మహిళా మాణిక్యాలు
సాహితీ బంధువులకు –శుభ కామనలు—వివిధ రంగాలలో ప్రపంచ ప్రసిద్ధులైన మహిళల పై ఇంటర్నెట్ లో నేను రాసిన 50ఆర్టికల్స్ ను ‘’మహిళా మాణిక్యాలు ‘’పేరు తో సరసభారతి తరఫున 12వ పుస్తకం గా ముద్రించి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో అంటే 30-3-2014నఆవిష్కరింప జేయాలని సంకల్పం కలిగింది . ఇందులో డొక్కాసీతమ్మ గారు ,డాక్టర్ కాకాని భావాని (అమెరికా ) ,నాట్యగురువు రత్నపాప (అమెరికా )జిల్లెళ్ళమూడి అమ్మ ,భండారు అచ్చమాంబ ,మొదటి మహిళా మార్షల్ పద్మా బందోపాధ్యాయ ,ఏం ఎస్ సుబ్బు లక్ష్మి ,సుసాన్ ఆంథోని ,లేడీ కార్పెంటర్ మొదలైన వారి పై వ్యాసాలున్నాయి .కనుక దీనికిముద్రణ ఖర్చులు భరించే వదాన్యులైన దాతలెవరైనా ముందుకు వచ్చి స్పాన్సర్ గా ఉంటె సంతోషం తో స్వాగతిస్తున్నాము .ఒక వేళఅంతా ఒక్కరే భరించ లేక పోతే ఇద్దరు ముగ్గురు ఉన్నా స్వాగతమే .వీరి స్పాన్సర్ షిప్ ను పుస్తకం లో ప్రచురిస్తాము .అదీ కాక పోతే rs.500రూపాయలు ,అంతకంటే పైగా విరాళం ఇచ్చే దాతల పేర్ల ను పుస్తకం లో ప్రచురిస్తాము .ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ముందుకు వచ్చి సహకరించవలసినదిగా అభ్యర్దిస్తున్నాము .మీ స్పందనే మాకు ప్రోత్సాహం ..ఫిబ్రవరి నెలాఖరు లోపల మీ స్పందన తెలియ జేయ వలసిందిగా కోరుతూ –మీ దుర్గా ప్రసాద్
26.01.2014
ఈ ఉదయం ”మహిళా మాణిక్యాలు ”పుస్తకం పై నేను చేసిన అపీల్ కు కొన్ని గంటలలోనే స్పందించి ఆ పుస్తకానికి తానే పూర్తిగా స్పాన్సర్ గా ఉంటానని ఫోన్ లో చెప్పి నన్ను ప్రోత్సహించారు నా ఆత్మీయులు ,సరసభారతికి అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి ఆప్తులు అమెరికా లొఉంటున్న మా ఉయ్యూరు వాసి అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ..వారి సద్యొస్పన్దనకు కృతజ్ఞతలు . కనుక ఈ పుస్తకానికి ఇంక ఎవరూ స్పాన్సర్ గా ముందుకు రానవసరం లేదని మనవి చేసుకొంటున్నాను .
—