వరద’’ కవన కుతూహలం ‘’
1986 లో వరద ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో’’ కవన కుతూహలం ‘’ధారావాహిక రాస్తే ,అది పుస్తక రూపం గా 198 9 లో వచ్చింది .దీన్ని రా వి .శాస్త్రి గారికి అంకితమిచ్చాడు వరద .
కవన కుతూహలం మహా కుతూహలం గా సాగింది .కొన్ని దశాబ్దాల క్రిందటి విషయాలను గుర్తు చేసుకొని ,మననం చేసుకొని రాసిన అనుభవ జ్ఞాపకాలు .ఆయన ధారణ’’రసనాగ్ర నర్తకి ‘’అన్నాడు ఏ బి కె .శ్రీపాద వారి’’ అనుభవాలు –జ్ఞాపకాలు’’ ,శ్రీ శ్రీ ‘’అనంతం ‘’,ఇంద్రగంటి ‘’గౌతమీ గాధలు ‘’తర్వాత చెప్పుకో దగింది కవన కుతూహలం .’’యుద్ధం లో ‘’కదన’’ ,సాహిత్యం లో ‘’కవన’’కుతూహలాలు ఒకే కోవకు చెందినవి .’’ఇది ఆధునిక ఆంద్ర సాహిత్యం లో ఒకటి ,రెండు శతాబ్దాలకు పూర్వం ‘’స్వర్ణ యుగం ‘’గా భావించిన ‘’ఒక మహోజ్వల ఘట్టం తో సంబంధం ఉన్న సాహితీ స్రస్టలగురించి జ్ఞాపకాలు మాత్రమే కాదు ,పర నింద కాదు,రొడ్ద కొట్టుడు ఆత్మ కద అంతకంటే కాదు రెండు దశాబ్దాలకే పరిమితమూ కాదు లెక్కలేనంత మంది కవులు ,రచయితలూ నాటక కర్తలు బారులు తీరి పాఠకులకు అజ్ఞాన నేత్రదర్శనం చేయటానికి క్యూ కట్టారు .అందుకే ఇది ఐదు దశాబ్దాల సాహిత్యావలోకనం ‘’అన్నాడు ఏ బి కె .అంతేకాదు ‘’వరద సాహిత్య సిద్ధాంత రాద్ధా౦తాలతో బాధించకుండా ,తన సహజ చతురిమ ,హేళన అని పించని పరిమిత అవహేళనతో ,పరదాలు తొలగించి సరదాగ సాధించాడు .సాహిత్య వివేచనా ,విమర్శన ,హాస్య ప్రియత్వం కల బోసిన రచన .తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం పాఠకులపై చెరగని ముద్ర వేయగల అరుదైన సాహిత్య క్రీడ కవన కుతూహలం ‘’అని సరైన తూకపు రాళ్ళతో తూచి నిక్కచ్చిగా నిగ్గు తేల్చాడు . తండ్రి అబ్బూరికి సరైన సాహితీ వారసుడు వరద .
ప్రాచీన ,అర్వాచీన ,పాశ్చాత్య సాహిత్యోద్యమాలతో ,కవితా ధోరణులతో మునిగి తేలే వారంతా ,వరద రచనా విశిస్టతతో మనకు పరిచయం ఉన్న వారుగా కనిపిస్తారు .’’ఇది కొద్ది మందికే పరిమితమైన అనుభవ పేటిక కాదు . ఆంద్ర దేశమంత వెడల్పూ ,తెలుగు సాహిత్యమంత లోతు ఉన్న అపురూప రచన ‘’అన్న ఏ బి కె మాట ప్రత్యక్షర సత్యమే .రచనా పద్ధతీ శైలీ ,ధారా శుద్ధి ప్రశంసనీయం .పరిచయమైతే వదలి పెట్టని రకం వరద .వరద అంటే ‘’అబ్ది ఘోష లో శబ్ద తరంగం ‘’ఓకే తరానికి తండ్రి తోపాటు కౌమార దశ లోనే కవి కుమారుడై తనతరానికి ఒక ఇన్ స్పి రేషన్ అయ్యాడు వరద ‘’.ప్రముఖుల జీవిత రసవత్తర సన్నివేశాలను ,వచో వైభవ స్మ్రుతి విశేషాలను అనితర సాధ్య రీతిలో వరద గ్రంథస్థం చేశాడు ‘’అన్నాడు అజంతా కవి .వరద’’ కుతూహం’’చూస్తుంటే బెర్నార్డ్ లెనిన్ ‘’కండక్టేడ్ టూర్ ‘’అందులో యూరప్ లోని 12 సంగీతోత్సవాలకు హాజరై రాసినదీ ,పారిస్ కి చెందిన సిల్వియా బీచ్ ‘’షేక్స్ పియర్ అండ్ కంపెని ‘’ హెమింగ్ కోహెన్ ‘’లాండ్ మార్క్స్ ఇన్ అమెరికన్ రైటింగ్ ‘’గుర్తుకు వస్తాయి అన్నాడు ప్రసాద్ .అయితే వచనకవితను వరద తక్కువగా చూడటం హేళన చేయటం మంచిదికాదన్నాడు ఏ బి కె .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-17 –ఉయ్యూరు