భక్తి యోగం లో నాద సాధన
భక్తి యోగానికి చేసే సాధనాలన్నీ నాద యోగానికీ సాధనాలుగానే ఉన్నాయి .భక్తీ యోగి మంత్ర జపం చేసేటప్పుడు మొదటి దశలో ఆ మంత్రంపై పూర్తి ఎరుకతో ఉంటాడు .ఆ మంత్ర నాదం పై అతిని ద్రుష్టి పూర్తిగా నిలిచి ఉంటుంది . ఆ మంత్రాన్ని అనేక సార్లు దీక్షగా గాఢంగా జపించే టప్పుడుమరింత లోతుగా అవగాహనా జ్ఞానం పొందాక ,వినిపించ నంత గా శబ్ద కంపనాలను చేస్తూ ,తర్వాత తన అవగాహనను మరింత వృద్ధి చేసుకొని మంత్రాన్ని గుసగుస శబ్దంగా ఉచ్చరిస్తాడు .
రెండవ దశలో సాధకుడు తన అవగాహన లేక జ్ఞానాన్ని ఆ గుస గుస మంత్రం లో విలీనం చేసే ప్రయత్నం చేస్తాడు .ఈ పని పూర్తిగా సంతృప్తికరంగా పూర్తయితే గుసగుస శబ్దం తో చేసే మంత్రోచ్చారణనను కూడా ఆపేసి మంత్రాన్ని మానసికంగా ఉచ్చరిస్తాడు .అప్పుడు అతనికి వినిపించని మానసిక సూక్ష్మ గమనికలను (నోట్స్) మరింత లోతైన జ్ఞాన ఫలితంగా ఊహించ గలుగు తాడు .ఒక్కో సారి ఈ దశలో అసలు మంత్రమే విని పించే అవకాశం కూడా ఉంది .అప్పుడు భక్తి యోగి తానే నిజంగా మంత్రాన్ని వినిపించే స్వరం తో ఉచ్చరించాననే భావన కలుగుతుంది . మానసిక ఉచ్చారణ క్రమంగా శోషించిన జ్ఞానం కలిగినపుడు ,మనసు పూర్తిగా లోతైన స్థానం తో విలీనమైనప్పుడు మంత్రం లేక నాదం స్థిరమైన వినబడని పునరావ్రుత్తరూపంగా రూపాంతరం చెంది ,సాధకుడికి చేతన తలంపై (కాన్షస్ ప్లేన్ ) వినిపించినట్లుగా దృశ్య మానమై ,ఇతరులకు కనిపించకుండా వినిపించకుండా ఉంటుంది .ఇదే భక్తి యోగుల మంత్ర నాద యోగ సాధనా విధానం .
నిద్రాణమైన అతీంద్రియ స్థానాన్ని ఉద్దీపనం చేయటానికి మంత్రాలతో కొన్ని బంధాలు ,క్రియలు చేర్చ బడుతాయి . మొదటి శబ్దం లేక నాదాన్ని కనుక్కోవటానికి యోగి చెవులు మూసుకొని తన పనిని ముందు ప్రారంభించాలి .సాధన సంతృప్తి కరంగా పురోగమిస్తున్నప్పుడు ,ఇక తన చెవులను మూసుకోవాల్సిన అవసరం లేదు . అనేక పరిమాణాలలో ఉన్న శబ్దాలతో అనుసంధాన అవసరం లేక ఇక చెవులను పూసుకోవాల్సిన పని ఉండదు . ,ప్రశాంత రాత్రి వేళ చెవులు మూసుకో కుండానే దీనికి బదులుగా లోపలి నాదం తో అనుసందానమౌతాడు . అర్ధ రాత్రి వేళ దీని అనుభవం విశేషంగా ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-16-ఉయ్యూరు