రాచకీయ ద్విప్లేట్స్ -24—ఎన్నికల బరి
1-ఇప్పటిదాకా ‘’రెడ్ కార్పెట్ ‘’వెల్కం తో హల్ చల్ చేసిన’’ కే.వి.పి .’’
ఇప్పుడు ‘’టైటానియం ‘’కేసు లో ‘’రెడ్ కార్నర్ ‘’తో అయ్యాడు ‘’ఉత్త వి పి.’’
2-రద్దయిన శాసన సభ
రాష్ట్ర పతి పాలన పెంచిన శోభ .
3-గవర్నర్ పాలన లోనూ అవినీతి ,వేధింపు ,డబ్బుపంపిణీ ,కుంభకోణాలు
ఎవరొచ్చినా చేదించలేని మాయా జాలం –విస్తరించింది బహు కోణాలు .
4-రాహులోచ్చి కెసిఆర్ పై సాగించాడు’’ దూకుడు ‘’
పార్టీని ‘’చిరు’’లా గంగలో కలిపేస్తే చేసే వాడా ఏకుడు?
5-అవినీతి ఆక్రమణల నేత ‘’పొన్నాల ‘’శిఖండి
అడ్డుపెట్టుకొని ఇదేమి వాచాలం అన్న ‘’గులాబి దండి’’.
6-మోడీ బాబూ ,పవన్ అయ్యారు బలే జోడీ
యువత ఆకాంక్షకు ,ఇదొక గొప్ప ‘’మోళీ మోడీ ‘’.
7-అయిదు సంతకాలతో రాత మార్చేస్తాడట ‘’జగన్’’
‘’తన రాతే’’ మార్చుకొంటాడు అనుకొంటున్నారు జనం .
8-తెలంగాణా కల సాధ్యం చేసింది’’ చెయ్యి ‘’అన్న ‘ప్రధాని మన్మోహన్ ‘’
పాపం ఆయన్ను చూసి ఓటేసే జనం ఉన్నారను కుంటున్నాడా’’ మౌన మోహన్ ?’’
9-కొత్తతరానికి ఇచ్చింది కాంగీ అవకాశం అన్న ‘’చిరు ‘’
‘’అన్న’’ తీరు చూసి చిందులేస్తూ పవన్ ‘’చిరు బురు ‘’.
10- మంత్రులూ ,భార్యలూ బస్సుల్లో తరలిస్తున్న ఎన్నికల ధనం
పట్టుకోగా మిగిలింది తిలాపాపం తలా పిడికెడు అయింది గెలుపు కు ’’ ఇంధనం’’ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-14-ఉయ్యూరు