మరుగున పడిన మతాలు –మతా చార్యులు – 11
అచింత్య భేదా భేద మతం
బెంగాల్ రాష్ట్రం లో శ్రీకృష్ణుని మహా భక్తుడైన చైతన్య ప్రభువు సాక్షాత్తు శ్రీ కృష్ణావతారం గా భావిస్తారు ఈయన 1465 లో జన్మించి 1532 లో తనువు చాలించాడు .చైతన్యుడు ఒక గొప్ప భక్తి సాంప్రదాయానికి పునాది వేశాడు .ఈయన, ఈయన శిష్యులు ‘’బ్ర హ్మ సూత్రాల’’ మీద ఎలాంటి వ్యాఖ్యానం చెయ్యలేదు .వీరికి శ్రీ మద్భాగవతమే సర్వోత్రుస్టమైన గ్రంధం .చై తన్యుని శిష్యులు రూప గోస్వామి ,సనాతన గోస్వామి సోదరులే .రూప గోస్వామి’’భక్తీ రసామృత సింధువు‘’మొదలైన గ్రంధాలను రచించాడు సనాతన గోస్వామి ‘’వైష్ణవ తొషిణి ,’’భాగవతామృతం ‘’మొదలైనవి రాశాడు వీరి తమ్ముడి కుమారుడు జీవ గోస్వామి ‘’క్రమ సందర్శం ’’అనే భాగవత టీక ను భక్తీ సిద్ధాంత ,ఉపదేశామ్రుతం వంటి పుస్తకాలు రాశాడు శ్రీ చైతన్య జీవితాన్ని శ్రీ కృష్ణ దాస కవి రాజు రాసి అందులో చైతన్య బోధలను పొందు పరచాడు .గోస్వాములు ముగ్గురు రాసింది వేదాంత వ్యాఖ్యానమే
చైతన్య మహా ప్రభువు రూప గోస్వామి ,సనాతన గోస్వామి
జీవ గోస్వామి
బలదేవ విద్యాసాగారుడు
18 వ శతాబ్దపు వంగ దేశ బల దేవ విద్యా సాగరుడు చైతన్యుల గోస్వాముల బోధల నాధారం గా బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశాడు .గోవింద భగవానుడు స్వప్నం లో కనిపించి ఆదేశించటం వల్ల రాసిన్ది కనుక దీనికి ‘’గోవింద భాష్యం ‘’అని పేరు పెట్టాడు .వీరు చెప్పిన వేదాంత దర్శనానికే ‘’అచింత్య భేదా భేద వాదం’’ అనే పేరొచ్చింది అందులోని ముఖ్య విషయాలను తెలుసు కొందాం .
సూర్యుని లాగా వేదం కూడా స్వయం ప్రకాశం .అన్ని ప్రామాణా లకు వేదమే శరణ్యం .జీవుడికి పరమేశ్వర అంటే శ్రీ కృష్ణ స్మ్రుతి ఉండదు .అందుకే ఇది తెలుసుకోవటానికి కృష్ణుడే వేదాలను ,,పురాణాలను బోధించాడు .ఉపనిషత్తుల లో ఉండే ముఖ్య విషయాలనే వ్యాస మహర్షి బ్రహ్మ సూత్రాలుగా చెప్పాడు .వ్యాసుడు స్వయం గా నారాయణుడే కనుక ఇందులో భ్రమ, ప్రమాదాలుండవు తాత్పర్యం వల్ల ముఖ్యార్ధం తెలియక పోతే గౌణార్ధం ,అభిదా వృత్తి వలన అన్వయం కుదరక పోతే లక్షణా వృత్తి వల్ల గ్రహించాలి
బ్రహ్మ సూత్రాలలో వ్యాసుడు పరిణామ వాదం చెప్పాడు. భగ వంతుడు చిన్తయ శక్తి ‘’ఉన్న వాడు .కనుకనే ఆయన స్వేచ్చగా జగత్తు లో పరిణ మిస్తాడు ఆయన అవికారి గానే ఉంటాడు .భగవంతుడు ఐశ్వర్య స్వరూపుడు .ఆయనలో మాయ ఉండదు .అయన పరి పూర్ణుడు .వేదాలన్నిటికి భగవంతుని తో సంబంధం ఉంది .వేద బీజం అయిన ‘’ప్రణవం ‘’మాత్రమె వేదాల మహా వాక్యం .ఇది భగవంతుని నిగూఢ నామం .ఇదే ఈ విశ్వాన్ని ధరిస్తోంది .ప్రణవ మహా వాక్యం ముందు‘’తత్వ మసి ‘’అనే వాక్యం మహా వాక్యం గా నిల బడదు .ఇది ఏక దేశీయ వాక్యమే అవుతుంది .
వేదాంతం లో చెప్ప బడిన బ్రహ్మ శబ్దం ముఖ్యార్ధం భగ వంతుడే .ఐశ్వర్య ,వీర్య ,యశః ,శ్రీ జ్ఞాన వైరాగ్యాలను సంపూర్ణం గా ఎవరిలో ఉన్నాయో ఆయనే భగ వంతుడు .భగవంతుని విభూతి ,,దేహాలు చిదాకారాలు .ఆయన స్థానం ,పరివారం కూడా చిదానందమయాలే భగవద్గీత లో చెప్పి నట్లు జడ ,జీవులు ఆయన అపర పర ప్రక్రుతులే .ప్రకృతియే శక్తి . భగ వంతుని లో జడ జీవులకు భేద అభేద సంబంధం ఉంది .ఇది నిత్యం సత్యం .
భక్తీ పురుషార్ధ సాధనం . భగ వంతుని దయ వల్ల ముక్తి లభిస్తుంది .ముక్తి పొందిన వాడు భగవంతుని సన్నిధి లో,భగవంతుని లోకం లో ఉంటాడు వాడికి మళ్ళీ పుట్టుక ఉండదు .భక్తీ అనేది ఆనంద ,జ్ఞానాల రూపం .సాధన ,భావన ,ప్రేమ అనే మూడు భక్తీ మార్గానికి అవస్తా త్రయం .ఇంద్రియ ప్రేరణ వల్ల సాధారణ భక్తీ కుగుతుంది .ఇది హృదయం లోఉన్న ప్రేమ ను .మేల్కొల్పుతుంది .శుద్ధ సత్వం ,స్నిగ్ధత వల్ల లభించే భక్తీ విశేషాన్ని భావం అంటారు .భావం ఘనీభవించినపుడు ప్రేమ ఏర్పడుతుంది .ఇదే మానవ యత్నం లో చివరి ఫలం .,పరమ పురుషార్ధం కూడా . మొత్తం మీద ఇవీ అచిన్త్యా భేదాభేద వాదం లోని ముఖ్య విషయాలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-13- ఉయ్యూరు –