మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13
ముగ్గురు గ్రీకు మత దార్శనికులు
క్రీ పూ. 600 -400 మధ్య కాలం లో ముగ్గురు గ్రీకు దార్శనికులు ప్రభావం చూపారు . వారే అనాక్సి మాండ ర్,,అనాక్సిమేనీజ్ ,అనాక్స గొరాన్ లు
అనాక్సి మాండర్
క్రీ. .పూ.611-547కాలం వాడుఅనక్సి మాండర్..అయోనియా భౌతిక దార్శనికులలో రెండవ వాడుగా ప్రసిద్ధి చెందాడు .మైలీతాస్ అనే నగరం లో ఉండే వాడు .తెలీజ్ కు సహచరుదంటారు .’’దేని నుంచి వ్యతి రేక విషయాలు వేరు పడటం వల్ల ప్రపంచం పుట్టిందో ,దేనిలో ప్రళయం లో ప్రపంచం తిరిగి లయం అవుతుందో అలాంటి నిత్య ,అవినాశ ,అనంత మైనదే మొదటి తత్త్వం అని చెప్పిన దార్శనికుడు అనాక్సి మాండర్..తాను చెప్పిన దర్శన సూత్రాలను లిఖిత పూర్వకం గా భద్ర పరచిన మొదటి ఫిలాసఫర్ అనాక్సి
.ఆయన రాసిన దానిలో ఒక భాగం మాత్రమె లభిస్తోంది .విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు ప్రపంచ వస్తువులను నిశిత పరిశీలన చేశాడు .’’ప్రక్రుతి సమతుల్యతకు భగ్నం కలిగిస్తే ఈ విశ్వం ఎక్కువ కాలం మనలేదు ‘’ అని ఆనాడే గట్టిగా చెప్పిన పర్యా వరణ రక్షకుడు ..ఖగోళ శాస్త్రానికి కొత్త విషయాలు జోడించాడు భూమికి గ్రహాలకు ఉన్న అవినా భావ సంబంధాన్ని వివరించాడు .ప్రపంచ పటం అయిన గ్లోబ్ ను మొదట తయారు చేసిన వాడీయనే .దీనితో జాగ్రఫీ వృద్ధి చెందింది .ఆయనకున్న అపార జామెట్రీ పరిజ్ఞానం వల్ల గ్రీసులో ‘’గ్నోమోన్’’ ను ఆవిష్కరించాడు మిలేశియాస్ రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నాడు .అందులో ఒక కాలనీకి నాయకుడిని చేశారు సైన్సు ప్రయోగాలకు ఆద్యుడు కూడా అని పించుకొన్నాడు
అనాక్సి మేనీజ్
ఈయన కూడా మైలీతాస్ దార్శనికుడ ని పేరు పొందాడు .క్రీ.పూ.586- 528 వాడని భావిస్తారు .ప్రపంచం లో మొదటి ద్రవ్యం ‘’వాయువు’’ అని చెప్పాడు .వాయు సాంద్రత లోని మార్పుల వల్లనే సమస్త సృష్టి జరిగిందని చెప్పాడు అనాక్సి మాండర్ కు శిష్యుడు .భూమి పుట్టుక ,స్వభావాలపై పరిశోధన చేశాడు .భూమికి ఖగోళ వస్తువులకు సంబంధాన్ని చర్చించాడు . సూర్య ,చంద్రులు బల్ల పరుపు గా ఉన్నాయని చెప్పాడు అవి గాలి లో తెలియాడుతా యన్నాడు . భూ కంపాలకు భూమిలో తేమ తగ్గి పోవటమే కారణం అన్నాడు .సాంద్ర మైన గాలి పొరలపై సూర్య కిరణాలు పడినప్పుడు ఇంద్ర ధనుస్సు ఏర్పడుతుందని ఊహించాడు
ఆయన పరిశోధనలు గుర్తించి ఆధునిక ఖగోళ శాస్త్ర వేత్తలు చంద్రునిలో ని ఒకగుంట కు ‘’ అనాక్సి మేనీస్ ‘’అని గౌరవం గా పేరు పెట్టారు . ‘’ఆయన దృష్టిలో ఫిలాసఫీ అంటే మూలాధారమైన నమ్మకాలు, కీలక భావనలు , వ్యక్తీ లేక బృందం యొక్క వైఖరులు ‘’అని నిర్వచనం చేశాడు విజ్ఞానం స్తితి ,యదార్ధం ,విలువలు ,వివేచనా బుద్ధి మొదలైన వాటి పై ఆయన శోధించి తన భావాలు చెప్పాడు
.చంద్రుని పై ”అనాక్సి మెన్స్ గుంట
అనాక్స గోరస్
క్రీ.పూ.500-428 కాలానికి చెందిన వాడు ఆసియా మైనర్ లో క్లోజో మెనో లో జన్మించాడు ఎదేన్స్ నగరానికి వెళ్లి అక్కడే 30 ఏళ్ళు ఉన్నాడు .శాస్త్రీయ అన్వేషణ విధానాన్ని దార్శనిక విధానాన్ని అయోనియా నుండి ఎదేన్స్ కు తెచ్చిన వాడు గోరాస్ .
ప్రపంచం ఏదో ఒక విధం గా నిత్యం అన్నాడు మొదట్లో ప్రపంచం అతి సూక్ష్మ భాగాలుగా ఉండేదని ,ప్రపంచం అంతా అవి వ్యాపించి ఒక దానితో ఒకటికలిసి పోయాయని అన్నాడు .మన బుద్ధి కాని, హేతువు కాని వీటిని వేరు పరచటం కాని సంఘటితం చేయటం కాని చేసింది అంటాడు .యాంత్రికం గా కలుసుకోవటం, వేరు పడటం వల్ల సూక్ష్మ కణాలు భౌతిక ద్రవ్యానికి కారణం అయ్యాయి ఇదే ఆ తర్వాత పరమాణు సిద్ధాంతానికి మార్గం ఏర్పరచింది
అనాక్స గోరాస్ మరియు పెరిక్లిస్
గ్రహణాలు ,తోక చుక్కలు ,ఇంద్రధనుస్సు,అగ్ని గోళమైన సూర్యుడు గురించి స్పష్టమైన విషయాలు చెప్పిన మొదటి వ్యక్తీ .బుద్ధి పై అతి సూక్షం పరిశోధన చేశాడు మనసు వల్లనే చలనం జరుగుతోన్దన్నాడు గ్రీకు ఫిలాసఫీ ని మలుపు తిప్పిన వాడు అనాక్స గోరస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-13- ఉయ్యూరు