గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -8

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -8

రచనల పరంపర

1757 లో అంటే కాంట్ కు ముప్ఫై ఏళ్ళు వచ్చినపుడు ‘’sketch and announcement of lecture course on physical geography with on appendix whether the westerly winds in our environs are so humid because they blow over a large ocean ‘’అనే దాని పై ప్రకటించి, ప్రసంగించి మంచి ప్రాచుర్యం పొందాడు .1758 లో కొనిగ్స్ బర్గ్ ను రష్యా ఆక్రమిన్చాది .ఆ ఏడు సమ్మర్ సెమిస్టర్ కు ‘’new doctrine of motion and rest ‘’పై వ్యాసాలూ రాశాడు .డిసెంబర్ లో ‘’కిప్కీ ‘’పదోన్నతికి పెట్టుకొన్నా ఫలించలేదు .1759 లో ముప్ఫై అయిదవ ఏట say on some views about optimism ‘’రాశాడు .మరుసటి ఏడు‘’thoughts at the occasion of Mr.Johann Fredrich Von Funk ;s untimely death ‘’రచించాడు .1762 నాటికి రష్యా ఆక్రమణ పూర్తయింది ‘’the false subtlety of the four syllologistic figures ‘’ను రాశాడు .1764 లో హెర్దర్ కాంట్ కు శిష్యుడైనాడు 1763 లో ‘’the only possible argument in support of demonstration of the existing God ‘’ పూర్తీ చేశాడు. తాను రాసిన ‘’negative magnitude ‘’అనే కీలక భావన ను ఫిలాసఫీ లో చేర్చే ప్రయత్నం చేశాడు కాంట్ .1764లో ‘’ ’’inquiry concerning the distinctness of the principles of natural theology and morality ‘’అనే ఎస్సే రాశాడు .దీనినే ‘’ప్రైజ్ ఎస్సే‘’అన్నారు .ఇందులో

ఎక్కువ భాగం రష్యన్లు కొంగ్స్ బర్గ్ వదిలి పెట్టి వెళ్ళిన తర్వాతా రాసినవే .

కొనిగ్స్ బర్గ్ యూని వర్సిటి లో పని చేస్తుండగానే చాలా రాసి ప్రచురించాడు .ఎన్నో ‘’ డేసేర్టే షన్ ‘’వ్యాసాలూ రాశాడు .1756-62 మధ్య కాలం లో మూడే మూడు’’పాంఫ్లేట్స్’’ మాత్రమె అవీ తన లెక్చర్ల ప్రకటనలు ,ఇంకొక వ్యాసమూ మాత్రమె రాశాడు  జీవిత చరమాంకం లో అతి ముఖ్హ్యమైన అయిదు పుస్తకాలు రాసి ప్రచురించాడు .అవి చర్చోప చర్చలకు దారి తీశాయి .’అవి తత్వ శాస్త్రం లో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి ..’’inquiry concerning the distinctness of the principles of natural theology and morality ‘’అనే ఎస్సే రాశాడు .దీనినే ‘’ప్రైజ్ ఎస్సే ‘’అన్నారు . ..ఇందులో ‘’ఫాల్స్ సటి లిటి ‘’వ్యాసం ను ‘’product of few hours ‘’.అన్నాడు కాంట్ .కాంట్ దృష్టిలో ‘’a woman is to have a beautiful understanding and a man a deep understanding ‘’అని హావించాడు .అంతే  కాదు అన్నీ’’ తెలుసుకొన్న మహిళ గడ్డం పెంచుకో వచ్చు ‘’అనీ ముక్తాయింపు ఇచ్చాడు .ఇది మాత్రమె కాదు ‘’among men there are but few who behave according to principles –which is extremely good ,as it can so easily happen that one errs in principles and then the resulting disadvantage extends all the further ,the more universal the principle and the more resolate the person who has set it before him self ‘’అని నిష్పాక్ష పాతం గానే తీర్పు చెప్పాడు .

నలభై కి ఉన్న ప్రాముఖ్యత –కేరక్టర్ పై ద్రుష్టి

1764 లో కాంట్ కు నలభై ఏళ్ళు వచ్చాయి కాంట్ దృష్టిలో ఈ నలభై చాల ప్రాముఖ్య మైనది .’’ఇరవై లో ఆలోచనలను జాగ్రత్త గా వాడగలం .కాని నలభై లో మాత్రం పరి పూర్ణత (మేచూరిటి ) వస్తుంది ‘’అంటాడు .ఇప్పుడే శీల సంపద ఏర్పడుతుంది అని చెప్పాడు .’’ఈ దశ వరకు అభిప్రాయాలు ఊగిస లాట లో ఉంటాయి .ఇప్పుడే స్తిర పడతాయి శీలం ,ప్రవర్తన లకు ఒక ఆధారం ఏర్పడితే జీవితాంతం అదే బాటలో నడుస్తారు ఎవరైనా ‘’అంటాడు .. కేరక్టర్ అనేది పుట్టుక తో వచ్చే సహజాతం కాదు .దాన్ని మనం సృష్టించుకోవాలి .మనంతట మనం ఏర్పరచుకోవాలి .లేక రూపొందించుకోవాలి .మంచి శీలం అనేది చివరి నైతిక గమ్యం (ultimate moral achievement ).నైతిక దృష్టితో శీలం వ్రుద్ధికావాలి .ఆయనచెప్పిన ‘’ నైతిక సైకాలజీ యే’’-‘’ సైకాలజీ ఆఫ్ కేరక్టర్ ‘’)నలభయ్యవ ఏట ఏది జరిగినా అది నైతికత మీద ప్రభావం చూపిస్తుంది .అంత రాత్మ చెప్పి నట్లు నడుస్తూ బయటి వారితో తన ప్రవర్తన లో ప్రతి బిమ్బించాలి ‘’అని చెప్పాడు అలానే నడుచుకొని ఆదర్శం గా నిలిచాడు కాంట్ .

నలభై లోపు వయసులో సరైన నిర్ణయాలు చేయలేమని విషయాలలోని యదార్ధాన్ని పూర్తిగా గ్రహించాలేమని వాటికి సరైన విలువ కట్టలేమని అంటాడు కాంట్ .శీలానికి పరి పక్వత కావాలి అయితే నలభై లో జ్ఞాపక శక్తి క్షీణించటం ప్రారంభిస్తుంది ఈ దశ లో ఏదీ కొత్తగా నేర్వలేం .ఉన్న జ్ఞానాన్ని విస్తృత పరచుకోవాలి .సిద్ధాంతాల మీద షీలా మానం జరుగు తుంది .సిద్ధాంతాలు అంటే ఇతరుల నుంచో ,పుస్తకాల నుంచో గ్రహించినవి .,జీవితానికి అన్వయిన్చుకోన్నవి .ఇతరులతో స్నేహితులతో చర్చిస్తే దీని పై మనకు స్పష్టత వస్తుంది .ఇవన్నీ మన చుట్టూ ఉండేవే ..మనం ఎన్నుకోవాలి అంతే .ప్రతి సందర్భం లోను ‘’మాక్షిమ్స్’’ఉండాలి .బ్రతుకులో ,ఆలోచనలలో వాటికి స్తానం ఉండాలి .ఈ విధం గా విమర్శనాత్మ క్షక్తికి (రేష నాలిటి) కి కాంట్ ప్రాధాన్యత నిచ్చాడు ..

ప్రొఫెసర్ కాంట్

1770 జనవరి లో ‘’జేనా ‘’  యూని వర్సిటి లో ఉద్యోగానికి కాంట్ కు ఆఫర్ వచ్చింది .1770 .లో కొనిగ్స్ బర్గ్ గణిత శాస్త్ర ప్రొఫెసర్ ‘’లాంగ్ హాం ‘’చని పోయాడు .ఈ పోస్ట్ తనకు ఇవ్వమని బెర్లిన్ అధికారులకు కాంట్ విజ్ఞప్తి చేశాడు .చేసిన పది హీను రోజులకే లాజిక్ ,మెటా ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ప్రమోషన్ ఇచ్చారు .ఇప్పుడు కాంట్ జీతం .160 tholes ,60 groschen  లు జర్మనీ డబ్బులో .పూర్వం కంటే వంద తేల్స్ ఎక్కువ ..ఇది జేనా వారిచ్చిన ఆఫర్ కంటే తక్కువే .కాని ఇక్కడే ఉండి  పోయాడు .1772లో కొనిగ్స్ బర్గ్ ప్రొఫెసర్ గా రిజిస్టర్ అయ్యాడు . దీనికి గాను ప్రారంభోప న్యాసాన్ని (డే సేర్ టేషన్ ) లాటిన్ భాష లో ఇవ్వాలి .1770 ఆగస్ట్ ఇరవై ఒకటిన ‘’on the form and principles of the sensible and intelligent world ‘’అన్న విషయం మీద లాటిన్ లో అదర గొట్టే డేసేర్ టేషన్ ఇచ్చాడు ఇది ఇన్స్టింక్ట్ కు సెన్సేషన్ కు మధ్య ఉన్న తేడాను తెలిపే విషయం .బౌద్ధిక జ్ఞానం జ్ఞానేంద్రియాల జ్ఞానం తో  సరి తూగదు అని దీని సారాంశం ..’’spirituality and temporality are negative criteria that allow us to exclude concepts from pure meta physics ‘’అని హ్యూమ్ చెప్పిన connection or tie between cause and effect was a determination of mind ‘’అన్న దానితో కాంట్ ఏకీ భ వించాడు ‘’any fundamental reliance on reason was a mistake ‘’అని తీర్మానించాడు .

సశేషం

మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -17-8-13- ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.