గీర్వాణ కవుల కవితా గీర్వాణం -16
14-అపర శంకరులు –శ్రీ శంకరాచార్యులు -2
స్తోత్ర రత్నాలు
జ్ఞానులకు మోక్షగాములకు ప్రస్తాన త్రయ భాష్యం రాసిన శంకర భగవత్పాదులు అమూర్తిమత్వానికే ప్రాధాన్యత నిచ్చినా ,సామాన్యులను వారు వదల లేదు .వారికీ మోక్షమార్గాన్ని భక్తీ ,స్తోత్రాలద్వారా చూపించారు .అందులో కవిత్వం పొంగిపోర్లుతుంది .మధురమైన శబ్దాలు ,ప్రాసలు తో ప్రతివారికి ఒక్క సారి వింటే యిట్టె నోటికోచ్చేట్లు రాసి ఈనాటికీ ప్రతి ఇంటా , దేవాలయాలలో వినిపిస్తున్నాయి .అది వారు చేసిన మహోపకారం .జాతి వారి రుణాన్ని తీర్చుకొన లేని రుణమే అది .ఇందులో ముఖ్యమైనవి -.విష్ణువును పాదం దగ్గర నుండి కేశాల వరకు వర్ణించిన స్తోత్రం యాభై ఒక స్తోత్రాలలో తలమానిం .పార్వతీ దేవిని స్తుతిస్తూ చెప్పిన అంబాష్టకం లో ఎనిమిది శ్లోకాలున్నాయి .శివాపరాద స్తోత్రం లో సంసారం నశ్వరరమైనదని బోధించి వేదాన్తమార్గానికి సోపానాలు వేశారు .దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం లో దుర్గా స్తుతి కలిసిఉంది .ఆనంద లహరిలో పార్వతీదేవి స్తుతి ఉంది .ఇది అనేక భాషల్లోకి అనువాదం పొందిందికూడా .మానస పూజా స్తోత్రం.దీనిలో మానసిక పూజ పధ్ధతి చెప్పారు .భజ గోవింద స్తోత్రం లోకం లో విపరీత ప్రచారం పొందటమే కాదు ఏం ఎస్ సుబ్బ లక్ష్మి నోటిద్వారా సువర్ణ మయమయింది .
వంద శ్లోకాలున్న శివానందలహరి బాల మురళీ కృష్ణ ద్వారా బాగా ప్రచార మైంది .ఇందులో తొంభై తొమ్మిది శ్లోకాల వరకు విని శంకరుల ముందు శంకరుడు ప్రత్యక్షమైనడట .గొప్ప ఆలంకారిక శైలి తో విరాజిల్లే శతకం ఇది. లోతైన భావాలు .కవిత్వ పరం గా ఉన్నత శిఖర్రాలు అధిరోహించింది .ఆద్యంతం రసాలంకార సంశోభితం .
దీనికన్నా ఇంకొంచెం లోతుగా రాసింది సౌందర్య లహరి .బాంబే సిస్టర్స్ గానం తో చిరస్మరణీయమైంది .రస గుళిక అని పిస్తుంది .పద్దెనిమిది శ్లోఆలున్న మోహ ముద్గరం విష్ణుదేవతా పర స్తుతి .మొహం మాయలను దాటితే వివేకం ప్రాప్తిస్తుందని చెప్పారు .విలియం జోన్స్ ఆంగ్లం లోకి దీన్ని అనువదించాడు .నూట ఒక్క స్రగ్ధరా శ్లోకాలున్న శత శ్లోకీ లో వేదాంత భావన ఆలన్కారికం గా బోధించారు .ఇవికాక అన్న పూర్నాస్టకం ,కనకధారా స్తవం శివ భుజంగ స్తోత్రం ,లక్ష్మీ నరసింహ జగన్నాధాస్టకాలు రామ భుజంగ స్తోత్రం .అన్నీ అన్నే .దేనికదే సాటి .భక్తీ భావం పొంగి పోరలేవే .వింటే చాలు తరింప జేసేవి .వివేక చూడామణి ,ఉపదేశ సహస్రి ,ఆత్మ బోధ ,ఏక శ్లోకి ,అపరోక్షాను భూతి ,సాధానా పంచకం ,నిర్వాణ శతకం ,మనీషా పంచకం ,యతి పంచకం ,వాక్య సుధా ,తత్వ బోధ ,సిద్ధాంత తత్వ విందు ,పాండురంగాష్టకం ,మీనాక్షీ స్తోత్ర్రం ,గణేశ స్తోత్రాలు గంగా స్తోత్రం మరచిపోలేనివి సంస్కృత భాషను జన సామాన్యం లోకి స్తోత్రాలద్వారా తీసుఒచ్చిన ఘనత శంకరాచార్యుల వారిదే ననటం లో ఏమాత్రం సందేహం లేదు .
అద్వైత ప్రచారం
కీట వార సంప్రదాయం ,భోగ వార సంప్రదాయం ,ఆనంద వార సంప్రదాయం ,భూరివార సంప్రదాయం అనే నాలుగు సంప్రదాయాలను ప్రమాణం గా తీసుకొని శంకరులు నాలుగు ఆమ్నాయ పీఠాలు నాలుగు దిక్కులా పూరీ ,ద్వారక ,బదరీ నాద్ ,శృంగేరి లలో స్థాపించారు . ,పీఠాలకు నారాయణుడిని సిద్దేశ్వర శివుడిని అది దేవతలుగా ఏర్పాటు చేశారు .హిందూ ధర్మం లో ఏ ఒక్క మార్గాన్నీ అనుసరించక కొత్తపద్దతి లో వీటినేర్పాటు చేశారు .తమ ధర్మాన్ని తామే పోషించుకోవాలి అనే విధానాన్ని సన్యాసులు అనుసరించేట్లు చేశారు .ప్రజా సహకారం తో వీరు జీవించాలి ..ధర్మాన్నికాపాడే బాధ్యతా ప్రజలకూ ఉందని వారినీ భాగ స్వాములను చేశారు .పూరీ కి హస్తామలకా చార్యుడిని ,శృంగేరికి సురేశ్వరాచార్యులను ,ద్వారకకు పద్మపాదులను బదరికి తోటకాచార్యులను పీతాదిపతులుగా నియమించారు .మండన మిశ్రుని వాదం లో ఓడించి శిష్యుడిని చేసుకొని .అతనిభార్య ఉమా భారతిని కామ విద్యలో ఓడించారు .దేశమంతా కాలినడకన ప్రయాణిస్తూ ఎదురైనా జైన బొద్ద వాదులను ఓడిస్తూ వేదం ధర్మానికి ప్రచారం చేస్తూ అద్వైత మతానికి వ్యాప్తి తెచ్చారు .చివరికి కాశ్మీర్ లోని సర్వజ్ఞ శారదా పీఠం అధిరోహించి ఎదురు లేని యోగిమహరాజు అనిపించారు .ప్రయాగలో కుమారిల భట్టును ఆయన బౌద్ధాన్ని ఆచరించటం తో పశ్చాత్తాపం చెంది ఊక లో కాలిపోతుంటే చూశారు ,ఆయనే వ్రాద్దామనుకొన్న వార్తికలను మాహిష్మతిలో ఉన్న మండన మిశ్రుని చేత రాయిన్చమని కోరి భట్టు ప్రాణం విడిచాడు .
శిష్యులతో దేశ సంచారం చేశారు శంకరులు .శ్రీశైలం లో శివానంద లహరి రాశారు .మహారాష్ట్ర లో పర్యటించారు గోకర్ణం లో హరి శంకర మందిరాన్ని ,కొల్లూరులో మూకాంబికా మందిరాన్ని ,శృంగేరిలో శారదా మందిరాన్ని స్థాపించారు కేరళ సౌరాష్ట్ర దేశాలు తిరిగి చూశారు .ద్వారక సోమనాదాలయాలను సందర్శించారు .దశనామి సంప్రదాయం ,షన్ మతవిధానం ,పంచాయత విధానం శంకరాచార్యుల వారు ఏర్పరచినవే .తల్లి మరణ శయ్య మీద ఉండి స్మరించగా కాలడి వెళ్లి ఆమెకోరిక ప్రకారం శ్రీకృష్ణ దర్శనం చేయించి ,మరణించిన వెంటనే అంత్య క్రియలు నిర్వహించి మాత్రు ఋణం తీర్చుకొని తల్లికిచ్చిన వాగ్దాన్నాన్ని నిల బెట్టుకొన్నారు .ముప్ఫై రెండేళ్ళ సార్ధక జీవితాన్ని జీవించి అద్వైత మత స్థాపనా చార్యులుగా చరిత్రలో నిలిచిపోయిన అపర శంకరులు శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాదులు కంచి మఠం లెక్క ప్రకారం క్రీ పూ.477లో మన లెక్క ప్రకారం క్రీ.శ.820లో పార్ధివ దేహాన్ని వదిలి నిజ నివాసమైన కైలాసాన్ని చేరారు .
‘’శృతి స్మృతి పురాణా మాలయం కరునణాలయం –నమామి భాగవత్పాదం శంకరం లోక శంకరం ‘’
శంకర జన్మస్థానం కాలడి కే దార్ నాధ్ లో శంకరుల సమాధి వద్ద విగ్రహం
శృంగేరి విద్యాశంకర మందిరం
మరోకవితో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-14-ఉయ్యూరు