గీర్వాణ కవుల కవితా గీర్వాణం
—
-477- సుశ్రుతుడు(6వ శతాబ్దం )
నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది .
సుశ్రుతుడు క్రీ.శ.ఆరవ శతాబ్దిలో జన్మించి నట్లు తెలుస్తోంది .ఈయన విశ్వామిత్ర మహర్షి కుమారుడని ,అంటారు ధన్వంతరి కి ముఖ్య శిష్యుడు .సుఖ ప్రసవం కోసం శాస్త్ర చికిత్స కూడా చేశాడు .మూత్ర పిండాలలో రాళ్ళను కూడా తొలగించే వాడు .విరిగిన ఎముకలు అతికించటం లో ,కంటి శుక్లాలు తొలగించటం లో కృషి చేశాడు .ప్లాస్టిక్ సర్జరీ ,రైనో ప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణం ప్లాస్టిక్ శాస్త్ర చికిత్సలో నిష్ణాతుడు
సుశ్రుతుడు శాస్త్ర చికిత్స మీద ‘’సుశ్రుత సంహిత ‘’ అనే బృహద్ద్ద్ గ్రంధాన్ని రచించాడు .ఇందులో నూటొక్క శాస్త్ర పరికరాలను పేర్కొన్నాడు .ఇది ఇప్పటి శాస్త్ర వైద్యానికి మణి దీపం గా నిలుస్తోంది .ఈయన ప్రక్రుతి ఆరాధకుడు కూడా .జంతు వృక్ష ప్రపంచం మీద ద్రుష్టి సారించి అమూల్య సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేశాడు .భిన్న ఋతువులలో వాతావరణ పరిస్తితులలో ఆరొగ్యాఆఆఆఆఆమ్ గా ఎలా ఉండాలి అన్న వాటిని వివరించాడు .
ఒక సారి ఒక ప్రయాణీకుడు అడవి గుండా వెడుతుంటే ప్రమాద వశాన అతని ముక్కు తెగింది తెగిన ముక్కును చేత్తో పట్టుకొని దగ్గిరున్న సుశ్రుత ఆశ్రమానికి చేరాడు .ఆయన గమనించి ముందు నీతితో గాయాన్ని తుడిచాడు .దానికి మూలిక్కా రసం అద్దారు సెప్టిక్ కాకుండా .ఒక గిన్నెడు మద్యం తాగించాడు .ఆటను స్పృహ కోల్పోగానే సూక్షమమిన కత్తులతో సూదులతో శాస్త్ర చికిత్స చేశాడు .ఒక ఆకుతో ముక్కు కొలత కొలిచాడు చిన్న పడు నైన వేడి చేసిన కత్తి తో దవడ కంద లో కొంత భాగం కోసి దాన్ని సరిగ్గా కావాలసినంత గా రెండు భాగాలు చేసి ముక్కు పుతాలలో అమర్చాడు .ముక్కు ఆకారాన్ని సరి చేసి బియ్యపు పిండి ,గంధం తో పట్టు వేశాడు .దాని మీద బూరుగు దూది పెట్టి ,ఔషధ నూనె పోసి కట్టు కట్టాడు .రెండు రోజుల్లో ఆ వ్యక్తీ తేరుకొన్నాడు .అతడు ఏ ఏ ఆహార నియమాలు పాటించాలో ఏయే మందులు వాడాలో సూచించాడు సుశ్రుతుడు .
సుశ్రుత సంహిత గ్రంధాన్ని ఎనిమిదో శతాబ్దిలో అరెబిక్ భాష లోకి ‘’కితాబ్ పాశూన్ –ఏ –హింద్ ‘’,కితాబ్ –యి –సుసృద్ ‘’పేరా అనువదించారు .విరిగిన ఎముకలను సరి చేయటానికి అనేక రకాలైన కర్ర బద్దల్ వివరాలున్నాయి ఇదే‘’శల్య తంత్రం ‘’.మత్తు మందుగా మద్యాన్ని వాడే వాడు
పిస్తులా వ్యాధికి ‘’క్షార సూత్రా ‘’చికిత్స చేసే వాడు మొలలు నాదీ వరణం మొదలైన వాటికీ దీన్ని ఉపయోగించేవారు ఒక దారాన్ని తీసుకొని ఇరవై ఒక్క సార్లుక్షార ఔషధాలతో సమ్మిళితం చేయటాన్నే క్షార చికిత్స అంటారు దీన్ని వాడితే అయిదారు వారాలలో ఫిస్తులా మాయం .
అతి నైపుణ్యం గా శాస్త్ర చికిత్స చేయటానికి కొన్ని జంతువుల వెంట్రుకలను ,బాగా ఎదిగిన వెదురు బొంగులను ,కొన్ని ప్రత్యెక లక్షణాలున్న బెరడులతో చేసిన కుంచెలను ఉపయోగించేవాడు .సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం వీలున్నా పూర్వ కర్మ చికిత్స అంటే ‘’ఫిజియో తెరపి ‘’చేయాలని సూచించాడు .ఆయన వాడిన శాస్త్ర పరికరాల వివరాలనూ వివరం గా వర్ణించాడు తన గ్రంధం లో సుశ్రుతుడు ,చరకుడు చెప్పిన వైద్య విధానం క్రీస్తు పూర్వమే ఆగ్నేయ ఆసియా ఉత్తర ఆసియా ,మధ్య ప్రాచ్యాలలో బాగా వాడుక గా ఉంది చరిత్ర కారుడు ‘ఫరిస్తా ‘’రాసిన చరిత్రలో పదహారు ప్రాచీన భారత వైద్య శాస్త్ర గ్రంధాలు ఎనిమిదో శతాబ్దం నాటికే అరబ్బులకు పరిచయమైనాయి .
గర్భ ధారణా కు అనువైన ఔషధాలు యవ్వనోత్సాహానికి మందులు సూచించాడు ఆయన తయారు చేసిన ‘’ఫొర్ సేప్స్‘’,దిసేక్తింగ్ అండ్ డ్రెస్సింగ్ ఫొర్సేప్స్ ‘’ఈ నాటి శాస్త్ర చికిత్సా సాధనాలకు మార్గ దర్శకలయ్యాయి తెగిన ముక్కు పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించిన మహానుభావుడాయన .
మహా రాష్ట్ర లో పది హేనవ శతాబ్దం లోనే ఇటుకలు తయారు చేసే కాంగ్రా వంశీకులు ప్లాస్టిక్ సర్జరీ లో సిద్ధ హస్తులయ్యారు .ఈ కుటుంబాలలో హకీమ్ దీనా నద కుటుంబం ఇరవై వ శతాబ్దం లో ఈ చికిత్స చేసిన చివరి కుటుంబం .బ్రిటీష్ వాళ్ళు ఈ దేశం లో బాల పడిన తర్వాత ఈ చికిత్సా విధానాన్ని బ్రిటిష్ పాలకులు తెలుసుకొని 1794లో పాశ్చాత్య దేశాలకు తెలియ జేశారు ఇదంతా సుశ్రుత మహర్షి కృషి ఫలితమే .
478- కణాదుడు౯(క్రీ పూ .800)
ప్రపంచం లో ప్రతి పదార్ధం సూక్ష్మ కణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్ర వేత్త కణాదుడు .ఈతని తర్వాతే దేమాక్రటీ స్ అనే గ్రీకు శాస్త్ర వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కాన సముదాయం అని అంతకంటే చిన్న కణాలుగా విభజించటం కుదరదని చెప్పాడు .వీటినే అణువులు అన్నాడు గ్రీకు లో ఆటోమాస్ అంటే విభజించాతానికి వీలుకానిది అని అర్ధం .అనువులున్నాయని నిరూపించా లేక పోయాడు
కఠోపనిషత్తు లో ప్రపంచ పరిణామానికి జడ పదార్దమే కారణం అని ఉంది దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారం గా తీసుకొని మన వాళ్ళు వేరే మార్గం లో పయనించారు కపిల ,కణాదుల భౌతిక సిద్ధాంతం తర్వాత బౌద్ధం వచ్చింది తర్వాత జైనమతం హేతు వాదం తో వృద్ధి చెందింది .బౌద్ధ ,జైన శాస్త్ర వేత్తలు కనాడ కపిలులనే ఆధారం గా తీసుకొన్నారు .దేమోక్రాతిస్ కు ముందే కణాదుడు జన్మించాడు వైశేషిక దర్శనం లో ”అన్విక విశిష్టత ”ఉంది .వైషేశికం లో ఆధునిక శాస్త్ర వేత్త ”ఔలూక్యుడు ”.ఈ నాడు మనం చెప్పే శాస్త్ర వేత్త ,పరిశోధకుడు అనే పేర్లు ఆయనకే సరి పోతాయి ఆయనే కణాదుడు .డేమోక్రాటిస్ కు నాలుగు వందల ఏళ్ళ క్రితమే కణాదుడు పుట్టాడు .
”ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం ”నూతన అధ్యాయానికి దారి తీసింది .”అణు భక్షకుడు ”అని కణాదుడు పేరు పొందాడు .కణాదుడు అంటే కణాలు తినే వాడని అర్ధం .”అణుస్ ”అనే సంస్క్రుత్సపడమే ఆటం అయింది ఇంగ్లీషులో .సూదులను అయస్కాంతం ఆకర్షించటం ,మొక్కలలో జల ప్రసరణ జడం అనేది ఈధర్ లేక అయస్కాంతం లో ప్రసారం చేయటానికి ఆధారమవటం ,అన్ని రకాల వేడికి సూర్యుడు ,అగ్నియె కారణం ,భూమి అనువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనం కోన సాగటం అను విచ్చ్చ్చేడం ద్వారా విశ్వ ప్రళయం ,ఉష్ణ ,కాంతి కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించటం వల్లనే కణాలు అనూహ్య వేగం తో అన్ని వైపులకు దూసుకు పోతాయి (విశ్వ కిరానా సిద్ధాంతం ),దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటిని కణాదుడు స్స్పస్తం గా చెప్పాడు .
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణం అవుతుంది ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది .అనువుల్లో అంతర్భాగం గా ఉన్న సహజ భౌతిక శక్తి ,బహిర్గాతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు .ప్రపంచ సృష్టికి అణువులే కారణం .అణువులు గుండ్రగా ఉంటాయి .అణువులు ఒకదానినుంచి ఒకటి వేరైనప్పుడు కాని ,కదలిక లేనప్పుడు కాని ఏ పనీ జరుగదు అన్నాడు .అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణ మౌతాయి .కణాలు ఏర్పడటానికి అందులోని అణువులే కారణం .అణువులు ఎప్పుడూ చేతనా స్తితి లో ఉంటాయని కణాదుడు ఊహించ లేక పోయాడు .డిమొక్రటిస్ సిద్ధాంతాల కంటే కనాడ సిద్ధాంతాలు భౌతిక వాదాన్ని బాగా బల పరుస్తాయి .
”పరిమిటి గల పదార్ధం అనంత కోటి వస్తువులకు పదార్ధం కాజాలదు”అన్న వైషేశికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్ధం అనువు అనే నిర్ధారించింది .
కణాడునికి ఔలూఖ్య ,కాశ్యప అనే పేర్లున్నాయి క్రీ పూ ఆరవ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు .ఉత్తర ప్రదేశ్ లో అలహా బాద్ జిల్లా పభోస ప్రాంతం లో ప్రభాస లో కణాదుడు జీవించాడు ఆయనది ”పావురం జీవితం ”అన్నారు కొందరు .అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకొని తిని బతికాడని అర్ధం .చిన్న చిన్న రేణువులు అంటే కణా దులు మీద ఆధార పడిజీవించాడు కనుక ”కణాదుడు ”అని పించుకొన్నాడు .ఆయనకు ”కణ ”,కణ భూకర్ ,కణ భక్ష ”పేర్లు కూడా ఉన్నాయి ఈయన సోమ శర్మకు శిష్యుడు .”సూర్య కారణ సంబంధం ”అనే సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన వాడు కనాడుడే .”వైశేషిక సూత్రా ”రచయితా .ఇది పది గ్రందాల సంపుటి .ప్రతి గ్రంధం లో రెండేసి అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం లో అనేక సూత్రాలు ఉన్నాయి ప్రతి గ్రంధంలో కనీసం 370సూత్రాలుంటాయి .పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని వాటిని మళ్ళీ విభజించినా ఆ తర్వాత విభజించటం సాధ్యం కాదు అని చెప్పాడు
కణాద సిద్ధాతం ప్రకారం ఈ విశ్వం ఆరు స్తితులలో ఉంది ద్రవ్య ,గుణ ,కర్మ ,సామాన్య ,విశేష ,సమవాయ స్తితులు .పదార్ధాలు తొమ్మిది అస్తిత్వాలను కలిగి ఉంటాయి భూమి జాలం ,అగ్ని ,తేజ ,వాయు ఏఎధర్ ,కాలం ,అంట రిక్షం మనస్సు ,ఆత్మా ..కణాదుడు నిరీశ్వర వాదిడ చని పోయే ముందైన దేవుడిని ప్రార్ధించమని శిష్యులు కోరితే ”పీలవః”అని అన్నాడట .అంటే ”పరమాణువు ,పరమాణువు ”.అని అర్ధం .ఈయన భావనలో మనస్సు ఆత్మా రెండు ద్రవ్యాలే .ప్రతి ద్రవ్యం అణురూపం లోనే ఉంటుంది .స్పేస్ అండ్ టైంకూడా ద్రవ్యా లేనివని ఐ న్ స్టీన్ కాలాని కంటే ముందే కణాద మహర్షి చెప్పాడు నిరీశ్వర వాదికావటం వల్ల తగినంత ప్రచారం పొందలేక పోయాడు .