ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -138
55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -4(చివరిభాగం )
రసెల్ 80 వ జన్మ దినోత్సవం కీర్తులు భుజకీర్తులతో బ్రహ్మాండంగా జరిగింది .నోబెల్ బహుమతి వచ్చినప్పుడు లైఫ్ మేగజైన్ రాస్తూ ‘’తాను సాహిత్యానికి చేసిన సేవ ఏదీలేదు కనుక దాన్ని తిరస్కరించాడని ఆతని మహోన్నత బుద్ధి ఇంకా కోపం తెప్పిస్తూనే అల౦కార మైంది ‘’అన్నది .ఆయనపై ఒక సినిమా చిత్రీకరిస్తు ఇంటర్వ్యు చేస్తున్నప్పుడు ఆయన బుర్ర పాదరసంలా పని చేసి పక్షపాతం ,నటన ,మోసాలను అతి వేగం గా గుర్తించ గలిగే సామర్ధ్యాన్ని కలిగే ఉంది .అప్పుడు ఆయన 60ఏళ్ళ వాడికంటే యవ్వనంగా కనిపించాడు .మీసం ఎప్పుడో జారిపోయింది .కవళికలు స్పష్టంగా పెదిమలు ద్రుఢంగా,కళ్ళు జీవం తో తొణికిస లాడాయి .
80 వ పుట్టిన రోజు జరిగిన నెలకు ఈ పెళ్ళిళ్ళ ప్రయత్న గాడు వివాహ ఆనందాన్ని చాలా అనుభవించానని విడాకులను దూరం చేశానని అన్నాడు .అన్నాడేకాని కొన్ని నెలల తర్వాత నాలుగో సారి ఎడిత్ ఫించ్ అనే బ్రిన్ మావార్ కాలేజి మాజీ టీచర్ ను పెళ్ళాడేసిఆశ్చర్యం కల్గించాడు .ఆయన సంకల్ప బలం రచన శక్తీ ఎనభై దాటినా ఏమీ తగ్గనే లేదు .వితండ వాదం ప్రమాదల గురించి నిర్మోహ మాటం గాఇదివరకటికంటే ఘాటుగా రాశాడు .1950-52కాలంలో ‘’అన్ పాప్యులర్ ఎస్సేస్ ‘’,న్యు హోపెర్ ఫర్ ఏ చేంజింగ్ వరల్డ్ ‘’ది ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ ఆన్ సొసైటీ ‘’ గ్రంధాలు రాశాడు.1953లో రసెల్ కొత్త రంగ ప్రవేశం చేశాడు .అప్పటివరకు 65పుస్తకాలు అనేక కరపత్రాలు రాసిన వాడు చిన్న కదల మోజులో పడి రాశాడు .వీటిని ‘’శాటన్ఇన్ దిసబర్బ్స్ ‘’పేరుతొ ప్రచురించాడు .1954లో 82వ జన్మ దినోత్సవం జరుపు కొంటూ ‘’నైట్ మేర్స్ ఆఫ్ ఎమినేంట్ పెర్సన్స్’’రాసి ప్రచురించాడు .ఫ్రీ మైండ్ గురించి ఇంకా చర్చిస్తూనే రాస్తూనే చెబుతూనే ఉన్నాడు .చావేకాక మనిషి జీవితం లోచాలా స్వేచ్చగా ఉండాలి ,ఆలో చనల్లొ ,విమర్శలో ,ఊహలో ,సృజనలో అన్నాడు
‘’ 1962జూన్ 1న చావు గరించి విని విచారం వెలి బుచ్చే సమయం లో తానొక దేశ దిమ్మరినని ,అరిస్టాక్రసి వ్యతిరేకినని,అతని సిద్దా౦ తాలు చాలా తమాషాగా ఉంటాయని ,అవిఅతని నడవడిని నిర్ణ యించాయని చెప్పుకొంటారు .ఆయన బాగా ముసలితన లో కూడా మాంచి వినోదం పంచేవాడిగా ,మంచి ఆరోగ్యంగా ,రాజకీయ నిర్ణయ నేతగా ,ఆనాటి రెస్టోరేషన్ తరువాతి మహాకవి మిల్టన్ లాగా ఒంటరి గా ఉన్నాడని ,చని పోయిన శకానికి మిగిలిన ఆఖరి ప్రాణి ‘’అని కీర్తించాలని కోరుకొన్నాడు .
రసెల్ పూర్తిగా యుద్ధ వ్యతిరేకి .సామ్రాజ్య వాదాన్ని పూర్తిగాతిరస్కరించినవాడు .పాసిజం ను సమర్ధించి జైలుకు వెళ్ళినవాడు .తర్వాత హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాడు . స్టాలిన్ తరహా నియంతృత్వాన్ని ఎదిరించిన వాడు .వియత్నాం పై అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకించాడు .అణ్వాయుధ విసర్జన కోరుకొన్నవాడు .అతనికి వచ్చిన పురస్కారాలు విశేషమైనవి .పుట్టుక నుండి1908వరకు ‘’ది ఆనరబుల్ బెర్ట్రాండ్ ఆర్ధర్ విలియమ్స్ రసెల్ ‘’ను ,1908నుంచి 1931 వరకు ‘’ఎఫ్ ఆర్ ఎస్ ‘’,1931-49వరకు ‘’రైట్ ఆనరబుల్ ఎరల్ రసెల్ ‘’‘’,1949నుంచి చని పోయేవరకు ‘’రైట్ ఆనరబుల్ ఎరల్ రసెల్ ఓఎం ఎఫ్ ఆర్ ఎస్ బిరుదులతో విరాజిల్లాడు .
ఎనలిటికల్ ఫిలాసఫీ స్థాపకుల్లో రసెల్ ఒకడు .లీబ్నిజ్ ప్రభావం బాగా ఉన్నవాడు .ఈస్తెటిక్స్ కాకుండా అన్ని వేదాంత విషయాలు రాశాడు .ఫలవంతమైన మెటా ఫిజిసిస్ట్ .లాజిక్ ఫిలాసఫీ గణితాలలో ఉద్దండుడు.ఫిఆసఫీ ఆఫ్ లాంగ్వేజెస్ ,ఎథిక్స్ ,ఎపిస్టమాలజిఅంటే జ్ఞాన మీమాంసా శాస్త్రం లలో నిష్ణాతుడు .బ్రాండ్ బ్రాన్ డాల్ట్ రసెల్ ను ఈస్తెటిక్స్ పైన ఎందుకు రాయేదని అడిగితె తనకు సౌందర్యం గురించి ఏమీ తెలియదని, కాని దాని వలన తాను రాసినదానిని బేరీజు వేయకూడదని అన్నాడు .తాను ఆజ్ఞేయ వాదినే అన్నాడు .అంతమాత్రం చేత ఒలింపిక్ దేవతలను కాదని అనలేదు .బ్రిటిష్ హ్యూమన్ అసోసియేషన్ సలహా సంఘ సభ్యుడిగా ,,కార్దిస్ హ్యుమానిటీస్ అధ్యక్షుడిగా జీవితాంతం రసెల్ పని చేశాడు .శాస్త్రీయ సంఘం(సైంటిఫిక్ సొసైటీ ) ఏర్పడాలనివాచించాడు .యుద్ధం లేని జనాభా అతిగా పెరగని ,సంపద అందరికి సమానంగా విభజింప బడే సమాజం కోరుకొన్నాడు .మానవాళికిమార్గ దర్శనం చేసేది పరస్పర సహకారమే అన్నాడు .’’హోమో సెక్సువల్ ఆ రిఫార్మ్ సొసైటీ’’ని పూర్తిగా సమర్ధించాడు .”Reflections on My Eightieth Birthday” (“Postscript” in his Autobiography), Russell wrote: “I have lived in the pursuit of a vision, both personal and social. Personal: to care for what is noble, for what is beautiful, for what is gentle; to allow moments of insight to give wisdom at more mundane times. Social: to see in imagination the society that is to be created, where individuals grow freely, and where hate and greed and envy die because there is nothing to nourish them. These things I believe, and the world, for all its horrors, has left me unshaken”[158
అని రాసుకొన్నాడు .రసెల్ ప్రభావం పడని ఆధునిక రచయిత ఎవరూ లేరు అన్నది యదార్ధం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-16-ఉయ్యూరు