నాద యోగం -7
చేతనయొక్క వివిధ కోశాలలో నాదం
ఇలా వినిపించిన ధ్వనులన్నీ యదార్ధమైనవే .అవి మనసు లోని విషయాల,చేతనల యొక్క అభిజ్ఞలు లేక చిహ్నాలు .మనసు ఈ చిహ్నాలపై నిలిచి ఉండి ,వేగంగా వాటి సాయం తో సాగుతుంది .ఈ ధ్వనులు చేతన యొక్క లోపలి కోశాలైన అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ కోశాల అనుభవాలు .ఈశాబ్దాలు ఊహించినవి కానే కావు .వాటిని వ్యక్తీ యొక్కవివిధ స్థాయిలలోని అస్తిత్వపు కంపనాలుగా అర్ధం చేసుకోవాలి .ఇవే భౌతిక ,ప్రాణిక ,మానసిక ,అతిమానసిక ,ఆనంద లేక ఆత్మీయ అనే 5స్థితులు .ఈ విభిన్న స్థితులలో నాదం భిన్న భిన్న రూపాలలోఉండి వినిపిస్తుంది .మొదటగా భౌతిక శబ్దం వినిపిస్తుంది .కాని చేతన అత్యుత్తమంగా మితిమీరితే అప్పుడు ప్రాణ కోశం లోని సూక్ష్మనాదాలతో అనుసందానమవుతుంది .
మానవ చేతన పరిదిలేక శ్రేణిని మొత్తం మూడు లేక ఇంకా సూక్ష్మంగా ఐదుభాగాలుగా విభజించారు .చేతన అనేది అన్నమయ ,ప్రాణమయ కోశాల చేత యేర్పరచ బడింది .ఈ రెండు శరీరాలు ఆహారం ,ప్రాణం ల చేత ఏర్పడినాయి .రెండవ స్థాయిలో వ్యక్తిత్వం అనేది మనోమయ ,విజ్ఞాన మయ కోశాల చేత నిర్మించ బడుతుంది .ఇందులో మానసిక ,జ్యోతిష(యాస్ట్రల్ ) విషయాలు ఉంటాయి .చేతన యొక్క మూడవ పరిమాణం ఆనందమయ ,కోశం చేత నిర్మింపబడి ఆనందానికి పరమావధిగా ఉంటుంది .
నాద యోగ సాధనలో నాదం యొక్క అభివ్యక్తి (మాని ఫెస్టేషన్)మనసు మిగిలిన మానసిక స్థితుల సంబంధం తో స్థాపించ బడుతుంది .ఉదాహరణకు మనసు లేక చేతన భౌతిక శరీరం లోనే ఉండిపోతే ,అప్పుడు చెవులు మూసుకొన్నా ,హృదయ ,ఊపిరి తిత్తుల ,మెదడు ,రక్త ప్రసరణ ,జీవన క్రియల (మెట బాలిజం ).జీవన చర్యలకు శక్తి విడుదల చేసే విధానాలు(కెట బాలిజం ) మొదలైన శరీరం లోపల జరిగేవన్నీ వినిపిస్తాయి .
చేతన ప్రాణమయ కోశం లోపూర్తిగా దూరి ఉన్నప్పుడు ,వేణునాదం తో కలిసి అనేక ధ్వనులు వినిపిస్తాయి .మనసు ఆనంద మయ కోశం లో విహరిస్తుంటే మిగిలిన శబ్దాలు అన్నీ అంతరించిపోయి దాని స్థానం లో నాద యోగ ప్రభావం మాత్రమే మిగిలి ఉంటుంది . ఏ ప్రత్యెక నాదం ఏ ప్రత్యెక స్థాయికి చెందిందో చెప్పటం కష్టం .భారత దేశం లో వీటి దృష్టాంతాలను ప్రతీకాత్మక కధలతో చెప్పారు .ఎత్తులకు ఎగసే మరియు పారమార్ధిక నాదాన్ని అన్వేషించే వ్యక్తిగత చేతనా స్వరాన్ని నారద మహర్షి ఉదాహరణలతో విస్తృతంగా పురాణాలలో వివరించాడు .మహర్షి నారదుడు రాహస్యంగా బోధించిన దాన్నిసందేహ పడకుండా అర్ధం చేసుకోవాలి .నారదుని చేతిలో మహతి అనే వీణ ఉంటుంది .నాద యోగం లో వీణానాదం అత్యుత్తమ శ్రేణికి చెందినది .నాద యోగుల వివిధ శాఖలలో వీణానాదం ,వేణు నాదం లను చేతనలో ద్వైత భావ౦ అంతమొందించే వాటికి చెందినవిగా భావిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-28-3-16-ఉయ్యూరు