచయితల సభలను న భూతో గా నిర్వహించిందని ,తెలుగు భాష ప్రాచీనత పై జాతీయ సదస్సు ,సిందు –కృష్ణా లోయల నాగరకతల అధ్యయన సదస్సు ,అంతర్జాలం లో రచనల శిక్షణా సదస్సు ,తెలుగులో న్యాయ పాలనా సదస్సు ,కృష్ణా జిల్లా చారిత్రిక వైభవం పై జాతీయ సదస్సు అద్భుతం గా జరిపిన చరిత్ర మనది అన్నారు మన సంఘానికి అంతర్జాతీయ గుర్తింపు అంటే ఐ.ఎస్.ఐ.ముద్ర  రావాలని అన్నారు .

డాక్టర్ గుమ్మా సాంబశివరావుఆహ్వానం పలుకుతూ వివిధ రంగాలలో అద్వితీయ కృషి చేసిన ప్రముఖులకు‘’కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రతిభా పురస్కారాలను అందిస్తోందని ప్రతి పురస్కారానికి పది వేల రూపాయల నగదు ,ప్రశంశా పత్రం తో సత్కారం చేసి గౌరవిస్తున్నామని చెప్పారు ఇది మూడవ పురస్కార సభ అని అన్నారు ఇప్పటి వరకు కీ.శే.మండలి కృష్ణా రావు భాషా పురస్కారాన్ని శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ నెలకొల్పి ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి డాక్టర్ బాలాంత్రపు రజనీకాంత రావు ,కీ.శే.డాక్టర్ వి.వి.కృష్ణ శాస్త్రి గార్లకు అందజేశామని తెలిపారు .కీ.శే.ఆలూరి బైరాగి సాహితీ పురస్కారాన్ని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నెలకొల్పగా ఆచార్య జి.ఆదేశ్వర రావు ,శ్రీ వంగపండు ప్రసాద రావు ,డాక్టర్ మైనేని కృష్ణ కుమారి అందుకోన్నారని ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు తన పేర నెల కొల్పిన సాహితీ సేవా పురస్కారాన్ని .పోతుకూచి సాంబశివరావు ,డా.బోయిన పల్లి రామా రావు ,ఆచార్య వంగపల్లి విశ్వనాధం గారలు అందుకోన్నారని ,కీ’శే.పోలవరపు కోటేశ్వర రావు కదా పురస్కారాన్ని శ్రీ గోళ్ళ నారాయణ రావు నెలకొల్పగా శ్రీ మునిపల్లె రాజు ,శ్రీ విహారి అందుకోన్నారని స్వర్గీయ ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారాన్ని ఆచార్య ప్రతిభ నెల కొల్పగా ,కీ.శే.పరకాల పట్టాభి రామా రావు ,శ్రీ జి.వి.రామా రావు గార్లు అందుకోన్నారని హర్ష ధ్వానాల మధ్య తెలియ జేశారు ..

         శ్రీ యార్లగడ్డ తెలుగు హిందీలలో కవితలను పుంఖాను పుంఖం గా గుప్పించి ఆలూరి బైరాగి విశిష్టతను ప్రసంశించారు ..శ్రీ బుద్ధ ప్రసాద్ తమ కీలకోపన్యాసం లో ఇది ‘’సాంస్కృతిక వికాస సంవత్సరం ‘’గా ప్రభుత్వం భావించి చేస్తోందని ఇంకా భాషా సంస్కృతులకు చేయాల్సింది చాలా ఉందని ఇందరు పెద్దల్ని సత్కరించుకోవటం మననల్ని మనం సమ్మా నిన్చుకోన్నట్లే నని వారందరి తో తనకున్న పరిచయాన్ని వివరించారు పది మంది సూర్యులు ఈ వేదిక ను సుసంపన్నం చేశారని వీరంతా రాత్రికోడా ప్రకాశించే దశాదిత్యులని పిస్తున్నారని ఆన్నారు .పరబ్రహ్మ శాస్త్రి గారి శాసన పరిశోధకులు మనకు ఇప్పుడు లేరని వారి సేవలు అమోఘమని చెప్పారు యువత వారి దారిలో నడిచి ఎంతో చరిత్ర ను త్రవ్వి తీయాలని కోరారు ..

    ఇప్పుడుజరుగుతున్నది  2011,2012 సంవత్సరాలకు సంబంధించిన పురస్కార సభ అని గుర్తు చేశారు .  ఆ తర్వాత దా.పి.వి పరబ్రహ్మ శాస్త్రి గారికి ఆచార్య పేరి భాస్కర రావు గారికి, మండలి కృష్ణా రావు ‘’భాషా పురస్కారాన్ని’’అండ జేశారు .ఆలూరి బైరాగి ‘’సాహితీ ప్రతిభా పురస్కారాలను ‘’డా.వెలగా వెంకటప్పయ్య ,శ్రీ ఏ.కృష్ణా రావు లకు ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు ‘’సాహితీ సేవా పురస్కారాన్ని’’ శ్రీ గూడ ఆంజనేయులు ,శ్రీ యాదగిరి శ్రీ రామ నరసింహా రావు లకు సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వర రావు’’ కదా పురస్కారాన్ని’’ ఆచార్య కొలక లూరి ఇనాక్ ,శ్రీ శ్రీ రమణ గార్లకు ముక్కామల నాగ భూషణం ‘’పాత్రికేయ పురస్కారాన్ని’’డా.జి.వి.వరదా చారి శ్రీ గోటేటి రామ రావు గార్లకు ప్రసాద్ ద్వయం అధ్యక్షా కార్య దర్శులల సమక్షం లో అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య అందజేశారు .కన్నుల పండువు గా సాగిన ఈ కార్య క్రమం మధురాను భూతినిచ్చింది .

      తమకు జరిగిన ఈ పురస్కార ప్రదానం పై అందుకొన్న ప్రముఖులు తమ మనో భావాలను పంచుకొని కృతజ్ఞతలు తెలియ జేశారు .ముందుగా కృష్ణా రావు గారు పత్రికలూ ప్రజల కన్ను నోరు అని వాటి విలువ ను ఎందరో మహాను భావులు పూర్వమే తెలియ జేశారని వారి అడుగు జాడలలో తానూ నడుస్తున్నానని ప్రధానం గా తానుకవి ని అని చెప్పారు .శ్రీ పరబ్రహ్మ శాస్త్రి గారు తమ ప్రసంగం లో అశోకుడి కంటే ముందే మన భట్టిప్రోలు శాశనం ఉందని అందులో తెలుగు ప్రామాణిక మైనదని అన్నారు ఈ శాసనం ఫోటోలు తీయించి ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోను ఉంచాలి అని గట్టిగా చెప్పారు శ్రీ కాకుళాంధ్ర మహా విష్ణువు విగ్రహ స్థాపకులు  శాతవాహన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి అన్నారు ఆంద్ర దేశాన్ని జయించి నందుకు గుర్తుగా దీన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చునని లేక అతని సేనాని విష్ణు అనే పేరున్న వాడు రాజు ఆజ్ఞ తో నెలకొల్పి ఉండ వచ్చునన్నారు .ఖారవేలుడు ఒరిస్సా ప్రాంతం వాడని ఆంద్ర దేశం వచ్చాడని మంచి పాలనా దక్షుడని అన్నారు మన చరిత్ర గొప్పదని తెలుగే అన్నిటి కన్నా ప్రాచీనమని వివరించారు .

      ఆచార్య పేరి భాస్కరరావు తెలుగు లిపి సంస్కరణ కు ఇంటర్నెట్ బాగా దోహద పడుతోందని పూర్వం అచ్చులో లేని అక్షరాలను మళ్ళీ వాడే విధానం చేస్తున్నామని ఒక పదాన్ని వేర్వేరు చోట్ల ఎలా పలుకుతారో చిత్రాలద్వారా చూపించే సౌకర్యం ఉందని అంతర్జాలం తో భాషను అను సంధానం చేయాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు .బ్రాహ్మీ లిపి లో‘’అ’అనే మన తెలుగు అక్షరం ‘’శిలువ ‘’ఆకారం లో ఉండేదని క్రమం గా పరివర్తన చెంది ఇప్పుడు మనం రాసే రూపం లోకి వచ్చిందని ,ఆ క్రమ పరిణామాన్ని మనం కంప్యూటర్ ద్వారా తెలుద్సుకో వచ్చునని .బ్రిటన్లో  ఇంగ్లిష్ ను జాగ్రత్త గా కాపాడు కొంటారని వారసత్వాన్ని భద్ర పరచుకొంటారని బెర్నార్డ్ షా సూచించిన భాషా సంస్కరణలు మార్పులన్నిటినిబ్రిటిషర్లు  అక్కడి భాషా వేత్తలు తిరస్కరించారని గుర్తు చేశారు .

       శ్రీ వెలగా వెంకటప్పయ్య బైరాగి తామూ ఒకే చోట తెనాలి లో అయితారం లో జన్మించామని చెప్పారు పదకొండేళ్ళు బైరాగి బీహార్ లో ఉండి వచ్చాడని హిందీ లో గొప్ప పాండిత్యం సంపాదించాడని నిరాడంబరమే ఆయన ఆహార్యమని కండగల కవిత్వం రాసి తన ‘’నూతిలో గొంతుకలు’’ కు అద్వితీయ సాహితీ గౌరవాన్ని సాధించాడని చెప్పారు

          .శ్రీ రమణ మాట్లాడుతూ భమిడి పాటి కామేశ్వర రావు గారు కొడుకు రాధాకృష్ణ కు వచ్చిన మొదటి బహుమతి తెలిసి ‘’ఈ స్తితి లో ఉందన్న మాట తెలుగు సాహిత్యం ‘’అని మేళ మాడారని గుర్తు చేశారు తాను ఇందరు పెద్దల మధ్య కూచునే అర్హత లేని వాడినని వారంత గా తాను స్దాధించింది లేదని అన్నారు పత్రిక లో పని చేసి పేరడీ రచన ద్వారా ప్రాచుర్యం పొందానని  తన’’ మిధునం ‘’కదా ద్వారా ప్రపంచవ్యాప్త గౌరవం కలిగిందనిబాపు రమణలస్నేహం తో తాను ఇంతవాడిని అయ్యానని వినమ్రం గా చెబుతూ నవ్వుల్నీ పూయించారు ..

      ఆచార్య ఇనాక్ గారు తను రాసి మెప్పించి నంత సాహిత్యం సమకాలీనం గా లేదని కదా, నవలా, నాటిక ,విమర్శ లలో తన రచనలు గొప్ప గుర్తింపు పొందాయని మన జాతీయ పతాకానికి మూడు రంగులు కాకుండా మూడు ద్రవాలు ఉంటె బాగుంటుంది అని పిస్తుందని అవి ‘’చెమట ,’’’రక్తం’’లని అన్నారు తానేప్పుడో ‘’వ్యాస పరిణామం ‘’ పై పరిశోధనా వ్యాసం రాస్తే మళ్ళీ దాని జోలికి ఎవ్వరూ వెళ్లలేదని చెప్పారు .తనకు జ్ఞాన పీఠ పురస్కారం రావాలని బుద్ధ ప్రసాద్ గారు కోరటం తన పై ఉన్న అపార నమ్మకమని చెప్పారు కృష్ణా జిల్లా రచయితల సంఘం తనను ఎప్పుడూ ఆత్మీయం గా ఆహ్వానిస్తుందని అందుకే ప్రతి సభకు వచ్చి వారి ఋణం తీర్చుకొంటానని తెలియ జేశారు .

 

    శ్రీ  గూడ శ్రీ రాములు భిలాయ్ లో యాభై ఏళ్ళుగా తెలుగు ను బ్రతికిన్చుకొంటున్నామని ‘’భిలాయ్ వాణి ‘అనే పత్రికను పదకొండేళ్ళుగా నిర్వహిస్తూ అందరికి ప్రతిఫలాపేక్ష లేకుండా పంపిస్తున్నామని తామంతా మొదటి తరానికి చెందినవారమని ఇప్పుడు రెండో తరం యువ నాయకులూ కూడా బాధ్యతలు చేబట్టి పని చేస్తున్నారని తమల్ని మర్చి పోవద్దని కోరుకొన్నారు

     .శ్రీ యాదగిరి శ్రీ రామ నరసింహా రావు పి.వి.నరసింహా రావు అనుక్షణ పుస్తక పఠనాభి లాషి విజిటర్లు ఒకరు విడిచి ఒకరు వచ్చే రెండు నిమిషాల వ్యవధిలోనే ఆయన చేతిలో ఉన్న పుస్తకం లో ఎక్కడా ఆపేశారో అక్కడి నుంచి చదివే వారని ఆయనకు 21భాషలలో అ పారవైదుష్యం ఉందని తన అనుభవాలను గుది గుచ్చి వివరించారు

.    డా.వరదా చారి ఇవాళ బ్రిటన్ దేశ పత్రికలలోనూ పతనం ప్రారంభమైందని ,పత్రికల వాళ్ళను చిన్న చూపు చూసే అలవాటు ఉందని కాని ఒక పాత్రికేయుని గా ఇక్కడ మీరు చేస్తున్న సన్మానానికి పులకరిస్తున్నానని కృతజ్ఞత తెలిపారు తాను హేచ్.ఏం.టి.వి.కి ‘’ అంబుల్డ్స్ మన్’’ గా ఉండి  వీక్షకుల మనో భావాలకు విలువనిచ్చే పని చేస్తున్నాని .ఇలాంటి ఒక పదవి ఏర్పాటు చేయటం మన తెలుగు చానళ్ళ చరిత్ర లో ప్రధమం అని దీనికి కారకులైనడైరెక్టర్ ,పూర్వపు ఆంద్ర జ్యోతి సంపాదకులు శ్రీ కే.రామ చంద్ర మూర్తి ని అభినందించాలని అన్నారు .

         శ్రీ గోటేటి రామా రావు తన ప్రపంచ పర్యటనానుభావాన్ని వివరించారు తమ పత్రిక ప్రుబుద్దానద్ర్హ్ర ద్వారా తనకు ప్రపంచ వ్యాప్త గొరవం కలిగిందని తమిళమద్రాస్ లో ‘’తెలుగు కు పాదు ‘’తాను అని మండలి వారనే వారని గుర్తు చేసుకొన్నారు కెనడా లోని టోరాంటో లో అమెరికా లో న్యు జెర్సీ లో తెలుగు సంఘాలు ఏర్పడటానికి తన కృషి ఉందని  మలేషియా లో మదిని సోమి నాయుడు గారు తెలుగు కు చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు .తెలుగు భాష .మరణించదని అది అమృత భాష అని మన లిపి చాలా గొప్పదని వివరించారు .

  దాదాపు మూడున్నర గంటలు జరిగిన ఈ పురస్కార సభ వేసవిలో వసంతం లా అలరించింది .రచయితల సంఘం చాలా నెలల తర్వాత జరిపిన సభ శోభాయమానం గా ప్రేక్షకాదరణ తో విశేష వీక్షక సందోహం తో రమణీయం గా జరిగింది అనంతరం అందరి కమ్మని విందు ఏర్పాటు చేశారు .

                  మిధున పతయేనమః

         శ్రీ రమణ పేరడీ లంటే నాకు మహా ఇష్టం .జల సూత్రం రుక్మిణీ నాద శాస్త్రి (జరుక్ శాస్త్రి )ఎప్పుడో పేరడీ కవిత్వాన్ని రాసి ఒక రకం గా ఆద్యుడని పించుకొన్నాడు ఆ వ్యంగ్యాస్త్రాలతో ఆ నాటి మహా కవులను మహా ఇబ్బంది పెట్టి’’ తేలు కొండి గాడు  ‘’ అని పించుకొన్నాడు మళ్ళీ ఇన్నేళ్ళకు శ్రీ రమణ అందరు కవుల కవితలకు అద్భుత పేరడీలు రాసి‘’పేరడీ గారడీ వాడు ‘’అని పించుకొన్నాడు .జరుక్ శాస్త్రి వదిలిన లింకు ను మళ్ళీ పట్టుకొని చెలరేగి పోయాడు .అంతేకాదు వచన కవుల రచనలకూ పరమ పేరడీలు రాసి శెభాష్ అని పించుకొన్న’’ కోణంగి ‘’.అలాంటి రమణ‘’మిధునం ‘’కద తో ఒక్కసారిపాతికేళ్ళ కిందట  ‘’స్టార్ కదా రచయిత ‘’అయ్యాడు దాన్ని భరణి సినిమా తీసి ఒక అద్భుతం చేశాడు దీనితో రమణ కీర్తి శిఖరాయమానం అయింది ఆ మిధునం అన్నా ,ఆ కదా రచయిత శ్రీ రమణ అన్నా నాకు మా శ్రీమతికి వీరాభి మానం .ఆయన్ను చూడాలనే ఓపిక లేకపోయినా విజయ వాడ కు నాతో వచ్చింది .అంత సేపు కూర్చుని చూసింది ,విన్నది శ్రీ రమణ తో ఫోటోలు తీసుకొన్నాం .ఆయన్ను నేను పలకరిస్తూ ‘’మిధున పతయే నమః ‘’అన్నాను చిరు నవ్వు చిందిస్తూ ‘’అబ్బో ‘’అన్నారు .ఆనంద పడ్డారు ఇది శివుని అభిషేకం లో చెప్పే మాట ఓం మిధున పతయే నమః ఓం మిదున పతాన్తికాయనమః  ‘’అని అంటారు దీన్ని జోడించాను రెండో అర్ధం లో ‘’మిధునం‘’కద కు పతి అనే అర్ధం ఈ మాట కే/బి/లక్ష్మి గారికి చెబితే పరమ సంతోష పడిపోయారు గుమ్మా సాంబశివరావు గారికి చెబితే ఆనంద పడ్డారు .అప్పుడే అమెరికా నుంచి మా అమ్మాయి విజయ లక్ష్మి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఈ మాట చెబితే‘’అద్భుతః ‘’అంది .శ్రీ రమణ తో ఫోన్ లో మాట్లాడి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఆయనా సంతోషించారు త్వరలో అమెరికా లో డెట్రాయిట్ వస్తున్నట్లు మా అమ్మాయికి శ్రీ రమణ తెలిపారు శ్రీ రమణ తో నేను ‘’మీ మిధునం కదా ను ఏం.పి.3 లో నా వాయిస్ తో రికార్డుచేసి ఇంటర్నెట్ లో అందరికి పంపాను చదివేటప్పుడు చివర్లో నాకు కన్నీళ్లు ఆగక ధారా పాతం గా కారిపోయాయి అవి ఆనదశ్రువులో దుఖాశ్రువులో తెలీదు .విన్న వారందరూ కూడా కన్నీరు కార్చామని మెయిల్స్ రాశారు ‘’అని చెబితే చిరునవ్వే సమాధానం .మన పల్లె తూల్లలో పశువుల కాపరుల వద్ద అద్భుత మైన భాషా జ్ఞానం ఉందని దాన్ని మనం భద్ర పరచుకోవాలని అన్నారు .అంతే కాదు పొలాల పని చేసేటప్పుడు నారు పీకే తప్పుడు నాటే తప్పుడు కోతల సమయం లో రైతులు కూలీలు ‘’మునుం పట్టటం ‘’అనే మాట ఉపయోగిస్తారని .మునుం అంటే కొంత వైశాల్యం గల ప్రదేశం అని అంటూ ఈ పదాన్ని తిక్కన గారు భారతం లో ప్రయోగించారని అన్నారు నాతోను బుద్ధ ప్రసాద్ గారితోనూ . ..ఎంతో కాలం గా శ్రీ రమణ గారిని చూసే అదృష్టం కలిగింది మా అందరికి .ఆయన అ సలు పేరు’’ రామ చంద్ర రావు’’ అని తనకూ ఇప్పుడే తెలిసిందని కే.బి.లక్ష్మి గారు ఆయన్ను సభకు పరిచయం చేస్తూ అన్నారు వెలగా వెంకటప్పయ్య గారిని పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు ..

         ఒక రాసావేశం లో మునిగి తేలి గుత్తికొండ సుబ్బారావు గారి కారులో ఉయ్యూరు కు రాత్రి పదకొండున్నరకు ఆయన తోపాటువచ్చాం మా ఇంటి దగ్గర దింపి బందరు వెళ్ళారు .వెళ్ళేటప్పుడు వేణు గోపాల రెడ్డి కూడా మాతో బెజవాడ వచ్చాడు అప్పుడూ కారు లోనే వెళ్లాం .

      గొప్ప అనుభూతిని మిగిల్చి ప్రతిభకు పట్టం కట్టి ,కర్తవ్యాన్ని బోధించిన సభ .రంగ రంగ విభవం గా జరిగింది .

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –27-3-13- ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.