మాన్యశ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి నమస్తే -విజయవాడ కార్యక్రమాన్ని నెట్ లో పంపటమేగాక విడిగా పోస్ట్ లో ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు . రెండేళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం మహదానందంగా ఉన్నది . నిన్నటి మీ నవ్య నాద నీరాజన0 లో తబలా మోత ,కీ బోర్డు హోరు మీ మాధుర్య గాత్రానికి గ్రహణం పట్టించాయేమో నని పించింది
.మీ ప్రయత్నం అద్వితీయం అనితర సాధ్యం .ఘంటసాల సంగీతానికి, స్వర మాధుర్యానికి మీరు మాట .పాట ద్వారా చేస్తున్న విశ్లేషణ ,ప్రచారం అత్యున్నత స్థాయి లో ఉండి మాస్టారిపై గౌరవం నేటికీ రోజు రోజుకూ పెరిగేట్లు ఉండటం మీద్వారా ఆ కృషి జరగటం వారిపై మీకున్న ఆరాధనాభావానికి, ,రసజ్ఞులలోవారిపై ఉన్న ఆదరణ భావానికి నిలువెత్తు నిదర్శనం . బహుశా భారత దేశం లో ఏ సినీ సంగీతగాయకునికి ఘంటసాల మాస్టారు గారికి ఉన్న ఆరాధన ,దాన్నికార్య రూపం లోసప్తాహాలు ,ఏకాహాలు బృందగానాలు గా నిర్వహించటం జరుగుతున్న దాఖలాలు లేవు . అది ఒక్క మాస్టారు గారికే లభించింది . మరీ ప్రత్యేకంగా వారి గాత్ర ,రాగ స్వర మాధుర్యాలను సభాముఖంగా విశ్లేషణ చేస్తూ ,ఆధునికతను జోడిస్తూ ,వాటిలోని శాస్త్రీయ సంగీతపు లోతులను తెలియ జేస్తూ మీరు చేస్తున్న ప్రచార వ్యాప్తి మరే గాయకునికీ దక్కలేదు అని నిర్ద్వంద్వముగా చెప్పవచ్చు దీనిద్వారా మీరు తరిస్తూ రసజ్ఞ లోకాన్నీ మీవెంట తీసుకొని వెడుతూ తరింప జేస్తున్నందుకు తెలుగు జాతి మీకు ఎంతో రుణ పడి ఉంది .. మీ పరిశోధన ఏ విశ్వ విద్యాలయమూ చేయలేనంత బృహత్తర మైనది . ఘ0టసాలగారే పాడుతున్నారా ,వారే తమ స్వర రాగాలను విశ్లేషించి మనకు చెబుతున్నారా అన్నంత మమైక్యత సాధించి” అపర ఘంటసాల” అని పిస్తున్నారు .మీ జీవితం ధన్యం .వింటున్న, చూస్తున్న మా జీవితాలూ ధన్యాతి ధన్యం .ఈ పొడి మాటల పుష్పాలతో మీ సేవకు అర్చన చేస్తూ -మీ దుర్గా ప్రసాద్
—