సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు

సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు

andhraprabha –   Sun, 15 Feb 2015, IST

కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినపðడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటపðడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల పక్షపాతి. కృష్ణదేవయాలు సంస్కృత కవులను, ఇతర దేశభాషలలో కవిత్వం రాసే

వారిని కూడా సమాదరించాడు.

జయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో ఉత్తమోత్తమ పరిపాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు

పేరు పొందాడు. మహావీరుడిగానే కాక సంగీత, సాహిత్యాలకు పెద్దపీటవేసిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన పాలన కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1530 వరకు విజయనరగ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. భారతదేశంలో గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలొకరు. ఇతడు అపజయమెరగనివాడు. ఇతడు స్వయంగా గొప్ప విద్వాంసుడు. రాజనీతిజ్ఞుడు. ఇతడు రాసిన ‘ఆముక్తమాల్యద’ పాండిత్యానికి లోకజ్ఞతకు గొప్ప నిదర్శనంగా నిలిచింది. అనేకమంది విద్వాంసులను పోషించి గౌరవించాడు. ఏ విధంగా చూసినా భారతదేశ చరిత్రలో ఉన్నత స్థానం పొందాడు. మహామంత్రిగా ఖ్యాతి గడించిన తిమ్మరుసు అనేక పర్యాలు కుట్రల నుండి కృష్ణరాయలను కాపాడుతూ వచ్చాడు. కృష్ణదేవరాయల పట్ల తిమ్మరుసుకు అత్యంత అభిమానం ఉండెను. విజయ నగర కన్నడ తమిళం కూడా రాజుల చేత పోషించించబడి వర్ధిల్లింది. సాళువ, తుళువ ఆర్వీటి వంశాల పాలనలో తెలుగు భాషకు ఎనలేని గౌరవం పొందింది. విజయనగర రాజుల పాలన కాలంలో మొదటగా పేర్కొనదగినవాడు నాచన సోమన. ఇతనిని రెండవ బుక్కరాయల కాలం వాడిగా కొందరు నిర్ణయించారు. కాని శాసనాలలో విరుద్ధంగా ఉన్నవి. ఇతడు గొప్ప పండిత కవి. నాచన సోమునికి సర్వజ్ఞ బిరుదు కలదు. ఇది ఇతని పాండిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

సోమన ఉత్తర హరివంశంలో గొప్ప గ్రంథాన్ని రచించాడు. మొదటి దేవరాయల కాలంలో జక్కన అనేకవి విక్రమార్క చరిత్రను రాసాడు. దేవరాయలు సంస్కృత భాషను, కర్ణాటక భాషను కూడా సమాదరించి పోషించాడు. సాళువ నరసింహరాయలకు పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడు తాను రాసిన జెమిని భారతాన్ని అంకిత మిచ్చాడు. ఇతని కవిత్వం కొంత కఠినంగా ఉన్నా మిక్కిలి రమ్యమైనదని పండితుల చేత ప్రశంసలు పొందింది. సాలువ నరసింహరాయలకాలంలో అన్నమాచార్యుడు తిరుపతిలో నివసించి తన కృతులను రచించాడు.

విజయనగర రాజుల కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల యుగం అఖండ ఐశ్వర్యాతో అనుభవించెను. దానివవల్ల ప్రజలలో భోగలాలసత్వం పెరిగింది. రాజులు, సామంతులు మొదలుగా గలవారు శృంగారరస ప్రధానమైన ప్రబంధ రచనలను ప్రోత్సాహించారు.

కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినప్పుడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటప్పుడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల పక్షపాతి. కృష్ణదేవరాయలు సంస్కృత కవులను, ఇతర దేశభాషలలో కవిత్వం రాసే వారిని కూడా సమాదరించాడు. శ్రీకృష్ణదేవరాయలకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పేరుపొందిన కవులుండేవారు. ప్రబంధ పరమేశ్వరుడనదగిన అల్లసాని పెద్దన వీరిలో అగ్రగణ్యుడు. రాయలితనిని యాధ్రకవితా పితామహుడనే బిరుదునిచ్చి గౌర వించాడు. అల్లసాని పెద్దన రాసిన ‘మనుచరిత్రను’ శ్రీకృష్ణదేవ రాయలకు అంకిత మిచ్చాడు. మను చరిత్ర ఒక గొప్ప శృంగార ప్రబంధం. దీనిలోని కవిత్వం మృదుమధురంగా ఉండి చదువరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ మను చరిత్ర తరువాత వచ్చిన ప్రబంధాలకు దారి చూపించింది. నంది తిమ్మన తను రాసిన ‘పారిజాతాపహరణ’ను రాయలకు అంకితం ఇచ్చాడు. కృష్ణదేవరాయలు గొప్ప కవి. అతడు ఆముక్తమాల్యద అనే గొప్ప గ్రంథాన్ని రాసి కవిగా తనేమిటో నిరూపించుకున్నాడు. దీనికి విష్ణు చిత్తీయమనే మరో పేరు కూడా కలదు. ఆముక్తమాల్యద భక్తిరస ప్రధానమైన గ్రంథం. సమకాలీన జీవితమును కృష్ణదేవరాయలు పరిశీలించినంతగా మరెవరు పరిశీలించి ఉండక పోవచ్చు.

రాయల ఆస్థానలో లొల్ల లక్ష్మీధర పండితుడు ఉండేవాడు. ఇతను మొదట గజపతుల దగ్గర ఉండి తదుపరి విజయనగరానికి వచ్చినట్లుగా చెబుతారు. ఇతడు శివానంద లహరి అనే గ్రంథానికి వాఖ్యానం అలాగే దైవజ్ఞాన విలాసమను గొప్ప గ్రంథాన్ని రాసాడు. దైవజ్ఞాన విలాసమొక విజ్ఞానగని. రాయల విఖ్యాతమంత్రి తిమ్మరుసు గొప్ప సంస్కృత విద్వాంసుడు. అతడు అగస్త్య భారతానికి వ్యాఖ్యానం రాసాడు. తిమ్మ రుసు మేనల్లుడు నాదెండ్ల గోపన ప్రబోధ చంద్రోదయమను గ్రంథంపై టీక రాసాడు. విజయనగర రాజాస్థానానికి ఎందరో మత బోధకులు వచ్చి శాస్త్ర చర్చలు గావించేవారు. శ్రీకృష్ణదేవరాయలను ఆశ్రయించి ఎందరో కవులు, పండితులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆయన నుండి ఎన్నో బహుమతులు పోందేవారు. కవులను మిక్కి లిగా గౌరవించేవాడు. కృష్ణదేవరాయలు సాహిత్య చర్చల కోసం ‘భువనవిజయం’ అనే దానిని స్థాపించాడు. ఇందులో ఎందరెందరో కవులు పండితులు తమ పాండిత్య ప్రతిభను ప్రదర్శించేవారు. మత సంస్క ర్తలు విజయనగరాన్ని సందర్శించేవారు. అటువంటి వారిలో చైతన్యుడు, వల్లభా చార్యుడు వంటివారు ఉన్నారు. మాధ్వగురులగు వ్యాసతీర్థులు, విజయేంద్రులు, రామానుజ మతస్థులు డొడ్డయాచార్య, తాతాచార్య మొదలైనవారు విజయనగర రాజుల చేత అదరింపబడినారు. వ్యాసతీర్థుడు వేదాంతము, తర్కం వంటి విష యాలపై అనేక గ్రంథాలను రాసాడు. స్త్రీ రచయితలు కూడా విజయనగర రాజులచే గౌరవించబడినారు. వారిలో తిరుమలాంబ, గంగాదేవి మొదలైన వారు ఉన్నారు. తిరుమలాంబ వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రాసింది. గంగా దేవి మధురావిజయమనే గ్రంథాన్ని రాసింది. సాహిత్యంతోపాటు సంగీతం, నాట్యం వంటి కళలను కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆదరించి కళాకారులను గౌరవించాడు. శ్రీకృష్ణదేరాయలు వీణావాదాన్ని నేర్చుకొని దానిలో ప్రావీణ్యాన్ని సాధించాడు. కృష్ణుడను సంగీత విద్వాంసుడు కృష్ణదేవరాయలకు సంగీత గురువు. విజయనగర రాజుల కాలంలో శిల్ప కళ, చిత్ర లేఖనం ఎంతో ఆదరాన్ని పొంది అభివృద్ధిని సాధించాయి. ఎన్నోదేవా లయాలను నిర్మించారు. కృష్ణదేవరాయల భువన విజ యం పేరిట గొప్ప సభా భవ నాన్ని నిర్మించాడు. ఈ మంటపం గజాకారం గల స్థంభా లపై నిలిచి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం సాహిత్యానికి, కళలకు స్వర్ణ యుగం. అంతటి మహోన్నత పరిపాలకులు భారతావనిలో చాలా తక్కువ మందే ఉన్నారంటే అతిశ యోక్తికాదు. విశాల భూభా గాన్ని పరిపాలించి గొప్ప పరిపాలకుడిగా పేరుపొందాడు.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.