గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
181-రుద్ర భాష్య కర్త -శ్రీ ఆత్మ బోదేంద్ర సరస్వతి (1586-1638 )
తమిళనాడులోని వృద్ధాచలం లో 1586 లో ఈశ్వరగా జన్మించి 58 వ కంచికామకోటి జగద్గురువులయ్యారు .దేశమంతా విస్తృతంగా పర్యటించి అద్వైత భావ దీప్తి కలిగించారు .శ్రీ రుద్రం ‘’పై వ్యాఖ్యానం రాశారు .అవధూత సదాశివ బ్రహ్మేంద్రనుకంచి మఠ గురువులపై ‘’గురు రత్నమాలిక ‘’ వ్రాయమని కోరారు వీరిద్దరికి పరమ గురువులు 57 వ పీఠాధిపతి తిరువేంగాడు లో సిద్ధిపొందిన శ్రీ పరమ శివేంద్ర సరస్వతి . దక్షిణ పినాకిని నదీ తీరం లో వీరు 1638 న సిద్ధిపొందారు
182-లక్ష భగవన్నామ శ్లోకాలు రచించిన -శ్రీ బో దేంద్ర సరస్వతి(1638-1692)
కంచిలో కేశవ పాండురంగ సుగుణలకుమారుడుగా 1610 లో జన్మించి శృతి స్మృతులలో అశేష పాండిత్యం సాధించి ,రామ నమ నామ సంకీర్తనలో తరించి ,రోజుకు లక్షసార్లు రామనామము చేస్తూ శ్రీ ఆత్మ బో దేంద్ర సరస్వతి దృష్టిలో పడి లక్ష్మీధరుడు రాసిన భగవన్నామ కౌముదిని ,పూరీలో ఆయనవద్దనే అభ్యసించి ,దానినాధారం గా ఒక లక్ష భగవన్నామాలు వ్రాయమని ఆదేశించి తర్వాత కంచికి రమ్మని కోరారు అలాచేయగానే 59 వ జగద్గురువుగా అభిషేకించారు .దేశ పర్యటన చేస్తూ వీరు కావేరీ డెల్టా ప్రాంతం లో పర్యటిస్తూ అక్కడి ప్రకృతి అందాలకు మురిసి అక్కడే మహా సిద్ధిని 1638 లో పొందారు .
183-శివాష్టపది కర్త శ్రీ 4 వ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి (1746-1783 )-
కంచి మఠం కంచి నుంచి కుంభకోణం కు కర్ణాటక యుద్ధాల సమయం లో మారటం వలన వీరి వివరాలు తెలియలేదు .వీరు 62 వ జగద్గురువులు .జయదేవుని అష్టపదులు మాదిరిగా వీరు’’ శివాష్ట పది’’ రాశారు . 1783 లో కుంభకోణం లో సిద్ధిపొందారు .
184-ముస్లిం ల అభిమానం పొందిన -శ్రీ మహా దేవేంద్ర సరస్వతి -6(1783-1813 )
63 వ కామకోటి జగద్గురువులు శ్రీ మహా దేవేంద్ర సరస్వతి కుంభకోణం లో జన్మించి 31 వ ఏటపీఠాధిపతి అయ్యారు .ధర్మ శాస్త్రాలలో మహా నిధి .అందుకని ముస్లిం రాజులు కూడా ధర్మ విషయం లో వీరి తీర్పును అభిప్రాయాన్ని శిరసా వహించేవారు . యుద్ధాలు జరుగుతున్నా వీరికీ భక్తులకు పుణ్య క్షేత్ర సందర్శనాలకు ఆటంకాలు కలిపించేవారుకాదు .కుంభకోణంలోఆది కుంభేశ్వర దేవాలయం లో వీరు సోమ స్కంద మండపం కట్టించారు .కుంభకోణంలో 1813 లో సిద్ధి పొందారు
185-కనకాభి షేకం పొందిన -శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి -6 (1746-1783)
64 వ కామకోటి జగద్గురువులైన 6 వ చంద్ర శేఖరేంద్ర సరస్వతి కుంభకోణం లో కంచిమఠానికి ప్రక్కనే ఉన్న ఇంట్లో వెంకట సుబ్రహ్మణ్య నామధేయం తో జన్మించి 37 వ ఏట కంచి కామకోటి పీఠాధిపతి అయ్యారు .మహా శ్రీ విద్యోపాసకులుగా గొప్ప పేరు పొందారు .కంచికామాక్షి అమ్మవారి ఆలయానికి మహా కుంభాభిషేకం చేయాలన్న తలంపుతో వీరు మద్రాస్ లో కొంతకాలం విరాళాల సేకరణ కోసం ఉన్నారు .ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి కంచికి తిరిగి వచ్చెయ్యమని చెప్పగా వెళ్లి పోయి మహా కుంభాభిషేకాన్ని అనన్య సాధారణం గా నిర్వహించారు . విరాళాల వెల్లువ కొనసాగి అద్భుతంగా కార్యక్రమం జరిగింది .తిరువనైక్కాల్ లో అఖిలాండేశ్వరి అమ్మవారికి తాటంక ప్రతిష్ట ను రాజకీయ పార్టీల వారు అడ్డుపడినా దిగ్విజయంగా నిర్వహించారు .తంజావూర్ మహారాజుకలలో శివుడు ప్రత్యక్షమై ఆదేశించగా శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతికి కి కనకాభి షేకం చేశాడు .ఇది కంచికామ కోటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖియింపబడిన అద్భుత ఘట్టం .తాటంక ప్రతిష్టకు జరిగిన ఖర్చు అంతా మహారాజే భరించాడు 1850 లో సిద్ధిపొందారు . మళ్ళీ కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రులకు సువర్ణాభిషేకం జరిగిందని మనకు తెలుసు. కంచి చరిత్రలో ఇది రెండవ కనకాభిషేకం
186-అద్వైత సభ నిర్వహించిన -శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి -6 (1891-1907)
66 వ కామకోటి జగద్గురువులు ఆరవ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి చెంగల్పట్టుజిల్లా ఉదయం బాక్కం లో స్వామినాధ గా జన్మించారు .జననీజనకులు మల్లికాంబిక, సీతారామ పండిత . 7 వ ఏటనే పీఠాధిపతి అయ్యారు .మహా వక్తగా సుప్రసిద్ధులు . అద్వైత వేదాంతాన్ని వ్యాప్తి చెందించటానికి మొదటిసారిగా ‘’అద్వైత సభ ‘’ను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు . 1907 లో వెల్లూర్ జిల్లా కలవై లో సిద్ధి పొందారు
187-క్రియా సూత్రాలు రాసిన -స్వామి అత్యేశ్వరానంద విద్యారత్న బాబాజీ ( 1920)
8 వ ఏటనే క్రియా యోగాశ్ర మంలో చేరి చదివి ,వేదాంతం లో ఏం ఏ చేసి ‘’,లా ‘’కలకత్తా యుని వర్సిటీలో చదివి ,పి హెచ్ డి చేసి ,పూరి గోవర్ధనమఠ శంకరాచార్యుల వద్ద సన్యాసం తీసుకొని 12 ఏళ్ళు హిమాలయాలలో ఏకాంతంలో తపస్సులో గడిపిగురువు మహాముని బాబాజీ వద్ద ‘’క్రియా సూత్రాలు పూర్ణ క్రియ పొంది ,యోగిగా మారి సంస్కృతం లో విద్యా రత్న పొంది ,అమెరికా సందర్శించి 55 గ్రంధాలు రచించారు .
క్రియాసూత్రాలు -1
తత్త్వం -అత ఆత్మా జిజ్ఞాసా -స్వరూపేవస్థానం ఆత్మా దర్శనం -సర్వజ్ఞహ్ నిత్యం పూర్ణ మిదానమ0తమాత్మా -తస్య ప్రకాశహ్ ప్రణవః -ప్రణవ శబ్ద ఏవ పంధా -జగత్ సృష్టిమయా ఈశ్వరస్య తస్య హేతురవిద్యా -చిత్త వృత్తిహ్ హేయ హేతుహ్ .
188- అంకపదీయ కర్త –శ్రీ నిశ్చలానంద సరస్వతి(1943)
ఋగ్వేద భూమికపై ఏర్పడిన పూరీ గోవర్ధన పశ్చిమ ఆమ్నాయ పీఠాధిపతి శ్రీ భారతి కృష్ణ తీర్ధ మహారాజ్ పూర్వాశ్రమంలో ‘’ఫాదర్ ఆఫ్ వేదిక్ మాధేమాటిక్స్ ‘’గా పేరు పొందారు . 1925 లో పూరీ పీఠాధిపతి అయ్యారు .అప్పటినుంచి ఈ పీఠం వేద గణితానికి ప్రాముఖ్యం పొందింది .
వీరి తరువాత పీఠాధిపత్యం వహించిన శ్రీ నిశ్చలానంద సరస్వతి కూడా గొప్ప గణిత శాస్త్ర వేత్త .వేదగణితం పై 7 ఉద్గ్రంధాలు 1-అంకపదీయం 2-స్వస్తిక గణితం 3-గణిత దర్పణం మొదలైనవి రాశారు .వేదిక మాథ్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ‘’కు వీరి ఆశీస్సులున్నాయి .
1943 లో ఉత్తర భారతం లో హరిపూర్ భిక్షాటల్ లో’’నీలాంబర్’’ గా జన్మించి ,లెక్కలు సైన్స్ సంస్కృతాలు చదివి ,16 వ ఏట ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టి ,ఢిల్లీ వెళ్లి జ్యోతిర్మఠ శంకరాచార్యులవారివద్ద దీక్షపొంది ‘’ధ్రువ చైతన్య ‘’దీక్షానామం పొందారు .1970 లో దేశ సంచారం చేస్తూ అనేక క్షేత్ర సందర్శనం చేసి ,ఆత్మ జ్ఞానం పొంది,1974 లో నిశ్చ లానంద స్వామి నామధారులయ్యారు .వేదోపనిషత్తులను గణిత శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు .వీరి జ్ఞాన పరాకాష్టకు వీరిని 19 94 లో పూరీ గోవర్ధన పీఠ 145 వ శంకరాచార్యులుగా ప్రతిస్థాపనం చేశారు .అప్పటినుంచి దేశ సంచారం చేస్తూ వేద ప్రాశస్తాన్ని భారతదేశ సమైక్యతను బోధిస్తున్నారు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-6-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా