చిన్నారి చైనా కధలు -4
చచ్చిన గుర్రం –తెలివి తేటలు
చైనా లో రాజ్యాల మధ్య క్రీ పూ.475-221కాలం లో అనేక యుద్ధాలు జరిగాయి .ఒక యుద్ధం లో యాన్ రాజ్యం ‘’క్వి ‘’రాజ్యం చేతిలో దారుణం గా ఓడి పోయింది .యాన్ రాజ్యానికి రాజుగా ఝావో పట్టాభి షిక్తుడుఅయ్యాడు .యుద్ధం లో పొందిన పరాభవాన్నుంచి మళ్ళీ విజయాన్ని చేకూర్చి తన దేశానికి గౌరవం కల్పించాలని నిశ్చయించి సైన్య బలాన్ని బాగా పెంచి గొప్ప శిక్షణ నిప్పించాడు .కాని తనకు అవసరమైన తెలివి తేటలు లేవని బాధ పడే వాడు . ఒక రోజు రాజు మంత్రిని పిలిచి తనకు మంచి తెలివి తేటలు ,సమర్ధతా రావటానికి ఏమి చెయ్యాలో చెప్పమని కోరాడు .అప్పుడు మంత్రి ఒక కద చెప్పాడు రాజుకు .
‘’ఒక రోజు ఒక రాజు గారు రోజుకు అయిదు వందల కిలో మీటర్లు పరి గెత్తె రెక్కల గుర్రానికి వంద ఔన్సుల బంగారం ఇస్తానని ప్రకటించాడు . అలాంటి గుర్రం కోసం వెతకమని ఒక దిని పురమాయించాడు .వాడు అనేక దేశాలు తిరిగి అందులో సగం బంగారానికి చనిపోయిన గుర్రపు బొమికలు కొని మూట కట్టుకొని వచ్చి రాజుకు చూపించాడు .రాజుకు చిర్రెత్తుకొచ్చింది .’’శాంతం భోషాణం ‘’అని వాడు ‘’అయ్యా ! చచ్చిన గుర్రానికే మీరు ఇంత బంగారం ఇచ్చికొన్నారు అని జనాలకు తెలిస్తే ,అది బాగా ప్రచారమై ,ఎవరి దగ్గరైనా మీరు కోరిన లక్షణాలు కల గుర్రం ఉంటె మన దగ్గరకే వాడు తీసుకొస్తాడు ‘’అన్నాడు .ఆతను చెప్పింది నిజమైంది . ఏడాదిలోపే అలాంటి గుర్రాలను మూడు తీసుకొచ్చారు .అప్పుడు వాడు రాజు గారితో ‘’మీరు నిజం గా అలాంటి తెలివి తేటలుకావాలని కోరుకొంటే ఆ చచ్చిన గుర్రం లాగా నన్ను ఎందుకు భావించ కూడదు ?’’అని అడిగాడు .
అతని తెలివి తేటలకు సంతోషించిన రాజు ఝావో ‘’గువో వి ‘’అనే అద్భుత సౌధాన్ని అతనికోసం నిర్మించి అందులో ఉంచి తనకు గురువుగా చేసుకొన్నాడు . అతిధులకు అనేక బహుమతులు అందించటానికి ఒక వేదిక నిర్మించి దానిపై వాటిని ఉంచే ఏర్పాటు చేశాడు .రాజు గారి నిజాయితీ త్వరలో దేశమంతా తెలిసి పోయింది .రెండేళ్ళ తర్వాత మహా వీరులు ,శూరులు అయిన ‘’జూ జిన్ ‘’ ‘’సూడాయ్’’,’’జౌ యాన్ ‘’,’’లి ఇ ‘’అనే వాళ్ళు దేశం వివిధ ప్రాంతాలనుంచి వచ్చి రాజు కొలువులో చేరారు .వీరందరి చేరిక వల్ల’’యాన్ రాజ్యం ‘’శక్తి సంపన్నమైనది .అరి వీర భయంకరం గా తయారైంది .’’క్వి రాజ్యం ‘’పై దండెత్తి ఝావో ఆ రాజును ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తాను పూర్వం పొందిన అవమానాన్ని పోగొట్టుకొన్నాడు .తన చిరకాల కల ను, వాంచితాన్ని నెర వేర్చుకొన్నాడు .కనుక శక్తి ,హంగూ ఆర్భాటాలు అన్నీ ఉన్న సరైన మార్గ దర్శనం చేసే వ్యక్తీ ఉంటేనే విజయాలు సాధ్యం అవుతాయి అని తెలియ జేసే కద ఇది .
స్కర్ట్ మహిమ
చైనా లో లయాన్ ఘాన్ పర్వత ప్రాంతం లో చైనీస్ యుఝి జాతికి చెందిన రెండు యువక బృందాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటానికి ఆయుధాలతో సర్వ సన్నద్ధం అయి ఉన్నారు .ఇంతలో ఒక మధ్య వయసు ఆవిడ లేసు ఉన్న స్కర్ట్ తో అక్కడికి వచ్చి ‘’స్కర్ట్’’ కదిలిస్తూ వాళ్ళ మధ్య నిల బడింది .ఇంత ధైర్యం గా తమ మధ్యకోచ్చిన ఆవిడ ఎవరా అని రెండు గ్రూపుల వాళ్ళూ ఆశ్చర్యం తో ఆగిపోయారు .ఆమె స్కర్ట్ ఊపుతూనే ఉంది బెదిరి పోకుండా .
ఆమె సాధారణ స్త్రీ మాత్రమె .ఏ అధికారం ఉన్నఆవిడా కాదు .ఆ యుద్ధానికి సిద్ధ పడిన రెండు గ్రూపులలో ఒక గ్రూపు వాళ్ళు తన భర్త గ్రామానికి చెందిన వారు ,రెండో గ్రూపు వాళ్ళు తన స్వగ్రామానికి చెందిన వారు ..’’యుఝి ‘’నియమాల ప్రకారం యుద్ధం చేసే రెండు గ్రూపుల మధ్యకు ఎవరూ వెళ్ళ రాదు. అలా వెడితే వాళ్ళను చంపెయ్యటమో బందీగా తీసుకొని పోవటమో జరుగుతుంది .కనుక ఎవరూ ఆ సాహసం చేయ్యారు .కాని ఈవిడ మొండిగా అడ్డు నిలబడింది .అదే అందరికి ఆశ్చర్యం గా ఉంది .సరిహద్దు దగ్గర పొలాల్లో పని చేసుకోవచ్చు బంధువులు,స్నేహితులు అవతలి వైపు గ్రామాలలో ఉంటె వెళ్లి పలకరించి రావచ్చు .యుద్ధం ఆపాలి అంటే ఆ గ్రామానికి చెందిన స్త్రీ ఎవరైనా సరి హద్దు వద్ద నిలబడి మధ్య వర్తిత్వం చేయ వచ్చు .అప్పుడు ఆమె చెప్పిన దాన్ని గౌరవించ వచ్చు . ఆవిడ మాటలను రెండు పక్షాల వారూ లెక్క చెయ్యక పొతే వారి మధ్యకు స్కర్ట్ వేసుకొని వచ్చి నిల బడ వచ్చు .వారు తన మాట వినక పోవటం వలన కలత చెందిన ఆమె అప్పుడు ఆమె తన స్కర్ట్ విప్పేసిగౌరవం దక్కించుకోవటానికి నగ్నం గా నిలబడి వారు చూస్తుండగానే ఆత్మ హత్య చేసుకో వచ్చు ..అలా జరిగితే యుద్ధం చేయాలని పట్టు బట్టే గ్రూపు ను నిందిస్తారు .రెండవ గ్రూపు లోకి జనం విపరీతం గా చేరి ఆ గ్రూపు బలాన్ని పెంచుతారు .అసలే అనేక యుద్ధాలు తగాదాలతో అతలాకుతలమైపోతున్న ఆ ప్రాంతం లో జనం అలాంటి స్త్రీల మాటకు అధిక గౌరవం ఇచ్చి పోట్లాట మానేసి శాంతిగా వర్ధిల్లుతారు .అదీ ఆమె’’ స్కర్ట్ ‘’ మహిమ .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-14-ఉయ్యూరు
.