రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )
1-బి జే.పి రాజకీయ చదరంగం లో సూత్ర దారి ‘’అమిత్ షా’’
దిగిపోయిన పరువును పైకెత్తి ప్రత్యర్ధులకు పెట్టాడు ‘’షా ‘’.
2- గుడ్డిగా కొడుకు కూతురు ,మేనళ్ళుళ్ళను వెనకేసుకొచ్చిన’’ కరుణానిధి ‘’
‘’జయ’’ చేతిలో కాటా దెబ్బతిని ఒక్క సీటూ లేక పాలయ్యాడు ‘’అధోగతి ‘’
3-మోడీ ని కాదని ‘’ హస్తం ‘’ఆలంబనం పొందిన ‘’నితీష్ ‘’
ఉన్నదీ ఉంచు కొన్నదీపోయి రాచకీయం గా అయ్యాడు ‘’మటాష్ ‘’
4-మధ్య ప్రదేశ్ ,రాజస్థాన్ గుజరాత్ లలో కాంగ్రెస్’’సున్నా’’
భస్మాసుర ‘’హస్తం ‘’పెట్టుకొన్న వారికి అంతేరా ’’ వెర్రి కన్నా ‘’ .
5-‘ నమ్మి ప్రచారం తో సహా అన్నీ అప్పగిస్తే ‘’చిరంజీవి ‘’
తన పార్టీ తో బాటు హస్తాన్నీ చంపి పారేసి చేశాడు ‘’మెగా ఫ్లాప్ షో’’.
6-కుటుంబం లోని నలుగురినే కాదు పార్టీని ముంచి తానూ మునిగాడు ‘’బొత్స’’
సోల్లూ ,పోల్లూ ,పని నిల్లూ,డబ్బు మందూ బెల్ట్ షాపులూ ఫుల్లూ తో ‘’చేతికి ‘’ఇచ్చాడు’’బొచ్చె ‘’
7-షీలా కొడుకు తో సభ్యులను కొట్ట్టించిన మధు యాష్కీ
పూర్తిగా ఓడి రెంటికి చెడ్డ రేవడై మధువు కోసం ఇష్కీ ఇష్కీ .
8-తల్లీ కొడుకుల రాజీనామా వద్దన్న దద్దమ్మ కాంగీ వర్కింగ్ కమిటీ
సిగ్గూ శరం లేకుండా మళ్ళీఅమ్మ కాళ్ళ మీద పడటం ఏమిటి ?
9-అంటకాగిన నితీష్ ను ఆదర్శం గా తీసుకో లేరా ?
మళ్ళీ పాత పాటే పాడి బుద్ధి తెచ్చుకోలేరా?
10- కత్తీ సుత్తీ ,కొడవలి మధ్య పోరాటం
ఇంకా బుద్ధి రాక సీట్ల కోసం ఆరాటం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-14-ఉయ్యూరు