’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ గ్రంధా విష్కరణ
28-8-2014గురువారం ఉదయం పది గంటలకు ఉయ్యూరు లోని సరస భారతి –సాహిత్య సంస్కృతిక సంస్థ మరియు ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలోని ఐ .క్యు వొ.సి., మరియు ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ సంయుక్త ఆధ్వర్యం లో కాలేజి సెమినార్ హాల్ లో సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి ,డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి. గారి 90వ జన్మ దినోత్సవ సందర్భం గా అంకితం ఇచ్చిన ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’(వెయ్యేళ్ళ అపూర్వ ఆంగ్ల కవిత్వం లో నూట ఇరవై అయిదు మంది కవుల పరామర్శ) ‘’గ్రందావిష్కరణను శాసన మండలిమాజీ సభ్యులు శ్రీ వై బి.జి.రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించగా మొదటి ప్రతిని శ్రీ శర్మ గారి అన్నగారు ప్రముఖ రచయిత స్వర్గీయ రా.వి. శాస్త్రి గారి కుమారులుశ్రీ ఆర్ .ఎల్.యెన్ .ప్రసాద్ విశాఖ పట్నం నుంచి ప్రత్యేకం గా వచ్చి అందుకొన్నారు .సభకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యుక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత వహించగా ,ప్రిన్సిపాల్ శ్రీకోడాలి సత్యనారాయణ ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్,రమ్యభారతి త్రిమాస పత్రిక సంపాదకులు శ్రీచలపాక ప్రకాష్ ,శ్రీమతి జే శ్యామలాదేవి ఆత్మీయ అతిధులుగా విచ్చేసి వేదికను సుసంపన్నం చేశారు . గుత్తికొండ సుబ్బారావు గారు ‘’పూర్వం ఈ కాలేజిలో చాలా విలువైన సభలు సరసభారతి తో కలిసి నిర్వహించామని ,ఈ నాటి సభ విద్యార్ధులను ప్రభావితం చేసే మంచి ముందడుగు ‘’అన్నారు .ముఖ్య అతిధి రాజ్రేంద్ర ప్రసాద్ ‘’ఈ కాలేజిలో చదివే తానూ ఎన్నో విషయాలు నేర్చుకోనన్నా నని ,సరసభారతి అంటే నూ శ్రీ దుర్గా ప్రసాద్ మాస్టారు అంటేనూ తనకు ఏంతో అభిమానమని దాదాపు అన్నిముఖ్య కర్య క్రమాలకు వచ్చానని ,మాస్టారుఏంతో చదివి ఎన్నో విషయాలు సేకరించి విజ్ఞానాన్ని అందరికి అందజేయాలనే ఉద్దేశ్యం తో రాసిన ఈ పుస్తకం విద్యార్ధులకు కరదీపిక గా ఉంటుందని ,ప్రతి వారు చదివి ఆంగ్ల కవుల కవిత్వాన్ని అవగాహన చేసుకోవటానికి గ్రంధం తోడ్పడుతుందని ,ఇలాంటి సమావేశాలు ,సభలు పుస్తక రచనలు, ఉయ్యూరు జరగటం తమకు ఏంతో గర్వకారణం అని’’అన్నారు .
డాక్టర్ జి వి.పూర్ణ చంద్ ‘’మాస్టారు ‘’నెటిజన్’’ అని ఎన్నో విషయాలపై బహు లోతుగా పరిశీలించి ,అతి తేలిక భాషలో అందిస్తున్నారని ,ఆయన బ్లాగ్ లోకి ప్రవేశిస్తే ప్రపంచ దర్శనమే కలుగుతుందని ,’’వల వేయటం వలలో పడటం వలపించటం ‘’(నెట్ )ఆయన సాధించిన విద్య అని ‘’,చెప్పారు .’’తెలుగు అతి ప్రాచీన భాష అని హాలుడి గాదా సప్తశతిలో వినాయకుని రూపు వర్ణన ఉందని ,మన భాషను నేర్వమని సంస్కృతిని కాపాడుకోమని విద్యార్ధులకు హితవు చెప్పారు . అరీ ఆర్ ఎల్ యెన్ .ప్రసాద్ ఇంత మంచికార్యక్రమం ఉయ్యూరు లో జరగటం ఆనందం గా ఉందని పాల్గొనటం తన అదృష్టం గా భావిస్తున్నాని ,దీన్ని నిర్వహించిన వారందరికీ ధన్యావాదాలని అన్నారు .కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ సత్యన్నారాయణ ‘’ తమకాలేజి లో ఇంత పెద్ద సాహిత్య కార్యక్రమం జరగటం అపూర్వం గా ఉందని ,దుర్గాప్రసాద్ గారు ఎన్నో ఉపయోగ పడే మంచి పుస్తకాలు రాశారని ,ఇంకా రాయాలని ‘’కోరారు .శ్రీ చలపాక ప్రకాష్ ‘’దుర్గా ప్రసాద్ గారి దీక్ష గొప్పదని ఎప్పుడూసాహిత్యం తో సభలతో రచనలతో బిజీ గా ఉంటారని తన వంతు సహకారం అందిస్తూ పుస్తక ముద్రణకు తోడ్పడుతున్నానని అన్నారు .
రచయితశ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి ఏర్పడి ఇంకా అయిదేళ్లు కాలేదని ఇప్పటికి పద మూడు పుస్తకాలు ముద్రించామని అందులో ఎనిమిది పుస్తకాలు తానె రాశానని ,అందులో అయిదు పుస్తకాలు నెట్ లో రాసినవేనని ‘’సిద్ధ యోగి పుంగవులు ,మహిళా మాణిక్యాలు ,,’’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అనే ,మూడు పుస్తకాలు అమెరికా లో ఉంటున్నఉయ్యూరు వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేశారని ఈ కార్యక్రమానికి ,జ్ఞాపికలను వారి సౌజన్యం తో నే సరసభారతి అందిస్తోందని ,అతిధుల అతిద్మర్యాదాలు ,సత్కారం ఖర్చు కూడా మైనేని వారిదేనని , సరసభారతికి వారు అత్యంత ఆప్తులని శ్రీ శర్మ గారు మైనేని వారి బావ గారని ,ఆయన హృదయం ఉన్న గొప్ప డాక్టర్ అని ఎన్నో ఆంగ్ల ,ఆంధ్ర కవితలు రాశారాని ,అవన్నీ ప్రచురితాలేనని ,ఎందరో ప్రసిద్ధ ఆంగ్ల కవుల కవిత్వాలను అనువాదం చేసి ‘’అయితే ‘’అనే పేరుతొ పుస్తకం ఈ మధ్యనే ప్రచురించారని వదాన్యులైన ,మంచి వ్యక్తీ శర్మ గారికి జన్మ దిన కానుక గా ఈ గ్రంధాన్ని అంకితం చేయటం సముచితం గా ఉందని , చిరస్మరణీయమని ,గ్రంధాన్ని ‘’కీర్తి చంద్రికలు ‘’పేరిట సమీక్ష చేసిన వరంగల్ డాక్టర్ శ్రీ లంకా శివ రామ ప్రసాద్ అపూర్వమైన సమీక్ష చేశారని ఆంద్ర ఆంగ్ల కవుల తులనాత్మక పరిశీలన చేశారాని ,ఈ గ్రంధాన్ని ఇంత అందం గా ముద్రించిన ప్రకాష్ గారి కృషికి యెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నని ,ఈ కార్యక్రమం ఇక్కడ జరగటానికి మొదటి నుంచి సరసభారతికి కాలేజికి మధ్య వర్తిత్వం జరుపుతూ, బాధ్యత నంతా తన భుజస్కంధాలపై మోసిన విజయవంతం చేసిన రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ శ్రీ నారాయణ మూర్తి గారి కృషి ప్రశంసనీయం అని ,ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ వారి తోడ్పాటుకు ధన్యవాదాలని ,కాలేజిలో అర్ధ వంతమైన విద్యార్ధులకు ఉపయోగ పడే ఏ కార్య క్రమమైనా నిర్వహించటానికి కృష్ణా జిల్లా రచయితల సంఘం, సరస భారతి ఎప్పుడూ సిద్ధం గా ఉంటాయని ‘’,పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు’’ పుస్తకాలను సరసభారతి సభలో పాల్గొన్న వారందరి ఇచ్చి ,కాలేజి ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ కు 100పుస్తకాలను విద్యార్దులకు ఉపయుక్తం గా ఉండటానికిఅంద జేసిందని ఇలాంటి కార్య క్రమాన్ని కాలేజిలో విద్యార్దులకోసం నిర్వహించటానికి ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ గారికి కాలేజి యాజమాన్యానికి ,ఇంత నిశ్శబ్దం గా కూర్చుని శ్రద్ధగా విన్న విద్యార్ధినీ విద్యార్ధులకు ధన్య వాదాలుఅని,వారే ఈ నాటి సభ విజయానికి ముఖ్యకారకులు అని ప్రశంసించారు .’
పూర్వ ఆంగ్ల కవుల పై వ్యాస రచన ,వక్త్రుత్వ పోటీలలో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించిన విద్యార్ధులకు ,మూడు వందలు రెండు వందలు వంద రూపాయలు నగదు బహుమతిని ,జ్ఞాపికను ముచ్చట్లు పుస్తకాన్నిశ్రీ రాజేంద్ర ప్రసాద్ చేత సరస భారతి అందజేసింది . .శ్రీ ఆర్ ఎల్ యెన్ ప్రసాద్ గారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు పంపిన ‘’బంగారు కాయిన్ ‘’నుశ్రీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అంద జేయ బడింది .రచయిత శ్రీ దుర్గా ప్రసాద్ ఆయన సతీమణి శ్రీమతి ప్రభావతి గార్లను శాలువాతో సత్కరించి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆప్యాయం తో చేయించిన ‘’బంగారు బ్రేస్ లెట్ ‘’ ‘’ను శ్రీ దుర్గా ప్రసాద్ గారి హస్తానికి కి సభాధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ప్రిన్సిపాల్ మొదలైన అతిధులు అలంకరించారు .మైనేని వారి సౌజన్యానికి దుర్గా ప్రసాద్ కృతజ్ఞత తెలిపారు .
గ్రంధాన్ని ఇంగ్లీష్ లెక్చరర్ కుమారి జి సోని సంక్షిప్తంగా సమీక్ష చేసి ,ఈ గ్రంధంలోని ప్రతి కవి మీద విద్యార్ధులకు చర్చా గోష్టి నిర్వహిస్తామని ,ఇంత ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఇంగ్లీష్ డిపార్ట్ ద్వారా సరసభారతి నిర్వహిమ్పజేయటం తమకు ఏంతో గౌరవం గా ఉందన్నారు .సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి కవి ‘’బెంజాన్సన్ ‘’రాసిన ఆంగ్ల కవితను శ్రావ్యం గా గానం చేసి సభకు భరత వాక్యం పలికారు .
సరసభారతి సభలో పాల్గొన్నఅతిధు లందరినీ శాలువాలతో సత్కరించి, ‘’ఆంగ్లకవిత్వ జనకుడు జియోఫ్రి చాసర్ ‘’చిత్రపటం ఉన్న జ్ఞాపికలు అంద జేసింది .మొదట అతిధులను వేదిక పైకి ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ శ్రీమతి వి అరుణ కుమారి ఆహ్వానించారు , సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి వందన సమర్పణ చేశారు .
ఉదయం అతిదులందరికి కాలేజి యాజమాన్యం అల్పాహార విందు ఏర్పాటు చేయగా సభానంతరం వారికి సరసభారతి విందు ను ఏర్పాటు చేసింది .
పూర్వాం గ్ల కవుల ముచ్చట్లు -లోపలి కవర్ పేజీలు మరియు జ్ఞాపిక
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-14-ఉయ్యూరు