‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు – 8 (చివరిభాగం)
భారతి
సంజీవ దేవ్ పెద తండ్రి కూతురు భారతి .తుమ్మ పూడి లో ఆమె కు పాఠాలు చెప్పే వాడు .స్నేహం ఎక్కువ .మద్రాస్ నుంచి ఈ అన్న గారు తిరిగి వచ్చి నందుకు ఆమె ఏంతో సంతోషించింది .’’మద్రాస్ నుంచి వదిన తో వస్తావని అనుకొన్నాను .ఒక్కడివే వచ్చావే ‘’అని దేప్పింది .’’బావ మరిది కోసం వెతికా. దొరక లేదు. వదినా దొరక లేదు .కనుక మనమిద్దరం అదృష్ట వంతులమే ‘’అన్నాడు భారతికి వివాహం జరిగి అత్తారింటికి వెళ్లి పోయింది .గుంటూరు తరచూ వెడుతూ సోదరి భారతితో చర్చలు జరిపే వాడు .
భార్య సులోచన
1950 లో సంజీవ దేవ్ వివాహం సులోచన తో జరిగింది .ఆమె కొంత వరకు చదువు కొన్నదే .సంస్కారం ఎక్కువ .కళ్ళు పెద్దవి పేరుకు తగ్గట్టు .’’ఆమె రాక తో నా ఒంటరి జీవితం జంట జీవితం గా మారింది ‘’అని సంతృప్తి పడ్డాడు .ఆమె స్వభావం స్వరూపం నచ్చాయి .తానూ ధన్య జీవి నని భావించాడు .ఆమె ప్రవేశం తో ఆయన ప్రతిభ లో నూతన కాంతి వచ్చి నట్లు అను భూతి పొందాడు .ఆమె సాన్నిధ్యం లో రచనలు వేగంగా ,రసవంతం గా సాగాయి .బెంగ తొలగింది .చురుకుదనం ,కావ్య రంగం లో తీయదనం ప్రవేశించాయి అన్నాడు .నిజాన్ని ఒప్పుకొన్నాడు ఈ ముదురు బ్రహ్మ చారి .తను పెళ్లి చేసుకోవటం సముచితమే నని తీర్మానించు కొన్నాడు .అత్తా గారికి ఆమె సేవలు చేసేది .సతీ సులోచన గా ప్రవర్తించింది .
డాక్టర్ జయ ప్రద
గుంటరు డాక్టర్ సదా శివ రావు ప్రఖ్యాతి చెందినా వైద్య నిపుణు.డుభార్య జయ ప్రద కూడా డాక్టరు .సాహితీ ప్రియ కూడా . కధలు రాసింది .ఆమె తండ్రి కూడా కవి .ఆమె స్నేహ శీలి సహృదయ .ఆదర్శ గృహిణి గా పేరొందింది .మానవ సేవే మాధవ సేవ అని భావించిన డాక్టర్ .అందుకే సంజీవ దేవ్ తోఆమే కు మంచి స్నేహ మేర్పడింది .
శ్రీమతి హార్డీ
శ్రీమతి హార్డీ ఇంగ్లీష్ అతన్ని పెళ్లి చేసుకోంది .ఆమె స్వతంత్ర బుద్ధికి ఆయన అతిధి మర్యాదకు కుదరక ఒక ఏడాది లోనే విడాకులు తీసుకోంది.ఏకాకిగా జీవించింది .సంజీవ్ భార్య సులోచన తో మంచి స్నేహం చేసింది .హార్డీ తెలుగు వాడి కిష్టమైన ఆవకాయ బాగా తినేది .’’మనిషి తాను పుట్టిన దేశాన్ని వదిలి కొంత కాల మైనా పరాయి దేశం లో ఉండాలి .అప్పుడే సంకుచిత భావాలు నశించి విశాల దృక్పధాలు ఏర్పడతాయి .స్వయం సత్తా తెలుస్తుంది .మనిషి లో విశ్వ జనీనత వికశిస్తుంది‘అని దేవ్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చాడు .ఇది అక్షర సత్యం .ఈయన ఎడలా ఇది రుజువైంది కదా .
క్రిస్టినా
అమెరికా లోని క్రిస్టినా అనే ‘’మిస్టిక్ రచయిత్రి ‘’తానూ రచించిన కవితా సంకలనాలు పంపింది .కవితలు బాగా రాసింది .దీని కంటే ముద్రణ ,ఆకృతి బాగున్నాయన్నాడు దేవ్ .అవి ‘’హస్త భూషణలు ‘’అన్నాడు
మిస్ టాంపూ
మద్రాస్ లో ఫోటోగ్రాఫ్ ప్రదర్శన జరిగింది .అక్కడే ఇరవై ఏళ్ళ యువతీ సంజీవ దేవ్ ఫోటోల వద్ద నిలిచి తదేకం గా చూస్తోంది .ఆమె లో ప్రత్యెక ఆకర్షణ ఉంది .’’కత్తి రించిన జుట్టు ,పెదవుల రంగు ,చిరు నవ్వవు తో తేజో మయం గా ఉంది ‘’ఆమె ఏ స్విస్ యువతీ ‘’మిస్ బీటా టాంపూ ‘’ఆమె తో ఫోటోగ్రఫీ విషయాలు చర్చించాడు ఆమె కూడా ఈయన లాగే మానవ మూర్తులను ఫోటోలు తీయటం ఈయనకు ఆనందం .స్విస్ యువకుడినే ప్రేమించి పెళ్లి చేసుకో బోతోంది .ఆమె స్వీయ గాధ వినటం లో ఆనందం పొందాడు .’’చెప్పబడే విషయాన్ని బట్టికాక చెప్ప బడుతున్న పధ్ధతి బట్టి విలువ హెచ్చుతుంది ‘’అనే సత్యాన్ని గుర్తించాడు .
శ్రీమతి ఆచంట శారదా దేవి
ఆచంట జానకి రాం భార్యయే శారదా దేవి .ఇద్దరూ సాహితీ ద్రస్టలే .ఆమె మిత భాషిణి .గంభీర స్వభావి అని తెలుసుకొంటాడు .చాలా విషయాలే ఇద్దరూ మాట్లాడుకొన్నారు .
పార్శీ మహిళ
మద్రాస్ నుండి బెంగుళూర్ కు వెళ్తున్నారు .ఒక పార్శీ యువతీ అయిదేళ్ళ కొడుకు తో అదే రైల్ లో వీరితో ప్రయాణిస్తున్నారు .మంచి చిత్త .సంస్కారమున్న మహిళ .ఇంగ్లీష్ బాగా మాట్లాడుతోంది .మానవ స్వభావాల గురించి ఆమె కు మంచి అవగాహన ఉందని పించింది .అందుకని చాలా జాగ్రత్త గా మాట్లాడాడు .అంటే జాగ్రత్త గా ప్రవర్తించాడు కూడా .రైలు ప్రయాణం గురించి తర్కం జరిగింది .ఇద్దరూ పోటా పోటీగా ఎవరి వాదం వారు విని పించారు .తన భర్త అందం గానే ఉంటాడని అంది .కాదంటే ఆమె అతని ఫోటో తీసి చూపింది .నిజమని గ్ర్సహించినా ఆమె అంద గత్తే అన్నాడు ‘’మగ వారి కళ్ళకు మగాళ్లు అందం గా కనీ పించరు ‘’అందామె .ఒక కోతి ని చూపి కొడుకుతో ‘’అదుగో మీ మెటర్నల్ అంకుల్ ‘’అన్నాడు ‘’కాదు పెటర్నల్ అంకుల్ ‘’అందామె .సంజీవ్ ను కోతితో పోల్చిందన్న మాట .లోపల ఏదైనా ఈయన కు భావం ఉంటె పోగోట్టటమే ఆమె ఉద్దేశ్యం .ఈయన రచనలు చదివి ఆనందించింది .ఆమె రచనలు చేయ లేదు కాని చదివి ఆనందించ గలదు .’’మీరంతా రచయిత్రులలైతే ఇక మా రచనలు చదివి ఆనందించే వారెవ్వరూ ?’’అన్నాడు .కనుక ఆమె ను రచయిత్రి కావద్దన్నాడు .బెంగుళూర్ లో దిగి పోతూ ఆతిధ్యానికి రమ్మని ఆహ్వానించింది .’’లోకం లో సుగుణులు ఎందరుంటారు ?’’అని ఆశ్చర్య పడ్డాడు .
‘’స్వయం గా జీవితం లోంచి ,నిత్యం జరిగే దై నందిన కార్య కలాపాల నుండి ,కస్ట సుఖాను భవం నుంచి బాహ్య జగత్తును చేసే పరిశీలన నుంచి ,అంతర జగత్తు లోకి ప్రవేశింప జేసే అంతర వీక్షణం నుంచి పొందే వేదాన్తమే సజీవ వేదాంతం ‘’అన్నాడు సంజీవ దేవ్ .ఆమె గ్రహించి ‘’ఇదంతా జిడ్డు కృష్ణ మూర్తి వేదాన్తమే కదా /?’’అంది .ఈయన ‘’ఇది ఎవరి స్వంతమూ కాదు ..అందరం ఆచరించ వచ్చు .’’అన్నాడు .ఆమె గంభీరం గా ఆలోచనలో పడింది .లైట్లు తీసి పడుకొన్నాడు .ఆమె నెమ్మదిగా అన్నది ‘’మన కాళ్ళు మనం కాము .ఈ శరీరం మొత్తం మనం కాము .మనం అంటే ఏమిటి ?’’అని అడిగింది .దానికి సంజీవ దేవ్ ‘’మనమంటే మనమే .మనం కాని వన్నీ మనం కాము .మనం ఏదో అదే మనం ‘’అని చెప్పి ఊరుకొన్నాడు .ఆమె లోని తాత్విక భావాలకు పరవశించాడు .ఆమె హృదయ వైశాల్యానికి పులకరించాడు .’’సజీవ భారత మాతృశ్రీ దర్శనం పొందిన అను భూతి ‘’పొందాడు సంజీవ దేవ్ .
.