– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
10-రుక్ సంహితలో విసర్గ సంధి పై పరిశోధించిన –వట కృష్ణ ఘోష్
1905లో జన్మించి 45 ఏళ్ళు మాత్రమే జీవించి 1950లో మరణించిన బెంగాల్ కు చెందిన (వ)ట కృష్ణ ఘోష్ భారతీయ భాషా శాస్త్రవేత్త మాత్రమె కాక ఇండో యూరోపియన్ భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వాడు .సంస్కృతం ఇండో యూరోపియన్ భాషా శాస్త్రాలపై ఎన్నో గ్రంధాలు రాశాడు .పాళీ భాషపై విల్హెం గ్రీగర్ జర్మన్ భాషలో రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి కలకత్తా యూని వర్సిటీ నుండి ప్రచురించాడు .సంస్కృతం లో ఆయన మొదటి రచన –‘’లెస్ ఫార్మేశంస్ నామినేల్స్ఎట్ వేర్బెల్స్ ఎం పు డు సాంస్క్రిట్ ‘’
వట కృష్ణ ఘోష్ ఇతర రచనలు –ఆపస్తంభ అండ్ గౌతమ ,గోదే అండ్ హిస్ ఫాస్ట్ ,కలెక్షన్స్ ఆఫ్ ది ఫ్రాగ్ మెంట్స్ లాస్ట్ బ్రాహ్మణాస్ పాణిని ,ఇండో యూరోపియన్ ఆరిజిన్ ఆఫ్ సాంస్క్రిట్ ,వేదిక ,పాళీ లిటరేచర్ అండ్ లాంగ్వేజెస్ ,ఏ సర్వ్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ,ఏ లా ఆఫ్ విసర్గ సంధి ఇన్ రుక్ సంహిత ,విజ్ఞాన బాడ,హిందూ ఐడియా ఆఫ్ లైఫ్ అకార్డింగ్ టు గృహ్య సూత్రాస్ అండ్ శ్రౌత సూత్రాస్ ధర్మ శాస్త్ర ,అర్ధ శాస్త్ర అండ్ కామ సూత్ర,లింగ్విస్టిక్ ఇంట్ర డక్షన్ టు సాంస్క్రిట్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు