గీర్వాణ కవుల కవితా గీర్వాణం 479- ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్(1835-1904)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

479-  ఖగోళ శాస్త్ర వేత్త  పటాని సమంత్(1835-1904)

సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు పరి శోధన చేసి చెప్పక ముందే భారతీయులు ,చైనా వారు ,ఈజిప్షియన్లు గ్రీకులు చెప్పారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఖగోళ విజ్ఞానం అభి వృద్ధి లోకి రాక ముందే ,ఏ యూని వర్సిటి విద్య లేకుండా ,టెలిస్కోపులు కూడా లేని కాలం లో చేతి పరికరాల సాయం తో పరిశీలన చేసి గణన చేసి ఖచ్చితమైన విలువలను రాబట్టిన ‘’పటాని సామంత్ ‘’అనే ఖగోళ శాస్త్ర వేత్త ను అందరం మర్చి పోయాం .ఆయన పరిశోధనా ఫలితాలు ఈ నాటి వారిని అత్యాశ్చర్యం లో ముంచెత్తాయి ఈ మహాను భావుని పూర్తీ పేరు’’ మహా మహోపాధ్యాయ చంద్ర శేఖర సింగ్ హరి చందన మహా పాత్ర సమంత్.’’.1835డిసెంబర్ పద మూడు న ఒరిస్సా లో ‘’ఖండాపర ‘’ప్రాంతం లో జన్మించాడు .

 

చిన్న నాటి నుంచే విశ్వం ఖగోళం ,రాశులు మొదలైన వాటిపై ఆసక్తి ఉండేది .వీటిపై సంస్కృత గ్రంధాలు విస్తృతం గా చదివాడు .ప్రాచీన విజ్ఞానాన్ని ఔపోసన పట్టాడు .ప్రయోగ శీలిగా పరి వర్తన చెందాడు .సామాన్య కళ్ళ  తో చూడలేని‘’దనూ రాశి ‘’ని ఆరు శతాబ్దాల కిందటే భారతీయులు కానీ పెట్టారు .మిగిలిన రాశులను ఏ శాస్త్రీయ పరిజ్ఞానం తో గుర్తించారో ఈ రోజుకీ ఎవరికీ అంటూ బట్టటం లేదు .సూర్యుడు రాప్తాశ్వ రధా రూఢుడు అని మన వాళ్ళు వేలాది ఏళ్ళ క్రితమే గుర్తించి ఆయన లో ఏడు రంగులున్నాయని చెప్పగలిగారు

ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్త ‘’నేకల్స్హన్ మెర్లే ‘’కి కొన్ని వందల సంవత్స రాలకు పూర్వమే శ్రీ నాద మహా కవి‘’కాశీ ఖండం ‘’లో కాంతి వేగాన్ని ఎలా చెప్పగలిగాడో ఎవరికీ తెలియలేదు .అప్పటికి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్నే కవి చెప్పి ఉంటాడు .అలాగే ‘’సమంత్’’గారి పరిశీలనలకు గణన లకు మూలాధార మేమిటో తెలుసుకో లేక పోతున్నారు .ఖగోళ విజ్ఞానాన్ని భూకేంద్ర సిద్ధాంతం ,సూర్య కేంద్ర సిద్ధాంతాల ద్వారా తెలుసుకొనే వీలుంది .ఖగోళం లో జరిగే అపురూప సంఘటనలనుఆధారం గా చేసుకొని గణించే అవకాశం ఉంది ఫలితాలను సమీక్షించుకో వచ్చు కూడా .సంప్రదాయ పండితుడైన సమంత్ 1874 లో జరుగ బోయే ‘’శుక్ర గ్రహ సంక్రమణం ‘’అంటే శుక్ర గ్రహ ప్రయాణ మార్గం (ట్రాన్సిట్ ఆఫ్ వీనస్ )గురించి చాలాకాలం ముందే ప్రకటించాడు .

సమంత్ పరి శీలనకు జ్ఞానానికి కోపర్నికస్ తెచ్చిన ఖగోళ విప్లవం గురించి పరిచయం తెలియనే తెలియదు .అయినా 1874డిసెంబర్ తొమ్మిది నసంభ వించిన శుక్ర గ్రహ సంక్రమణం ఆయన చెప్పిన తేదీననే ఖచ్చితం గా జరిగింది .ఇది మన భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అద్భుత పరిశోధనా మిగిలి పోయింది సువర్నాధ్యాయమై వెలిగి పోతోంది .ఈ సంఘటన వ్యవధి సమయం ఆధారం గా భూమి –సూర్యుడి మధ్య దూరాన్ని గణన చేయటం ఏంతో ఆసక్తికర విషయం .ఆ నాటి బ్రిటిష్ పాలకులు కూడా ఈ పరిశోధనా ఫలితాన్ని ఆశ్చర్యం తో గమనించారు .ప్రభుత్వ ఆధ్వర్యం లో ‘’అబ్సర్వేటరి సెంటర్లు ‘’ప్రారంభ మైనాయి అంటే ఇది సమంత్ కృషి ఫలితమే అని గుర్తించుకోవాలి  పటాని సమంత గణించి ,నిర్ధారించిన ఖగోళ సంఘటన మళ్ళీ 2004జూన్ఎనిమిది న జరిగింది .ఈ రెండు సంఘటన పరిశీలనలు లెక్కలు పాశ్చాత్య శాస్త్ర వేత్తల కృషి కి ఏ మాత్రం తీసి పోవేమీ కాదు .ఇలా తనకున్న స్వంత చిన్న పరికరాలతో అమూల్య ఫలితాలను తెలియ జేశాడు .తన కృషిని అంతటిని ‘’సిద్ధాంత దర్పణ’’సంస్కృతంలో పొందు పరచాడు .ఇది ఒరియా లిపి లో తాళ పత్రాల మీద రాయగా కలకత్తా యూని వర్సిటీ వారు  1899 లో ప్రచురించారు .ఇందులో మొత్తం 2,500శ్లోకాలున్నాయి .

ఈ సిద్దాన్తగ్రంధం లో అనేక అద్భత అంశాలున్నాయి .సూర్య ,శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32అని లెక్క చెప్పాడు ఇది 31నిమిషాల ,31సెకనులు గా లెక్కించి చెప్పటం మరింత గొప్ప విషయం .ఈ పుస్తకం లో కొన్ని ముఖ్య భాగాలను అరుణ కుమార్ ఉపాధ్యాయ ఇంగ్లీష్ లోకి అనువదించారు .శుక్ర గ్రహణ సంక్రమణం సమంత్  ఇంట ఖచ్చితం గా ఎలా చెప్పా గలిగాడో ఎవరికీ అంటూ బట్టటం లేదు .పటాని సమంత్ 1904లో మరణించాడు భారతీయ పురాణాలలో,సంస్కృత గ్రంధాలలో మంత్రాలు శ్లోకాలరూపాలలో అనేక శాస్త్రీయ విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి

.ధ్రువుడి తపస్సుకు మెచ్చి విష్ణువు మెచ్చి ధ్రువ నక్షత్రం ఏర్పరచి ‘’నువ్వు ఆకాశం లో అత్యున్నత స్తానాన్ని పొందిన నీ చుట్టూ సప్తర్షులు 2,600 ఏళ్ళ కోసారి ప్రదక్షిణాలు చేస్తారు ‘’అని భాగవతం లో ఉంది . ఈ విషయాన్ని క్రీ.పూ..’’హిపార్చస్ ‘’అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు దీనిని ఎన్నో వేల ఏళ్ళ క్రితమే మన భాగవత కర్త వ్యాసుడు చెప్పటం అత్యాశ్చర్యం కరం .మన సమంత డాక్టరేట్లు సైన్సు పట్టాలు లేకుండా నే ఖగోళ అద్భుత రహస్యాలను కను గోన్నాడు కేంద్ర ప్రభుత్వం 11-6-2001న సమంత్ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి గౌరవించింది .’’హాట్స్ ఆఫ్ టు సమంత్’’.11-6-1904 న మరణించాడు .

Inline image 1

480-విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి

భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు  సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం ,అది శ్రీ కృష్ణార్జున యుద్ధం దాకా వెళ్ళటం తెలిసిందే .రామాయణం లో కుబేరుని ‘’పుష్పక విమానాన్ని ‘’రావణుడు లాక్కొని అనుభ వించాడు .దానిలోనే శ్రీ రామాదులు లంక నుంచి అయోధ్యకు చేరారని తెలిసిన విషయమే .వసు రాజు కు ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు అది ‘’ఎయిర్ కండిషన్డ్ విమానం ‘’..దానిలో సకల సౌకర్యాలు ఉన్నాయి .

వి అంటే పక్షి .గాలిలో పక్షి లాగా ఎగిరేది విమానం అని పిలువ బడింది ..మహా భారత కాలానికే విమాన శాస్త్రం వృద్ధి చెందింది .ఋగ్వేదం లో విమాన యాన ప్రసక్తి ఉంది .మూడు చక్రాలతో ఆకాశం లో విహరించేరదాలున్నట్లు మన పురాణాలలో ఉంది .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’లో విమాన యానం కు సంబంధించిన రచన ఉంది .దీనికి అను బంధం గా ‘’సంస్కార రత్నావలి  ‘’,’’శకట యానం ‘’,’’లోహ తంత్ర’’,’’యాన బిందువు ‘’మొదలైన గ్రంధాలు వచ్చాయి .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’ను భూర్జర పత్రాల మీద రచించిన భారద్వాజ మహర్షి వివరాలు అందు బాటు లో లేవు .

క్రీ.పూ.ఏడవ శతాబ్దిలో భరద్వాజుడు జన్మించినట్లు తెలుస్తోంది .తండ్రి బృహస్పతి .తల్లి మమత .హిమాలయ పర్వత సానువులలో జన్మించినట్లు భావిస్తారు .ఋగ్వేద అధర్వణ వేదం ,రామాయణ ,మహా భారతాలలో భరద్వాజ ప్రసక్తి ఉంది .ఈయనే విమాన శాస్త్ర రచయిత గా అందరు భావిస్తారు .భరద్వాజుడు రాసిన ‘’బృహత్ యంత్ర సంహిత ‘’లో విమాన శాస్త్రం ఒక భాగం మాత్రమె .ఇందులో అనేక పూర్వ గ్రంధాలను ఆధారం చేసుకొని రాసినట్లు చెప్పాడు .ప్రాచీన విజ్ఞాన గ్రంధాలు ముఖ్యమైనవి 25ఉన్నాయి .అవి ‘’వైశ్వానర తంత్రం ,ధూమ ప్రకరణం ,సౌదామిని కళ,శక్తి సూత్రం ,అంశు బోధిని ,వాయు తత్వ ప్రకరణం ,ఆకాశ  తత్త్వం.

భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రం కు విపులమైన వ్యాఖ్యానం రాసిన వాడు ‘’బోదా నంద’’ .ఆయన రాసిన ప్రకారం భరద్వాజుడు వేదాలను మదించి ,ఈ యంత్ర శాస్త్రాన్ని తయారు చేశాడు .భారద్వాజునికి పూర్వమే కొంతమంది విమాన శాస్త్రం పై అనేక పరిశోధనలు చేశారని,గ్రంధస్తం చేశారని  తెలుస్తోంది .అయితే అవి అస్పస్టాలు అసంపూర్నాలు అవటం తో అసలు విషయం తెలియ లేదు .శౌనక మహర్షి రాసిన ‘’వ్యోమ యాన యంత్రం ‘’వాచస్పతి రాసిన ‘’యాన బిందు‘’,నారాయణ రాసిన ‘’విమాన చంద్రిక ‘’దుండి నాధుడు రాసిన ‘’వ్యోమ యానార్క ప్రకాశిక ‘’,గార్గ్య మహర్షి రాసిన‘’యంత్ర కల్పం ‘’,చక్రాయన రచించిన ‘’భేత యాన ప్రదీపిక ‘’మొదలైనవి భరద్వాజుని విమాన శాస్త్రానికి ముందువే .

భరద్వాజ విమాన శాస్త్రం లో ఎనిమిది అధ్యాయాలువంద అధికరణాలు,500సూత్రాలున్నాయి  ,ఇదీ అసంపూర్తి గ్రంధమే .పూర్తీ గ్రంధం అలభ్యం .భరద్వాజుడు తన విమాన శాస్త్రం లో మొత్తం 32విమాన శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నాడు .విమాన నిర్మాణం లో

32యంత్రాలున్నట్లు ,వాటిని ఎక్కడెక్కడ అమర్చాలో వాటి పనులేమిటో కూడా తెలియ జేశాడు .2005లో హరిద్వార్ లో ఆవిష్కరింప బడిన ఆమంచి బాల సుదాకర శాస్త్రిగారి రచన  ‘’భరద్వాజ వైమానిక ‘శాస్త్రం ‘’లో కావలసిన వివరాలున్నాయట .శాస్త్రి గారు విజయ వాడలో ‘’మహర్షి కాల జ్ఞానం ‘’సంపాదకులట.ఇందులో మూడు వేల శ్లోకాలు వంద అధ్యాయాలు ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ లలో ఈ పుస్తకం వేలు వడిందట .  మన దేశం లో రైట్ సోదరులకు పూర్వమే బొంబాయి లో’’ శివ శంకర్ బాపూజీ తల పడే ‘’అనే శాస్త్ర వేత్త1895లో మొదటి విమానాన్ని తయారు చేసి ఆకాశం లో ఎగిరెట్లు చేశాడట .ఈయన బొంబాయి చైనా బజార్ లో ఉండేవారు .సంస్క్రుత ఆంగ్లలో  నిష్ణాతుడు .విజ్ఞాన పరిశోధనల్లో ఆరి తేరిన వాడు .బొంబాయి జే.జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో లెక్చరర్ .వేదం వాగ్మయాన్ని అవలోడనం చేసిన వారు .1913లో శివకర్ గారు ‘’ప్రాచీన విమాన విద్వేచా శోధ’’పేరుతొ మరాఠీ లో ఒక గ్రంధం రాశారు .భార్య మిత్రుల సహకారం తో వేదం లోని విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విమానాన్ని నిర్మించారు .తన విమానానికి‘’మరుత్సఖ’’ (వాయు మిత్రుడు ).అని పేరు పెట్టారాయన .బొంబాయి లోని ఆర్ట్ సొసైటీ నిర్వహణ లో ఉన్న టౌన్ హాల్ లో ప్రదర్శించారు .పాదరసాన్ని  ,సౌర శక్తిని ఇంధనాలు గా ఉపయోగించారు .బొంబాయి లోని ‘’చౌ పట్టి’’సముద్ర ప్రాంతం లో ప్రయోగించి నడిపించారు .1500అడుగుల ఎత్తు  వరకు ‘’మరుత్సఖ ‘’యెగిరి క్షేమం గా భూమి మీదకు దిగింది .ఆ నాటి బరోడా యువరాజు సాయీజీ రావు గైక్వాడ్ ,ప్రసిద్ధ న్యాయ వేత్త మహా దేవా గోవింద రానడే ,వాణిజ్య వేత్త లాల్జీ నారాయణ్ జీ మొదలైన ప్రముఖు లందరూ ఈ విమానాన ప్రయోగాన్ని చూశారు .దీన్ని అభి వృద్ధి చేయటానికి కావలసిన ఆర్ధిక సాయం చేస్తామని వీరందరూ ప్రకటించారు .కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించటం భార్య మరణించటం తో ,శివాకర్ గారు కూడా చని పోవటం తో ఈ ప్రయోగం ఆగిపోయింది .ఈయన వారసులు ఈ తోలి విమానాన్ని బ్రిటిష్ కంపెని కి అమ్మేశారు .బాల గంగాధర తిలక్ తన కేసరి పత్రిక లో 1953 may 10న  ఒక వ్యాసం రాశారు ‘’శివకర్ తల పడే’’ విమాన ప్రయోగం గురించి పూర్తీ వివరాలు అందులో రాశారు .బ్రిటిష్ ప్రభుత్వం పరువు పోతుందనే భయం తో ఈ విషయాన్ని అంతకు ముందు

బయటికి పొక్క కుండా చేసింది. కాని తిలక్ గారి వల్లనే మొదటి సారి లోకానికి తెలిసింది .1950లో ‘’శిల్ప సంసార‘’అనే పత్రిక వేదాలలో విమాన శాస్త్ర వివరాలను ధారా వాహిక గా రాచురించింది .1956లో జనవరి ఎనిమిదిన ‘’త్రిపుర‘’పేరు తో ఒక ప్రత్యెక విమానానికి సంబంధించిన కొన్ని రేఖా చిత్రాలను ప్రచురించారు .ఈ విమానం భూమి మీద ,గాలి లోను ఎగుర గలదని తెలిపింది .

భారద్వాజుడి విమాన శాస్త్ర అధ్యయనాన్నిఅనేక మంది ఆధునిక శాస్త్ర వేత్తలు చేశారు .ఇందులో డాక్టర్ రామ ప్రభు,డాక్టర్ మహేశ్వర్ సేరోన్ ,డాక్టర్ యెన్ జి దొంగ్రే ,పి రామ చంద్ర రావు మొదలైన వారున్నారు.

1956-60-ల మధ్య రష్యా నుంచి ఉయ్యూరు కు రెండు సార్లు వచ్చిన ఉయ్యూరు వాస్తవ్యూలు రష్యాలో ఆయిల్ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతా రామయ్య గారు ఇక్కడ జరిగిన పౌర సన్మానం లోను విడిగా బంధువుల ఇంటి లోను మాతో మాట్లాడి నప్పుడు భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రాన్ని జర్మనీ దేశశాస్త్రజ్ఞులు ఇండియా నుంచి తీసుకొని వెళ్లి జర్మని లో విమానాన్ని తయారు చేశారని చెప్పారు .ణ

కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం సమాప్తం .

Inline image 2

గబ్బిట దుర్గాప్రసాద్ –3-2-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.