రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం
- -వెలుదండ నిత్యానందరావు
- 29/11/2014

శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ
ఉపన్యాసాలు- వ్యాసాలు
సంపాదకులు: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
వెల: రూ.150; పుటలు: 160
ప్రతులకు: వేమన అధ్యయన కేంద్రం
తాళ్ళకాల్వ గ్రామం,
గాండ్లపెంట మండలం
అనంతపురం జిల్లా- 515521
డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి యువకోత్సాహంతో సేకరించి ప్రచురించిన ఉపన్యాసాల వ్యాసాల సంకలనం ఇది. రాయలసీమ ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రకటించడం ఈ వ్యాసాల లక్ష్యం. 1929నుండి 1936 వరకు రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవాల్లో విద్వాంసులు చేసిన ప్రసంగాలను, సభల విశేషాలను హరినాథరెడ్డి శ్రీసాధన కౌమోదకి మొదలయిన పత్రికల్లో నుండి సేకరించి పునర్ముద్రించారు. అప్పటివారి భావజాలాలను, ఆ నాటి స్థితిగతులను ఎనబై ఎనిమిదేళ్ళుదాటి వచ్చిన పిదప ఉన్న స్థితిగతులను పోల్చిచూడడానికి ఇలాంటి గ్రంథాలు ఎంతో అవసరం. 1929-2014 మధ్యలో మద్రాసు నుండి విడిపోవడం, ఆంధ్రుల వ్యవహార సరళి పట్ల రాయలసీమవారి భయ సందేహాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, రాయలసీమవారే ఎక్కువ కాలం పరిపాలించినా రాయలసీమ క్షామం, దారిద్య్రం తొలగకపోవడం, తెలంగాణా కలవడం, దోపిడీకి గురికావడం, విడిపోవడం మొదలైన పరిణామాలెన్నో సంభవించాయి. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రత్యేకమైన భిన్నమైన మనస్తత్వాల, సాంస్కృతిక వైరుధ్యాల అపవిత్ర కలయిక ఆంధ్రప్రదేశ్. తెలంగాణ తన దారి తాను చూసుకొంది. ఇదే తరుణంలో పనిలోపనిగా రాయలసీమ కూడ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఉంటే బాగుండేదేమో! బైరెడ్డి రాజశేఖరరెడ్డి లాంటి ఏ ఒకరిద్దరో గొంతు వినిపించారు. కాని అది ఎందుకో పుంజుకోలేదు. భవిష్యత్తులో జరుగబోయే పరిణామమదే.
1926లో వప్పూరు రామాచార్యుల సంపాదకత్వంలో వచ్చిన శ్రీసాధన పత్రిక రాయలసీమ గొంతును బలంగా వినిపించింది. 1929-1932ల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వప్పూరు రామాచార్యులు, చిలుకూరి నారాయణరావు, రొద్దం హన్మంతరావు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కల్లూరి సుబ్బారావు, వార్త కవి రామచంద్రరావు, కడప కోటిరెడ్డి, నాగపూడి కుప్పుస్వామయ్య, గార్లదినె్న సుబ్బారావు, అడవి లక్ష్మీనరసింహరావు లాంటి దిగ్గజాలు పాల్గొన్నారు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు పెనుగొండలో 1929 ఫిబ్రవరి 22న జరిగిన కృష్ణదేవరాయ జయంత్యుత్సవ సభలో అన్న మాటలకు నేటికీ ప్రాసంగికత ఉన్నట్లే ఉంది. నిన్నమొన్నటి వరకు రాయలసీమవారే ఆంధ్రులలో నుత్తములు. తూర్పునాటివారన్న యేవగింపు. వారు తండోపతండములుగ వచ్చి యిచట యాచన చేయుచుండెడు పేదలు. కృష్ణానది డెల్టా యేర్పడిన వెనుక వారైశ్వర్యవంతులైరి. మన తుంగభద్ర ప్రాజెక్టు యింకను విట్టి స్థితిలో నున్నదో తెలియదు (పుట.28). మొదటినుండి రాయలసీమ వారికి ఆంధ్రుల పట్ల అనుమానమే ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాపన దగ్గర గొడవ వచ్చింది. రాజధాని విషయమై తగాదా వచ్చింది. శ్రీ్భగ్ ఒప్పందం. ఇంతేగాక బళ్ళారి, హోసూరు లాంటి రాయలసీమ ప్రాంతాలు కర్ణాటకలో కలపడం రాయలసీమ చరిత్రలో క్షంతవ్యంకాని అంశం.
కేవలం కృష్ణరాయల సూచకంగా కాకుండా సంగమ వంశస్థాపకులైన హరిహర బుక్కరాయల నుండి ఆరవీటి వంశీయుడైన అళియరామరాయల దాకా పరిపాలించిన సీమనుద్దేశించి రాయలసీమ అని పేరు పెట్టారట. సీడెడ్ డిస్ట్రిక్ (దత్తమండలం) అన్న కర్ణకఠోరమైన అసభ్య అవాచ్య నామాన్ని తీసేయడానికి నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆనాటి పెద్దలందరు తీర్మానించి వ్యవహారంలోకి తెచ్చారు. (పుట.40). కృష్ణదేవరాయలకు సంబంధించిన అనేక విషయాలను చరిత్ర పుస్తకాలలో చదువుకోవచ్చు. ఆనాటి రాయలసీమ పెద్దల పేర్లను స్మరించుకొనే అవకాశాన్ని ఈ పుస్తకం కలిగ