గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
66 –స్వర్గీయ రాళ్ళ బండి కవితాప్రసాద్ ‘’ఒంటరి పూల బుట్ట ‘’కు సంస్కతాను వాదం చేసిన- డా.రాణీ సదాశివ మూర్తి
తూర్పు గోదావరిజిల్లా ఏనుగల మహల్ లో శ్రీ రాణీ సదాశివ మూర్తి జన్మించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతం చదివి ఎం ఏ .పొందారు .’’వైదిక ఛందస్సు ‘’పై పరిశోధన చేసి పి హెచ్ డి అందుకొన్నారు . వీరి డిగ్రీలను చూస్తె దిమ్మ తిరిగి పోతుంది .సంస్కృత, ఇంగ్లీష్లలో ఎం ఏ ., వేదాంతవిద్యా ప్రవీణ ,జ్యోతిష ఆచార్య .పొయేటిక్స్ ,వేదిక్ ప్రాసడి,తంత్ర సంస్కృత సైన్స్ లలో పట్టభద్రులు.ఎం బి ఏ కూడా చేశారు . సంస్క్రుతాధ్యాపకులుగా చేరి పని చేశారు .2000 సంవత్సరం లో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం సంస్కృత ఆచార్యులు గా లో చేరి పని చేస్తున్నారు .శ్రీ సదాశివ మూర్తి గారు ఇప్పటిదాకా 40 కి పైగా గ్రంధాలు రాశారు .ప్రాచీన గ్రంధాలలోని అనేకానేకమైన వైజ్ఞానిక విశేషాలను ఎన్నో వ్యాసాల ద్వారా తెలియ జేశారు. దేశ విదేశాలలో జరిగిన 80 కి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన పరిశోధనా పత్రాలను సమర్పించారు .15 కు పైగా సదస్సులకు తామే నేతృత్వం వహించారు .ఆయన ప్రచురించిన పరిశోధనా వ్యాసాల సంఖ్య 50 కి పైమాటే .రాష్ట్రీయ విద్యా పీఠం కు శ్రీ సదా శివ మూర్తి చేసిన కృషికి గుర్తి౦పుగా 2007 లో ‘’వ్యాసభారతి ‘’జాతీయ పురస్కారాన్ని,ప్రజ్ఞా భాస్కర బిరుదు అందుకున్నారు
నాట్యం లో మంచి ప్రావీణ్యం ఉన్నవీరిని .నాట్య రవళి వంటి పలుసంస్థలు సత్కరించాయి . సంస్కృత నృత్య నాటికలు రచించారు . నాటకాలు రాశారు ..అనేక అరుదైన గ్రంధాలకు సంపాదకత్వం వహించారు .వీరి సంస్కృత భాషా సేవను గుర్తించిన సాహిత్య అకాడెమి ఇటీవలే పురస్కారం అందించింది .ఆంద్ర ప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా పని చేసిన ద్విశతావదాని , బహు గ్రంధ కర్త స్వర్గీయ డా .రాళ్ళ బండి కవితా ప్రసాద్ రచించిన ‘’ఒంటరి పూల బుట్ట ‘’కవితా సంకలనాన్ని శ్రీ రాణీ సదాశివ మూర్తి సంస్కృతం లోకి అనువదించారు .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి 50 వేల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది . ఈ పురస్కారాన్ని,తామ్ర పత్రాన్ని త్వరలో ఢిల్లీ లో జరిగే ప్రత్త్యేక కార్యక్రమం లో సదాశివ మూర్తి గారికి అందించి సత్కరిస్తారు .’’ఇంతటి గుర్తింపు ,గౌరవం దక్కటం జీవితం లో మరిచి పోలేను .ఇన్నాళ్ళు గా నేను సాగించిన సాహిత్య కృషి ఫలించింది అని భావిస్తాను ‘’అని శ్రీ రాణీ సదాశివ మూర్తి అత్యంత వినయంగా చెప్పారు .
‘’హిడింబ భీమ సేనం ‘’అనే సంస్కృత ఫీచర్ ఫిలిం కు ప్రొఫెసర్ సదాశివ మూర్తి దర్శకత్వం వహించారు .’’ఎలెక్ట్రానిక్ సెర్చ్ ఆఫ్ మహా భారత ‘’అనే వీరి పరిశోధన చాలా విపులం మూలాలకు అత్యంత సమీపం గా ఉన్నది అందులో 18 విషయాలపై పరిశోధన ఉన్నది .అవి –పర్వ ,ఉపాఖ్యాన ,అధ్యాయ,శ్లోక పరిశోధన ,సారాంశ ,చిత్ర ప్రదర్శన ,అస్త్ర ,యుద్ధ వ్యూహ మొదలైన వాటిపై విపుల పరిశోధన ఇది .అంతేకాదు హరివంశం తో కూడా కలిసిఉన్న 1 లక్షా పది వేల శ్లోకాల మహా భారత౦ పై మహా పరిశోధన ఇది.ఇందులో వారి కుశాగ్రబుద్ది’’ రాణీ ‘’గా రాజ్య మేలింది.దీనికి ప్రొఫెసర్ శ్రీపాద శ్రీ పాద సత్యనారాయణ మూర్తి ప్రిన్సిపల్ ఇన్వెస్టి గేటర్ అయితే ,ఆచార్య సదాశివ మూర్తి కొ ఆర్డినేటర్ .ఒకే ఒక్క ఏడాదిలో ఈ బృహత్ పరిశోధన పూర్తీ చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది .
సంస్కృతం లోనే కాక పాశ్చాత్య భాషా విమర్శన లోనూ నిపుణులు .
జాతీయ స్థాయిలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు వ్యాఖ్యాతగా గొప్ప ప్రసిద్ధి పొందారు .
ఆధారం -23-2-17 ఆంద్ర జ్యోతి
సశేషం
మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-17 –ఉయ్యూరు