సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం 3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో నిర్వహింప బడుతాయి .
ఈ సందర్భంగా1- స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కారాన్ని-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిస్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (పొన్నూరు ) గారికి అందజేస్తున్నాం .
2- .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ0త ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావు (విజయవాడ ) గారికి ”స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ”అంద జేస్తున్నాం
3- జిల్లా లోని ప్రముఖ కవులచే ”వసుధైక కుటుంబం ”అంశం పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం
ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ శ్రీ పరుచూరిరామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు (అమెరికా ) గౌరవ అతిధి గా పాల్గొంటారు .
సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 14-2-17
—