నాద యోగం -6
నాద సాధనకు సిద్ధమవటం
నాద సాధన చేసే సాధకుడు ముందు గా మూల బంధం, వజ్రోలి ,యోగ ముద్ర లను అభ్యాసం చేయాలి .ఈ మూడూ చాలా ముఖ్యమైనవి .వీటిని వేయటం బాగా వస్తే తర్వాత కుంభక౦ ను అభ్యసించి తన చేతనను బిందువు పై కేంద్రీకరించాలి .తరువాత భ్రామరి చేయచ్చు.భ్రామరి చేసే టప్పుడు చెవులు మూసుకొని ,కళ్ళను వ్రేళ్ళతో నొక్కి పట్టుకోవాలి .పై దంతాలను కింది దంతాలను దూరం చేసి వదులుగా ఉంచాలి .అప్పుడు అసలైన నాద యోగం ప్రవహింప చేయాలి .
నాద అభి వ్యక్తీకరణకు ఆచరణ విధానం
ఒక దిండు మీద కూచోవాలి .అరికాళ్ళు, నేలకు తగిలేట్లు మోచేతులు మోకాళ్ళు తొడ నరాలపై ఆన్చి కూచో వాలి .ఎత్తు తక్కువ దిండు సుఖంగా ఉంటుంది .కొంతమందికి ఎక్కువ ఎత్తు దిండు బాగుండచ్చు .ఇక్కడ గ్రహించాల్సిన అతి ముఖ్య విషయం ఒకటి ఉంది .వెన్నుపాముకు అడుగున ఉండే త్రిభుజాకార ఎముక (కాకీక్స్ ),మరియు మూలాధారం అంటే ఉపస్తే౦ద్రియానికి గుద ద్వారానికి మధ్య ఉన్న ప్రదేశం లతో దిండును మూలాధార బిందువు వద్ద గట్టిగా నొక్కాలి .అందుకని ఉపయోగించే దిండు గుండ్రగా గట్టిగా ఉండాలి .గుదం సంకోచించకుండా ,మూలాధార చక్రాన్ని ఎత్తైన గట్టి దిండు పై కూర్చుని నొక్కాలి .
నాదం అభి వ్యక్తమవటానికి ప్రాణాయామం లో 1-ఉజ్జైయిని 2-సూర్య భేదన 3-భస్త్రిక 4-శీతలి 5-శీత్కారి 6-భ్రామరి 7-ప్లవిని 8-మూర్చ అనే ఆచరణ విధానాలున్నాయి .అందులో ‘’మూర్చ ‘’. ప్రాణాయామాన్నిచేసి ,యోని ముద్ర ,మూల బంధనం ,వజ్రోలి లను కొన్ని నిముషాలు చేసి తర్వాతనే నాద యోగాన్నిఇప్పుడు చెప్ప బోయే విధానం లో ప్రారంభించాలి . రెండు చెవులు మూసి ,చేతనను బిందువు దగ్గరకు చేర్చి ,అప్పుడు ఏదైనా నాదం వినిపిస్తోందేమోనని జాగృత మవ్వాలి .అప్పుడు మబ్బు తెరలు వెడుతున్నట్లు ,నీటిజాలు ప్రవహిస్తున్నట్లు ,సము ద్రం గర్జిస్తున్నట్లు ,,ఘంట శబ్దం విన్నట్లు అనిపిస్తుంది .ఒక్కోసారి వేణునాదం ,గిటార్ లయ ,లేకసాయంకాలం సూర్యాస్తమయం లో చీకటి పడే వేళ ఉండే భయంకర పక్షుల కిచకిచ లాగా కూడా ఉండచ్చు . లేక నక్షత్రాలతో ఉన్న రాత్రి ,ఏ శబ్దమూ వినిపించ నట్లు అనుభూతికలగా వచ్చు .అది సుదూర సముద్ర ఘోష కాని ,పిడుగు శబ్దం గా కాను అనుభవం కలగనూ వచ్చు .ఈ అంతర్ నాదాలను సాధకుడు కనుక్కో వచ్చు .
బిందువులో శబ్దాన్ని కను గొనడం కష్టం .మనసును సహస్రారం లో కాని ,ఆజ్ఞా చక్రం లోకాని ,లేక మెదడు కేంద్రం లో కాని లేకపోతె కుడి ఎడమ కర్ణ భేరి లలో కాని సంచారం చేయించాలి .లేక పొతే’’ చిదా కాశం’’ లో లేక భ్రూ మధ్యమం లోకాని ఆ నాదం వినబడే దాకా మనసును కేంద్రీకరించాలి .నాదాన్ని గుర్తి౦ఛి కనుక్కోవటం చాలా తేలికే .శబ్దాన్ని ఊహించటానికి బదులుగా ,మనసును ఒకే దృష్టి తో కేంద్రీకరిస్తే ,అప్పుడు మొదటినాదం వినిపించాక దాన్ని చివరిదాకా వెంటాడాలి .శబ్దానికి చెందినఒక అంతర్నాదాన్ని ఇంకా ఎక్కువ స్పష్టంగా ,ప్రాముఖ్యంగా ఉండే వరకు అనుసరించాలి .అది నిజంగానే స్పష్టంగా ,ప్రాముఖ్యమైనదిగా ఉన్నప్పుడు మరొక నాదం వేరొక స్వరం తో నేపధ్యం లో వినిపిస్తుంది .
రెండవ శబ్దం వినిపించాక మొదటిదాన్ని వదిలేసి రెండవ దాన్ని అనుసరించాలి .ఉదాహరణకు చెవులు మూసుకొని ,సాయంకాల పక్షుల కిలకిలారావాలను వినాలి .దీనిని వింటూనే ఉండాలి .అది పూర్తిగా స్పష్టంగా విభిన్నంగా ఉంటె ,మరొక నైటింగేల్ (కోకిల)అభి వ్యక్త నాదాన్ని కనుక్కోవాలి .ఇప్పుడు చేతనను పెంచుకోవాలి .నేపధ్యం నుండి పక్షుల కిలకిలా రావాన్ని విసర్జించాలి .ఇప్పుడు నైటింగేల్ స్వరాన్ని మరింత స్పష్టంగా స్పష్టంగా వినాలి .అది పూర్తిగా విభిన్నంగా స్పష్టంగా చేతనకు అనిపిస్తే ,మరొక శబ్దం నేపధ్యంగా వినిపిస్తుంది. తరువాత వినిపించే ధ్వని’’ చిన్ చిన్ చిన్’’ అని వినిపించే క్రికెట్ పక్షి శబ్దంగా ఉంటుంది .ఇదికూడా స్పస్ట౦ గా ఉంటె ,ముందు దాన్ని వదిలేయాలి .నైటింగేల్ స్వరాన్నీ విసర్జించి కొత్తదాన్ని అందుకోవాలి .అది కూడా కొంతకాలానికి స్పష్టంగానే ఉంటుంది .దీన్ని వదిలేసి నాలుగోదాని వెంట పడాలి .ఇలాశబ్ద విసర్జన చేసుకొంటూ చేతన పూర్తిగా కోల్పోయేదాకా ,లేక చేతన పూర్తిగా మనసులోని విషయాలను ఖాళీ చేసేదాకా వెళ్ళాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-16-ఉయ్యూరు
—