ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116
48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్
కవిత్వం లో ను , మాటల్లోను అసాధారణ సంక్షిప్తత ,సిగ్గుపడే మనస్తత్వం ఉన్న అమెరికన్ కవి ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ .సమకాలీన విలువలను చాలెంజీ చేసి ,పొందిన విజయాలను ప్రశ్నించి ,ఆనాటి వరకు ఎవరూ ఎదిరించని కలం వీరుడిగా చరిత్రలో స్థానం పొందాడు .యవ్వన దశలోనే తాను ఈ ప్రపంచం లో నిత్య పోరాటం తో ,తప్పించుకోరాని సంఘటనల మధ్య జీవించాల్సి ఉంటుందని గ్రహించాడు .22-12-1869 న అమెరికాలోని లింకన్ స్వరాష్ట్రం మెయిన్ లో హెడ్ టైడ్అనే గ్రామం లో జన్మించాడు .పుట్టిన ఏడాదికే తండ్రి కుటుంబాన్ని దగ్గరలోనే ఉన్నఉత్పత్తికేంద్రం ,నాలుగు వేల జనాభా ఉన్న గార్డేనర్ కు మార్చాడు. 27 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండిపోయాడు .ఈ అనుభవాలను తన కవిత ‘’టిల్బరీ టౌన్ ‘’లో నింపాడు .ఇక్కడున్నకాలం లో దాదాపు ఒంటరిగా ,ఎక్కువకాలం ఇంట్లోనే ఉన్నాడు .తండ్రి షిప్ కార్పెంటర్ గా పని చేశాడు .ఒక జనరల్ స్టోర్స్ కూడా ఉండేది .ఎడ్విన్ యవ్వన దశవరకూ ఆ కుటుంబం సంపన్న కుటుంబం గానే ఉండేది .తండ్రి లాండ్ ఓనర్ ,స్టాక్ హోల్డర్ ,కౌన్సిలర్ ,బాంక్ డైరెక్టర్ కూడా కావటం తో సంపన్న ధనిక కుటుంబంగా ఉన్నారు .ఎడ్విన్ ఇద్దరు అన్నయ్యలలో ‘’డీన్ ‘’ను డాక్టర్ చేయించాలని చదివించారు .రెండోవాడు హీర్మన్ ను బిజినెస్ మాన్ గా మార్చాలని తండ్రి భావించాడు .ఎడ్విన్ చిన్నప్పటినుండి చాలా ప్రశాంతంగా ఉండేవాడు .చుట్టూ ఉన్న ప్రపంచం లో పోరాడి ,విజయం సాధించాగలిగితేనే బతకగలం అనే అధైర్యమేర్పడి ,పోటీ పడటానికేప్పుడూ వెనకడుగే వేసేవాడు .
అయిదవ ఏటనే కవిత్వం చదివి అర్ధం చేసుకొని ,పదకొండవ ఏట కవిత్వం రాయటం ప్రారంభించాడు రాబిన్సన్ .ఎడ్విన్’’ టీన్’’ వయసు నుంచి బయట పడే లోపే తండ్రి ఆరోగ్యం క్షీణించి,నిత్యం చావు బతుకుల్లో గడిపాడు .తెలివిగలా అన్న ‘’డీన్’’ మెడికల్ ప్రాక్టీస్ మానేసి ,మత్తుమందుకు బానిసై ,నరాల వ్యాధితో నరకమే అనుభవించేవాడు .మేజర్ అయిన ఆర్లింగ్టన్ ,రాబోయే భవిష్యత్తు యెంత దారుణంగా ఉండ బోతుందో ఊహించుకోగలిగాడు .స్వీయ అస్తిత్వం లేకుండా ,,నిరాశ నిస్పృహలతో ఒంటరి జీవిగా కు౦గి పోయాడు .’’నేను దాదాపు ఇరవై రెండేళ్ళు గార్దినర్ లో ఉన్నానన్న మాటే కాని ఇల్లువదిలి బయటకు వెళ్ళిన పాపాన పోలేదు ‘’అని తర్వాతెప్పుడో రాసుకొన్నాడు .ఒంటరితనం వ్యక్తిత్వ వికాసానికి ఎక్కువగా తోడ్పడుతు౦దని ,తన అపజయాలకు అది సానుభూతి చూపుతుందని అనుకొన్నాడు .ఏదో తెలీని అదృశ్య శక్తి యాదృచ్చికంగా తన జీవిత నావను నడిపిస్తుందని నమ్మాడు .
1891 ‘’ఫాల్’’ సీజన్ లో హార్వర్డ్ లో చేరి ,రచయితకావాలని అనుకొన్నాడు .హార్వర్డ్ మాసపత్రికకు డజన్ కవితలు పంపాడు .అందులో చాలా ఇప్పుడు అధిక ప్రాచుర్యాన్ని పొందినా ,ఆనాడు ఆ పేపర్ వాటిని తిరస్కరించింది .రెండేళ్ళ తర్వాత కాలేజీ చదువుకు స్వస్తి చెప్పాడు .మిల్లులన్నీ మూతపడ్డాయి .బ్యాంకులు కట్టేశారు .బాగా వ్యవస్తీక్రుతమైన ఫరములు కూడా దివాలా తీశాయి .నలభై లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు .కొక్సీ నిరుద్యోగ సైన్యం వాషింగ్టన్ పై దాడి చేసింది .రాబిన్సన్ అదృష్టమూ దీనితో తలక్రిందులైంది .తండ్రి చనిపోయాడు .అన్న డీన్ భ్రమలలో బతుకుతున్నాడు .మరో అన్న హీర్మాన్ తెలివి తక్కువగా పనికిరాని వాటిలో పెట్టుబడులు పెట్టి,కలిసిరాక తాగుడుఅలవాటై ,కలల్లో తెలిపోతున్నాడు .ఈ పరిస్తితులలో తన కాళ్ళ మీద తానూ నిలబడాల్సిన పరిస్తితి ఉందని ఎడ్విన్ గ్రహించాడు .ప్రపంచం చెప్పే వ్యాపార ద్రుష్టి తనకు లేదని తెలుసుకొని వినయంకలిగి ,అజ్ఞాతంగా ఉండి పోయిన ,జనం మర్చి పోయిన వారి గురించి చిన్నకధలు రాస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు .మధ్య మధ్యలో సానేట్లు ,19పంక్తులతో ,రెండు రైమ్స్ ఉన్న’’విల్లనేల్లెస్ ‘’ కవితలు రాశాడు.తర్వాతి జీవితం లో అడపాదడపా నాటికలు గిలికే ప్రయత్నమూ చేశాడు ..ఇవేవీ తనకు అచ్చి రావని గ్రహించి కవిత్వమే తనకు దిక్కు అనే నిశ్చయానికి వచ్చేశాడు .
చిన్నతనం లోనే చెవి ఎముకకు ఇన్ఫెక్షన్ సోకి ,లోపలి చిన్న ఎముకలను నాశనం చేసింది .వినికిడి పోతుందేమోనని విపరీతంగా భయ పడ్డాడు .కళ్ళు కూడా చాలా బలహీనం గా ఉండేవి .కళ్ళు చెవి లపై తీవ్ర ఆందోళన చెందేవాడు .తనకు ఎవరో ఒకరు ఆసరాగా ఉంటేగాని జీవి౦చలేననే అధైర్యమేర్పడింది .స్నేహితుడికి ఉత్తరం రాస్తూ 24 ఏళ్ళ తాను ప్రతి సెంటు డబ్బుకోసం, తినే ప్రతి ముద్ద కోసం తల్లిపై ఆధార పడాల్సి రావటం సిగ్గుగా ఉందని,.ప్రపంచం తనను భయపెడుతోందని తెలియ జేశాడు .ఏదైనా వచనం లో రాసిపంపితే పేపరు వాళ్ళు తిరుగు టపాలో మొహాన కొట్టేస్తున్నారు .అతని బాగా ప్రసిద్ధమైన కవిత ‘’ది హౌస్ ఆన్ ది హిల్ ‘’ను ఒక పత్రిక స్వీకరించి౦ది కాని ఒక్క సెంటు కూడా విదల్చలేదు .ఇంకోటి మరో మేగజైన్ లో అచ్చు అయి ,ఒక ఏడాది పాటు ఆ పత్రికను ఉచితంగా పంపింది అంతే.కాని 1895లో మాత్రం ఎడ్గార్ అల్లెన్ పో పై రాసిన సానెట్ ను ‘’లిప్పిన్ కాట్స్ మేగజైన్ ‘’ప్రచురించి 7 డాలర్ల పారితోషికాన్నిచ్చి ఉత్సాహం నింపి ,ఆర్ధికంగా సాయపడింది .అదే 26 వ ఏట అతని మొదటి సంపాదన అయింది .
1896లో వందపెజీల ‘’దిటారెంట్ అండ్ ది నైట్ బిఫోర్ ‘’ వ్రాతప్రతిని రాసి పంపిస్తే ,రెండు సార్లు తిరస్కరింపబడింది ..చివరికి రివర్ సైడ్ ప్రెస్ లో ముద్రించి అతని అంకుల్ ఒకడు 312పేపర్ బౌండ్ కాపీలను 52 డాలర్లకు అందజేశాడు .దీన్ని ‘’To any man ,woman ,or critic who will cut the edges of it –I have done the top ‘’అని స్వీయ చేతనతో అ౦కి తమిచ్చుకొన్నాడు .దీనిపై వచ్చిన స్పందన స్వల్పమే .కొన్ని విమర్శలు అనుకూలంగానే వచ్చినా ఇంకా ఎక్కు మందికి అందేలా రచయిత ప్రయత్నించాలని సలహా నిచ్చారు .గర్విష్టి అయిన ఒక పబ్లిషర్ రిచర్డ్ సి బాడ్జేర్ అతి తక్కువ ధరకే పుస్తకంకొత్త ప్రచురణ అచ్చు వేస్తానన్నాడు .కొన్ని కవితలు వదిలేసి కొన్ని కొత్తవి చేర్చినానా కంగాళీ చేసి ,ఎడ్విన్ స్నేహితుడు డబ్బు అడ్వాన్స్ గా ఇస్తే ‘’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’నుప్రచురించి అందులో కొన్ని రాబిన్సన్ పోర్ట్రైట్లు కూడా చేర్చి 1897లో విడుదల చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-16-ఉయ్యూరు