8-3-17 బుధవారం ఉదయం మా ఇంటికి యలమర్రు కు చెందిన వారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ0 లో 30సంవత్సరాలనుండి భాషా శాస్త్ర వేత్తగా ,న్యాయ విద్యా ప్రవీణగా ,వేదాంతాచార్యగా సేవలు అందిస్తున్న డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,వారి కుమారులు డా శ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి గారు .రావటం మా సుకృతం .
శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు తమకు తర్క న్యాయ మీమాంసాది శాస్త్రాలు బోధించిన విజయవాడ వాస్తవ్యులు మహా మహోపాధ్యాయ స్వర్గీయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో 11-3-17 నుండి 13-3-17 వరకు మూడు రోజులు విజయవాడ శ్రీ శివ రామ కృష్ణ క్షేత్రం లో మాణిక్య శాస్త్రిగారి శిష్య బృందం తో కలిసి ఘనం గా నిర్వహిస్తూ ,ఆహ్వానాన్ని నాకు అందజేయటానికి ఉయ్యూరు వచ్చిన సందర్భం ఇది .
స్థానిక ఛానల్ వారు మా ఇంట్లోనే శ్రీ శాస్త్రిగారిని ఇంటర్వ్యూ చేశారు . సంస్కృత భాషా వైభవాన్ని తమ వైదుష్యాన్ని భాష చిరంజీవిగా వర్ధిల్లటానికి చేయవలసినదానిని వారుచక్కగా వివరించి చెప్పారు .
శ్రీ మాణిక్య శాస్త్రి గారిపైన ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారిపైనా నేను గీర్వాణ కవుల కవితా గీర్వాణం -రెండవ భాగం లో రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను . వాటినే ఉపయోగించి మాణిక్య శాస్త్రిగారి శత జయంతికి ఫోటోలతో సహా ఒక చిన్న బుక్ లెట్ ను ప్రచురించి ,సభలకు విచ్చసే వారందరికీ అంద జేయాలన్నది శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి సంకల్పం . ఆ బుక్ లెట్ తయారీ కూడా మా అబ్బాయి రమణ సహాయం తో ఇక్కడే రూపు దాల్చటం సరసభారతి అదృష్టం . గురు భక్తి కి నిలువు దర్పణం డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు . అందరికీ ఆదర్శ ప్రాయులు ఆ గురు శిష్యులు . -దుర్గా ప్రసాద్