ఘోరకలి -5(చివరిభాగం )

ఘోరకలి -5(చివరిభాగం )

                     బర్నింగ్ బుక్స్ బోన్ ఫైర్ -2

–అంతకు ముందు కొన్నివారాలుగా నిషేధిత పుస్తకాలను నాజీ ప్రభుత్వం సవాదేనం చేసుకొన్నది . మార్చ్ 12 న  స్టార్మ్ట్రూపర్స్ లోకల్ ట్రేడ్ యూనియన్ లైబ్రరీ ని తస్కరించి బోల్షెవిక్ ,పసిఫిస్ట్ ఏదీస్ట్  మార్క్సిస్టు పుస్తకాలు న్యూస్ పేపర్లు లోకల్ లైబ్రరీలనుంచి తొలగించాలని ఆదేశించింది .తర్వాత పబ్లిక్ లైబ్రేర్రలన్నీ వెయ్యి కళ్ళతో వెతికించి లాగించేసింది .హీదేం బెర్గ్ స్తూడెంట్ బాడీ విద్యార్థుల్ని తమదగ్గరున్న నిషేధ సాహిత్యాన్ని తొలగించమన్నది  తర్వాత బాన్ ,డార్మ్ స్టెడ్  డ్రేస్డైన్ ,ఫ్రీబర్గ్ ,గీసేన్  గూటింజెన్ ,విటెన్ బెర్గ్ మొదలైన 24 చోట్ల బుక్ బోన్ ఫైర్ పండగ చేశారు . ఏప్రిల్ ,మే లలో వేలాది లైబ్రరీ పుస్తకాలకు దహన సంస్కారం చేశారు  .వీటి స్థానం లో హిట్లర్ మీన్ కాంప్ పుస్తకాలను చేర్చారు లైబ్రరీలలో . ఫ్రాంక్ ఫర్ట్ లో రొమేన్ బెర్గ్ 15 వేలమంది చూస్తుండగా పుస్తక భోగిమంటలు వేశారు బెర్లిన్ ఒపెరాస్క్వేర్ లో 25 వేల విలువైన వెస్టర్న్ కాల్చర్కు చెందిన గ్రంధాలను అగ్నికి ఆహుతి చేశారు .ఇందులో 10 వేలు సెక్సువల్ ఇంస్టి ట్యూట్ కు చెందినవి  ప్రఖ్యాత జర్మన్ రచయితలైన షాలేం యాష్ ,హేన్రి బార్బస్ ,ఫ్రాంజ్ బోస్ ,జాన్ డాస్ పాసోస్ ,ఫరాయిడ్ ,అయిన్ స్టెయిన్ ,ఆంద్రీ గైడ్ ,ఎర్నెస్ట్ హేమిగ్వే ,హెలెన్ కెల్లర్ , లెనిన్ ,రోసా లక్సన్  బెర్గ్ అప్టాన్  సింక్లెర్ ,హేజీ వేల్స్ ,మొదలైన వారి అమూల్య గ్రంధాలు నాజీల అహంకారానికి అగ్ని జ్వాలకు ఆహుతయ్యాయి .ఈ బుక్ బర్ణింగ్  మంటలు ”సింబల్ ఆఫ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ”అని నాజీలు భుజాలు చరచుకొన్నారు ..ఈ దహన కాండలో ఎందరో ఎకాడమిస్ట్ లైబ్రేరియన్లు ,టీచర్లు  ,పాల్గొన్నారు .జెర్మనిస్ట్ అయిన మాక్స్ హెర్మన్ ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు  .ప్రాపగాండా మినిష్టర్ గోబెల్స్ ,అతని మంత్రిత్వ శాఖ ముందు నాయకత్వం వహించలేదు .కానీ తర్వాత సపోర్ట్ చేశాడు

    అనేక అసోసియేషన్లు నాజీ మూకలు ఈ సరస్వతీ మరణ హోమాన్ని జాతీయ పండగగా జరిపారు ..ఇదొక సంప్రదాయమే అయింది .ట్రక్కులనిండా నిషేధ పుస్తకాలు పెట్టి హిబ్రూ అని నిక్ నేం తగిలించి ,రెండు ఎద్దులతో లాగించి  కెన్నీ ట్రక్కులమీద ”చెత్త పుస్తకాలు ”అని పేరు రాసి  మరికొన్న ట్రక్కులను గుర్రాలతో లాగించి దానిమీద ”నేను ఈ పుస్తకాలు చదివిన గాడిదను ”అని పోస్టర్ అంటించి కుర్రాళ్ళు స్తూడెంట్లు అరుపులు కేకలతో ఊరేగి తగలబెట్టారు ..పిల్లలు యువకులు ముసలి ముతక అందరూ ఈ పాపం లో భాగస్వాములయ్యారు . దీనికి తోడు సంగీతం తో హోరెత్తించారు .ఇందులో పాల్గొన్నవారికి ఆ పుస్తకాలేమిటో ఎవరు రాశారో వాటిప్రాముఖ్యత ఏమిటో ఎవ్వరికీ తెలియదు అదీ మూక రాజ్యం అంటే ..హిట్లర్ చాలా అముఞ్చిపని చేస్తున్నాడని అభినందనలు ..నాజీల లిస్టులో శత్రువుల పేర్లు ఎక్కువ స్నేహితులపేర్లు అతి తక్కువ అదీ వైపరీత్యం .ఒపేరా స్క్వేర్ దగ్గర జరిగిన బుక్ బార్కింగ్ లో రచయితఆర్నార్డ్ జ్వీ గ్ తన పుస్తకాలు తగలబడుతుండగా స్వయం గా చూశాడు 1887 లో పుట్టిన ఆయన జర్మనీ తరఫున మొదటి వరుసలో యుద్ధం చేసి న యుద్ధ వీరుడు.
        సమాప్తం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-17-కాంప్-షార్లెట్-అమెరికా ..


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.