ఘోరకలి -5(చివరిభాగం )
–అంతకు ముందు కొన్నివారాలుగా నిషేధిత పుస్తకాలను నాజీ ప్రభుత్వం సవాదేనం చేసుకొన్నది . మార్చ్ 12 న స్టార్మ్ట్రూపర్స్ లోకల్ ట్రేడ్ యూనియన్ లైబ్రరీ ని తస్కరించి బోల్షెవిక్ ,పసిఫిస్ట్ ఏదీస్ట్ మార్క్సిస్టు పుస్తకాలు న్యూస్ పేపర్లు లోకల్ లైబ్రరీలనుంచి తొలగించాలని ఆదేశించింది .తర్వాత పబ్లిక్ లైబ్రేర్రలన్నీ వెయ్యి కళ్ళతో వెతికించి లాగించేసింది .హీదేం బెర్గ్ స్తూడెంట్ బాడీ విద్యార్థుల్ని తమదగ్గరున్న నిషేధ సాహిత్యాన్ని తొలగించమన్నది తర్వాత బాన్ ,డార్మ్ స్టెడ్ డ్రేస్డైన్ ,ఫ్రీబర్గ్ ,గీసేన్ గూటింజెన్ ,విటెన్ బెర్గ్ మొదలైన 24 చోట్ల బుక్ బోన్ ఫైర్ పండగ చేశారు . ఏప్రిల్ ,మే లలో వేలాది లైబ్రరీ పుస్తకాలకు దహన సంస్కారం చేశారు .వీటి స్థానం లో హిట్లర్ మీన్ కాంప్ పుస్తకాలను చేర్చారు లైబ్రరీలలో . ఫ్రాంక్ ఫర్ట్ లో రొమేన్ బెర్గ్ 15 వేలమంది చూస్తుండగా పుస్తక భోగిమంటలు వేశారు బెర్లిన్ ఒపెరాస్క్వేర్ లో 25 వేల విలువైన వెస్టర్న్ కాల్చర్కు చెందిన గ్రంధాలను అగ్నికి ఆహుతి చేశారు .ఇందులో 10 వేలు సెక్సువల్ ఇంస్టి ట్యూట్ కు చెందినవి ప్రఖ్యాత జర్మన్ రచయితలైన షాలేం యాష్ ,హేన్రి బార్బస్ ,ఫ్రాంజ్ బోస్ ,జాన్ డాస్ పాసోస్ ,ఫరాయిడ్ ,అయిన్ స్టెయిన్ ,ఆంద్రీ గైడ్ ,ఎర్నెస్ట్ హేమిగ్వే ,హెలెన్ కెల్లర్ , లెనిన్ ,రోసా లక్సన్ బెర్గ్ అప్టాన్ సింక్లెర్ ,హేజీ వేల్స్ ,మొదలైన వారి అమూల్య గ్రంధాలు నాజీల అహంకారానికి అగ్ని జ్వాలకు ఆహుతయ్యాయి .ఈ బుక్ బర్ణింగ్ మంటలు ”సింబల్ ఆఫ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ”అని నాజీలు భుజాలు చరచుకొన్నారు ..ఈ దహన కాండలో ఎందరో ఎకాడమిస్ట్ లైబ్రేరియన్లు ,టీచర్లు ,పాల్గొన్నారు .జెర్మనిస్ట్ అయిన మాక్స్ హెర్మన్ ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు .ప్రాపగాండా మినిష్టర్ గోబెల్స్ ,అతని మంత్రిత్వ శాఖ ముందు నాయకత్వం వహించలేదు .కానీ తర్వాత సపోర్ట్ చేశాడు