కోరి కొలువైన కైలాసవాసుడు

కోరి కొలువైన కైలాసవాసుడు

04/06/2015

విజయనగరాన్ని విజయరామ గజపతి పరిపాలిస్తున్న రోజులల్లో నండూరి వెంక మ్మ తనకున్న పొలాన్ని పండిస్తూ కాలం గడుపుతోంది. ఒకరోజు పండిన ధాన్యాన్ని పురిలో భద్రపరచింది. ఆ రోజు రాత్రి ఆమె కలలో శివుడు కనిపించి తాను వీరరాజేశ్వరునిగా ఆ స్థలంలో వెలుస్తున్నానని, ధాన్యపు పరిలో తన ప్రతిరూపమైన శివలింగం నీకు కనిపిస్తుందని వెంటనే దానిని బయటకు తీసి అదే స్థలంలోప్రతిష్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆ మరునాడు వెంకమ్మ ధాన్యపు పురిలో వెదికింది. ఆ ధాన్యపు పురిలో కాంతులీనుతూ శివలింగం కనిపించింది. వెంటనే వెంకమ్మ విజయరామ గజపతి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా తెలియచెప్పింది. మహారాజు ఒక మంచిరోజున వీరరాజేశ్వరస్వామిని ప్రతిష్టించారు. అనంతర కాలంలో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో వీరరాజేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి, గౌరీ శంకరులు ఉండటంతో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. 1978 సంవత్సరంలో మూడు కోవెళ్ళు దేవాదాయశాఖ అధీనంలోనికి వెళ్ళింది.
ఈ కోవెలలలో సీతారామస్వామి, జగన్నాథస్వామి పూజలు అందుకుంటున్నారు. వీర రాజేశ్వరస్వామికి ఇరువైపులా వినాయక సుబ్రహ్మణ్య స్వాములతోపాటు రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. మూడు కోవెళ్ళలో కొలువైన వీరరాజేశ్వరుని దర్శనం ముక్తిదాయకం.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.