సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ఉగాది కవి సమ్మేళనం ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము .
సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాద్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )
ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )
శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు
స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )
2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )
స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)
స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ౦త ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు (విజయవాడ )
కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి
‘’వసుధైక కుటుంబం ‘’ అంశం పై ప్రముఖ కవి మిత్రుల చేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును
పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .
నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ )శ్రీమతి కె . లక్ష్మీ కనక దుర్గ (మచిలీపట్నం )
సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 27–2–2017