అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -3(చివరిభాగం)కొనసాగింపు
అనుకొన్నవన్నీ కావు .అనుకోకుండా నిమిషాలపై నిర్ణయం తీసుకొన్నవి ఒక్కోసారి అద్వితీయ విజయాలను ఇస్తాయి .అలాంటిదే మా పోలవరం టూర్ .ప్రకటించిన పది నిమిషాలకే శ్రీ పూర్ణ చంద్ గారు టూర్ కు వచ్చే వారి పేర్లు సేకరించటం ,మర్నాడు ఉదయమే ఏర్పాటు అవటం ,మేము ఉయ్యూరునుంచి ఆరుగురం పాల్గోవటం అంతా చక చకా జరిగి పోయాయి .ఇంకా ఎవరైనా వస్తారేమో నని పూర్ణ చంద్ గారు తెలిసిన వారందరికీ బస్ బయల్దేరే దాకా ఫోన్ మీద ఫోన్ చేయటం నాకు తెలుసు .ఏదో ఒక కారణం చెప్పి రాలేమన్నవారే ఎక్కువ .అనుకున్నాం కనుక పాతికమందైనా వెళ్ళాలి అనుకోని బయల్దేరాం .రాలేని వాళ్ళు ఫేస్ బుక్ లో మాతో ఆనందం పంచుకొన్నవారే అధికం .ఒకరిద్దరు అసహనం చూపారు .
నాకు తెలిసినంతవరకూ కేరళ ప్రజా కవి అచ్చప్పన్ జయంతిని ప్రతి ఏటా ఫిబ్రవరిలోవారం రోజులు ఘనంగా జరుపుతారు .దేశ విదేశాలనుండి దేశం లోప్రతి మూల నుండీ కవులు రచయితలూ పాల్గొని అనుభూతి పొందుతారు .అలాగే రెండేళ్ళ క్రితం అచ్చప్పన్ జయంతి సభలకు వెళ్లాలని ఒక ఆలోచన వచ్చింది .కాని ఈ నాటి వరకు అమలు కాలేదు .ఇప్పటికైనా ఏదైనా ఉత్సాహం ఉరకలు వేసే సాహితీ సంస్థ ఆ టూర్ ను ఏర్పాటు చేస్తే నేను కూడా రావటానికి సిద్ధమే .పూను స్పర్ధలు విద్యలందే కాదు కృషిలో ,సేవలో కూడా ఉండాలి అప్పుడే మంచి ఫలితం వస్తుంది .నిన్ననే నేను రాసినట్లు మేమెవరమూ గవర్నమెంట్ బాండ్ వాగన్ గాళ్ళం కాదు .మంచిని మెచ్చేవాళ్ళం సమర్ది౦చే వాళ్ళం మాత్రమే.అత్యాధునిక టెక్నాలజీ కొద్దోగొప్పో తెలిసినవాళ్ళం .ఆ రంగం లో అభి వృద్ధిని ప్రోత్సహించేవాళ్ళం .మా టూర్ బాచ్ లో బి టెక్ విద్యార్ధిని కుమారు బిందు తోపాటు ,యువ కవులు పత్రికా రచయితలూ నా బోటి ముసలివారు ,మహిళలూ ఉన్నారు కనుక ఒక చక్కని బాలన్స్ ఉన్న టూర్ .
ఆధునిక టెక్నాలజీ అందుకొని బస్ బయల్దేరాక అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకొంటూ అప్పటి కప్పుడు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయించిన బిందు ,శ్రీ చలపాక అభినందనీయులు .అలాగే తిరిగి వచ్చేటప్పుడూ మా అనుభవాలను చెప్పించి ఫేస్ బుక్ లో లైవ్ ప్రోగ్రాం గా వాళ్ళిద్దరూ నిర్వహించి ఈ టూర్ కు ఒక అత్యంత ఘనతను చేకూర్చారు ఇది టేక్నాలజి విజయం .వందలాదిమంది చూసి అభినందించారు అందరినీ .పట్టిసీమ ,పోలవరం పనులు అత్యంత ఆధునిక టెక్నాలజీ తో చేస్తున్నారు .దాన్ని తెలుసుకోవటానికే మేము వెళ్లి , మా టెక్నాలజీ తో లోకానికి ఆన్ ది స్పాట్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చాం .ఇదో మైలురాయి .
అయితే మాకు కనిపించిన కొన్ని లోపాలు మంత్రి శ్రీ ఉమా గారికి ప్రయాణం లోనే చెప్పేశాం .అవి పట్టి సీమ ,పోలవరం లలో అక్కడి పనుల విషయమై వివరించే బ్రోచర్లు లేవు .అడిగితె ఇంగ్లీష్ లో ఉన్న ఒక్కటి మాత్రమె పూర్ణ చంద్ గారికి ఇచ్చారు .సందర్శకులకు బ్రోచర్స్ చేతికిస్తే అక్కడి నిర్మాణపు పనుల వైశిష్ట్యం తెలుస్తుంది .అలాగే పోలవరం లోనూ అంతే.వీడియో లద్వారా జరిగిన, జరుగుతున్న, జరుగ బోయే పనులను ,ప్రొజెక్టర్ లద్వారా చూపిస్తే మరీ హృదయానికి తాకి మురిసి పోతారు .ఆ ఏర్పాటు ఇక నుంచైనా అక్కడ జరగాలి .తిరిగి వచ్చాక శ్రీ ఉమా గారు ఏర్పాటు చేసిన సభలో బ్రోచర్లు లేవని మేము చెబితే ,పట్టిసీమ పై తమ ఆఫీసులో ఉన్న చిన్న చిన్న హాండ్ బుక్ లను అంద జేశారు .అది సర్వ సమగ్రంగా ఉంది .కాని పోలవరం పై సమగ్రమైన బుక్లెట్ రావాలి. హా౦డీగా,పూర్తి వివరాలతో ఇలాగే తెలుగులో రూపొందింఛి అందించాలి . . ఇవి చెప్పాల్సిన బాధ్యతా మాది .మొహమాటం లేకుండా మంత్రిగారికే తెలియ జేశాం సభా ముఖంగా .అయన సంతోష పడి, తమ దగ్గర మెకంజీ మాన్యువల్ ఉందని ,దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే వెంటనే ప్రచురిస్తామని చెప్పారు .పూర్ణ చంద్ గారు తప్పక అనువాదం అతి త్వరలో అంద జేస్తామన్నారు .ఇది కూడా చాలా సమగ్రమైన పుస్తకం అవుతుంది .అభి వృద్ధి విషయం లో మెకంజీ ఆలోచనలు అందరికి తెలుస్తాయి . మరొక్క సారి నాతో ఈ పర్యటనలో పాల్గోన్నవారికీ ,ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి అధికారులకూమా పూర్ణ చంద్ గారికీ అందరికీ కృతజ్ఞతలు .ఇది వినోద యాత్ర కాదు .శాస్త్ర సాంకేతిక విజ్ఞాన యాత్ర .ఫలప్రద యాత్ర .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-17 –ఉయ్యూరు