మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10
సెయింట్ థామస్ ఆక్వినాస్
సెయింట్ తామస్ ఆక్వినాస్ క్రైస్తవ మతం లో డొమినికన్ శాఖ కు చెందినా వాడు .ఐరోపా లోని మధ్యయుగ దార్శనికులలో గొప్ప వాడు .ఆయన బో ధించింది సంపూర్ణం సమగ్రం అంటారు .తనకు పూర్వం ఉన్న దార్శనికుల భావాలను తన దర్శనం లో పొందు పరచాడు .గ్రీకు తత్వ వేత్తలైన అరిస్టాటిల్ ప్లేటోల భావాలను ,క్రైస్తవం లోని గ్రీక్ ఫాదరుల వాదన సారాంశాలు ,అగస్టీన్ సిద్ధాంతాలను ,పూర్తిగానో ,పాక్షికం గానో తన దర్శనం లో పొందు పరచాడు .పదకొండు ,పన్నెండు ,పదమూడు శతాబ్దాలలో ఉన్న దార్శినికుల భావాలకు తన సిద్ధాంతాలలో స్తానం కల్పించాడు .
క్రీ.శ.1225 లో ఇటలీ లోని ఆక్వినాస్ దగ్గర థామస్ ఆక్వినాస్ జన్మించాడు .ప్రాధమిక విద్య మౌంట్ కాసినో విద్యా సంస్థ లో పూర్తీ చేశాడు ..తర్వాతా నేపిల్స్ యూని వర్సిటి లో ఉన్నత విద్య కోసం చేరాడు .1244 లో డొమినికన్ సన్యాసులలో చేరాడు ..పారిస్ లో ఆల్బర్తస్ మాగ్నస్ దగ్గర విద్య నేర్చాడు .అక్కడి నుండి గురువుతో పశ్చిమ జర్మని చేరుకొన్నాడు .
1252 లో ఆక్వినాస్ రచనలు బోధనలు ప్రారంభించాడు 1268-72 మధ్య పారిస్ లో ఉన్నాడు .నేపిల్స్ విశ్వ విద్యాలయం లో డొమినికన్ కాలేజి ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు 1274 మార్చి 7 న ఆక్వినాస్ 49 వ ఏట మరణించాడు .ఆయన దాదాపు 105 గ్రంధాలు రచించి నట్లు తెలుస్తోంది .
ఆక్వినాస్ సిద్ధాంతాలలో కొన్ని విషయాలను తెలుసు కొందాం .మనిషికి సహజం గా పరమ సత్తా ను గ్రహించటం అసాధ్యం .ప్రతి ఒక్కరిలో నిర్ణయ అధికారం ఉంటుంది .నిర్ణయం అనేది అందరు గుర్తించాల్సిన విషయం .నిర్ణయం అనేది స్వయం వ్యక్తం ..ఈ నిర్ణయం అనే దాన్ని మొదట్లో సెయింట్ ఆగస్తీన్ ,డేకార్టు లు చేశారు .సామాన్య నిర్ణయాలు మన మొదటి నిర్ణయాలు కాదు అంటాడు ఆక్వినాస్ .
మన మనస్సు చే గ్రహింప బడిన సత్తా ,వస్తువు యొక్క సత్త అభిన్నాలు అనేది ముఖ్య సూత్రం .మన నిర్ణయమే ప్రామాణికమే .రెండు సత్తా ళల సంవాదాన్ని సత్యం అంటారు .అది రెండిట్లోనూ ఒకే రకం గా ఉండాల్సిన అవసరం లేదు .అది వస్తువులో భౌతిక రూపం లోను ,మనసులో భావ రూపం లోను ఉంటుంది .
మనం గ్రహించేది అంతా మన రీతి ని బట్టే గ్రాహిస్తాం .సత్తా క్లిష్టం గా ఉంటె అందులో ఒకటి గృహీత అంశం ,రెండోది గ్రాహక అంశం ..దీన్ని అంతర క్రియ అన్నాడు .సత్యం అనేది ఈశ్వరుడు కావచ్చు .లేక పోతే క్రియా శక్యతల మిశ్రితం కావచ్చు .ప్రతి భౌతిక సత్తా కు ఒక వాస్తవ రూపం ఉంటుంది .రూపం తో బాటు శుద్ధ శక్యత కూడా ఉంటుంది .
నిర్ణయానికి ఆధార మైంది అంతరజ్ఞానం కాదు .ఇంద్రియాల తో జన్మించిన బౌద్ధిక ప్రక్రియ మాత్రమె .సన్ని కర్ష జన్యం అయిన క్రియ చేత బుద్ధి గ్రహించి స్వయం గా సమన్వయించుకొన్నందు వల్ల జ్ఞానం కలుగుతుంది .మానవ జ్ఞానం నిరంతరం అన్వేషణ తోనే ఉంటుంది .మానవుడిని ప రిపూర్నుని చేసే సమర్ధత ఉంది .మనకు అన్వేషణ యోగ్యం గా ఉండేదే మనకు లక్ష్యం .సత్తా ఉత్రుస్టం అయిన కొద్దీ ,పరి పూర్ణ సామర్ధ్యత పెరుగుతుంది .అందుకని సత్తా లన్నిటిలో భగవసత్తపరమ ప్రమాణం అయినది .మానవునికి అన్వయించు ప్రక్రుతి నియమమే నైతికం .మనిషి దీన్ని అనుసరించ వచ్చు లేక పోనూ వచ్చు .
ఈ విధమైన పది సూత్రాలను ఆధారం చేసుకొని ఆక్వినాస్ తన దర్శనాన్ని సంపూర్ణం చేశాడు .దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం లో దివ్యులు కూడా మత విశ్వాసం తో నే సంచరిస్తున్నారు .జగత్తులో మానవులు, దివ్యులు ,భౌతిక సత్తాలు ఉన్నాయి .మనవ స్వభావం అతని ప్రవ్రుత్తి వల్లనే బయట పడుతుంది .నిర్ణయం అతని బుద్ధికి ఇంద్రియాను బవానికి సంబంధించింది .
మానవుడు అంటే ప్రాధమిక ద్వవ్యం ,జ్ఞానాన్ని ఆశ్రయించిన లేక ఆత్మా అనే ఈ రెండిటి వల్ల ఏర్పడిన వాడు .మన ఆత్మ సంపూర్ణ వ్యక్తీ కాదు .సంపూర్ణ వ్యక్తికీ ఆత్మా ఉండదు .ఆత్మ కేవలం ఒక ఆకృతి మాత్రమే .ఆత్మ అభౌతికం స్వయ అస్తిత్వం కలిగింది .జ్ఞానేంద్రియాల ద్వారా మనిషి జ్ఞానం సంపాదించాలి .అనుభవ గ్రాహ్య మైన వాటి నన్నిటిని సమన్వయ పరచి గ్రహించాలి .మా నవునికి ఉన్న స్వచ్చంద ఇచ్చ వస్తువును గ్రహించటానికి ,వదిలెయ్య టానికి నిర్ణయించు కొంటుంది .
మానవ శక్తి పరిమితం కనుక స్వశక్తితో పరమ లక్ష్యాన్ని చేరుకో లేదు .దయామయుడైన దేవుని అనుగ్రహం వల్లనే గమ్యాన్ని చేరగలడు .భగవంతుదు తనను తాను ఆవిష్కరించు కోవటం వలన నే మనిషి కి ఈ వరం ప్రసాదింప బడింది .అందుకే బందీ లో చిక్కిన దర్శనాలను చేదించుకొని ఏకైక సాధనం అయిన సార్వ భౌమ సాక్షాత్కార అనుభవానికి ఎదురు చూస్తుండాలి
సశేషం
వినాయక చవితి శుభా కాంక్షల తో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-13 –ఉయ్యూరు