ఆంజనేయుడంటే వాళ్లకు కోపం
ఇండియాలో ఉత్తరాఖండ్ లోని ద్రోన్ గ్రామం లో భూటియా అనే తెగ వారికి హనుమంతుడు అంటే విపరీతమైన కోపం .దీనికి కారణమూ ఉంది . రామ రావణ యుద్ధం లో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛ పోయాడు .హనుమంతుని సంజీవి మొక్క తెమ్మని పంపితే దాన్ని గుర్తు పట్టలేక ఏకంగా డ్రోన్ గ్రామ లో ఉన్న సంజీవ పర్వతాన్నే పెకలించుకు లంకకు తీసుకొని వెళ్ళాడట .సంజీవ పర్వతం ఆ గ్రామస్తుల ఆరాధ్య దైవమట.అందరి ప్రాణాలను కాపాడే తమ దేవుడైన ఆ కొండను హనుమ ఒంటి చేతితో ఎత్తుకు పోవటం ఈ గ్రామం వారికి ఆయనపై విపరీతమైన ఆగ్రహం కలిగించింది .కొత్త గా ఆ ఊళ్లోకి వచ్చే వారెవరూ ‘’జై బజరంగ భళి ‘’అనటానికి వీల్లేదు .
కొరియన్ల రాణి స్వగ్రామం అయోధ్య
కొరియన్ మహా రాజు కిం సురో కరక్ వంశాన్ని స్థాపించాడు .ఆయన భార్య మహారాణి ‘’హర వాంగ్ ఓక్ ‘’.ఈమెను ‘’సురి రత్న ‘’అంటారు .ఈ రాణి పుట్టిల్లు మన అయోధ్య .ఇక్కడి నుంచే క్రీ శ.48 లో పడవ ద్వారా ఆమె అయోధ్య నుంచి దక్షిణ కొరియా కు వెళ్లి కిం సురో రాజును పెళ్ళాడి ‘’గం వాన్ గయా ‘’రాజ్యాన్ని స్థాపించిందని కొరియన్ల నమ్మకం .పదేళ్ళప్పుడు ఆమెకు వివాహం జరిగింది .పది మంది పిల్లలకు తల్లి అయింది .వీరి ను౦చే కరక్ వంశం ఆవిర్భవించింది .రాణి వాంగ్ ఒక్ 157 ఏళ్ళు జీవి౦చిందట .ఒక రోజు దేవుడు ఆమెకు కలలో కనిపించి ,కొరియాలో భార్య దొరక్క విలపిస్తున్న సురో రాజు ను చేరుకొని పెళ్లి చేసుకోమని చెప్పాడట .దక్షిణ కొరియాలో ఈ తెగవారు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు .కరక్ తెగవారికి అందుకే తమ రాణి పుట్టిన పవిత్రస్థలం అయోధ్య అంటే వాళ్ళకి వల్ల మాలిన అభిమానం .అందుకే ప్రతి ఏటా వందలాది మంది ఆ తెగవారు అయోధ్యకు యాత్రకు వచ్చి వెడుతూ ఉంటారు కొరియాలో రాణి సమాధిని కట్టటానికి రాళ్ళను అయోధ్య నుంచే తీసుకు వెళ్లి నట్లు ఆమె సమాధిపై రాసి ఉంది.దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోది ని వారు అయోధ్యలో తమ రాణి వాంగ్ ఒక్ పేరిట ఆలయాన్ని కట్టమని కోరారు .అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రినీ కోరారు ఇద్దరూ సానుకూలంగా స్పందించారు .త్వరలో రాణి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశిద్దాం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-17 –ఉయ్యూరు
ఆధారం -6-11-16 ఆంద్ర జ్యోతి ఆదివారం స్పెషల్ .