మా నవ రాత్రి యాత్ర -9 ఖజురహో కళలాహో అదురహో

మా నవ రాత్రి యాత్ర -9

ఖజురహో కళలాహో అదురహో

ఖజురహో ఆలయ శిల్ప కళావైభవం

ఖజురహో దేవాలయ సముదాయ శిల్పకళ ఇండో ఆర్యన్ సంస్కృతికి చెందింది .మధ్యయుగ శిల్పకళా వైభవానికి నిలు వెత్తు నీరాజనాలివి .శిల్పకళ పరి పూర్ణం గా వర్ధిల్లి నేటికీ భద్రం గా రక్షింపబడిన సమూహం ఇది .బెంజమిన్ రోలాండ్ అనే ప్రఖ్యాత శిల్ప శాస్త్ర వేత్త దీన్ని ‘’ The Khajuraho artist seems to be thoroughly versed in the mnemonic traditions and textual canons ,the grammar and syntax of architecture and iconography’’అని కీర్తి కిరీటం పెట్టాడు .ఇండో ఆర్యనుల కళా మేళవింపు మేధావితనం ఈ సముదాయాన్ని సర్వోత్క్రుస్త స్తితికి తెచ్చిందని మెచ్చుకున్నాడాయన .

నగర్ ఆలయ నిర్మాణ శైలి భూమి,పై శిఖరం లోను ,సూచీ అగ్రం గాను చుట్టూ విస్తరించి ఉండటం లోను జ్యోతకమవుతుంది .చౌన్స్ నాద దేవాలయం తప్ప మిగిలిన ఖజురహో ఆలయాలన్నీ అత్యంత నాణ్యమైన  శుద్ధి చేసిన ఇసుక రాయి తో నిర్మితమైనాయి .లేత పసుపు రంగు కొద్ది పాటి ఊదారంగు రాయి తూర్పు తాటాక తీరం లోని  ‘’పన్నా ‘’నుండి తెచ్చారు .పెద్ద రాళ్ళను క్వారీల వద్దనే శిల్పాలుగా మలిచి ఇక్కడికి రవాణా చేశారు .వాటిని దేవాలయ ప్రాంతం లో ఒకదానితో ఒకటి అంటించి ఆలయాలన్నిటినీ నిర్మించారు .చౌశాత్ యోగిని దేవాలయాన్ని మాత్రం గ్రానైట్ రాయితో కట్టారు .స్థానికం గా దొరికే గ్రానైట్ ముతకగా ఉండటం తో పన్నా వెళ్లిఇసుక రాతిని  తేవాల్సివచ్చింది .

This slideshow requires JavaScript.

ఫెర్గూసన్  పండితుడు ‘’ఖజురహో దేవాలయాలను ఒకదానికొకటి విడ మరచి  తెలుసుకోవటానికి సూక్ష్మ పరిశీలన అవసరం .అన్నీ ఒకే రాజు నిర్మించి నట్లు అని పిస్తుంది .ఒకదాన్ని చూసి రెండోది ఈర్ష్య కల్గిన్చేదిగా కని  పిస్తుంది .అధిక శ్రమకు ఇవి ప్రతీకలు ‘’అన్నాడు .మిగతా చోట్లున్న దేవాలయాల కంటే ఖజురాహో ఆలయాలు కోణ నిర్మాణాలకు సూక్ష్మ అగ్రాలకు ప్రతినిధులుగా కనిపిస్తాయి .సమాంతరం గ నైనా నిలువుగానైనా ,మూలల్లోనైనా ఈ ప్రత్యేకత గోచరిస్తుంది .శిఖర సముదాయాలతో కూడిన ఆలయ శిఖరం వంకీలతో నగిషీ చెక్కిన ట్లుంది ఆశ్చర్య పరుస్తుంది .ఇలా పైకి పోయి పోయి గుండ్రని ఆమలక శిఖర రూపు దాలుస్తుంది .పద్మంవికశించి సూక్షం రూపం లో కి మారినట్లు ,అంతరిక్ష శూన్యానికి ప్రతీకగా విశ్వమానవ కపాల భాగం గా రూపు దాల్చటం ఖజురాహో ఆలయాల విచక్షణత .రోలాండ్ భాషలో ‘’Distinct characteristic of Khajuraho temple archi tecture is that the temples stand on a lofty terrace and are not surrounded by usual enclosure walls ,proudly proclaiming their presence asif they had nothing to fear from iconoclasts ,vandals and marauders .The terrace or the lofty platform provides an outer pradakshina or open ambulatory on which the devotees can go round the temple .The shrines can be entered into only after ascending a number of stairs which lead to the portico or Ardha mandapa .Usually most of the temples except the Chaturbhuja temple and Lalgaun Madhav temple have their entrance from the east .these two have west entrance ..’

పెర్సి బ్రౌన్ అనే మరో విశ్లేషకుడు ‘’అర్ధమండపాలు మహా శిల్ప సౌందర్యం గల మకర తోరణాలతో విరాజిల్లాయి .ఇవి దంతపు నగిషీని  తలదన్నే శిల్ప విన్నాణాన్ని ప్రదర్శిస్తాయి .లక్ష్మణ ,కందరీయ ,విశ్వనాధ దేవాలయాలను ‘’పంచాయతన దేవాలయాలు ‘’అంటారు .పంచాయతన దేవాలయం అంటే గర్భ గుడిలో ఆ దేవాలయానికి చెందినా పెద్దదేవతా  విగ్రహంతో బాటు నాలుగు చిన్న విగ్రహాలు నాలుగు మూలలా ఉండటం .దేవాలయ నిర్మాణం అయిదు సోపానాల్లో ఉంటుంది .అర్ధమండపం ,మండపం అనే హాలు ,అంతరాలయం లేక గర్భాలయం ,మహా మండపం ,ప్రదక్షిణ సౌకర్యం కల దారి కలిగి ఉంటాయి .ఇందులో ప్రతి దాని శైలి భిన్నం గా నేఉండి శిల్ప శోభగల పైకప్పు ఉంటుంది .ప్రతి ఆలయం సంపూర్ణ కళా విలాసమై ఒకే తరహాలో కని  పిస్తుంది తప్ప దేనికది ప్రత్యేకం  ఉండక పోవటం ఖజురహో ప్రత్యేకత .’’ ‘’all these separate structure do not appear as an independent structures or buildings but are co-ordinated into a compact architectural synthesis ‘’

ఆలయ వివిధ భాగాలు ఒకదానికొకటి సంబంధం కలిగి కోరికను బహిర్గతం చేసేదానికి చిహ్నం గా ఉంటుంది టేర్రాస్ పై నిలువుగా గోడలు బాల్కనీలు లోపలి గృహాలు రెండు లేక మూడు సమాంతర శిల్పాలు ఆ పైన కప్పు ,ఇవన్నీ కలిసి అపురూప శిఖరావతారం దాలుస్తాయి .ఆమలక ఉంగరపు రూపు వస్తుంది చివరగా కలశాలు ,బాల్కనీ కిటికీలు ,వాటి గుండా కొద్దిగా  కాంతి ప్రసారం తో ఆలయం లోపల సగం వెలుగు సగం చీకటి గా చీకటి వెలుగుల రంగేళీ గా భాసిస్తుంది .గర్భ గృహం వెలుపల ప్రదక్షిణ మార్గం ఉంటుంది .ఈ మార్గం లో ఎన్నో శిల్పాలు మూడు అంతస్తులలో  దివ్య విభూతి తో దర్శన మిస్తాయి .ఇలా కందరియ ,లక్ష్మణ ,విశ్వనాధ  పార్శ్వనాధ దేవాలయాలలో ఉంటుంది .వీటిని ‘’సాం ధార  ప్రాసాదాలు ‘’అంటారు .పార్శ్వనాధాలయం లో రెండు గర్భ గ్రుహాలుంటాయి ఒకటి ఉత్తరానికి రెండోది దక్షిణానికి ఉంటుంది .చిత్రగుప్త ,జగదాంబా ,వామన ,జవారి దులాదేవ్ చతుర్భుజ ఆదినాధ ఆలయాలను ‘’నిరాధార ప్రాసాదాలు ‘’అంటారు .కారణం వీటికి ప్రదక్షిణ మార్గం లేక పోవటమే .పిరమిడ్ ఆకారపు ప్రత్యెక శిఖరాలు అర్ధ మండపం నుండి గర్భ గృహం వరకు పైకి వ్యాపించి ఉన్నతాశాయాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి .బెంజమిన్ రోలాండ్ దీనిపై స్పందిస్తూ ‘’The dominant impression of Khajuraho shrines is that of number of separate super structures ,each with its Amalaka and final ,building up a great mountain of masonry .The verticalism is emphasized through out from  the high base through the successive walls and roofs to the ultimate range of lesser peaks and constitute the main spire ‘’అని ఆ శిల్ప నిర్మాణ రహస్యాన్ని విప్పి చెప్పాడు .అతి విశాల హాలు పైన ఉన్న అతి పెద్ద శిఖరం ‘’సుకనాసం ‘(చిలుక ముక్కు)అనే స్తంభం కింది వరకు ఉంటుంది .సుక నాసమే చివరి బిందువు .ఒక సింహం పై కప్పును చూస్తూ ఉంటుంది .ముఖ్య శిఖరం ప్రక్కటెముకల సముదాయం గా అని పిస్తుంది ఇవన్నీ గుండ్రని కలశాలు  కలిగి ఉంటాయి .శిఖరం మీద శిల్పీకరించిన విగ్రహాలలో అనేక రీతులుంటాయి.అష్టభుజాక్రుతి కీర్తి ముఖాలుంటాయి .మొదలు వెడల్పుగా ఉండి పైకి సూచీలాగా తేలటం వీటి ప్రత్యేకత .సాలభంజికలు ,తీర్ధన్కరులవిగ్రహాలతో విరాజమానమవుతాయి ఒక్క క్షణం  కూడా దృష్టిని మరల్చటానికి వీలు లేనంత తన్మయ తన్మయ స్తితిలో చూస్తాం .ఆలయ లోపలి భాగాలన్నీ వాస్తు ననుసరించే ఉంటాయి .అంతరాలయం లో చంద్ర శిల గర్భాలయానికిదారి తీస్తుంది .లోపల రధాలు ,సలిలాన్తరాలు ముఖ్య దేవీ దేవతా విగ్రహాలతో పాటు చెక్కి ఉంటాయి నాగుల ,శార్దూలాలశిల్పాలు మహిమాన్వితం గా ఉంటాయి .ఆలయ పైకప్పు అంతా శిల్పకళా విరాజితమే .ఖజురహో దేవాలయ శిల్పా విన్యాసం ‘’నాగర ‘’శైలికి పరమోత్క్రుస్త ఉదాహరణ గా నిలిచింది ‘’khajuraho templearchi tecture was a marvel of the perfectly evolved Nagra style in which the counter pointed melodies of architecture and sculpture were held in a fine tune complex balance .The sculptor’s fine skill and a sense of imagination have given form to human emotion in the form of spiritual and physical love ‘’అని ఖజురహో ఆలయ శిల్ప కళా రహస్యాన్ని విడమర్చి చెప్పారు .

మరికొన్ని శిల్ప విశేషాలు మరో సారి

సశేషం

మీ– దుర్గా ప్రసాద్ -21-4-14-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నవ రాత్రి యాత్ర and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.