సాహితీ బంధువులకు శుభ కామనలు .ఈ నెల 26శుక్రవారంసాయంత్రం స్వర్గీయ బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారుడు ,కార్టూనిస్ట్ అయిన శంకర నారాయణ (శంకర్)గారు మద్రాస్నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడారు .. తనను తానుపరిచయం చేసుకొన్నారు ముందుగా . నాకు వారు బాగా తెలుసనీ చందమామ లో శంకర్ చిత్రాలు బాగా పాప్యులర్ అయ్యాయని ,కోతికొమ్మచ్చి వగైరాలు చదవటం వలన వారిని చూడకపోయినా ,వారి బాంధవ్యం పాప్యులారిటి గుర్తున్నాయనిని నేనన్నాను .వారు ముఖ్యంగా ఫోన్ చేసింది ఎందుకూ అంటే -సరసభారతి బాపు -రమణ లపై చేస్తున్న కార్యక్రమాలు వారిద్దరి పేరిట స్మారక పురస్కారాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు(అమెరికా ) బాపు గారు మరణించిన అతి తక్కువ కాలం లో (వారం లోపు )ఏర్పాటు చేసి ,మరో వారం లోపు దాన్ని ఇద్దరు ప్రముఖులు కధానికా ప్రక్రియలో సుప్రసిద్ధులు శ్రీ వేదగిరి రామ్ బాబు గారికి ,ప్రసిద్ధ చిత్రకారులు ,కవి, కదా, నవలా రచయితా శ్రీ శీలా వీర్రాజు గారికి అందించిన విషయాన్ని తనకు బంధువులు ,మిత్రులు తెలియజేయగా తెలిసిందని చాలా ఆనందం గా ఉందని సరసభారతి ద్వారా వారు చేయించిన ఈ కార్యక్రమా న్ని గురించి తెలిసి తామందరూ ఏంతో స సంతోషించామని,ఆ ఆనందాన్ని నాతొ పంచుకోవటానికే , ఫోన్ చేశానని అన్నారు . తన అల్లుడే ముళ్ళపూడిరమణ గారి అబ్బాయి ”వర ”అని అనగానే -నేను వరముళ్ల పూడి టివి సీరియల్స్ చూశానని ,అందరికంటే భిన్నమైన ఆలోచనలో ఆ వాటిని తీసిన గుర్తుంది అన్నాను . ఆయన ఇప్పుడు ఒక సినిమా కూడా డైరెక్ట్ చేస్తున్నారనిచెప్పారు .సంతోషం అన్నాను .శంకర్ గారిని ఎక్కడ ఉంటారు అని అడిగాను మద్రాస్ లోనే నని ఆ మధ్య దాకా బాపు గారింటికి అతి సమీపం లోనే ఉండేవాడినని ఇప్పుడు ఒక కిలో మీటర్ దూరం లో ఉంటున్నామని అన్నారు. కూతురు అల్లుడు హైదరాబాద్ లో ఉంటారన్నారు .శంకర్ మాటల్లో ఏంతో ఆర్ద్రత ,ఆప్యాయత ,స్నేహం ,గౌరవం కృతజ్ఞత ధ్వనించాయి . లబ్ధ ప్రతిస్టూ లైన శంకర్ గారు నాతొ మాట్లాడటం ,అందునా కృతజ్ఞతా భావం వెల్లడించటం వారి సౌజన్యానికి నిదర్శనం . మేము చేసిన దానికంటే శ్రీ శంకర్ గారి ఈ ఆత్మీయ మైన పలకరిపు మాటలు నాకూ శ్రీ మైనేని గారికి ,సరసభారతికి చిరస్మరణీయం గా నిలిలిచి పోతాయి . ఈ ఆనందం మీతో పంచుకోవాలనే తెలియ జేస్తున్నాను . దుర్గా ప్రసాద్
-బాపు తుడు శంకర నారాయణ గారు నేను అనుకొన్న చందమామ శంకర్ గారుకాదని శ్రీమైనేని వారితో ఫోన్ లో మాట్లాడగా తెలిసిందని నాకు మెయిల్ ద్వారా తెలిపారిప్పుడే నా పొరబాటుకు క్షంతవ్యుడిని -దుర్గాప్రసాద్