ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -159

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -159

 61—అత్యంత ప్రసిద్ధ ప్రతీకాత్మక హాస్యాత్మక పురాణ నవలా రచయిత-ధామస్ మాన్ -2

ముప్ఫై వ ఏట ప్రేటియా ప్రింగ్ షీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు ఆమె తండ్రి ప్రముఖ గణితాచార్యుడేకాక ,కళా పిపాసి విలువైనవాటి సేకరణ చేసేవాడు .తర్వాత 28 ఏళ్ళు ‘’మాన్ తన ఉమన్ ‘’తోహాయిగా  విలాసంగా సృజనాత్మకం గా కాలక్షేపం చేశాడు .మ్యూనిచ్ లో ఉన్న విలాసవంతమైన పెద్ద భవంతి కాక ,మిమిలాన్డ్లోని ఇసార్ లో ఒక కాటేజీ ని ఏర్పాటు చేసుకొన్నాడు వేసవి విడిదికోసం .ముగ్గురబ్బాయిలు ముగ్గురమ్మాయిలు  సంతానం .ఒక కొడుకు’’ క్లాస్’’ రచయిత..ఒక కూతురు’’ ఎరీకా’’ నటి ,ప్రసిద్ధ కవి డబ్ల్యు .హెచ్ ఆడెన్ ను పెళ్ళాడింది .తన వివాహం కాగానే మాన్ ‘’రాయల్ హైనెస్ ‘’అనే అరిస్టాక్రాటిక్ హీరో గురించి ,ఆర్టిస్ట్ అయిన ఆతను రెండు భిన్న సమాజాలమధ్య పొందిన బాధల గాధలుగా రాశాడు .పూర్వపు వాటిలో ఉన్న తీవ్రతను తగ్గించి తగిన మోతాదులో రాయటం తోదీన్ని నవలా రూపం లో ఉన్న కామెడి అన్నారు .మొ.ప్ర.యు.వచ్చి మీద పడే సమయం .ఇంకా 15ఏళ్ళకు కాని మాన్ మహా గ్రంధం అచ్చు అయి వెలుగు చూడదు .

   ‘’డెత్ ఇన్ వెనిస్ ‘’అనే ప్రసిద్ధ నవలిక 30 వ ఏట రాశాడు.అందాన్ని ఆరాధించే ,పాతదాన్ని పెకలించేసే గుస్టావ్ వాన్ ఏశాన్ బాష్  అనే విసిగి వేసారిన అరిస్టా క్రాటిక్ గురించిన కదగా రాశాడు .అతనికి ఒక పోలిష్ కుర్రాడు తోడు .ఇద్దరిమధ్య మాటలు ఉండవు .పట్టణం ప్లేగు మహమ్మారి కోరల్లో ఉంటె హీరో ఆ కుర్రాడికోసం అక్కడే ఉండి చనిపోవాలను కొంటాడు .ఇందులోని కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉంటాయి –‘’beauty ;s very essence ,form as divine thought ,the single and pure perfection which resides in the mind ‘’లాంటివి చాలా ఉన్నాయి .కదా లేదు కాకర కాయా లేదూ .పనీ లేదు పాటాలేదు .కాని అత్యంత ఉత్కంఠ కలిగిస్తూ నరాలు తెగిపోతాయేమో అన్నంత భయాన్ని కల్పిస్తూ రచన చేశాడు మాన్ .సౌందర్య స్తోత్రం చేస్తూ ప్రేరణ తోపాటు అపకారమూ కల్పించాడు .ఇందులోని విషయం మాన్ కు చాలా ఇష్టమైనది .హీరో ఎవరితోనూ పెద్దగా మాట్లాడక పోయినా ,ఒంటరిగా ఉన్నా ,తనకు సేవ చేసేవారితోనే అప్పుడప్పుడు మాట్లాడుతున్నా  నవలాకారుని తీవ్ర తన్మయత్వం ముగ్ధుల్ని చేస్తుంది .దీని భావాన్ని జోసెఫ్  వార్నర్ ఏంజెల్ అనే విశ్లేషకుడు –‘’ది ధామస్ మాన్స్ రీడర్ ‘’లో రాస్తూ ‘’his absorption with the idea ,his yielding to the image of Tadzio;s beauty separates Aschenbach  from his art ,which is communication ,and from his morality ,and he plunges into the abyss of solitude ‘’అన్నాడు .

  మొ.ప్ర.యు .తర్వాత మాన్ ఫిక్షన్ ఏదీ రాయలేదు .’’అన్ పొలిటికల్ మాన్ ‘’అనే పుస్తకం లో తన జ్ఞాపకాలు రాశాడు .తనవన్నీ మెటాఫిజికల్ ,మోరల్  రాజకీయ ,సాంఘికాలను చెందినవని ,తన అభిరుచులు సంప్రదాయం జర్మనీకి చెందినవని ,అవి కయ్యానికి కాలుదువ్వే  దేశ భక్తికి చెందినవనీ చెప్పేవాడు .కొన్నేళ్ళ తర్వాత మాన్ కున్న కన్జర్వేటివ్ భావాలు తగ్గాయి .తక్షణ సమస్యలపై దృష్టి ఏర్పడింది ,తానున్న పరిస్థితులను తన అంతరాత్మనూ బేరీజు వేసుకొన్నాడు .తాను  నడిచిన మార్గం సరైనదికాదని గ్రహించాడు .రాజకీయానికి వ్యతిరేకమైన ,అభి వృద్ధికి నిరోధకం గా ఉన్న సంస్కృతీ తో తాను సహజీవనం చేయలేనని గ్రహించాడు .

  ఇదుగో ఇలాంటి అంతః శుద్ది ఏర్పడిన కాలం లోనే  ‘’ది మాజిక్ మౌంటేన్ ‘’రాశాడు .మాన్ మొదటి నవల బడ్దేన్ బ్రూక్స్ ను మొదటి స్వచ్చమైన జర్మనీ నవలగా భావిస్తే ,దీన్ని స్వచ్చమైన మొదటి యూరప్ నవలగా విమర్శకులు గుర్తించారు .ఇది కూడా మాస్టర్ పీస్-అత్యుత్తమ నవల  అనిపించింది .ఈ నవలా కద 1912లో మాన్మాన్ మనసులో  మూడు వారాలు భార్యకు శ్వాసకోశ సంబంధ వ్యాధి చికిత్స కోసం సాని టోరియం లో ఉండగా రూపు దిద్దుకోన్నది .మొదట్లో ఇదొక కామెడీ గా అనుకొన్నాడు .కాని చావుపై వ్యామోహం ,జీవితం పైనా ,సువ్యవస్తపై అవ్యవస్థ విజయాలు  చూసి విపరీతంగా పెంచి రోగ గ్రస్త నాగరకత పై నీతిధా వ్రుత్తాంతం గా రాశాడు .ఈ నవల నుయదార్ధం గా ప్రతీకాత్మకంగా  రెండు స్థాయిలలో రచించాడు  మామూలు కద అయితే ఒక అమాయక ,ఏదీ దాచుకొని మధ్యతరగతి యువకుడైన హాన్స్ కాస్టర్ప్ స్విస్ శానిటోరియంలో క్షయ వ్యాధికి చికిత్స పొందుతున్న ఒక కజిన్ ను చూడ టానికి వస్తాడు .మూడు నెలలు ఉండాలనుకొని వచ్చినవాడు ఏడేళ్ళు అక్కడే ఉండి పోతాడు .అక్కడే అనేక సాహసాలలో మాంసం ఆత్మ లను పరిశీలించి ‘’సూక్ష్మ లోకం ‘’(వరల్డ్ ఇన్ మైక్రో కాసం )ను కనుక్కొంటాడు .అక్కడే ఒక జర్మన్ డాక్టర్ ఒక రష్యా అమ్మాయి మొదలైన అనేక జాతుల మనుషుల ప్రభావానికి లోనౌతాడు .రష్యా అమ్మాయి పై వలపుల వల విసురుతాడు .జర్మన్ డాక్టర్ ,సాల్విక్ సైకాలజిస్ట్ డచ్ పెయింటర్ కూడా పరిచయ మౌతారు. వాళ్ల సుదీర్ఘ వాగ్వాదాలు ,చావులాంటి ఉదాసీనత చూసి అకస్మాత్తుగా ,యే పనీలేకుండా ఉండే పరిస్థితి లోనుంచి ఒక మాజిక్ పర్వతం వలన బయట పడి జన జీవితం లోకి అడుగు పెట్టాడు .ప్రతీకాత్మకంగా ఆలోచిస్తే –ఇది జాతీయతను ,ఉదార వాదాన్ని తెలియ జేస్తూ ,,విషాదం వినోదం కాని జీవితం పాత్రలన్నీ అన్యార్ధ మైనవిగా ఉంటాయి .దీనిలోని నీతిని మాన్ స్వయం గా ఇలా ‘’A man lives not only his personal life as an individual ,but also  consciously or unconsciously ,the life of his epoch and his contemporaries ‘’ వివరించాడు .

    మాజిక్ మౌంటెన్ లో వాతావరణం శబ్దార్ధ ప్రధానంగా (లిటరల్ ),మెటా ఫిజికల్ గా ఉంటుంది .శిఖరాగ్రంనుండి దూకే పదాల జలపాతంలాగా ఉంటుంది .అవి రక్తం లేని వ్యాసాల్లాగా ఉంటాయి .అతని ఆలోచన నిర్మాణం కదా కధనం ,మేధా కలసిపోయి అత్యద్భుత పాత్ర చిత్రణ తో అత్యంత గొప్ప ఏకైక ఊహాత్మక నవలగా చరిత్ర సృష్టించింది .దీని విస్తృత పరిధి వలన ఇరవయ్యవ శతాబ్దపుప్రపంచాన్ని ,దాని కి అంటుకొన్న క్షయాన్నిచూడవచ్చు .ఈ క్షీణత మొదట్లోను తర్వాత హిట్లర్ ప్రజాస్వామ్యం పై చేసిన దాడి తోనూ మాన్ మనసులో పడలేదు .అతని అన్న హీన్రిచ్ ,అతని ఎదిగిన పిల్లలు అతిగా వ్యాపిస్తున్న నిరంకుశత్వాన్ని ఎదిరించమని పదేపదే కోరేవారు .ఏ రాజకీయం లేని మాన్  నిర్ణయం తీసుకోలేక పోయాడు .తనలో కన్జర్వేటివ్ భావాలు ఇంకా ఉండటం వలన జర్మనీకి వ్యతిరేకంగా మాట్లాడ లేక పోయాడు .నాజీల పూర్తీ దౌష్ట్యం ,నేరం ,నేషనల్ సోషలిజం పేరిట రీచ్ స్టాగ్ కాల్పులలో గుర్తించి మారి పోయాడు .వెంటనే రొమాంటిక్ బార్బెనిజాన్ని ఎదిరించాడు .ఈ కాలం లో మాన్ స్విట్జర్ లాండ్ లో జోసెఫ్ పై రాస్తున్న నాలుగు భాగాల రచనలో మునిగి పోయాడు .మళ్ళీ ఎన్నడూ జర్మనీలో అడుగు పెట్టలేదు .

 1933లో జ్యూరిచ్ లో స్థిరపడ్డాక ,మాన్ ఆస్తి నంతటిని జర్మనీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది .మాన్ గ్రందాల నన్నిటిని కాల్చి బూడిద చేసింది నాజీ ప్రభుత్వం .మూడేళ్ళ తర్వాత అతని జర్మన్ పౌరసత్వం రద్దు చేశారు .1938లోజన్మ భూమి జర్మనీ లో  నిలువ నీడలేని మాన్ అమెరికాకు వెళ్లి ప్రిన్స్ టన్ యూని వర్సిటీ లో ఉపన్యాసాలిచ్చాడు .కాలి ఫోర్నియా లో స్వగృహాన్ని ఏర్పరచుకొని 1914లో అమెరికా పౌరసత్వం పొందాడు .ఫాసిస్ట్ కార్య క్రమాలకు వ్యతిరేక ప్రచారం లో పాలు పంచుకొన్నాడు .’’ది కమింగ్ ఆఫ్ డెమోక్రసీ ‘’లో ‘’the habit of thought which regards life and intellect ,art and politics as totally separate worlds ‘’అని రాశాడు .భవిష్యత్ నాగరకతపై దార్శనికుడుగా తన మనోభావాలు చెప్పాడు .’’నా నలభై వ ఏట తప్పు చేయకుండా ఉండి ఉంటె ,ఇవాళ నేను సత్య దర్శనాన్ని పొంది ఉండేవాడినే కాదు అంటూ ‘’truth can never be a possession ,only an eternal aspiration .May it be said of each one of us that he spent his life honestly and restlessly striving for the true and the good ‘’అన్నాడు .

  Inline image 1  Inline image 3Inline image 2

   సశేషం

      మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.