అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

ఆలోచన

భారత దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగి చూశాము కాని కేరళా కాశ్మీర్ వెళ్లి చూడలేదనే బాధ నా మనసు లో ఉంది .కార్తీకమాసం లో పంచారామ సందర్శనం తర్వాతా ధనుర్మాస ప్రారంభం లో చిన్న తిరుపతి దర్శనం అయిన తర్వాతా ఈ కోరిక మరీ బలీయమైంది .మా శ్రీమతికూడా సరే నంది .మా కుటుంబ స్నేహితురాలు మాకు ప్రత్యక్ష ఆడపడుచు అని మేము భావించే సీతం రాజు మల్లికాంబ గారు కూడా మాతో వస్తానన్నారు. మా అన్నయ్య గారి అబ్బాయి రాం బాబు కూడా కలుస్తానన్నాడు .ఇవన్నీ పూర్తి అయేసరికి డిసెంబర్ చివరి వారం వచ్చేసింది .మా రెండో అబ్బాయి శర్మకు ఈ ప్లాన్ చెప్పి రైల్ టికెట్ల సంగతి చూడమన్నాం .వాడు వెంటనే చూశాడు .కేరళలో అనంత పద్మ నాభ స్వామిని గురవాయూర్ లో శ్రీ కృష్ణుని కాలడి లో శంకరాచార్య జన్మ స్థలాన్ని చూడాలనే మొదటి మా సంకల్పం .అటు నుండి మద్రాస్ వెళ్లి అక్కడి నుండి మళ్ళీ చిదంబరం అరుణాచలం  వెళ్లాలని ఆలోచన ఈ విషయాన్ని మద్రాస్ లో ఉన్న మా మేన కోడలి భర్త చంద్ర శేఖర్ కు చెప్పాం అతను దారిలోనే విరుదా చలం స్టేషన్ లో దిగి చిదంబరం ,అక్కడి నుండి అరుణాచలం వెళ్లి మద్రాస్ వస్తే సమయం త్రిప్పటా కలిసి వస్తుందని సలహా ఇచ్చాడు. బాగుందను కొన్నాం .

శర్మ ముందుగా బెజవాడ నుండి త్రివేండ్రం కు ,టికెట్ బుక్ చేసి ,అక్కడ ఒక రోజు మాత్రమె ఉండి మర్నాడు ఉదయం కన్యాకుమారి ,సుచీన్ద్రం నాగర్ కోయిల్ చూసి అక్కడ మళ్ళీ ట్రెయిన్ ఎక్కి గురవాయూర్ మర్నాడు ఉదయం చేరి స్వామి దర్శనం చేసి మధ్యాహ్నం నుండి కారు లో కాలడి వెళ్లి రాత్రికి ట్రెయిన్ ఎక్కి మద్రాస్ చేరేట్లు టికెట్ రిజర్వేషన్ చేయించాడు .త్రివేండ్రం లో ,గురవాయూర్ లో హోటల్ రూమ్స్ బుక్ చేశాడు. అంతా ఆన్ లైన్ లోనే .గురవాయూర్ నుండి రాత్రికి మద్రాస్ బయల్దేరే ట్రెయిన్ లో రిజర్వేషన్ చేయించాడు. దానిలో బయల్దేరి మర్నాడు సాయంత్రం విరుదాచలం లో దిగి ,అక్కడి నుండి చిదంబరం కార్ లో వెళ్ళేట్లు మాట్లాడాడు చంద్ర శేఖర్ .అతనే హోటల్ రూమ్స్ ఫోన్లో బుక్ చేశాడు .అక్కడినుండి వైదీశ్వరలయానికి కార్ లో వెళ్ళే ఏర్పాటు చేశాడు .చిదంబరం లో సాయంత్రం బయల్దేరి తిరువన్నామలై కు రాత్రి చేరి హోటల్ రూమ్ లో ఉండేట్లు రిజర్వ్ చేయించాడు .మర్నాడు ఉదయందర్శనం గిరి ప్రదక్షిణం చేసి రమణాశ్రమం చూసి మధ్యాహ్నం బస్ లో బయల్దేరి చెన్నై కి రాత్రికి చేరే ప్లాన్ చెప్పాడు చంద్ర శేఖర్ ఇది అందరికి నచ్చి దీన్ని బట్టి రిజర్వేషన్లన్నీ జరిపించారు శర్మా చంద్ర శేఖర్ కలిసి .

ఆచరణ

మాఘ మాసం లో కిందటి ఏడాది చంద్ర శేఖర్ కుమారుడి ఉపనయనానికి  మద్రాస్ వెళ్లి అతని సలహాతో కుంభకోణం తంజావూర్ ,పళని తిరువాయూర్ ,శ్రీ రంగం లను తిరుచ్చి  బేస్ చేసుకొని పర్యటిమ్చాం .ఇప్పుడు కూడా మాఘం లోనే మళ్ళీ ప్రయాణం .తమాషా అని పించింది .కేరళ లో మన భోజనం దొరకదు కనుక ఎలేక్ట్రిక్ కుకర్ తీసుకు వేల్దామనుకోన్నాం .కాని అను మతించరు హోటల్ లో అని చెప్పాడు చంద్ర శేఖర్. అందుకని ఆ ఆలోచన విరమించుకోన్నాం

.త్రివేండ్రం వెళ్ళే వరకు  రైల్ లో  తినటానికి ఏర్పాట్లు చేసుకోన్నాం .మా ఇంట్లో పూరీ కూరా నిలవ ఉండే గారెలు చేశాం మల్లికాంబ గారు పెరుగన్నం తెచ్చారు. రాం బాబు బిస్కెట్లు స్వీట్ హాట్ మంచినీరు ఏర్పాటు చేశాడు .కారం పొడి చింతకాయ పచ్చడి నిమ్మ కాయ ఊరగాయ అటుకులు తీసుకున్నాం .మనిషికి రెండే శాల్తీలు ఉండేట్లు అనుకొన్నాం .మా ఇద్దరి బట్టలు ఒక సూట్ కేస్ లో సర్దుకున్నాం .ఒక హాండ్ బాగ్ లో కావలసిన కొన్ని బట్టలు ,తయారు చేసినవి సర్దుకోన్నాం .అరటి ఆకులు కోసి తీసుకొన్నాం .ప్లాస్టిక్ గ్లాసులూ కాఫే కి ఫ్లాస్కు ,తీసుకొన్నాం దాదాపు తిండి కోసం ఏదీ కొనాల్సిన అవసరం లేకుండా చేశాం .కమలాలు ఆపిల్ పళ్ళు రాంబాబూ తో బాటు మేము కూడా ఎవరికి వారం తెచ్చుకోన్నాం .ఒక్క గురవాయూర్ లో తప్ప మిగిలిన చోట్ల సాయంత్ర దర్శనం ఉదయం దర్శనం అంటే రెండు సార్లు దర్శనం చేసేట్లు ఏర్పాట్లు చేసుకోన్నాం .

ఇదీ ప్లాన్

4-2-14మంగళ వారం రాత్రి పన్నెండు గంటలకు బ్రష్ చేసి స్నానాదికాలు పూర్తీ చేసి ,అందరూ మా ఇంటికి వచ్చారు .మేమూ రెడీ అయ్యాం . మా అబ్బాయి రమణ  రాము అని మాకు పరిచయం  అతనికి కారు కోసం చెప్పాడు .అతను కారు తీసుకొచ్చాడు 100_0618 - Copy - Copy (2)సామాను అంతా అందులో సర్దుకొని రాత్రి ఒంటి గంటకుబయల్దేరి బెజవాడ రైల్వే  స్టేషన్ కు చేరాం. ఏడవ నంబర్ ప్లాట్ ఫారం కు. త్రివేండ్రం ఎక్స్ప్రెస్ 22619ఎక్కి s3 లో 3,5,6,8బెర్తులు లోకి చేరాం. రాత్రి మూడు గంటలకు ట్రెయిన్ బయల్దేరింది .మమ్మల్ని ఎక్కించి రాము ఉయ్యూరు వెళ్ళాడు రాం బాబు శిష్యుడు ఒకతను కూడా తోడువచ్చాడు ట్రెయిన్ ఎక్కించటానికి. తొమ్మిది శాల్తీలు తో బయల్దేరాం ..నిద్ర పెద్దగా పట్టలేదు .ఉదయం లేచి మాతో తెచ్చుకొన్న కాఫీ త్రాగాం .తర్వాతా తెచ్చుకొన్న టిఫిన్ తిన్నాం. కాఫీ త్రాగాగానే నేను తెచ్చుకొన్న పుస్తకాల తో సంధ్యా వందనం పూజా పూర్తీ చేసి అరుణ పారాయణ మహా సౌర మంత్రం లను పూర్తీ చేసి టిఫిన్ తిన్నాను .మధాహ్నం పెరుగన్నం పళ్ళు తిన్నాం 100_0620 - Copy - Copy (2) 100_0622 - Copy - Copy (2) 100_0623 - Copy (3) 100_0624.సాయంత్రం గారెలు తిన్నాం. రాత్రికి పూరీ కూరా తిన్నాం .అయిదవ తేదీ అంతా ప్రయాణమే అయిదు బుధ వారం రాత్రిఒంటి గంటకు త్రివేండ్రం స్టేషన్ చేరుకొన్నాం .సామాను మేమే దింపుకొని ముప్ఫై రూపాయలిచ్చి మేము బుక్ చేసుకొన్న హోటల్ కు చేరాం. హోటల్ కు చాలా దగ్గర రోడ్డు దాటితే హోటలే .

చైత్రం లో మాఘం

ఆరవ తేదీ గురువారం – త్రివేండ్రం లో మేము బుక్ చేసుకొన్నా కేరళ ప్రభుత్వ హోటల్ పేరు ‘’చైత్రం ‘’.అంటే మేమిప్పుడు’’ చైత్రం లో మాఘ మాసం ‘’గడుపుతున్నామన్న మాట .రెండు రూములు బుక్ చేశాం .310,320.మదటి దాంట్లో ప్రభావతి మల్లికాంబ గార్లు రెండవ దానిలో నేనూ రాం బాబూ ఉన్నాం .నిద్ర ఎలాగూ పట్టదు కనుక మూడింటికే లేచి కాల కృత్యాలు పూర్తీ  చేసుకొని అప్పటికే ఒక సారి కాఫితాగాం నేను స్నానం తర్వాతా సంధ్య పూజ పారాయణ చేసి సిద్ధం గా ఉన్నాను 100_0631 - Copy (3) 100_0625 - Copy - Copy (2) 100_0626 - Copy - Copy (2) 100_0627 - Copy - Copy (2) 100_0630 - Copy (2).మిగిలిన వాళ్ళు కూడా రెడీ అయ్యారు .వెంట తెచ్చుకొన్న గారెలు బ్రేక్ ఫాస్ట్ గా తినేశాం .హోటల్ ప్రక్కనే కేరళ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ వాళ్ళ ఆఫీసు ఉంది .అక్కడికి వెళ్లి ఉదయం ఎనిమిదింటికి బయల్దేరే లోకల్ ట్రిప్ కు మనిషికి మూడు వందలు చెల్లించి బుక్ చేసుకోన్నాం .సాయంత్రం నాలుగున్నర ట్రిప్ కు రెండు వందల చొప్పున హార్బర్, కోవలం బీచ్ లకు బుక్ చేసుకోన్నాం .

ఎనిమిది గంటలకు ఏ.సి.మినీ వాన్ లో ఎక్కాం .మేము కాక ఇంకో దంపతులు మాత్రమె ఉన్నారు .మొదటగా శ్రీ అనంత పద్మ నాభ  స్వామి దేవాలయానికి తీసుకొని వెళ్ళారు .అక్కడ పాంటు చొక్కా కెమెరాలు ,సెల్ ఫోన్లు చెప్పులు క్లోక్ రూమ్ లో ఇచ్చి లుంగీ పై పంచ మాత్రమె వేసుకొని నేను రాం బాబు తయారయ్యాం 100_0632 - Copy - Copy (2) 100_0633 - Copy - Copy (2) 100_0634 100_0635 - Copy - Copy (2) 100_0636 - Copy - Copy (2) 100_0637 - Copy - Copy (2) 100_0638.ఆడవాళ్ళు చీర కట్టుకోవచ్చు చుడీదార్ దార్ నిషిద్ధం .లుంగీ లాంటి బట్టకట్టుకోవాలి .శ్రీ పద్మనాభ దర్శనం కనులారా చేసుకోన్నాం .బయటికి వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని అక్కడే ఉన్న స్వాతి తిరుణాల్ మ్యూజియం చూశాం .అక్కడి నుంచిపద్మనాభ బీచ్ కు వెళ్లాం .అక్కడ ఒక అరగంట గడిపి కెనాల్ బాక్ వాటర్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళాడు .అక్కడ మనిషికి వంద రూపాయలు ఇచ్చి స్పెషల్ బోట్ ఎక్కి ఒక గంట అందులో  ప్రయాణ సుఖం అను భావించాం .కెనాల్ ప్రక్కనే విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. దాన్ని బోటు లోంచే చూశాం . తిరిగి వచ్చి ప్రక్కనే ఉన్న పార్కు చూసి మళ్ళీ కారులో జూ లో మమ్మల్ని వదిలేశారు .జూ అంతా నేను రాంబాబు మల్లికాంబ గారు తిరిగి చూశాం .ప్రభావతి ఒక చోట కూర్చుని ఉంది .జూలో లో పెద్ద జంతువులేవీ లేవు .పాములు నెమళ్ళు జింకలు జిరాఫీ లు కనీ పించాయి .ఎండి పడిపోయిన చెట్లను జంతు ముఖాలుగా చెక్కిన తీరు బాగుంది. ఫోటోలు తీశాం

.అక్కడి నుంచి బయటికి వచ్చి ‘’రాజా రవి వర్మ చిత్ర శాల’’ చూశాం జీవితం ధన్య మైనదని పించింది .కళ్ళు చెమర్చాయి .రవి వర్మ లేక పోతే మన పురాణ పురుషుల రూపాలేలా ఉండేవో మనకు తెలియదుకదా. ఆ పుణ్యం ఆయనదే .కొన్ని చిత్రాలను ఫోటోలు తీశాం

.కారు వాడు వెళ్లి పోయాడు .మేము ఆటో లో నలభై రూపాయలిచ్చి చైత్రానికి చేరుకొన్నాం .అక్కడే వాళ్ళ రెస్టారంట్ లో మసాలా దోసె తిని కాఫీ త్రాగాం .రూమ్ చేరి విశ్రాంతి తీసుకొన్నాం .మధ్యాహ్నం మూడింటికే లేచి తయారై ఆటోలో’’ అత్తకాల్ అమ్మ వారి’’ గుడికి వెళ్లాం .మూసి ఉంది .తిరిగి ఆటోలో రూమ్ చేరుకొన్నాం .నాలుగున్నరకు మినీ వాన్ లో హార్బర్ ,బీచ్ లకు ప్రయాణమయ్యాం మేము నలుగురమే ఎవరూ లేరు .ముందుగా హార్బర్ కు ఒక ముప్పావు గంట ప్రయాణం చేసి తీసుకొని వెళ్ళాడు .డీప్  వాటర్ ఫిషింగ్ ఇక్కడే జరుపుతారు .అది చూపించి ఇంకో అరగంట లో కోవలం బీచ్ కు తీసుకొని వెళ్ళాడు అక్కడ సముద్రాన్ని తనివి తీరా చూసి ఆనందించాం.అక్కడ బాదం చెట్లు విపరీతం .ఎర్రగా పండిన పళ్ళు రాలి పడి ఉన్నాయి .మా చిన్నతనం లో మేము చూసిన బాదం పళ్ళు కాయల్ని కొట్టి లోపలి పప్పు తిన్న అను భూతి జ్ఞాపకానికి వచ్చాయి ఆ కాలం లో బాదం ఆకుల తో విస్తళ్ళు కుట్టి అందులోనే భోజనాలు చేశే వాళ్ళం ..ముచ్చటేసింది .సాయంత్రం ఆరింటికి మమ్మల్ని అత్తుకాల్ భగవతి అమ్మ వారి గుడి దగ్గర దిమ్పమన్నాం. అలానే చేశాడు . అమ్మవారు’’ కన్నగి ‘’కి ప్రేరణ .కాళికా అమ్మ వారు .మధుర ను కన్నగి శపిస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అత్తకాల్ లో ఉంది కనుక ఆ పేరు .అది చూసు కొని ప్రసాదం తిన్నాం. చాలా దేదీప్యమానం గా ఉంది అమ్మ వారు ..తొమ్మిదవ తేదీ నుండి పది రోజులు ఉత్సవాలు ఏర్పాట్లు ముమ్మరం గా చేస్తున్నారు .ఆ రోజుల్లో నలభై లక్షల మంది సందర్శిస్తారు .నాలుగు కిలో మీటర్ల దూరం వరకు ప్రత్యెక మైన పొయ్యిల మీద పొంగళ్ళు వండి అమ్మ వారికి నైవేద్యం పెడతారట .రాత్రి త్రివేండ్రం లో ఈస్ట్ ఫోర్ట్ రోడ్ లో ఒక చేనేత వస్త్రాలయానికి వెళ్లి నేను కేరళ పంచె ,మా ఒదినకు చీర రాంబాబు వాళ్ళ అమ్మకు చీరలు ప్రభావతి రెండు చీరలు ,మల్లికాంబ గారు చీరలు కొని రూమ్ కు ఆటో లో చేరుకొన్నాం .

ఏడవ తేదీ శుక్ర వారం   తెల్లవారు ఝామున మూడుమ్బావుకే పద్మనాభ దేవాలయం తెరుస్తారు .అప్పటికే మేము లేచి అన్నీ పూర్తీ చేసుకొని నా సంధ్యా, పూజా ,పారాయణ అయిన తర్వాతా మూడుమ్ముప్పావుకు గుడికి చేరుకొన్నాం .స్వామి అభిషేకం కనులారా చూశాం .అమ్మవారినీ దర్శించి ,కాఫీ తాగి చైత్రానికి చేరాం .కాసేపు విశ్రాంతి తీసుకొని తొమ్మిదింటికి రూములు ఖాళీ చేసి దగ్గరే ఉన్న రైల్వే స్టేషను కు సామాన్లను మేమే తీసుకొని వెళ్లాం తొమ్మిదిం బావుకు 1638 కన్యా కుమారి ఎక్స్ప్రెస్ .అందులో s4లో  33,34,35,36,సీట్ల లో కూర్చున్నాం అది కన్యాకుమారికి మధ్యాహ్నం పన్నెండుకు చేరింది .మిగిలిన విషయాలు మరో సారి .ఇలా మాకు ‘’చైత్రం లో మాఘం ‘’గడిచింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-14-ఉయ్యూరు

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.