రా’’చ’’కీయ ద్విప్లేట్స్-31(ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక )
1-ఎట్టకేలకు సీమాంధ్ర లో ఎన్నికలు ‘’పూర్తి’’
పీర్లు గుండాన పడి మిగిలింది ఇక ‘’ఆర్తి ‘’.
2-పులి వెందులలో ఎంపి ,ఏం ఎల్ ఏ అభ్యర్ధుల’’ అరెస్ట్ ‘’
జగన్ ప్రలోభాలు అవినీతి ,అడ్డగోలుతనం ఎక్కాయి’’ ఎవరెస్ట్ ‘’.
3-రాష్ట్రం లో రాష్ట్ర పాలన ‘’నాం కే వాస్తే ‘’
పట్టించుకోని నరసింహన్ కూడా అయ్యాడేమో ‘’కిమిం నాస్తి ‘’.
4-దేశ సమస్యల నివారణకు ‘’మోడిసన్ ‘’అన్న’’ రాజనాద్’’
ఈ మందు పని చేసి దేశానికవ్వాలి ఆయుర్వేద మందు ‘’వైద్యనాద్ ‘’.
4-‘’పబ్బం హరి’’ బరి నుండి తప్పుకొని వదిలేశాడు ‘’చెప్పులు ‘’
పాపం ఆశపెట్టుకొన్న కిరణ్ కుమార్ కు తెచ్చాడు ‘’తిప్పలు ‘’.
5-తెలుగు దేశం అభ్యర్ధిపై దాడి చేసిన’’ భూమన ‘’
ఇది టిటిడి దేవస్థానం అనుకోన్నాడా ఏమైనా ?.
6-పోలింగ్ శాతం తగ్గించేందుకు జగన్ పార్టీ’’కుట్ర’’
అని బయట పెట్టి ‘’బాబు’’ పెట్టాడు ‘’పులిమీద పుట్ర ‘’.
7—‘’రాయ పాటి’’ కారు పై జగన్ ముఠా ‘’దాడి ‘’
తెలిసి పోయిందా పోతున్నాడని’’ ఓడి?’’
8-అమేధిలో ‘’యువరాజు’’కు’’ గడ్డుకాలం ‘’
ద్వివేదియే చెప్పి ముగిసిన్దన్నాడు’’ రాహు కాలం’’.
9-ఫలితాల తర్వాత జగన్ ఎవరికైనా ఇస్తాడట’’ మద్దతు’’
అప్పుడే వ్యూహం మార్చి పెంచుకొంటున్నాడా ‘’ఇజ్జత్తు ‘’.?
10-వారణాసి లో ప్రచారం చేయనన్న’’ ప్రియాంక ‘’
వంక తప్ప చేయ్యటానికేం మిగిలింది బూడిద’’తప్ప ‘’ఇంక ‘’?
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-14-ఉయ్యూరు