గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
4౦9’’ఘటికా శతగ్రంధ ఘటనుడు -చెంగల్వ కాళకవి !(1590-1673)
దక్షిణాంధ్ర యుగం లో తంజావూర్ రాజు రఘునాధ రాయలకాలం లోను విజయ రాఘవ రాయలకాలం లోను చెంగల్వ కాల కవి ఉన్నాడు రఘునాధుని ఆస్థానకవి కాలేదు ఆ గౌరవం విజయ రాఘవుడిచ్చాడు .పాకనాటి ఆరువేల నియోగి .తండ్రి వెంకటయ్య తల్లి కృష్ణాంబ.’’ఘటికా శత ఘంట గ్రంధ ఘటనుడు ‘’గా కీర్తిపొండాడు .ఓష్ట్య ,నిర్యోస్త్య మొదలైన నియమాలతో కవిత్వం చెప్పేవాడు .’’పరి హ్రుతేతర యుక్తిభాగనూతన కదా కధకుడు ‘’.భారత శాస్త్ర పారంగతుడు .విజయ రాఘవుని ఆస్తానకవియై అతనిపై ‘’రాజగోపాల విలాసం ‘’రాశాడు .రాజుకు పరమ మిత్రుడుకూడా .రాజుతో రానులతో వి౦దు లారగించేంత చనువున్నవాడు .చాలారాశాడంటారు కాని విలాసం ఒక్కటే మిగిలింది .సంస్క్రుతకవులలో భారవికి ఉన్న స్థానం కాళ కవికి ఉంది .
బొమ్మకంటి ఆప్పయా చార్యుడు పద్నాలుగవ శతాబ్దం చివరలో ఉన్నాడు .రేచర్ల సింగ భూపాలుని ఆస్థానకవి .అమరసింహుడు రాసిన ‘’అమరకోశం ‘’కు ‘’అమర కోశ వ్యాఖ్య ‘’రాశాడు .ఈ వ్యాఖ్య వలన ఇతనికి ‘’మారపోత ‘’అనే పేరొచ్చింది .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-15-ఉయ్యూరు