పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29
ఆలివర్ గోల్డ్ స్మిత్
10-11-1728లో ఆల్వార్ గోల్డ్ స్మిత్ ఐర్లాండ్ లోని లాంగ్ గ్ ఫీల్డ్ లోని పల్లాస్ మోర్ లో జన్మించాడు .తండ్రి క్లేర్జిమన్ ట్రినిటి కాలేజి లో చేరి ,చదువు మీద శ్రద్ధ పట్టక ,విదూషకుడిగా అల్లరి చేస్తూ గడిపాడు .కర్క్ కు పారిపోయి ఆడామగా పిల్లలకు డాన్స్ లో వినోదం కల్పించాడు .కాలేజిలో మళ్ళీ చేరమని కోరితే చేరి తక్కువ మార్కుల తో డిగ్రీ ముక్కాడు .తర్వాత హోలీ ఆర్డర్ కు అప్ప్లై చేస్తే తిరస్కరించారు .సంపన్నకుటుంబం కు ట్యూటర్ గా కుదిరాడు .నిలవ లేక వదిలేసి ,ఒక స్కూల్ లో చేరి నీరస రొటీన్ కు విసిగి మానేశాడు .బాబాయి ఇచ్చిన యాభై పౌండ్లతో జల్సాగా గాంబ్లింగ్ లో పోగొట్టుకొన్నాడు .ఇంగ్లాండ్ వదిలి అమెరికా వెల్లి డాక్టర్ అవాలని అను కొన్నాడు .లేడేన్ లో క్లాసులకు హాజరై మెడికల్ డిగ్రీ సాధించాడు .తండ్రి వదిలి వెళ్ళిన చివరి పెన్నీ కూడా ఖర్చయి పోయింది .ఫ్రాన్స్ స్విట్జెర్లాండ్ లకు ఒకే ఒక షార్ట్ పాంట్ లతో చేతిలో ఫ్లూట్ తో కదిలి వెళ్ళాడు .డాన్సులు ఉత్సవాలలో తిరిగాడు .పూటకూళ్ళ ఇళ్ళల్లో వాయిస్తూ పోట్టపోసుకొన్నాడు .
ఇరవై ఆరు లో నిరాశ తో తిరిగి లండన్ చేరాడు .చిన్న పల్లె టూరిలో డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టినా రాణించలేదు .ఇండియా లో డాక్తర్ చేయాలనుకొన్నా అవకాశం రాలేదు .తప్పక రచయితా అయ్యాడు .ఏది కావాలంటే అది రాశాడు కాసుల కోసం .మారుపేర్ల తో పబ్లిషర్లు అడిగినవన్నీ రాశాడు అనువాదాలు లిటరరీ సర్వేలు చేశాడు .’’ది బీ’’పత్రిక కు ఎడిటర్ అయ్యాడు .వ్యాసకర్త గా పేరు తెచ్చుకొన్నాడు .దాదాపు డబ్బు లేకుండానూ ,డబ్బు చేతికొస్తే విచ్చల విడిగా తగలేస్తూ గడిపాడు .సామ్యుల్ జాన్సన్ తో పరిచయం ఏర్పడింది .ఏ కష్టమొచ్చినా ఆదుకొన్నాడు .డబ్బు ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలియ జెప్పాడు ‘’వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్’’నవల రాసి దాన్ని అమ్మి ఇంటి అద్దె బాకీ తీర్చాడు .వోల్టైర్ ,పార్నెల్ ,మొదలగు వారి చరిత్రలు రాశాడు .ఇంగ్లీష్ గ్రామర్ రాశాడు .నాటకాలతో అదృష్టం పరిక్షిన్చుకోవాలను కొన్నాడు ‘’దిగుడ్ నేచార్డ్ మాన్ ‘’,’’ది ట్రావెలర్ ‘’నాటకాలు రాశాడు .ఆరేళ్ళ తరువాత ‘’ది డిసేర్తెడ్ విలేజి ‘’నాటకం అమరుడిని చేసింది .
నలభై అయిదేళ్ళు వచ్చాయికాని చేతిలో పైసా నిలవటం లేదు .ఆరోగ్యమూ దెబ్బ తింది .మనసూ సరిగ్గా లేదు నలభై నాలుగేళ్ల వయసులో గోల్డ్ స్మిత్ 4-4-1774న చనిపోయాడు .రచనల్లో తన కష్టాలను ప్రతిఫలింప జేశాడు .ఆరాధన పొందిదింప లేక పోయాడు .వికార్ నవలా ఆయన జీవిత చరిత్రే .కవితలు ఆయన సాహిత్యం లో తక్కువ గానే ఉన్నాయి .’’I can not afford to court the draggle –tail muses –they would let me starve ‘’అన్నాడు .పోప్ తర్వాత దిట్రావెలర్ కవిత మంచి పేరు పొందింది .డేసేర్తేడ్ విలేజి పూర్తిగా వాస్తవికత ఉన్నదికాదు .ముచ్చ టైన కవి అన్నాడు వాషింగ్ టన్ ఇర్వింగ్ .ఆయన రాసిన విలేజ్ స్కూల్ మాస్టర్ ,విలేజ్ ప్రీచర్ ,విలేజ్ కవితలు అతని స్వంత ఐర్లాండ్ కు సంబంధించినవే .అందులో అమాయకత్వం వ్యక్తిత్వం కనీ పిస్తాయి .గోల్డ్ స్మిత్ మరణం తర్వాతా టెంపుల్ చర్చ్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్నేహితులు జాన్సన్ నాయకత్వం లో ఒక క్లబ్ ఏర్పాటు చేశారు లాటిన్ నుంచి జాన్సన్ అనువదించిన ‘’Oliver Gold smith –a poet naturalist ,and historian who left scarcely any style of writing untouched and touched nothing that he did not adorn ‘’of all the passions whether smiles ,were to be moved or tears a powerful yet gentle master .ingenius ,vivid ,versatile ,sublime .In style clear levated elegant ‘’అని రాసిన ఫలకాన్ని సమాధిపై అమర్చారు .
క్రిస్టఫర్ స్మార్ట్
గొప్ప మతాత్మక కవితాలు రాసి క్రిస్టఫర్ స్మార్ట్ చరిత్రలో నిలిచిపోయాడు జర్నలిస్ట్ గా ఉన్నా ఈ కవితలే రాశాడు .దివ్య స్వచ్చత కోసం రాశాడు .11-4-1722 ణ కెంట్ లోని షిప్ హార్న్ లో జన్మించాడు .తండ్రి స్తివార్డ్ గా ఒక చిన్న ఎస్టేట్ యజమాని గా ఉన్నాడు .తండ్రి చని పోయిన తర్వాతా పదకొండేళ్ళ వయసులో వేన్ ఫామిలీ ఇతన్ని రేబీ కాజిల్ కు తీసుకొని వెళ్ళారు .కౌన్తెస్ ఆఫ్ విల్చేసా స్మార్ట్ తెలివి తేటలకు ముచ్చట పడి పాట్రన్ గా ఉన్నది .కావాల్సిన డబ్బు అంద జేసేది .నాలుగేళ్ళకే రైం తో కవిత్వం చెప్పాడు .పద మూడేళ్లకే ఒడ్ రాశాడు పద హేదేల్లకు పెంబ్రోక్ కాలేజి లో చేరాడు .ర్హేటరిక్ లో లెక్చరర్ అయ్యాడు .ప్రేమలో పడ్డాడు .ఆమె పై కవితలు రాశాడు .తాగుడుకు బానిస అయ్యాడు .క్లాసులో నిద్రపోయేవాడు .ఇరవై అయిదులో అప్పుల పాలయ్యాడు .ఇంట్లో నుంచి భయం తో బయటికి వెళ్ళే వాడు కాదు .కేంబ్రిడ్జి వదిలి లండన్ చేరి ప్రింటర్ పబ్లిషర్ న్యూ బెర్రీ కు సహాయం చేశాడు .బాల సాహిత్యం ప్రచురించే సంస్థ అది .అతని బంధువులమ్మాయిని పెళ్ళాడాడు .
‘’ఆన్ ది ఎటర్నిటి ఆఫ్ దిసుప్రీం బీయింగ్ ‘’రాసి సియాటన్ ప్రైజ్ పొందాడు .అయిదేళ్ళలో నాలుగు సార్లు ఈ బహుమతి పొందాడు .’’ది హిల్లియాద్ ‘’అనే హోమర్ రచన ఆధారం గా సెటైర్ రాశాడు .అనేక సంస్థలు అతన్ని గౌరవించాయి .స్మార్ట్ భ్రాంతి పూర్వక రచనలు ప్రమాదకరం అని జాన్సన్ అన్నాడు .శరణాలయం లో చేరాడు .అక్కడే గొప్ప కవిత రాశాడు .’’ఏ సాంగ్ టు డేవిడ్ ‘’అనే ఆశ్చర్యకర రచన చేశాడు .విడుదలైన స్మార్ట్ కు స్నేహితులు చందాలు వేసుకొని సాయం చేశారు .పని చేయలేక తాగుడు మానలేక అప్పులు తీర్చలేక అప్పుల అప్పారావు గా జీవించి కింగ్స్ బెంచ్ ప్రిజన్ లో ఖైదుపాలయ్యాడు .21-5-1771లో చనిపోయాడు
బ్రౌనింగ్ ఒక శతాబ్దం తర్వాతా స్మార్ట్ రచన్ అ ఆధారం గా ‘’సాల్ ‘’రాశాడు .స్వస్థత కోల్పోయిన మనసుతో ఇమేజేరీ కవితలు రాశాడు .సాంగ్ డేవిడ్ అనేక సార్లు ముద్రణ పొందింది మొదటి సారి చదివితే అర్ధం కాదు కాని చదివిన కొద్దీ అద్భుతం అని పిస్తాయి .ప్రక్రుతి పైనా జాతీయ భావ జాలం మీదా గొప్ప కవిత్వం రాశాడు .ప్రక్రుతి ఆరాధకుడు .జంతుజాలాన్ని ప్రేమించాడు images in A Song to David are related also to depictions of the Temple in Isaac Newton’s Chronology of Ancient Kingdoms Amended (1728), the John Bunyan‘sSolomon’s Temple Spiritualiz’d (1688), and to the Geneva Bible, these works were relied on by the Freemasons.[194]
Based on this theory, the first pillar, the Greek alpha, represents the mason’s compass and “God as the Architect of the Universe.”[195] The second, the Greek gamma, represents the mason’s square.[196] In addition, the square represents the “vault of heaven.”[193] The third, the Greek eta, represents Jacob’s ladder itself and is connected to the complete idea of seven pillars.[197] The fourth, the Greek theta, is either “the all-seeing eye or the point within a circle.”[197] The fifth letter, the Greek iota, represents a pillar and the temple.[198] The sixth letter, the Greek sigma, is an incomplete hexagram, otherwise known as “the blazing star or hexalpha” to the Freemasons.[198] The last, the Greek omega, represents a lyre and David as a poet..
థామస్ చాటర్టన్
కీట్స్ చేత ‘’దిమార్వేలేస్ బాయ్ ‘’అని పిలవ బడిన థామస్ చాటర్ టన్ ఒక పేద స్కూల్ మాస్టారబ్బాయి .చర్చి నీడలో బాల్యం గడిచింది .జననం 20-11-1752.ఎనిమిదేళ్ళవరకు అక్షరం ముక్క నేర్ఫ్వ లేదు .ఫ్రెంచ్ మ్యూజిక్ ,బైబిల్ మీద మోజేర్పడింది .పదో ఏట కవిత్వం అలవడింది .మేరీ రెడ్ క్లిఫ్ చర్చి లో ఒక గది లో ఉండిపురాతన గ్రందాల రాత ప్రతులను ,స్పెల్లింగ్ ల ను అధ్యయనం చేశాడు .’’దిరోమాంటే ఆఫ్ దిస్నిఘ్నేట్’’కవిత చదివి అసలు రచయితా ఎవరో తేల్చి చెప్పాడు .పది హేనేళ్ళా లో అందగాడైన ఈ కుర్రాడు రూమ్సీ ని ప్రేమించాడు బ్రిస్టల్ అటార్నీకి అసి స్టంట్ గా పని చేశాడు శ్రద్ధ చూప లేదు .’’దాడ్స్లీ ‘’రాసి పేరుపొందాడు ..ఇది బాగాపేల లేదు.హోరేస్ వాల్ పోల్ కు రాశాడు సహాయం చేయమని .మోసం జరిగిందని గ్రహించి న్యాయం చేసి మళ్ళీ ఆ జోలికి పోవద్దన్నాడు .
పది హేడేళ్ల్లప్పుడు లండన్ వెళ్లి ‘’రౌలీ’’ పోయెమ్స్ ,సాంగ్స్ ,డ్రమాటిక్ లిరిక్స్ ,అసంపూర్తి నాటకాలు రాశాడు ఒక నెలలోనే అరడజన్ మెగా జైన్లకు రచనలు చేసి పేరొందాడు .లండన్ మేయర్ స్పాన్సర్ గా ఉంటానని వాగ్దానం చేశాడు సేకరించి రాసిన పురాతన గ్రందాల ముద్రణ కు ఎవరూ ముందుకు రాలేదు .మేయర్ చనిపోవటం తో స్నేహితులకు ముఖం చూప లేక పోయాడు .చలి ఆకలి తో అలమటించాడు .హాల్ బారన్ గారేట్ కు చేరి బయటికి వచ్చేవాడు కాదు .తల్లికి భార్యకు సంతోషం గా ఉన్నట్లు పోజు పెట్టేవాడు .ఎవరైనా ముందుకొచ్చి డబ్బు ఇస్తామంటే అగౌరవం అని భావించేవాడు .రచన , జర్నలిజం తో బతక లేనని నిర్ధారించుకొన్నాడు .ఆఫ్రికా షిప్ ట్రేడింగ్ లో స్థానం సంపాదించాడు .
24-8-1770లో ఇంటి యజమానురాలు ఇతను చిన్న రొట్టె ముక్కలు మాత్రమెవారం రోజులుగా బతుకుతున్నాడని తెలుసుకొని మంచి ఆహారం తీసుకొని అంద జేస్తే ఆకలి లేదని వద్దన్నాడు .అర్ధ రాత్రి ఒక రొట్టెల దుకాణానికి వెళ్లి అప్పుకు రొట్టె ముక్కలిమ్మన్నాడు .ఇవ్వనని వాడంటే జీవితం పై విరక్తి కలిగి ఎలుకలు చంపటానికి కావాలని’’ ఆర్సెనిక్ ‘’తెచ్చుకొని తినేశాడు .రెండు రోజులుగా రూము తలుపులు తెరచుకోక పోవటం తో లోపల తాళం వేసిన అ గది తలుపులు పగల కొట్టి లోపలి వెళ్లి చూస్తె చాటర్టన్ చనిపోయి ఉన్నాడు .అప్పటికి అతని వయసు పది హేడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమె .అతని చుట్టూ చినిగిన రాత ప్రతులెన్నో ఉన్నాయి .పాపర్ అయి చనిపోయాడుకనుక ఈ కవిని వర్క్ హౌస్ షూ లేన్ లో సమాధి చేశారు .
ఇతని కవితల్లో చాసర్ ,స్పెన్సర్ చాయలుంటాయి .పందొమ్మిదో శతాబ్దం వరకు ఇతని కవితలు ఆదరం పొందాయి .రొమాంటిక్ కవులు ఇతన్ని వెతికి పట్టుకొని పునర్జీవి ని చేశారు .కార్లైల్ ఇతని డార్క్ టోనేడ్ మ్యూజిక్ కు పరవశం చెంది ‘’కుబ్లాయ్ ఖాన్ ‘’లో వాడుకొన్నాడు .కీట్స్ ‘’ఎండిమేన్ ‘’లోఈ కవిని గురించి రాశాడు .మొదట ఆంగ్లం లో సాధారణం గా రాసి తర్వాతా రౌలీ విధానం లోకి మార్చాడని భావిస్తారు. కవితల్లో మనసులోని భావాలను సగమే చెప్పాడు . అనేక మేనరిజాలను ప్రయోగించాడు .ప్రతిభ ఉన్నా సమర్ధించి ప్రోత్స హించే వారు లేక దెబ్బ తిన్న కవి చాటర్టన్ .మరణం 24-8-1770 .మధ్య యుగానికి చెందినా అనేకమైన వాటికి అనుసృజన ,అనువాదాలు చేశాడు .పది హేనవ శతాబ్దికి చెందినా థామస్ రౌలీ అనే ఊహా జనిత సన్యాసిని తానుగా భావించి ఆ ధోరణి లో రాశాడు .చాటర్టన్ ‘’స్వాన్ సాంగ్ ‘’అని పిలువా బడే చివరి కవిత అందర్నీ కదిలించింది –
‘’awake awake o Birtha swotie mayde –‘’
చావు సీను
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-14-ఉయ్యూరు