వీ క్లీ అమెరికా -7
55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం
15-5-17 నుండి 21-5-17 వరకు
15 సోమ వారం మల్లినాధ సూరి వ్యాఖ్యానం పూర్తయింది ఆయన రచనలపై రాయటం ప్రారంభించి 44 వ ఎపిసోడ్ వరకు రాశాను సోమవారం మధ్యాహ్నం యు ట్యూబ్ లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కాంభోజి రాగాలాపన అందులో తన రచన ”ఏమి పాలింప జాలము ?”విని పరవశించాను . రాత్రి LOL లో రౌడీ -బ0డ ,పెళ్లి ఎగగొట్టటానికి ఎత్తులు చూసాం సరదాగా ఉన్నాయి యెంత మంది దగ్గర ఎంతటి టేలెంట్ ఉన్నదో రుజువు చేసేవి ఇవి ..
మంగళవారం మామూలుగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి శ్రీ రామ లక్ష్మణా చార్యుల ”సువర్చలా వల్లభ శతకం ”పఠించాను . సాయంత్రం ఇన్నయ్యగారి ఫోన్ పలకరింపు . ఆయన భార్య కోమలగారు రాసిన ”మై లైఫ్”చదివాను .ఆవిడ పామర్రు దగ్గర కొండి పర్రు ఆశ్రమం లో హిందీ చదివారు . ఆమె హైదరాబాద్ లో ఉండగా రేడియో స్టేషన్ ప్రోగ్రామ్ ఎక్సి క్యూటివ్ శ్రీ వేలూరి సహజానంద గారు ఆమెను కొందరు విదేశీ రచయితలను శ్రోతలకు పరిచయం చేయమని కోరగా కాఫ్కా ఆల్బర్ట్ కాము మొదలైన వారిని చక్కగా పరిచయం చేసినట్లు రాశారు .శ్రీ సహజా నంద మా రెండవ బావ గారు వేలూరి వివేకానంద గారి పెదనాన్న గారి అబ్బాయే . తేలప్రోలు దగ్గర చిరివాడ అగ్రహారం వాసి .సహజ శ్శ్రీ అరవింద భక్తులు .అరవింద దర్శనం పై పుస్తకాలు రాశాడు వీరి తమ్ముడు సదానంద .ఈ అన్నదమ్ముల్ని మా బావ గారి కుటుంబం సహజ ,సదా అని పిలిచేవారు ఇద్దర్నీ చూశాను .ఇన్నయ్యగారి పెద్దబ్బాయి శ్రీ రాజు నరిశెట్టి మా పెద్దబ్బాయి శాస్త్రికి గుజరాత్ లోని” ఇర్మ ” లో క్లాస్ మేట్ అని మా మనవడు సంకల్ప్ గుర్తించి చెప్పాడు .
17 బుధవారం నుండి 5 రోజుల న 55 వ సుందరకాండ పారాయణ మొదలు పెట్టాను .నిత్యపూజ ఆంజనేయ అష్టోత్తర ,శతనామ పూజ తర్వాత పారాయణ ప్రారంభించాను .మొదటి రోజు సంక్షిప్త రామాయణం ,తర్వాత శ్రీరామ జననం ,సీతారామ కళ్యాణం ,సీతా రామ సుఖ జీవనం సర్గలు చదివి సుందరకాండ ప్రారంభించి 15 సర్గలు పూర్తి చేశి మంకు శ్రీనుగారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”చదివి పూర్తి చేశాను అయిదు రోజులూ పానకం వడపప్పు చలిమిడి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం .7 గంటలకు ప్రారంభిస్తే పూర్తి అయేసరికి 10-30 అయింది తర్వాతే టిఫిన్ .ఉదయం 11 -30 కి డా. యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేశారు .ఏం చేస్తున్నారని అడిగితె పారాయణ సంగతి చెప్పా .ఆయన నిత్యం సంధ్యావందనం పూజ చేస్తారట .నేను చెప్పాక పారాయణ కూడా చేద్దామని అనుకొన్నారటగాని 83 ఏళ్ళ వారు అంతటి శ్రమ వద్దమని కుటుంబ సభ్యులు వారించారట అందుకని చేయటం లేదని తర్వాత గోపాల కృష్ణ గారు మెయిల్ రాశారు .మైనేనిగారు పంపిన ”Harry G.Frankfurt రచన ”డి రీజన్స్ ఆఫ్ లవ్ ”అందింది చదివాను పెద్దగా చెప్పిందేమీ లేదని పించింది ..రాత్రి ఫన్ బకెట్ లో ”వుయ్ వాంట్ జస్టిస్ ”అని బాహుబలి -3 తీయాలంటూ నిరాహార దీక్ష చేసిన సరదా ఎపిసోడ్ చూసి పగలబడి నవ్వుకున్నాం ..
గురువారం -రెండవ రోజు పారాయణ లో 27 వ సర్గ వరకు చేసి ముదిగొండ సీతారావమ్మగారి ”శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా .దాదాపు మొత్తం 3 గంటలు పట్టింది ”నా దారి తీరు ”లో కృష్ణా జిల్లాలోని ”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”గురించి రెండు ఎపిసోడ్ లు రాశాను ..రాత్రి నర్మదా నదీ తీర”కరి వీర పీఠం”శంకరాచార్య శ్రీ స్వామి రామా గురించి ”పీఠాధిపత్యం బందిఖానా గా భావించి పారిపోయిన పీఠాధిపతి ”అని రాశా . పారిపోయిన రామా గురువు బెంగాలీ బాబా ను దర్శించి విషయం చెప్పగా ”సాధకుడికి ఈ అనుభవమూ కావాలనే నేను నిన్ను నర్మదా తీరానికి 6 నెలల తపస్సుకోస0 పంపాను .దనం వ్యామోహం పదవీ ఎంత బాధకు గురి చేస్తాయో నీకు అనుభవం రావాలనే పంపాను ”అంటాడు
శుక్రవారం -ఉదయం 7-30 కే పూజ ప్రారంభించి 10-15 కు మూడవరోజు పారాయణ 38 వ సర్గ వరకు చేసి సీతారావమ్మగారి ” ‘శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా..దీనిని మా అమ్మాయి వీడియో తీసి పేస్ బుక్ లో పెట్టిందిట నాకు తెలీదు మామూలు గా చేసే పానకం వడపప్పు చలిబిడి తోపాటు రవ్వకేసరి ప్రసాదం నైవేద్యం 10-15 కు పూర్తిఅయింది . . మధ్యాహ్నం మైనేనిగారి ఫోన్ .తర్వాత నేనూ చేసి మాట్లాడాను
రాత్రి శ్రీ బులుసు సాంబమూర్తి పద్మ దంపతుల ఇంట్లో డిన్నర్ .వాళ్ళ అమ్మాయి ప్లస్ -2 కు సెలెక్ట్ అయి ర్యాలీ లో సీట్ వచ్చిన సందర్భంగా ఈ ఏర్పాటు .ఇలా సెలెక్ట్ అయినవారి చదువు హాస్టల్ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది స్టేట్ లో 300 మందికే ఆ ఛాన్స్ దాన్ని పొందటానికి అందరూ తీవ్రంగా కష్ట పెడతారట ఒరిస్సా లోని తెలుగు వారు .ఇక్కడే బరం పురం తెలుగు వారైన రాయప్రోలు వారూ కలిశారు .మేమూ ,పవన్ ,రాంకీ కుటుంబం గెస్ట్ ల0 అదనంగా . పప్పు ఆలూ కూర ,తమాషా పాయసం ,పునుగులు ,పులిహోర ,సాంబారు ,పెరుగు పండ్ల ముక్కలతో పాటు వాళ్ళ స్పెషల్ ”అప్పడాలపిండి ఉండలు ”వేశారు ఒరిస్సా ప్రాంత తెలుగువారిళ్ళల్లో విందులూ వినోదాలలో అప్పడాల పిండి ఉండలు వడ్డించకపోతే మహా తప్పుట చెప్పారు వాళ్ళు .అలాగే తద్దినాలలో మనం ఆవ పచ్చడి ,నువ్వుల పొడి తప్పక చేస్తాం .కానీ వాళ్ళు ఉసిరి గింజల పచ్చడి పెరుగుతో కలిపి ,ఉసిరి గింజల పొడి చెయ్యటం తప్పదట . మనకు కొత్తగా ఉంది కానీ ఏ ప్రాంతం వారి అలవాటు వారిది .మనకు ఎవరైనా చనిపోతే దినవారాలలో 12 వ రోజు శుద్ధి నాడు ఉసిరి పొడి నెత్తిమీద రాసుకొని స్నానం స్నానం చేసి శుద్ధి అవటం ఉంది ‘
శనివారం నిత్యపూజ ఆంజనేయ స్తోత్త్ర శతనామ పూజ తర్వాత నాల్గవ రోజు పారాయణ ఉదయం 7-30 కు ప్రారంభించి 54 వ సర్గ వరకు పారాయణ చేసి మామిడిపండ్లు ఆరంజ్ పీచు అరటిపళ్ళ తో పూజ చేసి మంకు శ్రీను గారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”పఠించా .అదనపు ప్రసాదం ”చిట్టిగారెలు ”11 గంటల వరకు సాగింది సంకల్ప్ ను మా అమ్మాయి యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చింది .
మా మనవడు శ్రీకేత్ 9 లో ఉన్నాడు .కనుక ఏం సెట్ లాంటి దాని కోచింగ్ కు షార్లెట్ యూనివర్సిటీ దగ్గర ”రమణ ”అనే లెక్చరర్ దగ్గర లెక్కల కోచింగ్ కు శని ఆదివారాలలో ఉదయం 7 గంటలకు వెళ్లి 12 దాకా ఉండి వస్తాడు మా అల్లుడో అమ్మాయో తీసుకుని వెళ్లి మళ్ళీ తీసుకు వస్తారు .మా వాళ్ళ ఇంటినుంచి 45 మైళ్ళు అంటే సుమారు 70 కిలోమీటర్లు . మైనేని గారుపంపిన ”క్లియరెన్స్ డారో ”రచన ”ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ”బృహద్గ్రంథం అందింది మొదలు పెట్టాను .సాయంత్రం మా అమ్మాయి మనవాళ్లతో లైబ్రరీకి వెళ్లి 7 పుస్తకాలు తెచ్చుకున్నాను చదవాలి .
21-5-17 ఆదివారం వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి -ఉదయం 6-45 కే నిత్యపూజా ,ఆంజనేయ అష్టోత్తర సహస్ర నామ పూజ చేసి 5 వ రోజు అంటే చివరి రోజు పారాయణ ప్రారంభించి 68 వ సర్గతో సుందరకాండ పూర్తి చేసి తర్వాత నాగ పాశ విమోచనం ఆదిత్య హృదయం ,రామ రావణ యుద్ధం రావణ సంహారం ,దేవతలుచేసిన శ్రీరామ స్తుతి ,శ్రీ రామ పట్టాభి షేకం తో మొత్తం సుందరకాండ పారాయణ పూర్తి చేసి రామ లక్ష్మణాచార్యుల ”శ్రీ సువర్చలా వల్లభ సుందర వాయు నందన శతకం ”పఠించే సరికి ఉదయం 10-45 గంటలు అయింది దీనితో శతక త్రయం ను రెండు సార్లు పఠించినట్లయింది పావు గంట విశ్రాంతి తీసుకొని శ్రీ సువర్చలాంజ నేయ శాంతి కళ్యాణం పుణ్యాహ వాచనం ,దిక్పాల నవగ్రహ పూజ కన్యావరణం ,ప్రవర మాంగల్యా పూజ ,ప్రవర చూర్ణిక మహా సంకల్ప0 మంగళాష్టకాలతో సహా చదివి తంత్ర రహిత మంత్రం సహిత కళ్యాణం చేసి స్వామి వారల ఫోటోకు నేను తెచ్చుకున్న శ్రీ ఆంజనేయస్వామికి ప్రక్కనే పెట్టిన పసుపు తో చేసిన సువర్చలాదేవికి అక్షతారోపణ అంటే తలంబ్రాలు పోసి కళ్యాణం పూరి చేసాం అంతా అయ్యేసరికి 12 45 అయింది అంటే ఉదయం నుంచిసుమారు 6 గంటల కార్యక్రమం నిర్వహించాం .నిత్య ప్రసాదాలతోపాటు పులిహోర ప్రత్యేక ప్రసాదం ఆ అమ్మాయి ,మనవడు పీయూష్ రాత్రి కూర్చుని స్వామికి పూల హారాలు కట్టారు. ఇవాళ పూలతో మామిడిపండ్లతో చక్కగా అలంకరణ చేసి శోభాయమానం చేసింది మా అమ్మాయి . భోజనానికి పవన్ కుటుంబం గోసుకోండ అరుణ కుటుంబాన్ని పిలిచాం వాళ్ళూ వచ్చి స్వామిపాదాలకు తలంబ్రాలు పోసి భోజనం చేసి వెళ్లారు .భోజనం లోకి మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,చిక్కుడుకాయ కూర పెరుగు పచ్చడి టమేటా చట్నీ చారు ,జున్ను .వడ్డించాం .కళ్యాణ విందుకూడా జరిగింది అనుకోకుండా
శనివారం రాత్రి కాలిఫోర్నియా నుంచి మా మేనల్లుడు శాస్త్రి ,భార్య ,అత్తగారు ఫోన్ చేసి మా అమ్మాయి పేస్ బుక్ లో పెట్టిన వీడియో చూసి ముచ్చటపడి ఆనందిం చామని అభినందనలు తెలిపారు మొత్తం మీద షార్లెట్ లో నా 55 వ సుందర కాండ పారాయణ హనుమజ్జయంతి స్వామివార్ల అనుగ్రహం తో దిగ్విజయంగా జరిగింది
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 19 వ తేదీ నుండి మూడు రోజులు 21 వ తేదీ వరకు శ్రీ హనుమజ్జయ0తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు మా అబ్బాయి ఏ పూటకాపూట ఫోన్ చేసి చెబుతూ ఫోటోలు పెడుతూ తెలియ జేశాడు మొదటి రోజు ఉదయం స్వామివార్లకు అభిషేకం . సాయంత్రం శతకత్రయ పోటీకి ”ఒక్క పురుగు ”కూడా రాలేదట .శివాలక్ష్మి శ్రీ రామ లక్ష్మణ్చ్చర్యులు గారు నిర్వహించటానికి వచ్చారు వారికి శాలువాలతో సత్కారం జరిగింది .రెండవ రోజు 1000 రసం మామిడిపండ్లతో పూజ కనుల పండువుగా జరిగిందని రాత్రికి మా శ్రీమతి కంటి డాక్టర్ శ్రీ మతి జయశ్రీ గారి కుటుంబం పూజలో పాల్గొన్నారని ,వారి అబ్బాయి అమ్మాయి చక్కగా పాటలు పడ్డారని మామానవరాలు హర్షితాఞ్జని కూడా పాడిందని శ్రీమతి శారదా గారు కూడా చక్కగా గానం చేశారని తెలిసింది మూడవ రోజు ఉదయం 200 తమల పాకు కట్టలతో అన్ని రకాల పుష్పాలతో అర్చన ఘనంగా జరిగిందని స్వామివార్ల శాంతికల్యాణాన్ని మా రెండవ అబ్బాయి శర్మ ఇందిరా ద0పతులు మూడవ కుమారుడు మూర్తి రాణి దంపతులు పీటలమీద కూర్చుని ఘనంగా నిర్వహించారని తెలిసి చాలా సంతోషించాం . రాత్రి శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు సంకల్పించి స్పాన్సర్ చేసిన 25 కిలోల మినపపప్పు తో స్వామివార్లకు గారెల దండలు అద్భుతః అనిపించాయి .కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసా చాలా భక్తిగా చేశారు అక్కడ మేము లేకపోయినా మా రమణ అన్ని బాధ్యతలు నిర్వహించి కార్యక్రమాలకు నిండుదనం తెప్పించాడు . ఈ వారానికి స్వస్తి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా